Pages

పేరొకటి - కధ మరొకటి!!!!! ఇది మరోరకం ఆవు వ్యాసం

 
ఈ వ్యాస రచయుత  ఆయన వ్రాసే ప్రతీ వ్యాసములో కూడా హిందూవులను .బ్రాహ్మణులను ,వైదికమతమును తూలనాడటం గా పని పెట్టుకున్నారు .ప్రతీ మతములోను ,ప్రతీ కులములోను మంచివాళ్ళు ,చెడ్డవాళ్ళు వున్నారు అది వారికి తెలియాలి ..వారు వ్రాసిన పది వ్యాసాలలో  తొమ్మిది  హిందువులను తూలనాడిన వ్యాసాలే .వాళ్ళు ఏమి చెప్పిన ,ఏమి వ్రాసినా ఆవు వ్యాసం లా అక్కడకే వస్తారు . ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే  ఆ వ్యాసం పై  ఏదైనా మనకు తోచిన నాలుగు విషయాలు లేక అభిప్రాయాలు వ్రాసి పంపిస్తే ఈ వార్తా పత్రికలు వాళ్ళు వేసుకోరు .ఏమిటి కారణం అడిగితే అబ్బో ఆ వ్యాస కర్త చాలా పెద్ద మనిషి వారి అబిప్రాయాలకు ఎదురు ఖండన వ్రాయటమా ? అంటూ మన వ్యాసం తీసి ప్రక్కన పారేస్తారు .అదే  ఈ వ్యాసం చాలా బాగుంది అంటూ హిందువులను ,బ్రాహ్మణులను ఇంకో రెండు తిట్టి   కనిపించని ,నేడు వినిపించని   బౌద్దాన్ని నాల్గు పొగిడి  వ్రాసి పంపిస్తే బ్రహ్మ్మాండముగా వేసుకుంటారు . ఇక వాళ్ళ జన్మ అంతా ఇలాతూలనాడటమే పనా ? మంచి విషయాలు కూడా కాస్త చెప్పండి   ఇక .కులం ,మతం ఒద్దు అంటారు .వీళ్ళే ముందు కులం ఎత్తి పట్టుకు వస్తారు .అదే పొరపాటున బ్రాహ్మడు లేక ఓ .సి  వాళ్ళు కులం మాట తెస్తే మీది మీది కి ఊరికి వస్తారు .  మూడ విశ్వాసాలు  ను ,సమాజానికి,నష్టం తెచ్చే ఆచారాలను ఏ మతం లో వున్నా ,ఏ కులంలో వున్నా ఖండించాల్సిందే .దానిని ఎవరూ కాదనరు .హిందూ మతం మీద ,బ్రాహ్మణుల పై వ్రాసినంత ఇతర కులాలు ,మతాలపై వ్రాయలేరు .అంత ఎందుకు పైన  మనం చూస్తున్న రచయుత గారివి ఎన్నో వ్యాసాలూ చూస్తూవుంటాం. కానీ వారివి ఒక్క వ్యాసం కూడా ఇతరులపై  నాకు ఎప్పుడూ కనిపించలేదు ..ఎప్పుడూ అరిగిపోయున రికార్డు లా గా అదేనా .  అన్నికులాల్లో ప్రతిభావంతులు వస్తున్నారు ,గొప్ప చదువులు చదువుకొంటున్నారు  కాని చాలామంది నిరుధ్యోగముతో బాధపడుతున్నారు .అటువంటి సమస్యలు పై వ్రాయవచ్చు.అధికధర లు ,దేశ సరిహద్దుల్లో సామాన్యప్రజలు పడుతున్న ఇబ్బందులు ,టెర్రరిజం ,నక్సలిజం  డ్రగ్స్ ,కల్తీలు ,రైతుల సమస్యలు ,అన్నిమతాల్లో కుటుంబ నియంత్రణసమస్యలు , పర్యావరణం ,పక్షులు ,లాంటివి ఎన్నో వున్నాయి .   