Pages

Sreemannarayana..In five swaroopas

ప్ర: వేంకటేశ్వరస్వామిని 'అర్చావతారం' గా వచ్చాడు .స్వామివారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నిలువు బొట్టు మతం లో అనగా శ్రీవైస్టన్వం.... దానినే విశిష్టాద్వైతం అని పిలుస్తారు భగవత్ రామనుజలవారు ...ఈ మతాన్ని తీసుకొని వచ్చారు ...అద్వైతమే కానీ కొద్దీ మార్పులతో విశిష్ట మైనది విశిష్టాద్వైతం.. అని తెలుసుకోవాలి దీనిలో 3 ప్రతిపాదించారు రామానుజులు 1 ప్రకృతి...2 జీవుడు ...3..పరమేశ్వరుడు అవే మోడరన్ సైన్స్ లో electron... ptotaan... newtran

జ: విశిష్టాద్వైత సిద్ధాంత ప్రకారం నారాయణుడు ఐదు స్వరూపాలతో భాసిస్తున్నాడు.
1. పర, 2. వ్యూహ, 3. విభవ, 4. అంతర్యామి, 5. అర్చావతారం.

*1. పరస్వరూపం:* శుద్ధసత్వంతో, అద్భుత తేజస్సుతో వైకుంఠంలో నిత్యమూ భాసించే, భూదేవీ శ్రీ దేవీ సమేత మూర్తి. కేవలం నిత్యముక్తులకు ఇది దర్శనమిస్తుంది.నిత్య ముక్తులు అంటే జన్మ నుంచి విముక్తి పొందిన వారు వారికి వైకుంఠంలో కనిపించే స్వామి

*2:వ్యూహస్వరూపం:* జగత్ సృష్టికి మూలకారణమైన స్వరూపం. నాలుగు వ్యూహాలతో ఉన్నది. అవి - వాసుదేవ, అనిరుద్ద, ప్రద్యుమ్న, సంకర్షణ. ఈ వ్యూహాలతో సృష్టి స్థితి లయలను నిర్వహించువాడు. వాసుదేవుడు క్షీరసాగర శయనుడైన మూలమూర్తి. అనిరుద్ధుడు సృష్టికారక చైతన్యం. ప్రద్యుమ్నుడు స్థితి శక్తి. సంకర్షణుడు లయ కారకుడు. అనిరుద్దాంశ బ్రహ్మ, సంకర్షణాంశం రుద్రుడు, ప్రద్యుమ్న తేజం విష్ణువు.ఈ ...స్వరూపంతో ప్రపంచాన్ని లేదా జగత్తును నడిపించే ఒక తంత్రం లేదా విధానం planning and idea structure

*3. విభవ స్వరూపం:* ధర్మరక్షణార్ధం లీలగా అవతరించే నారాయణుడు. అప్రాకృత దివ్య మంగళస్వరూపంతో, లీలా విభూతితో ఇలకు దిగిన శ్రీరామ, శ్రీకృషాదులు హరి యొక్క విభవస్వరూపులు.ఇది ఏమిటంటే ...అనగా వైభవతత్వం శ్రీమన్నారాయణుడు ఆయన ధర్మ రక్షణార్ధం ...మనకోసం ఒక అవతారం గా వస్తాడు ..ఆయన ను గుర్తించి ....ఆయనకు దగ్గరగా అవుతాము

*4. అంతర్యామి:* జీవుల హృదయాలలో భాసించే పరమాత్మ. అందరి ప్రవృత్తులకు కారకమై, సత్కర్మానుష్ఠానాలకు అనుమతించే స్వరూపమే అంతర్యామి...ఈ స్వరూపం ఏమిటంటే మన లోపల వడ్లగింజ కొన పరిమాణంలో నీలపు రంగు లో జ్యోతి లా వెలుగుతుంటాడు ...కంఠం నుంచి  మన చేతితో   క్రిందికి చిటికిన వేలు తగిలే చోట ఒక సొట్ట ఉంటుంది .అక్కడ నుంచి పొట్ట స్టార్ట్ అవుతుంది .అదిగో ఆ సొట్ట లో నే పరమాత్మ జ్యోతి లా వెలుగుతుంటాడు .అదే అంతర్యామి ఆయన శరీరాన్ని ,ఆత్మ ని నడిపిస్తూ వెంట ఉంటాడు నువ్వు చేసే పాప, పుణ్యాలు ఆయనకు అంటవు. ఊరికే ఒక కరెంట్ లేక చైతన్యం ఇచ్చి చురుకుగా ఉంచుతాడు .జ్ఞానం తెలుసుకొని నడుచుకోవాల్సినది నీవే దానిని బట్టి పాప పుణ్యాలు మళ్ళీ జన్మలు ఎత్తడం ,కష్టాలు పడటం ..దానుంచి బైట పడటమే మోక్షం
ఇక ఇప్పటి యోగా గురువులు మన లోపల మనమే చూసుకొని అంతర్యామి ని కొలుస్తున్నాం అని చెబుతున్నారు ..దానినే మెడిటేషన్ అంటున్నారు ..ఇది కొత్తదేమీ కాదు ...భగవద్గీత లో ఉన్న దే కాక పోతే భగవద రామానుజులు దీనిని బోధించలేదు ..ఎందుకంటే ఈ ధ్యానం అంత తేలికైన వ్యవహారం కాదు ఈ రోజుల్లో ఏకాగ్రత చాలా కష్టం అందుకే సామాన్యులకు భక్తి మార్గం ఉపదేశించాడు అదే విగ్రహారాధన దానిద్వారా భక్తి. ..దానిద్వారా ప్రప త్తి దాని ద్వారా జ్ఞానం అప్పుడు మోక్షం ఇలా ఒక వరుస క్రమము చెప్పారు

*5. అర్చావతారం:* అర్చింపబడి అనుగ్రహించేందుకు వివిధ క్షేత్రాలలో వెలసిన భగవద్రూపం. తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడు, శ్రీరంగంలో రంగనాథుడు మొదలైన వి అంటే దేవాలయాలలో కొలిచే శ్రీరాముడు,శ్రీకృష్ణుడు శివలింగం ఇవన్నీ విగ్రహం రూపంలో కొలిచి ఆనందపడటం విగ్రహారాధన అన్న మాట
ఇలా శ్రీ వైష్ణవ0 లో భగవంతుడిని ...కొలిచే ,తలిచె విధానం ..భగవత్ తత్వం చెప్పబడినది

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online