Pages

తిరుమల తిరుపతి స్వామివారి ద్వజస్తంభ రహస్యం secret of Tirumala Tirupati Dwajastambha

 *తిరుమల లో శ్రీవారి ధ్వజస్తంభం వెనుక ఉన్న  కథ మీకు తెలుసా...?*


🙏🏻🙏🏻🌷🙏🏻🙏🏻


*కర్ణాటక దండేలీ అడవుల్నుంచి 75 అడుగుల పొడవున్న 6 టేకుమానులు తీసుకుని 16 చక్రాల ట్రాలీ బయలుదేరింది. ఇంత భారీ వాహనం చేరాల్సిన గమ్యం 430 కిలోమీటర్లు!*


*డ్రైవర్ రెండు చేతులూ జోడించి దేవుని ప్రార్ధించాడు.*

*వందల కంఠాలు "గోవిందా! గోవిందా!" అంటూ ప్రతిధ్వనించాయి. అతన్ని ఏ శక్తి నడిపిందో మరుసటిరోజు సాయంత్రానికి గమ్యానికి చేరువలో అలిపిరి వద్దకు ఆ ట్రాలీ చేరుకుంది* 

*డ్రైవర్ దిగి కొండవేపు చూశాడు.*  *కలియుగ దైవం వేంచేసివున్న సప్తగిరి... చుట్టూ చూశాడు. వేలాది యువతులు* 

*హారతులిచ్చి, గోవిందా.. గోవిందా.. అంటూ తన్మయులైనారు*

*అక్కడే ఉన్న టి.టి.డి.చైర్మన్ నాగిరెడ్డి గారికి, ఎక్జిక్యూటివ్*  *ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారికి*

*నమస్కరించి  "ఘాట్ రోడ్డు 18 కిలోమీటర్లు, ఏడు ఎనిమిది* *క్లిష్ఠమైన మలుపులున్నాయి.*

*ఇది నా జీవితంలోనే గొప్ప సాహసం. ఎట్టి పరిస్థితుల్లోనూ*  *ట్రక్కును ఆపకుండా కొండ*

*మీదకు తీసుకుపోతాను.* *మధ్యలో పిట్టగోడలు దెబ్బతినొచ్చు,అంచులు తగిలి* *బండరాళ్లు దొర్లిపడవచ్చు, మీరు హామీ ఇస్తే పైకి చేర్చి* 

*తీరుతాను అన్నాడు" వారు డ్రైవరుతో పైకి చేర్చే బాధ్యత* *నీది. మిగిలిన బాధ్యతలు మావి*

*అని అభయం ఇచ్చారు*

*వాహనాల రాకపోకలను, పాత ఘాట్ రోడ్డుకు మళ్లించారు. ట్రక్కు బయలుదేరింది.వెనుకే* *వాహనాల్లో అందరూ*

*బయలుదేరారు. ఒక్కో మలుపు తిరుగుతుంటే*

*మానులు తగిలి, బండలు* *ఊడిపడ్డాయి. పిట్టగోడలు కూలిపడ్డాయి. ట్రాలీ లోయలో*  *పడిపోతుందేమో అని వెనుక వారికి భీతి కలిగేది.* *ఇలా గుండెలు ఉగ్గబట్టుకుని, ఫీట్లు చేసుకుంటూ* *సంభ్రమాశ్చర్యాల మధ్య 55 నిమిషాల్లో..*

*సూర్యాస్తమయం లోగా*

*ట్రాలీ తిరుమల చేరిపోయింది"*

*వేలాది భక్తుల ఆనందోత్సాహాలతో*

*గోవిందా..గోవిందా..*

*నామస్మణతో తిరుమల కొండ* *ప్రతిధ్వనించింది!*

*☘స్వామి వారి ధ్వజస్తంభం కోసం దండేలీ అడవుల్లోపుట్టి* *300 ఏళ్ల వయసున్న* 

*ఈ 6 టేకుమానులు స్వామి* *వద్దకు క్షేమంగా చేరుకున్నాయి*

*🍀ఏమిటీ ధ్వజస్తంభం కథ?*

*నాగిరెడ్డిగారు మర్రి చెన్నారెడ్డి ఆదేశాల మేరకు టిటిడి చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.*

*తిరుమలలో అనేక మరమ్మత్తులు చేపట్టారు. అందులో భాగంగానే ధ్వజస్థంభానికి బంగారు* 

*తాపడానికి పాలిష్ చేయడం.*

*నాగిరెడ్డి గారికి తోడుగా సమర్ధుడైన ఐ.ఏ.ఎస్ అధికారి* *పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు*

*ఎక్జిక్యూటివ్ ఆఫీసరుగా వున్నారు. ఈ పనులన్నీ ప్రసాద్* *గారు చిత్తశుద్ధితో చేసేవారు!*

*అప్పటి ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరామయ్య! ఇలా*  *ధ్వజస్తంభం చుట్టూ* *వున్న నాలుగు వరుసల*

*గోల్డ్ ప్లేట్లు విప్పి పాలిష్ చేసే* *సమయంలో అసలు విషయం బయటపడింది*. *ధ్వజస్తంభాన్ని టేకుతో చేస్తారు. చూస్తే* 

*ఆ మానంతా పుచ్చిపోయివుంది. భూమిలో* 

*ఉండాల్సిన భాగం అసలే కనిపించడం లేదు? మరి ఏ* *ఆధారంతో ధ్వజస్తంభం నిలిచి ఉంది? కేవలం ఆ బంగారు ప్లేట్ల ఆధారంతో అది ఉంది. రేపో మాపో అది* *కూలిపోవచ్చు!*