అయునా ఒక నాటి చాంధస వాదుల్లోనుంచే చాలామంది సంఘ సంస్కర్తలు పుట్టుకొచ్చారు ,వాళ్ళ పేర్లు వ్రాస్తూ పొతే ఓ చాంతాడు  అంత లిస్టు వస్తుంది . స్వాతంత్రవుద్యములో ఒక్క మహాత్మాగాంధీ తప్ప మిగతా వారు అంతా బ్రాహ్మణులే ,దానిలో చాలామంది జమిందారులే వాళ్ళు అంతా దేశం కోసం ఆస్తులు ,కుటుంబం జీవితం అంతా ధారపోసిన వాళ్ళే ,ఈనాడు వాళ్ళ వారసులు ,కుటుంబాలు చదువులు వుండీ ఉద్యోగాలు లేక ,ఆస్తిపాస్తులు లేక రోడ్ల పై బడి బ్రతుకు ఈడుస్తున్నారు .అటువంటి వాళ్ళ సమస్యలపై వ్రాయవచ్చు .జమ్మూ కాశ్మీర్ లో వేల మంది బ్రాహ్మణులుపండితులు వాళ్ళ కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు బలవంతముగా లాక్కొని  వాళ్ళను వెళ్ళ  గోట్టేసారు ముస్లిమ్స్ .భయపడి లొంగిపోయి కొంతమంది ముస్లిమ్స్ గా మారిపోయారు .అటువంటి బాధితుల పై వ్రాయవచ్చు . ఎప్పుడూ కసి కసి గా హిందూవులను,వేదాలను బ్రాహ్మిన్స్ పై రాతలు వల్ల ఏమి ప్రయోజనం ?వేదాలులో అంతరిక్షo గురించి విజ్ఞానం వుంది అని తెలుసుకున్న అమెరికన్లు వాళ్ళ స్పేస్ సెంటర్ లో వేదిక్ రీసెర్చ్సెంటర్ ను ఎప్పుడో స్తాపించు కున్నారు .మనం మాత్రం మనవేదాలపై విషం కక్కుతూ ఉన్నాము .  వేదాలలో ఏముంది నాకు ఏమి కనపడలేదు అని ఆ మధ్య ఒకామె వ్రాసారు .అంతమాత్రం చేత వేదాలు చదివే వారందరూ దుకాణం మూసుకొని వెళ్ళలేదు సరికదా వేదాలు చదివి తెలుసుకుందామని చాలామందికి ఎంతో ఆసక్తి కలిగింది .బనారస్ విశ్వ విద్యాలయం ,తిరుపతి శ్రీ  వెంకటేశ్వరవిశ్వ విద్యాలయం అటువంటి చోటికి వెళ్లి పండితులను కలిసి ,అక్కడ గ్రంథాలయములో బుక్స్ రుబ్బితే విషయాలు బైటకు వస్తాయి .ఇంట్లో కూర్చుని ఎక్కాలపుస్తకం లా వ్రాసేది కాదు అంతదాకా ఎందుకు   పూర్వకాలములో త్రేతాయుగంలో రావణాసురుడు అంతటి రాక్షసుడు లెక్కలు అదే గణితం పై పెద్ద గ్రంథం వ్రాశాడు ,దానిలో గ్రహాలు ,గ్రహాల వ్యాసం ,కొలతలు ,వాటి ప్రభావం పై పెద్ద బుక్ వ్రాసాడు .అది చాలామందికి తెలీయదు. ఇక మన వ్యాసం లోకి వస్తే ,    రాష్ట్రపతి గా  బ్రా హ్మనుడిని చేస్తే ,  బ్రాహ్మణుడా అంటారు ?దళితుడిని చేస్తే దానిలో కూడా రంద్రాన్వేషణ చేస్తున్నారు .ఈ మద్య మీడియా కూడా బ్రాహ్మణుడే దైన గొప్ప స్తాయులో సంఘం లో వస్తే కులం పేరు వ్రాయకుండా దాటేసినసందర్భాలు చాలా వున్నాయి .కులం లేదు ,మతం లేదు ,ప్రాంతం లేదు వర్ణం లేదు అని రాజ్యాంగములో గొప్పగా వ్రాసుకున్నాము .కానీ oc లకు వేరే విద్యాసంస్థలు,bcలకు scలకు s T  లకు ఇతర మతాలకు  ఇంకా స్త్రీలకూ ఇవి కాక బ్రాహ్మణులకు వేరే కార్పొరేషన్లు,bc లకు వేరే కార్పొరేషన్లు ఇలా ఎంత కాలం . రాజ్యాంగము  మరి కుల ,మతాలు లను ఒప్పుకోలేదు , అని గొప్పఅంటూ వ్రాతలుఎందుకు ?
