Pages

Brahmamokkate para brahmam okkate - part - 12

ఇటువంటి అన్ని సందేహాలకు ఉపనిషత్తులు ,భగవద్గీత లలో సమాధానం దొరుకుతుంది .కొన్ని వేదాంత విషయాలు ఏదో నవల లాగా చదువుకొంటూ పొతే అర్థం కాదు .సద్గురువు ,పండితుడు దగ్గర కూర్చుని అధ్యయనం చేయాలి  .ఇక పైన సందేహానికి  సమాధానం   ప్రతి జీవిలో రెండు  పక్షులు ఉంటాయి .ఒక పక్షి కదలకుండా స్థిరముగా వుంటుంది .ఇంకో పక్షి కదలాడుతూ వుంటుంది .అంటే దాని అర్థం ఒకటి జీవాత్మ    అది కదులుతూ ,ఆలోచిస్తూ వుంటుంది ,రెండోది పరమాత్మ .అయుతే అన్ని జీవులలోను ఇలానే ఉన్నప్పటికి   ప్రత్యేకముగా   మనిషిలో మాత్రం ఇంగిత జ్ఞానం అనేది ,ఇది మంచి ,ఇది చెడు అని తెలుసుకొనే అవకాశ ౦  ఇచ్చాడు ,జంతు వులలో మాత్రం అది లేదు .అందుకనే పెద్దవాళ్ళు పశువు ,మృగం అని కోపం వచ్చినప్పుడు తప్పు చేసిన వాడిని తిడుతూ వుంటారు . అయుతే  మనుషులలో అరిషడ్వర్గాలు అని ఆరు ఉంటాయి .అవి కామ ,క్రోధ ,లోభ మోహ ,మద మాత్సర్యాలు  ఈ ఆరు మనలోని జ్ఞానాన్ని మూసి కప్పెస్తాయు .

         కామం అంటే కోరిక     అది తీరక క్రోధం   అంటే కోపం     వున్నది పోతుందేమో అని లోభం      అంటే పిసినారితనం .     మళ్ళీ పదే పదే దానినే కోరుకోవటం ,దానిని విడిచిపెట్టలేక పోవటం అదే మోహ౦ .      ఇక మదం అంటే    నా అంత బలవంతుడు ,గొప్పవాడు ఇంకోడు రాడు నన్ను గెలిచి ఇదిఎమి పట్టుకెళ్ళలేడు .అని ఆలోచించడం ఇక మదం ముదిరి వచ్చేది  .మాత్సర్యం దానివల్ల వచ్చే పనికిరాని ఆవేశంపు గర్జనలు   ఈ ఆరు కాని అందులో ఒకటి కానీ మనుషుల్లోని మానవత్త్వాన్ని మంటకలిపేస్తాయి అది అప్పుడు చెడు గా మారిపోతుంది .అప్పుడు కూడా అంతరాత్మ గా కొంచం కొంచం గా మనిషి ని హెచ్చరిస్తూనే ఉంటాడు .కొంతమంది దానిని సిక్స్త్ సెన్సు అంటూ వుంటార     .అయునా వినడు  .లోపల  దాగి వున్న భగవంతుడు అలా చూస్తూ మౌనముగా ఉండిపోతాడు     .అటూ ఇటూ చలించనివి   మంచిని  స్తిరముగా ,శా స్వితముగా  వుండే వి ,ప్రపంచం వున్ననాళ్ళు ఉండేవి    భగవంతుడు అవి నేనే   అని కొన్నిటిని ఎంచుకొని    భగవద్ఘీత లో  చెప్పటం లో రహస్యం అదే అనుకోవాలి    .అంతేకాదు ప్రతీ ఒక్క  జాతికి  ఓ  ముఖ్య మైన దానిని ఎంచుకొన్నాడు .అది అగ్రభాగములో వుండిమిగతా వాటికి బలాన్ని , ఆదర్శాన్ని మార్గదర్శ కత్త్వాన్నిఇవ్వటానికి అలా ఎంపిక చేసుకొని చెప్పి ఉంటాడు భగవానుడు.

      .కాని వాస్తవముగా   అన్ని ప్రాణుల్లోనూ ,అన్ని జీవులలోను భగవంతుడు వసించి వున్నాడు .అందుకే ,అందుకే శ్రీ వైష్ణవములో తిరుమంత్రార్ధం మూడు రకాలు వుంటుంది మొదటిగా ఓం నమో నారాయణాయ , తరువాత ఓం నమో భగవతే వాసుదేవాయ  తరువాత ఓం నమో విష్ణవే ఇది పూర్తి తిరు మంత్రం , ద్వయమంత్రం ..ఇంకా మనం ప్రతి రోజు ,ప్రతి పూజకు చదివే  కేశవ నామాలలో సంకర్షణ ,వాసుదేవ ,ప్రద్యుమ్న నామాలు చాలా చాలా విశిష్టమైనవి అని పెద్దలు చెబుతారు .ఎందుకంటే పర ,వ్యూహ   విభవ   అంతర్యామి  అర్చన అనే అయుదు పద్దతులలో భగవంతుడి ఆరాధన విధానం వుంది అని పైన చెప్పుకున్నాము .శ్రీ మన్నారాయణు ని వ్యుహములో వుండే వే ఆ సంకర్షణ , వాసుదేవ  ప్రద్యుమ్న  రూపాలు అందుకే వాటిని మన పెద్దలు అంత గొప్పవి గా చెప్పారు .  అంటే ఆరాధనలో మొదటగా కొలిచేది శేషశాయుఅంటే పవలించియున్న శ్రీ మన్నారాయణుడు రెండవ విధానములో భగవ౦ తుడి ఆరాధానములో ఈ వ్యూహ ము లో వచ్చేవి ఆ సంకర్షణ  వాసుదేవ  ప్రద్యుమ్న రూపాలు

