Pages

kaathika suddha Ekadashi - Bodhana Ekadashi

ఈరోజు  భోదన ఏకాదశి-ఉత్థాన ఏకాదశి : కార్తీక శుద్ధ ఏకాదశి భోదన ఏకాదశి-ఉత్థాన ఏకాదశి :  కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి, దేవ-ప్రబోధినిఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేర్లు. ఆషాడ శుద్ధఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజున శయనించినశ్రీమహావిష్ణు​వు ఈ ఏకాదశి రోజునే యోగనిద్రనుండి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థానఏకాదశిగా అయ్యింది. దీనినే హరి-భోధిని ఏకాదశిఅతొలి ఏకాదశి నాడు ప్రారంభమైనచాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడేఅస్త్ర సన్యాసం చేసి, అంపశయ్య మీదశయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి ఈరోజునేజన్మించారు.
ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరన చేసి, మరునాడు ద్వాదశిఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి, పారణ చేసి(భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి.


ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి బ్రహ్మదేవునికినారద మహర్షికి మహ్ద్య జరిగిన సంభాషణస్కందపురాణంలో కనిపిస్తుంది. "ఈ ఏకాదశిపాపాలను హరిస్తుంది. 1000 అశ్వమేధయాగాలు, 100 రాజసూయ యాగాలు చేసినపుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని ఒక చిన్ననిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగఒక జీవుడు,తన వేలజన్మలలో చేసిన పాపాలనుకాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈరోజు మనం చిన్న మంచిపని (పుణ్యకార్యం) చేసినా, అది సుమేరు పర్వతానికి సమానమైనపుణ్య ఫలితం ఇస్తుంది. ఈ ఏకాదశి వ్రతంచేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవు. ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నతస్థానం కలగడంతో పాటు పాపాపరిహారంజరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగినపుణ్యానికి కోటిరెట్ల పుణ్యం ఒక్కసారైన ఈఏకాదశి ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుంది" అని బ్రహ్మదేవుడు నారదునితో పలుకుతాడు.


ఇంకా ఈ వ్రతంలో ఒకరికి చేసే అన్నదానం వలనసూర్యగ్రహణసమయంలో పవిత్ర గంగాతీరానకోటిమందికి అన్నదానం చేసినంత ఫలితంలబిస్తుంది. వస్త్రదానం చేయడం వలన, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకుఇవ్వడం వలన ఈ లోకంలోనే గాకమరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలులభిస్తాయి.


ఈ రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్దులు, యోగులుఅందరూ విష్ణులోకం చేరి కీర్తనలతోనూ, భజనలతోనూ, హారతులతోనూ శ్రీమహావిష్ణువునునిద్రలేపుతారు. అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజునఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికిఅపమృత్యు దోషం తొలగిపోతుందని ధార్మికగ్రంధాలు చెప్తున్నాయి. అందువల్ల అందరువిష్ణుమూర్తికి హరతి ఇవ్వండి. ఏవైనా కారణాలవల్ల హారతి ఇవ్వడం కుదరకపోతే దేవాలయానికివెళ్ళండి. అక్కడ స్వామికి ఇచ్చె హారతినికన్నులారా చూడండి, వీలైతే స్వామికి హారతికర్పూరం సమర్పించండి. అపమృత్యు దోషంపరిహారం జరుగుతుంది. స్వామి అనుగ్రహంకలుగుతుంది
ని కూడా అంటారు.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online