బౌద్ధమతము అంటే చాలా మంది  అది ఒక వేరే మతము గా చెబుతూవుంటారు .అది వేరే మతం ఎలా అవుతుంది అని  నా భావన  . మీరు కూడా ఆలోచించిచూడండి .బౌద్ధం  స్థాపకుడు గౌతమబుద్దుడు .ఆయన కులం క్షత్రియ ,శ్యాఖ్యవంశపు రాజు తల్లి తండ్రులు ఇద్దరు హిందువులే వాళ్లకు పుట్టిన సంతానం ఏమవుతుంది?హిందూవులే కదా పైగా కాషాయము ధరించి ,గుండు కొట్టించుకొని సన్యాసం తీసుకోవటం , యోగ ముద్ర ఇది అంతా హిందూ మతమే కదా ,అంటే ఇది కూడా హిందూ మతములో ముక్క ,జైనమతం  కూడా అంతే  కాకపొతే సామాజిక స్పృహ కొత్తగా తీసుకువచ్చారు అని చెబుతున్నారు . శ్రీరాముడి కాలములోను సామాజిక సంఘటనలు చాలా జరిగాయి ,గుహుడు,శ బరి,కొద్దిగా జంతు లక్షణాలు కలిగిన మానవ వానరులను సైతం క్రమశిక్షణలో పెట్టాడు .దుష్టులు రాక్షసులను అందరిని మట్టుపెట్టాడు ,క్రింది కులాల ను ప్రేమతో అక్కున చేర్చుకోవడం ఆయన దగ్గర్నుంచే ప్రారంభం అయుంది . అలానే క్రీస్తు పూర్వములోనే వేదకాలములో ఉపనిషత్తులు ,అరణ్యకాలు ఉద్భవించాయి. అరణ్యకాలు ,ఉపనిషత్తులు ఇవి జ్ఞానముకు సంబంధించినవి ,కొంతమంది బ్రాహ్మణులు ఆడంబరమైన పూజలు కు వ్యతిరేకముగా అడవుల్లోకి వెళ్ళిపోయారు .వాళ్ళ అక్కడే వుండితయారుచేసినవి అవి .కాబట్టి సామాజికస్పృహ  అప్పటినుంచే  ప్రారంభం .
ఇక తరువాత విషయం  మరచిపోని చరిత్ర బౌద్ధం అన్నారు .అంత వుంటే భారతీయులలో మరి మాంసం ,మద్యం ఎందుకు విపరీతమైన వాడకం పెరిగింది ? ఆ రోజుల్లో హిందూసమాజం వివక్ష చూపారు అని , క్రింది కులాల వారు  బౌద్ధం లోకి మతం మర్చేసుకున్నారని కొంతమంది మహనీయులు వ్రాసేశారు   .నిజముగా అలా జరిగి వుంటే చాలా మంది క్రింది కులాలవారు మాంసం ,మధ్యం ముట్టకుండా వున్న వాళ్ళు చాలా మంది వుండాలి కదా ,   పైన చెప్పిన ఆ మాంసం ,మద్యం లాగేస్తున్నారు , బుద్దుడిబోధనలు ఏమి అయి పోయాయి ? నాగపూర్ లో సభ లో ఆనాటి రోజుల్లో పాల్గున్నబౌద్దుల ,మారిన మతస్తులు అంతా ఎటు పోయారు ?  బుద్దుడు ,అంబేత్కర్ మంచిని ఆచరించమని చెప్పారే కాని ఇలా తాగి,తినీ రోడ్ల పై తందనాలు ఆడమని చెప్పలేదే .
బౌద్దానికి ,ఛాందసవాదం కు మధ్యపోరాటం అని వ్రాసారు .అందులో ఒక విషయం వుంది .క్రీస్తు పూర్వం ఎన్నో మతాలూ పుట్టాయి .ఎవరి ఇష్టం వచ్చినట్లు  వాళ్ళు మతం అవలంబిస్తూ మూడనమ్మకాలు నమ్మసాగారు . ఆ తరువాత కొంత కాలానికి శంకరాచార్యులు వారు వచ్చి    వారి మతాలలోని   విషయాలను ప్రస్తావిస్తూ  కొన్ని ప్రశ్నలు
అడిగారు ,దానికి సమాధానాలు చెప్పలేకపోయారు.           
