Pages

kaarthika puranam - 10th chapter

 కార్తిక పురాణం*
*10 వ అధ్యాయము*


 *అజామీళుని పూర్వ జన్మ వృత్తాంతము*

 జనకుడు వశిష్టుల వారిని గాంచి " ముని శ్రేష్ఠ ! యీ అజామీళుడు యెవడు? వాడి పూర్వ జన్మ మెటువంటిది?పూర్వ జన్మంబున నెట్టి పాపములు చేసియుండెను?ఇప్పడీ విష్ణు దూతలు వైకుంటమునకు తీసుకొనిపోయినతరువాత నేమి జరిగెను? వివరించ వలసినది " గాప్రార్ధించెను. అంత నా మునిశ్రేష్టుడు జనక మహారాజునుగాంచి యిట్లు పలికెను.


జనకా! అజా మీ ళుని విష్ణు దూతలు వైకున్తమునకుతీసుకొనిపోయిన తరువాత యమ కింకరులు తమప్రభువగు యమ ధర్మ రాజు కదా కేగి, " ప్రభూ! తమ అజ్ఞప్రకారము అజా మీ ళుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగాఅచ్చటకు విష్ణు దూతలు కూడా వచ్చి మాతో వాదించిఅజామీళుని విమాన మెక్కించి వైకుంట మునకు దీసుకొనిపోయిరి. మేము చేయునది లేక చాల విచారించుచూయిచటకు వచ్చినారము' అని భయ కి౦ పితులైవిన్నవి౦చు కొనిరి.

 "ఔరా! ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఇట్టి విధముగాజరిగి యుండలేదే? దీనికి బలమైన కారణము ఏదైనావుండి యుండవచ్చును" అని యముడు తన దివ్యదృష్టితో అజా మీళుని పూర్వ జన్మ వృ త్తాంతముతెలుసుకొని " ఓహొ! అది యా సంగతి! తన అవ సానకాలమున " నారాయణ" అని వైకుంట వాసుని స్మరణ జేసియుండెను. అందులకు గాను విష్ణు దూతలు వచ్చి వానినితీసుకొని పోయిరి. తెలియక గాని, తెలిసిగాని ముత్యుసమయమున హరి నామ స్మరణ మెవరు చేయుదురోవారికి వైకుంట ప్రాప్తి తప్పక కలుగును. గనుక, అజా మీళునకు వైకుంట ప్రాప్తి కలిగెను కదా!" అని అనుకొనెను.

 అజా మీ ళుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశమునఒకానొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడుఅపురూపమైన అందంచేతను, సిరి సంపదల చేతను,బలము చేతను గర్విష్టి యై శివారాధన చేయక,శివాలయము యొక్క ధనము నపహరించుచు, శివునివిగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను బెట్టక, దుష్టసహవసములను మరిగి విచ్చలవిడిగా తిరుగు చుండెడివాడు. ఒక్కొక్క ప్పుడు శివాలయములో పరమేశ్వరునికెదురుగా పాదములుంచి పరు౦డెడి వాడు. ఇతని కొకబిద బ్రాహ్మణ స్త్రీ తో రహస్య సంబంద ముండెడిది. ఆమెకూడా అందమైనద గు టచే చేయునది లేక ఆమె భర్తచూచియు చూడ నటుల నుండి భిక్షాటనకై వురూరాతిరుగుచూ ఏదో వేళకు యింటికి వచ్చి కలంగడుపుచు౦డెడి వాడు.

ఒకనాడు పొరుగూరికి వెళ్లియాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తినిబెట్టుకొని వచ్చి అలిసిపోయి " నాకు యీ రొజున ఆకలిమిక్కుటముగా నున్నది త్వరగా వంట చేసి పెట్టుము", అనిభార్యతో ననెను. అందులకామె చిదరించుకోనుచు,నిర్లక్ష్యముతో కళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా యీయక,అతని వంక కన్నెత్తి యైననూ చూడక విటునిపై మనస్సు గలదియైమగని తూలనాడుట వలన భర్త కు కోపం వచ్చి లనున్నకఱ్ఱతో బదెను. అంత ఆమె భర్త చెతి నుండి కఱ్ఱ లాగు కొనిభర్తను రెండితలు కొట్టి బైటకు త్రోసి తలుపులు సివేసెను.అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలనఇక యింటి ముఖము పట్ట రాదని తలపోసి దేశాటనకువెడలిపోయెను.