      .ఇక ఆతరువాత ఆరాధన విధానాలు ఇంకా మూడు వున్నాయి .అవి ఇదివరలో పైన చెప్పుకున్నాము   జీవుడికి వారి వారి గతం జన్మలలో చేసుకున్న పాప పుణ్యాలను పట్టి శ రీరం,జన్మ ,జీవితం ఇస్తాడు.  తరువాత  జీవుడికి శ రీరం అనే బండి ఎలా నడుపుకోవాలో ,ఎలా ప్రయాణం చేయాలో ,ఇది మంచి   ఇది చెడు   అనే జ్ఞానం ,విజ్ఞానం నేర్పిస్తాడు .అందుకే నా ఉద్దేశ్యములో భగవంతుడి దయ తో నే మనకు మంచి గురువు లభిస్తాడని ,అలా అటువంటి గురువే మనకు దైవాన్ని ,ఆ మోక్ష మార్గాన్ని చూపిస్తాడు అని , అందుకే  గురువు కంటే దైవమే గొప్ప అని నా ఉద్దేశ్యం .రాక్షస గురువు శుక్రాచార్యుడు ఎన్ని మార్గాలు కనిపెట్టినా వాటి అన్నిటినీ వమ్ము చేసేవాడు .గురువుని బట్టి మార్గం దానిని బట్టి భగవంతుడు లభిస్తారు కదా .కాబట్టి అంతిమం గా భగవంతుడి దయ వుండాలి .సరే ఇక అలా   పండితులు గురువులతో  జ్ఞానం   చెప్పిస్తాడు  , ఒక్కొక్క సారి ఆయనే దత్తాత్రేయుడిగా  మరియు   గీతాచార్ర్యుడు గా వచ్చి దర్మం ఉపదేశించి    అవసరాన్ని బట్టి స్తాపించి    వెళుతుంటాడు,.కొన్ని కొన్ని స్వయం అనుభవాలతో స్వయంగా మనకే నేర్పిస్తాడు   అన్ని రకాలుగా తర్ఫ్ఫీదు ఇచ్చి .అప్పడు నీ బండి లో అంటే నీ శ రీరములో కూర్చో బెట్టి నీ వు ఏమి తెల్సుకున్నావో ,తెల్సింది ఎలా ఆచరిస్తూన్నావో  ,,తెల్సి కూడా ఎలా నటిస్తున్నావో  , అంతా గమనించి మార్కులు వేస్తాడు .దానినిబట్టి మళ్ళీజన్మలా ,లేక మోక్షమా అనేది నీ కు వచ్చిన మార్కులు బట్టి వుంటుంది .

       ఇంత చెప్పినా మనిషి మారడు అతని స్వభావము మారదు   ,మార్చుకోవాలనే  ప్రయత్నం కూడా చేయడు  . కాబట్టి నీవు జన్మ ఎత్తినతరువాత ,నియమాలు నిభందనలు తెలుసుకొని రహదారిపై నీ జీవన శ రీర సెకటాన్ని జాగ్రత్తగా నడుపుకోవాలి . ధర్మముగా  నీకు లభించే దానితో నీవు సంతృప్తి పడుతూ జీవితాన్ని నడుపుకోవాలి ,ఒకర్ని చూసి ఈర్ష్య పడాల్సిన పని లేదు ,కోటీశ్వరులు కావాలని ఏదో ఏదో అడ్డదారులు తొక్కడం ,మనశ్శా౦ తి లేకుండా ,మనవాళ్ళకు ప్రశాంతమైన నిద్ర లేకుండా .సాగించే జీవితం ఎవరికీ లాభం .ప్రక్కవాడిది లాగేసుకొని తినేయటం ,వాడి డబ్బు కొట్టెయ్యడం, అడ్డం వస్ద్తే  వాడిని చంపేయటం  ఎవరికోసం పోనీ వాడిని చంపి వీడు ఏమైనా వంద సంవత్సరాలు బ్రతుకుతాడ ని గ్యారంటీ ఏమైనా వుందా ? 

       ఇక ,తరువాతి తరాలకు కూడా మనమే సంపాదించి పెట్టాలనుకోవటం .ఇదంతా అతిగా ఆశపడటం అవుతుంది మనం సంపాదించి ఇవ్వడం వచ్చిన వాడు విలాసాలు గడిపి వాడికి బద్ధకం పెరిగి అంతా త్రాగి వ్యసనాలతో ఆ డబ్బు అంతా తగలేయడం , కాబట్టి ఇది మంచిది కాదు    .మనం బ్రతకాలి ,పదిమందిని బ్రతక నివ్వాలి ఎక్కడైనా ఎప్పుడైనా మన ..కర్మ మన విధి జాగ్రత్తగా    ఆచరించాలి దాని ఫలితం ఆయన  కు వదిలేయాలి ,ఆయన  చూసుకొంటాడు.  గీత లో భగవంతుడు చెప్పినది  కూడా ఇదే .కోట్లకు పడగలు ఎత్తే మనిషి గా తయారవచ్చు కాని భగవంతుడు మెచ్చే మనస్సు ని మాత్రం అంత తేలికగా తయారు చేయలేవు  మానవుని జన్మఎత్తినందుకు  ఇహ లోకములో కోరికలు తీర్చుకోవటం లో  ఆశ పడాలి తప్పదు.కాని అతి ఆశ మాత్రం ఎప్పటికీ మంచిదికాదు అని తెలుసుకోవాలి .ధర్మ మార్గం లో తీర్చుకోవాలి ,అది భగవానుడు మెచ్చి  ఇచ్చే కర్మ మంచి ఫలితం .
 
 
 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online