==================================================================
అదీ కూడా ఏదో అలాటప్పా గా ,మామూలుగా అడగటం కాదు .ఆయన ప్రస్తానత్రయం  అనే ఒక సూచీ పెట్టాడు .అనగా మూడు పుస్తకాలు . అవి వేదం – ఉపనిషత్తులు –భగవద్గీత . వారు చెప్పే మతం విషయాలు ఈ మూడింటిలోనూ చూపించాలి ,ఉదాహరణకు గాణాపత్యం ,అంటే గణపతి ని ఆరాధించేవారు గణపతి కి సంభదించిన విషయాలు  పై న చెప్పిన మూడు పుస్తకాలలో చూపించాలి . ఏ ఒక్కదానిలో లేకపోయనా ఆ మతం వైదిక మతం కాదు . అంటే శాస్త్రీయం కాదు .దానిని ప్రజలు నమ్మకూడదు .అనుసరించ కూడదు .వదిలిపెట్టేయాలి .అలా 75మతాల వారు ఆయనతో వాదులాట లు పెట్టుకొనగా అందరు ఓడిపోయి కేవలం 5 మతాలూ వారు మాత్రమే మిగిలారు . వారు ఆదిత్యం(సూర్యారాధన) ,అంబికాం (దుర్గ) ,గణనాధం  విష్ణుం   మహేశ్వరం .ఇలా .ఇక ఆ తరువాత ఈ అయుదు గురు మళ్ళి వాళ్ళలో వాళ్ళు మేము గొప్ప కాదు మేము గొప్ప అని కొట్టుకోసాగారు .అప్పుడు శంకరాచార్యులువారు ఒక సలహా ఇచ్చారు ,ఈ అయుదుగురు  పూజలో గుండ్రముగా   మీ విగ్రహాలన్నీ పెట్టుకోండి  . ఎవరి మతం వారికి ఏది ఎక్కువ అనిపిస్తే దానిని మధ్యలో పెట్టుకోండి . అలా ఒక విషయం కొత్తగా చెప్పి ,పైన 5 + 1 ఆరు మతాలు స్తాపించారు కాబట్టి షన మత స్తాపనాఆచార్య  అని శంకరాచార్యులు వారికి పేరు వచ్చింది .అలా మధ్వాచార్యులు ,ఆ తరువాత రామానుజాచార్యులు అలా మిగతా గురువులు అందరు వచ్చారు .వారి వారి జీవిత గమనములో మళ్ళీ మళ్ళీ పుట్టుకు వస్తూవున్నమూఢనమ్మకాలు ను అణిచివేస్తూ    జ్ఞానంతో కూడిన   భక్తిని  ప్రతిపాదించారు .అలా కొట్టుకొని పోయి కనుమరుగు అయున చాలా మతాలలో బౌద్ధము ఒకటి .త్రి మతాచార్యులు ఎవరూ వ్యక్తి పూజలు ఒప్పుకోలేదు .అంటే వాళ్ళ బొమ్మలు పెట్టి చేసే పూజలు వుండవు . బౌద్ధములో బుద్దుడు చెప్పింది ఆచరించ కుండా ఆయన బొమ్మలు పెట్టి వ్యక్తిపూజ చేయటం వల్ల కొంతకాలానికి  ఆ  మతం  అంతరించి పో యినది .
