Pages

అక్షయతృతీయ గురించి తెలుసుకుందాము

వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభం అయుంది అని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆనాటి ది ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది ....ఇంకా ఈ నాటి తృతీయ రోజునే శ్రీమహావిష్ణు వు అవతారం పరశురాముడు పుట్టాడు అనికూడా తెలుస్తోంది .
మత్యపురాణములో శివుడు ,పార్వతీ అమ్మవారికి అక్షర తృతీయ చాలా విశిష్ట మైనది ..అని ఆ రోజు చేసే దానాలు అక్షయమై ..అంటే నాశనము లేకుండా ఆ ఫలితం ఎప్పటికీ ఉంటుంది .బ్రహ్మ కు ప్రధానమైనది అలానే శ్రీమహావిష్ణువు ఆరాధన కూడా అత్యంతవిశిష్ట మైనది ..కొంతమంది.. అక్షతలు..తో కల్పిన నీటిని తలస్నానం చేస్తారు ..శ్రీమహావిష్ణువు వద్ద బియ్యం ఉంచి నమస్కారం చేసి ...ఆ బియ్యాన్ని ...బీద బ్రాహ్మణులు కు లేదా గుడి లోని అర్చకుల కు దానం ఇచ్చి ఆశీస్సులు పొందవచ్చు ...అవి కూడా అక్షయం గా ఫలితం ఇస్తాయి .చాలా ముఖ్య విషయం ఏమిటంటే మనం చేసే దానాలు పై లోకంలో ఉన్న పితృదేవతలకు ..చాలా పుణ్యాన్ని తెచ్చిపెడతాయు అందుకే కొందరు వాళ్ళ పితృదేవతలు పేరుతో కానీ వాళ్ళ ఇంట్లో గతించిన వారి పేరు మీద గాని చలివేంద్రం పెట్టి ఈ ఎండా కాలములో మంచినీటిని కుండలు పెట్టి వచ్చి పోయే జనాలకు ,బాటసారులకు ,అడవిలో జంతువులకు ,కూడా దప్పిక తీరుస్తూ ఉంటారు .అలానే బ్రాహ్మణులు కు ,అలానే ఎవరైనా ముస్సలి వారికి చేతికఱ్ఱలు, విసనకఱ్ఱలు ,కొత్త ధోవతులు ..బట్టలు ముఖ్యంగా ఎండలో కాళ్ళు కాలకుండా చెప్పులు ,గొడుగు ఇటువంటివి దానం చేయాలి ...ఆ పుణ్యం కూడా అక్షయమై .జన్మ తరువాత పై లోకాల్లో స్వర్గసుఖాలు ,మ ళ్ళీజన్మ ఎత్తి భూమిపై పుడితే అప్పుడు కూడా ఆ పుణ్యం అక్షయమై ..మంచి శుభాలు ను ,సుఖాలు ను కూడా ఇస్తుంది .అంతే కానీ బంగారం కొని దాచుకుంటే అది పిల్లలు పెట్టి అక్షయమై కొన్ని టన్నులు... టన్నులు అవుతుంది అని ఎక్కడా చెప్పివుండలేదు ...కాకపోతే ఏదైనా సువర్ణ అంటే బంగారు దానాలు ....పితృదేవతలు... పెద్దలు గతించిన వారి పేరు మీద ఇస్తే అది కూడా చాలా విశిష్టమైన ,అక్షయమై న దానంగా మంచి ఫలితాలను ఇస్తుంది .అలానే పశుగ్రాసం ,దాణా కూడా అంతే ..ఇక ప్రతీ దానం బ్రాహ్మణులు అని ఎందుకు అంటారు ...బ్రాహ్మణులు...వాళ్ళు వ్రాసుకున్నవి కదా అంటారు ...కానీ అది నిజం కాదు ..వాళ్ళే వ్రాసుకొని ఉంటే ..మరి వాళ్ళు కూడా ఉపవాసాలు ,పండుగలు ,వ్రతాలు ,గ్రహ సమస్యలకు దానాలు .....పురాణాలు, శాస్త్రాల లో చెప్పిన వి ..అన్నీవాళ్ళు కూడా ఆచరిస్తూ ఉన్నారా ?లేదా?..ఇతరులు ఒక్కరే చేస్తుంటే వాళ్ళు వదిలేసి తిరుగుతూ ఉన్నారా లేదే ..