*మరి ఇప్పుడేం చేయాలి? ఏం* *చేయాలి?వేరే వారైతే దాన్ని* *తాత్కాలికంగా ఏదో* 

*చేసేయ్యండి. 75 అడుగుల* *టేకుమానులు బజారులో* *దొరకవు అని సర్దుబాటు* *చేసేవారు! కానీ ఇక్కడ* *ఉన్నది..నాగిరెడ్డి, పివిఆర్కే* *ప్రసాద్! స్వామి వారి సేవలో అచంచల భక్తి వున్నవారు.*

*స్వామివారికి, ఆయన* *భక్తులకు ఏ చిన్న లోపం*

*జరిగినా ఆ పాపం తమదే అని విశ్వసించే వారు*

*అందుకే "ధ్వజస్తంభాన్ని* *పునర్మిద్దాం"* 

*అని ప్రకటించారు......*

*ప్రకటించారు సరే..అసలు కథ ఇప్పుడే మొదలైంది!*

*🛑ధ్వజస్తంభం వాడే మానుకి ఆగమశాస్త్రం ప్రకారం నిర్ణీత లక్షణాలు ఉండాలి.!*

*ఆ మానుకి,ఎలాంటి తొర్రలు,పగుళ్లు,వంకలు,*

*కొమ్మలు ఉండకూడదు.75 అడుగుల ఎత్తున్న ఒకే మాను* *కావాలి. వందేళ్లకు పైగా మన్నిక*

*కల్గిన టేకు చెట్టు అయివుండాలి*

*ఎక్కడ? ఎక్కడ?*

*ఈ లక్షణాలున్న చెట్లు* *దొరుకుతాయి?*

*పాత మాను గురించి* *తెలుసుకుంటే దొరుకుతుంది అని 190 సంవత్సరాల* 

*రికార్డులన్నీ పరిశీలిస్తే..*

*ఎక్కడా ఈ ధ్వజస్తంభం* *ప్రస్తావన లేదు. మరో వేపు* *నాగిరెడ్డిగారు, ప్రసాద్ గారు ఇద్దరి నియామకాల గడువు* *పూర్తి కానున్న తరుణం.*

*ఈ కొద్ది రోజుల్లో మనం*

*ఇది చేయగలమా????ప్రశ్నలు???*

🍀  *ఆ సమయంలో బెంగుళూరు నుండి వచ్చిన*

*ఓ భక్తుడు వారిని కలిసి" అయ్యా! మీరు* 

*ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నట్లు* *రేడియోలో విన్నాను. అటువంటి మానులు కర్ణాటక దండేలీ అడవుల్లో ఉన్నాయి.*

*మీరు అనుమతిస్తే నేను ఆ పనిచేసి పెడతాను! వారంలోగా ఆ భక్తుడు వంద చెట్లను* *పరిశీలించి, అందులో నిర్ణీత ప్రమాణాలకు* *అనుకూలంగా*

*ఆరు చెట్లను ఎంపిక* *చేశారు.అదే వారంలో* 

*కర్ణాటక ముఖ్యమంత్రి* *గుండూరావు గారు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వచ్చారు..ఆయన* *ముందు ఈ ప్రతిపాదన ఉంచారు.* *ఆయన ఆనందంగా మహద్భాగ్యం అన్నారు.* *ధ్వజస్థంభానికి ఒక్కమాను* *సరిపోతుంది. అయినా* 

*ముందు జాగ్రత్తగా 6 చెట్లనూ* *తీసుకున్నారు.* *సమస్య అక్కడితో అయిపోలేదు*

*దట్టమైన అడవిలో, కొండ* *వాలులో ఉన్న వీటిని* 

*మొదటికంటా తీయించి 8* *కిలోమీటర్ల కిందికి తీసుకు రావడం చిన్న పనికాదు. రోడ్డు* *నిర్మించే బాధ్యత చీఫ్ కన్జర్వేటర్ తీసుకుంటే..* *సోమానీ పేపర్ మిల్లు వారు ఈ భాగ్యం మాకు ప్రసాదించండి అని..దుంగల్ని క్రేన్ల సహాయంతో రోడ్డు వరకూ* *చేర్చారు"*

*ట్రాలీకి 70,000 రూపాయల అద్దె! ట్రాలీ బయలుదేరింది. ఎటువంటి ఆటంకాలు* 

*లేకుండా తిరుమల చేరుకుంది!*

*1982 జూన్ 10వ తేదీన* 

*ధ్వజస్థంభాన్ని ప్రతిష్టించారు!*

*🍁ఉత్సవం చివరన నాగిరెడ్డి గారు ట్రైలర్ యజమానికి 70 వేల రూపాయల చెక్కును* *అందించారు! యజమాని..*

*"స్వామివారి సేవకు నాకు బాడుగా? 5 రోజులు  ఆయనతో వున్న నేను కదా చెల్లించాలి!"*

*అని దానిని తిరస్కరించారు!*

*డ్రైవరును స్వామివారి సమక్షంలో సత్కరించారు.*

*స్వామి వారి సన్నిధిలో నాగిరెడ్డి, పివిఆర్కె ప్రసాద్,* 

*ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట్రామయ్యను*

*సత్కరించి, ఆయన చేతిలో ఓ కవర్ ఉంచారు!అది విప్పి* *చూసిన వెంకట్రామయ్య కళ్ళలో కన్నీళ్లు.. ఏడేళ్లుగా ఎదురు* *చూస్తున్న తన ప్రమోషన్* *ఆర్డర్ అది! ఇలా..స్వామివారి*

*సన్నిధిలో.. ఎందరికి* *ప్రాప్తం?..అనుకుంటూ..*

*ఆయన రెండు చేతులూ జోడించి ఆనందడోలికల్లో మునిగిపోయారు!*

*🙏🏽💐ఓం నమో వెంకటేశాయ* 

సేకరణ సుధా శశికుమారిమాచవరం

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online