పూర్వకాలములో యజ్ఞాలలో ఎక్కువ శాతం మేకలను బలి ఇచ్చేవారు .అలానే ఆవులను ,గేదెలను గుర్రాలను కొంచం తక్కువగా బలి ఇచ్చేవారు .అది కూడా శాస్త్రం ప్రకారం
 శ రీ రములో వున్న చిన్న భాగం వోప అనే దానిని తీసి యజ్ఞ పాత్రలో వేయాలి .కాని రాను రాను అది ముదిరి టన్నుటన్నుల మాంసం లాగేయటం మొదలు పెట్టారు .అదిగో అక్కడే ఆడంబ ర మైన ఈ పూజల వల్ల  విసిగిపోయినకొంతమంది ఋషులు అడవుల్లోకి వెళ్ళిపో యి వ్యతిరేకించారు  బుద్దుడు ,శంకరాచార్యులు  లాంటి వారు ఆ మూఢనమ్మకాలు కు వ్యతిరేకముగా పోరాటంచేశారు .ఇక్కడే మనం ఆలోచించాలి ,బుద్ధుడు కి మిగతా త్రి మతా ఆచార్యులు కి తేడా ,  ఏమిటి  అంటే బుద్దుడు  ప్రజలకు జ్ఞానం  బోధించాడు ,ఆచరించమని చెప్పాడు ,కాని వాళ్ళు చెప్పిన జ్ఞానం ఆచరించడం మానేసి ,ఆయన బొమ్మలు పెట్టి పూజించటం మొదలు పెట్టారు .కాని త్రి మతాచార్యులు చెప్పిన జ్ఞానం ఇక్కడ ప్రజలు ఆచరించారు ,ఆదరించారు .అందుకే వాళ్ళ బొమ్మలు పెద్దగ ఎక్కడ కనిపించవు .మెల్ల మెల్లగా మధు మాంసాలు ను వైదిక పూజల్లో మానివేశారు .ధృఢమైన సంకల్పం తో మాంసం .సోమరసం అనే మధువు మానివేశారు ,అలా  అలా పురోహితులు ,ఆ వర్గం వారు సంపూర్ణ శాఖాహారులు అయ్యారు .మరి ఇప్పుడు తినే వారంతా ఎవరు ? ఇప్పుడు అహింసావాదం ఎక్కడికి పోయింది ? పైన వున్న వ్యాసం రచయుత లెక్క ప్రకారం ,ఆ రోజుల్లో అందరు బౌద్ధం లోకి వెళ్ళిపో యి వుంటే  ,లారీ లారీలు మాంసం లాగించే వారు అంతా ఎవరు ? యజ్ఞం లో ఓ జంతువుని ముక్కు మూసి మంత్రాలు చదువుతూ బలికోసం చంపారు  అంటేనే  అది ఒక పెద్ద హింస గా భావించే వాళ్ళు , మరి ఈనాడు చేతులతో కొస్తే ఆలస్యం అవుతుంది అని  మూడు రోజులు తిండి పెట్టకుండా నీళ్ళు ఇవ్వకుండా వాటిని మాడ్చి ఆ పై  పశువులను  , యంత్రాలలో పెట్టి పరమ కిరాతకముగా ప్రాణం పోకుండానే చర్మం పై వేడి వేడి నీరు పోసి    వూ డపీకి ,కనుగ్రుడ్డ్లు పెకిలించి ,ఎముకలు విరిచి రక్తం ఏరుల్ల్లాప్రవహింప చేసి  పైసాచికముగాతినేది ఎవరు ?
ఈ హింస మీ కళ్ళకు కనపడటం లేదా ? బీఫ్ పెస్టివల్ ను ఎందుకు సమర్ధిస్తున్నారు ?అప్పుడు బుద్దుడు , జైనుడు ఒంటెలు మాత్రమె నిషేధించారు .గే దెలు కూడా నిషేధించటం ఆనందకరమైన అంశం .ఎందుకంటే ఆవులు తెల్లగా ఉంటాయి ,గేదెలు నల్లగా ఉంటాయి కాబ ట్టి బ్రాహ్మణులు కుట్ర తో గేదె లు దేవతలు కాదు అనే వాదం తెచ్చారు  ఇతర రాష్ట్రాలలో ఆవులను చంపకుండా ఎక్కువ గేదెలను చంపి తినేస్తున్నారు  అంటూ చాలా సభల్లో కంచే ఐలయ్య్ చెప్పారు .అది ఉపయోగములో మాత్రమె నేను చెబుతున్నాను ,ఆవుల పాల కంటే ఎక్కువ గేదె ల పాలనే నేడు మనం ఎక్కువగా త్రాగుతున్నాము .కన్నతల్లి మనకు చిన్నప్పుడు   5 సంవత్సారాలు వరకే పాలు ఇచ్చి పెంచు తుంది .కానీ పశువులు మనషి జీవితాంతం పాలు  పెరుగు  నెయ్యి  ఇచ్చి చచ్చిన తరువాత కూడా ఎముకలు ఎరువుల కర్మాగారానికి ,చర్మం చెప్పుల కు ఇచ్చేసి  వెళుతుంది ,ఇంకా ఆవు అయుతే ఆక్సిజెన్ పీలుచుకొని ఆక్సిజెన్ నే వదిలిపెట్టి పర్యావరణం మేలు కు ఎంతో ఉపయోగపడుతుంది . పూర్వకాలములో  రైతులు      పశువులను స్వంత బిడ్డలు గా చూసుకోనేవాళ్ళు .ముసలి వాటికి విశ్రాంతిని ఇస్తూ వాటికి సేవ చేసేవాళ్ళు .అలానే  రాత్రివేళలలో పశువులు ఏవి అయి నా దారి తప్పి ఆకలితో బాధ పడతాయి అని ,ఆలోచించి ఇంటి ముందు అరుగుల పై కాస్తంత గడ్డి ,వేసి ఉంచే వారు .మరి ఇప్పుడు కాలం మారిపోయింది .తల్లి తండ్రులు ,ఆవులు గేదెలు అంతా వ్యాపారమే ,పనికిరాని పశువు ఇంటి ముందు ఎందుకు దండగ కబేలం కు అమ్మితే రెండు రూపాయలు వస్తాయి గా  అనుకొనే రోజులు ఇవి .  అదీగాక పోషించలేక పోవడం ,సకాలములో వర్షాలు లేక పంటలు లేక పశువులకు మేత లేకపోవటం కూడా ఒక ప్రధాన కారణం .