 భర్త యింటి నుండి వెడలి పోయెను కదాయని సంతోషించి, ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధిఅరుగు పై కూర్చుండి యుండగా ఒక చాకలి వాడు ఆదారిని పోవుచుండెను. అతనిని పిలిచి " ఓయీ! నీవి రాత్రినాతో రతి క్రీడ సలుపుటకు ర"మ్మని కొరెను. అంత నాచాకలి " తల్లి ! నీవు బ్రాహ్మణ పడతివి. నేనునిచాకులస్తుడును, చాకలి వాడిని మిరీ విధముగపిలుచుట యుక్తము గాదు. నేనేట్టి పాపపు పనిచేయజాలను" అని బుద్ది చెప్పి వెడలి పోయెను. ఆమె ఆచాకలి వాణి అమాయకత్వమునకు లోలోన నవ్వుకొనిఅచ్చటనుండి బయలుదేరి ఆ గ్రామ శివర్చకుని కడకేగి తనకామవా౦ఛ తీర్చమని పరి పరి విధముల బ్రతిమాలి ఆరాత్రంతయు అతనితో గడిపి వుదయమున యింటికి వచ్చి" అయ్యో! నే నెంతటి పాపమునకు ఒడి గట్టితిని? అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను యింటి నుండి వెడలగొట్టిక్షణికమయిననకామవాంఛకు లోనయి మహాపరాధముచేసితిని" అని పాశ్చాత్తాపమొంది, ఒక కూలి వానినిపిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తకు వెదికి తీసుకురావలసినది గ పంపెను.

కొన్ని దినములు గడిచిన తర్వాతబారత యింటికి రాగా పాదముల పై బడి తన తప్పులనుక్షమించమని ప్రార్ధించెను. అప్పటి నుండి మంచి నడవడికనవ లంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను.కొంత కాలమునకు శివర్చకునకు నేదియో వ్యాధిసంక్రమించి దిన దినము క్షీణి౦చుచు మరణించెను. అతడురౌర వాది నరక కుపముల బడి నానా బాధలు పొందిమరల నారా జన్మ మెత్తి సత్య వ్రాతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నది స్నానముచేసి దేవత దర్శనము చేసి యుండుట వలన నేడుజన్మముల పాపములు నశించుట చేత అజా మీళుడైపుట్టెను.

ఎప్పటికి తన అవసాన కాలమున 'నారాయణా ' అని శ్రీ హరి స్మరించుట వలన వైకుంట మునకు పోయెను.బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగ గ్రస్తురాలైచనిపోయెను. అనేక యమ యాత నలనను భవించి ఒకమల వాని యింట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదనిజ్యోతిష్కుడు చెప్పెను. మాల వాడా శిశువునుతీసుకొనిపోయి అడవి యందు వదిలిపెట్టేను.

అంతలో నొకవిప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల యేడుపు విని జాలి కలిగితీసుకొని పోయి తన యింట దాసికిచ్చి పోషించెను. ఆబాలికనే అజామీళుడు ప్రేమించెను. వారి పూర్వ జన్మవృత్తాంత మిదియే. నిర్మల మైన మనస్సుతో శ్రీ హరినిధ్యానించుట, దాన ధర్మములు, శ్రీ హరి కథలనుఆలకించుట, కార్తిక మాస స్నాన ప్రభావముల వలననెటువంటి వారైననూ మోక్ష మొంద గలరు. గాన కార్తికమాసము నందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసినవార లిహపర సుఖములు పొంద గలరు.   
                 
ఇట్లు స్కాంద పురాణా౦త ర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్యమందలి
 దశమా ధ్యాయము- పదవ రోజు పారాయణముసమాప్తము

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online