Pages

అశ్వ యుజ మాసం నవరాత్రులు ప్రారంభం

 17-10-2020 నుంచి నిజ ఆశ్వయుజ మాసం ప్రారంభం ..


 #ఆశ్వయుజ మాసం యొక్క విశిష్టత: 


🍁🍁🍁🍁


త్రిముర్తులైన బ్రహ్మ , విష్ణు, మహేశ్వరుల దేవేరులైన సరస్వతి,మహాలక్ష్మీ ,పార్వతిదేవిలకు అత్యంత ప్రీతికరమైన......వారి పూజలకు ఉత్కృష్టమైన మాసం ఆశ్వయుజం !

జగన్మాత అయిన పార్వతిదేవి దుష్ట శిక్షణ , శిష్ట రక్షణార్ధం , తొమ్మిది అవతారలను ధరించిన మాసం...

ఆయుర్వేద దేవుడు అయిన ' ధన్వంతరీ , త్రిమతాచార్యులలో ద్వైత సిద్ధాంత ప్రవక్త శ్రీ మధ్వాచార్యులు జన్మించిన మాసం. 

దుష్ట దానవుడైన నరకాసురుడు అంతమొందింపబడి ప్రజలందరికి ఆనందాల వెలుగులను పంచిన దివ్య మాసము ఇది 

ఈ మాసం లోని తొలి తొమ్మిది రోజులు "దేవి నవరాత్రులు ". సంప్రదాయబద్ధంగా పూజలు చెయ్యాలి అనుకున్న భక్తులు కలశాన్ని స్థాపించి , ముగ్గురు అమ్మల మూలపుటమ్మను ఈ నాటి నుండి తొమ్మిది రోజుల పాటు నియమముగా ఆరాధించాలి .

 దేవి పూజను ఆశ్వీయుజ మాసం అష్టమి, నవమిలలో పూజించిన భక్తులను ఎటువంటి శోకాలు దరిచేరవు. దేవి పూజకు ఉత్కృష్టమైన ఈ రోజులలో అమ్మవారిని పూజించి రోజుకొక నైవేద్యం చొప్పున సమర్పించడం మంచిది. కలశ స్థాపనాదులతో పూజించలేని వారు, అమ్మవారి పటానికి గాని, విగ్రహానికి గాని , పుస్తకాలను గాని పూజిస్తూ స్తోత్ర , నామ పారాయణలను చేయవచ్చు.

ఈ విధముగ దేవి నవరాత్రులలో ఆ తల్లిని ఆరాధించడం వల్ల ఆ దేవి సంతృప్తురాలు అవుతుంది. అంతే కాకుండా దుష్ట , గ్రహ పీడలు నశించి అమ్మవారి కృప కటాక్షలు కలుగుతాయని చెప్పబడుతోంది. 

అలాగే, ఈ మాసం లో సప్తమి రోజున గోపూజ చెయ్యవలెను. కపిల గోవును పూజించాలని, కేవలం పంచగవ్యములను మాత్రం స్వీకరించి ఉపవాసము ఉండవలెను. 

పూర్ణిమ నాడు " నారదీయ పురాణము"ను పండితులకు తాంబూలములో వుంచి దానము ఇవ్వవలేను.

పూర్ణిమ నాడు స్త్రీలు జాగరణ చెయ్యటం వలన లక్ష్మి దేవి సంతోషించి, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది అని శాస్త్ర వ

ఈ నెలలోని బహుళ పక్షములో చతుర్దశి , అమావాస్య తిధులలో దీపాలను దేవాలయం ,మఠము ప్రాకారాల్లోను , వీధులు , ఇంటి ముందు సాయంత్రము సమయములో వెలిగించుకోవడంవల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారని చెప్పబడుతోంది. 

ఈ విధముగ ఎన్నో విశిష్టతలను సొ౦తం చేసుకున్న మాసం -- ఆశ్వయుజ మాసం !

ఈ మాసం లో చేసే పూజలు, విధుల ఆచరణ వల్ల అనంతమైన పుణ్య ఫలాలు కలుగుతాయి.

అనంత రూపాలలో విలసిల్లే శక్తిస్వరూపిణి అయిన ఆ తల్లి ఏ రూపములోనైనా , ఏ నామంతోనైనా ఆరాధించవచ్చు. ఆ తల్లి అమ్మలగన్న అమ్మ !.

తనను నమ్మిన భక్తులను ఎట్టి పరిస్థితులలో విడవకుండా కాపాడే కల్పవల్లి ...

కరుణామయి..ఆ తల్లి !!!               (    .........సేకరించబడినది..........)

శ్రీమాత్రే నమః             ఇక అన్ని దానాలు ,పూజలు ,ఉపవాసాలు ,జాగరణ ,కుదరనివాళ్ళు ,చేతకానివారు చక్కగా 

మీ దగ్గరలోని  డేవాలయమునకు వెళ్ళి మనస్సు ను అర్పించి ..కొన్ని పువ్వులు కొబ్బరికాయ సమర్పించండి ....అదీ వీలుకాకపోతే  సాష్టాంగ ప్రమాణం చేయ0డి ...అమ్మవారు  కానీ భగవంతుడు కానీ చూసేది ఎంత ఖర్చు పెట్టావు అని కాదు ..ఎంతసేపు మనస్సు లో ఆ రూపం నిలుపుకున్నావు ..అదే మనస్సు సమర్పించి దైవం పట్ల మనం అనుభూతి చెందితే చాలు ...ఆ భగవత్ శక్తి మనలో ప్రసరిస్తుంది ...మనల్ని అంటిపెట్టుకొని కాపాడుతూఉంటుంది ..కానీ  ఏ ఒక్కరిని ,ఏ జీవి కి బాధ  కలిగించకుండా బ్రతకాలి ..ఏఒక్కరిని అవమానించకూడదు ..సేవ ఏ  పరమార్ధ్గ0గా బ్రతకాలి .  కొద్ది ఆలస్యం అయినా ...ధర్మం  కాపాడుతూఉంటుంది ...మన చూపు అహంకారం లేకుండా అమ్మవారు లేక అయ్యవారు అదే భగవంతుని పాదాలపై ఉంచి శర ణు కోరితే తప్పక కరుణిస్తాడు ....నమ్మకం తో ప్రయత్నం చేసి చూడాలి ...పెట్టే పరీక్షలు కూడా తట్టుకోవాలి ..అప్పుడు విజయం సాధిస్తాం ..అదే సాయిబాబా వారు చెప్పిన               శ్రద్దా.....సబూరి ...అంటే     శ్రద్ద.   ........ఓర్పు అని అర్థం ................................🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


 





0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online