కాబట్టి గేదెలు ,ఆవులు అనే కాదు పక్షులు ,పిట్టలు, పిల్లులు, ప్రకృతి  ,చెట్లు అస్సలు దేనినీ మానవులు బ్రతకనీయుత్లేదు .ఇటువంటి పరిస్తితుల్లో ఆనాడు మతం పుచ్చుకున్న ఎంతోమందిబౌద్ధులు ఎక్కడ కి పోయారు .బుద్దుడు రాకముందు జరిగిన  హింస కంటే వంద రెట్లు ఇప్పుడు ఎక్కువ జరుగుతుందే ,మరి ఆనాడు యజ్ఞాలు లో జంతు హింస వద్దు అని బుద్దుడు, శంకరాచార్యులు చెబితే బ్రాహ్మణులు అంతా విన్నారు .మరి వేల మంది బొద్ద మతం తీసుకొన్న వారు ఎటుపోయారు ,ఏమి చేస్తున్నారు .వారు అంతా సామాజిక స్పృహ వున్నవారు ,బ్రాహ్మణుల కంటే నీతిమంతులు  కదా ,పైగా కొంతమంది మేధావులు ఏమి వ్రాశారు అంటే బౌద్ధం తీసుకున్నవారిని ఆ రోజులలో వెలి వేసారు ,వాళ్ళే అంటరానివారు గా పరిగణించారు  అన్నారు .ఇప్పుడున్న సమాజములో వారే ఎక్కువ నిష్పత్తి లో వున్నారు కదా .హింస చాలా తక్కువ గా వుండితీరాలి ,తక్కువ మాంసం వినియోగం లో వుండాలి కదా ,మరి అలా జరగటం లేదే ,అదికాదు వేరే మతస్తులు ఎక్కువ తింటున్నారు అని చెబుతారు అనుకునదాము .మరి వేరే మతం అంటే వారు ఎవరో కాదు కదా ,వారు కులవివక్ష భరించ లేనివారే అన్య మతాలలోకి వెళ్ళారు కదా ?ఇప్పుడు ఈ విషయములో పైన వ్రాసిన  రచయుతకు   ఒకటి అర్థం కావాలి  హింస ,మాంసం ఇవి అన్నీ కూడా హిందూ మతములోని చాందస్సులకు ,బ్రాహ్మణులకు ఇప్పుడు ఏ సంభంధం లేదు పదే పదే B.C 25౦౦ -౩౦౦౦ కి వెళ్లి బౌద్ధం విషయం తీసుకురావటం వల్ల ఉపయోగం లేదు .ఇప్పుడు సమాజం లో చాలా మార్పులు జరిగిపో యునాయి..మీ పాత బూజుపట్టిన వాదాలను ఇక ఆపే యండి .