బ్రాహ్మణులు కూడా గుళ్ళు, గోపురాలు పూజలు,శాంతులు, హోమాలు ...దీక్ష లు అన్నీ ...ఇతర కులాల వారితో చేయిస్తూ,
వారు కూడా చేస్తూవున్నారు ...కాకపోతే ప్రతీది బ్రాహ్మణులు కు అని ఎందుకు అన్నారంటే ..దానం ఇస్తే అది దుర్వినియాగం misuse కాకూడదు అని ...దానం ఇవ్వగానే అది అమ్మేసుకొని పీకల వరకు తాగేసి భార్య ను కొడితే దానం వల్ల ఒనగూరే ప్రయోజనం రాదు ...బ్రాహ్మణులు అందరూ మంచి వాళ్లేనా?అని మనకు సందేహం రావచ్చు ఈ రోజుల్లో అందుకే సత్ బ్రాహ్మణులు కి అని చెబుతూవున్నారు ...అస్సలు బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం కలవారు అని అస్సలు అర్థం ..అందుకే పెద్దలుబీదలు,చేతకానినివారికి ..అంటే ముదుసలి వారు ఏ కులం ఆయునా భగవంతుని రూపాలే .....అన్నీజీవులు ,అందరూ ..నేనే ...అందరిలోనూ నేను అంతరాత్మ గా వున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు గీత లో చెప్పాడు కదా .అలా చేయవచ్చు. తరువాత బ్రాహ్మణులు ఇచ్చిన దానం గుడిలో,లేక ఇంటిలో నిష్ఠ గా వండి దైవానికి నైవేద్యం అంటే నివేదించి...సమర్పించి తాను తింటూ ఇచ్చిన వారిని తలచుకొని పవిత్రంగా అన్న దాత సుఖీభవ అనే ఆశీర్వచనాలు చదువుతాడాని ,ఆ భగవంతుని చేత ఇప్పి0చుతాడని ప్రజల కు అనాదిను0చీ ఒక బలమైన విశ్వాసం. అంతే కాదు దత్తాత్రేయుడు అవతారం ,షిర్డీసాయి అవతారం ,త్యాగరాజు స్వామి వారు,పీఠాధిపతులు ,వామనా వతారం వరకు బ్రాహ్మణ రూపములో భిక్ష ను స్వీకరించిన వారు అగుట వల్ల .ఏవేవో.. కొంత వరకు అలా0టి ఆలోచనలు తో కూడా బ్రాహ్మణుడు కు దానం ఇవ్వాలని ..పైగా అగ్ని రూపం ,జ్ఞానం రూప0 బ్రాహ్మణులు అనియు ..పూర్వకాలములో భిక్షాటన చేసుకొని పరమార్థం గా జీవించడం వల్ల కూడా అనుకోవచ్చు .ఇంకా శాస్త్రాలలో బ్రాహ్మణ త్త్వం ..గురించి ఏమి చెప్పబడినదో ఇస్సారి సందర్భములో చూద్దాము .అలానే ..ఈ అక్షరతృతీయ రోజునే సింహచలం. ..అప్పల నారసింహస్వామి వారి చందనోత్సవం ..కూడా విశేషంగా నిర్వహిస్తారు ...ఆ స్వామి వారి కరుణా కటాక్షాలు మనందరిపై కురిసి ఆయురారోగ్య ఐస్స్వర్యాలతో మనందరిని వర్ధిలింప చేయమని ఆ లక్ష్మీనరసింహస్వామి వారిని వేడుకుండాము.
...సర్వేజనా:సుఖినోభవం తు... ఓ0...శాంతి..శాంతి. శాంతి:

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online