ఇక చిలకలూరి పేట బస్సు దహనంకేసు. ఈ కేసు లో కల్లా కపటం తెలీయని 27మంది ప్రయాణీకులు బస్సు లో కాలి బొగ్గులు గా మారిపోయారు .బస్సు లోకి ఎక్కిన  ,ఇద్దరు ,ముగ్గురు ,బస్సు కొంత  దూరం ప్రయాణం చేసిన తరువాత డబ్బులు ,నగలు కోసం   పెట్రోల్   బస్సు అంతా జల్లి అగ్గి పుల్ల గీసి బెదిరిస్తున్నారు .ఈ లోపు నిజముగానే నిప్పురవ్వ జారి బస్సు బగ్గు మంది  మంటలు అంటుకున్నాయు.    నేరస్తులు తప్పించుకున్నారు .కాని ప్రయాణికులు మాత్రం ఒక్కళ్ళు కూడా మిగలలేదు .ఇళ్ళ దగ్గర తల్లితండ్రులు ,పిల్లలు ,కుటుంబ సభ్యులు అంతా ఎదురుచూస్తూ వున్నారు .కానీ వాళ్ళ కు మాడిన బొగ్గులు దొరికినాయు .కనీసం మనుషుల ఆనవాళ్ళు ఎక్కడా  ఆ బొగ్గుల్లో లేదు  .అది  అప్పుడు కులాల కార్డ్ బైటకు తీసి అప్పటి రాష్ట్రపతి నారాయణన్ ని కల్సి ఉరిశిక్ష రద్దు చేయుం చారు .పూర్వ కాలములో ని ధర్మ శాస్త్రములను విమర్శించే వారు. బ్రాహ్మణ కులానికి ఒక న్యాయము ,ఇతర కులాలకు ఒక న్యాయమా అని అడిగే వీరు చేసినది ఏమిటి ?
అదే సమయములో బెంగాల్ లో ఓ అగ్ర కులస్తుడు వాచ్ మెన్  గా వున్నాడు . అతగాడు చిన్న పిల్లను మానభంగం చేసి చంపేసి ఎక్కడో దాచేసాడు   తరువాత  .అతగాడి ని జైలు లో వే శారు . అతగాడు ఓ! 12 సంవత్సరాలు శిక్ష పూర్తి అయుపోయింది .ఈ లోపు విచారణ జరిపి ఉరిశిక్ష అమలు చేసి చంపారు .కొంతకాలం శిక్ష అను భవించాడు కదా .అతనికి క్షమాభిక్ష కోసం ఎవరూ ప్రయత్నించలేదు .ఎందుకంటే అతను క్రిందికులం వాళ్ళు కాదు .ఒక్కరిని చంపినందుకు వురి వేస్తె మరి 27 మందిని చంపేసిన వారి పరిస్తితి ఏమిటి ? మరి  అతగాడి శిక్ష ను జీవిత ఖైదు గా మార్చి వుండాల్సింది ,ఎందుకంటే ఆ నేరస్థుడు 11 ఏళ్ళు శిక్ష అనుభవించాడు కదా ,ఇక్కడ శిక్షలు ,ఉరిశిక్ష లు నిషేధం వాటి గురించి కాదు నేను మాటలాడేది   ,ప్రతీ విషయములో కుల ,మతాల కార్డు లు తీసుకురావడం . పైన పత్రికావ్యాస రచయుత గారు ఒక విషయం తెలుసుకోవాలి ఇది వరలో ఇలాంటి కేసుల్లో చాలామంది కి గతములో నేర చరిత్ర లేదు , వాళ్ళ అందరికి క్షమాభిక్ష పెట్టేశారా .? మీకు అబ్దుల్ కలాం ,ప్రణబ్ ముఖర్జీ  మీకు గుర్తుకు రాలేదా ? వాళ్ళు కులం మతం సంభందం లేకుండా , నేరం – శిక్ష  దృష్టిలో ఆలోచించి ఎవ్వరికి ఒక్కరికి కూడా క్షమా భిక్ష పెట్టల్లేదు .వాళ్ళ హయాం లో.  ఇక మూఢనమ్మకాలు హిందువులు ,బ్రాహ్మణులు ,భారతీయుల లోనే కాదు ప్రపంచం లో అన్ని దేశాలలో మనకంటే ఘోరముగా వున్నాయి . ఎవ్వరైనా ,ఎక్కడైనా ఏ దేశములో అయునా మూఢనమ్మకాలు వుంటే ఖండిచాల్సిందే దానిని ఎవరూ కాదనరు ,ప్రతీ దానికి భారతీయ హిందూ సమాజాన్ని మాత్రం నింది౦చటం  మానుకోవాలి .

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online