Pages

A cute video of two Elephants saving a baby elephant


The greatness of Bhagavat Geetha

[29/11, 12:23] Dr.Mmk:


 లోకంలో మరే ఇతర గ్రంధాలకి లేని విశిష్టత ఒక్క ‘భగవద్గీత’ కు మాత్రమే ఉంది.

1) ఏమిటా విశిష్టత..?

అవతారమూర్తులు,మహర్షులు,మహానుభావులు జన్మించినప్పుడు వారివల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది.
ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞత గా వారి జన్మదినాన్ని ‘జయంతి’ గా జరుపుకుంటారు.
అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల ‘గీతాజయంతి’ ని జరుపుకుంటారు.
ప్రపంచం లో ఏ ఒక్క ఇతర గ్రంధానికి కూడా జయంతి లేదు.



2)ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం..?

సుమారు 5200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్వాణం సమీపిస్తున్న సమయంలో..
కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞనం తో ప్రవేశిస్తున్న తరుణంలో..
ఆ అజ్ఞనపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ..మానవజాతి పై వెలుగులు విరజిమ్ముతూ భగవద్గీత ఉదయించింది.



3) ఏముంటుంది ఈ భగవద్గీత లో..?

ఏది తెలిస్తే మానవుడికి ఇంక మరేదీ తెలియాల్సిన అవసరం లేదో…
ఏది ఆత్మ, పరమాత్మ ల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో..
ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకి నడిపించగలదో..
అదే ఉంటుంది.

నూనె రాస్తే రోగాలు పోతాయి..దయ్యాలు వదిలిపోతాయి లాంటి మూఢనమ్మకాలు ఉండవు.
నన్ను నమ్మనివాన్ని చంపండి అనే ఉన్మాదం ఉండదు.
నన్ను దేవుడిగా ఒప్పుకోనివాన్ని నరకంలో వేసి కాలుస్తా అనే పైశాచికత్వం ఉండదు.



4) భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితం పై ఆసక్తి పోతుందా..?

భగవద్గీత విన్న అర్జునుడు అడవులకి పోలేదు..
గాంఢీవాన్ని ధరించి కదనక్షేత్రానికి వెళ్లాడు.
భగవద్గీత కర్తవ్య విముఖుడు ఐనవాడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది.



5)భగవద్గీత శాస్త్రీయ గ్రంధమా..?

ప్రపంచం లో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీత ని కోట్ చేసినవాళ్ళే..
భగవద్గీత ని మొదటిసారి చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే..



6) ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీతే ప్రపంచం లో మొదటి స్థానం లో ఉండాలి కదా..
ఇతర మత గ్రంధాలు ముందు వరసలో ఉన్నాయని అంటున్నారు…?
కలియుగం లో అజ్ఞనానికి ఆదరణ ఎక్కువ ఉండటం సహజం.
విదేశీయుల్లా కత్తి పట్టుకుని,రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చేయలేదు.



క్రైస్తవులు,మొహమ్మదీయులు మతవ్యాప్తి కోసం ప్రపంచం పై చేసిన దండయాత్రలు, తద్వారా జరిగిన విద్వంసం.. రక్తచరిత్రగా, సజీవ సాక్ష్యాలుగా ఇప్పటికీ నిలిచే ఉన్నాయి.   వారు కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశం పై దాడులు చేసి, దురాక్రమణలు చేసి, ప్రలోభపెట్టినా చేయలేని పనిని  ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీత ని ప్రచారం చేయడం ద్వారా కొన్ని కోట్లమంది పాశ్చాత్యులని కృష్ణభక్తులుగా మార్చారు..

“ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగం తో పరుగులు తీస్తుందనడానికి ఇదే నిదర్శనం.”
 

Geetha Jayanthi

[29/11, 12:31] Dr.Mmk:

 మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే  గీతా జయంతి.


గీత :-      యువకుడయిన అర్జునుడికి, యుద్ధ సమయం లో చెప్పాడు భగవంతుడు.

సృష్టి లోని రహస్యాన్ని మరియూ దానిని చేధించ గలిగే  సాధన ని చెప్పాడు భగవంతుడు.
ఈ జీవన యుద్ధం లో మనకు అవసరమైన ధైర్యాన్ని, తెలివితేటలని, విజయ కాంక్ష ని గీత లో మనకు నూరి పోశాడు భగవంతుడు.

సాక్షాత్తు గా భగవంతుడి నోటి ద్వారా మనకు అందించబడిన  700 చిన్న చిన్న శ్లోకాల సమాహారమే గీత.

మనం చేసే పని లో నైపుణ్యం ఎలా సంపాదించాలో మనక నేర్పే గేమ్ ప్లాన్ భగవద్గీత.

జీవితం అనే  హైవే లో, గీత చూపెట్టే డైరెక్షన్ లో సాగుదాం.
గీత ను చదువుదాం, ఆచరిద్దాం.

ప్రపంచానికి గురువు గా నిలబడిన భారత దేశ వాసులు గా,  అత్యున్నత ధర్మానికి వారసులు గా గర్విద్దాం.

జైహింద్.
హరిః ఓం.

A small story about the importance of Good people

సత్సంగం మరియు సజ్జన సాంగత్యం యొక్క ప్రాశస్తి
 
 
నాగరాజైన ఆదిశేషుడు సమస్త భూమండలాన్ని తన వేయి పడగలపై మోస్తున్నాడు. ఒక రొజు బ్రహ్మ దేవునికి దీటుగా సృష్టికి ప్రతి సృష్టి గావించిన రాజర్షి అయిన విశ్వామిత్రుడు వచ్చి నాగరాజును తనతో రమ్మన్నాడు. ఆందుకు ఆదిశేషుడు మిక్కిలి వినయ విధేయతలతో “ ఓ బ్రహ్మర్షి! ఈ సమస్త భూమండలం నా శిరస్సుపైనే వుంది. దీనిని పరిరక్షించడమే నా కర్తవ్యం. నేను ఈ కార్యాన్ని విస్మరించినట్లైతే ఈ భూమండలం పాతాళం వైపు పడిపోవడం తధ్యం. అప్పుడు అనేక కోట్ల జీవ రాశులు నాశనమైపోతారు” అన్నాడు.
 
 
ఆందుకు విశ్వామిత్ర మహర్షి చిరునవ్వు నవ్వి “ అటువంటిదే గనక జరిగితే నేను నా అమోఘమైన తపశ్సక్తితో దానిని ఆపుతాను” అన్నాడు.
అందుకు నాగరాజు ఒప్పుకోలేదు. విశ్వామిత్రుడు ఎన్ని విధాలుగా నచ్చ జెప్పి చూసినా ఆదిశేషుడు తన నిర్దేశిత కార్యాన్ని వదలనని మొండిపట్టు పట్టాడు. ఆదిశేషుని మంకుపట్టు చూసి విశ్వామిత్రునికి తీవ్రమైన కోపం వచ్చింది. కమండలం ఎత్తి శపించబోయేంతలో ఆదిశేషుడు భయపడి ఇక చేసేది లేక భూమిని పక్కకు పెట్టి వచ్చాడు.
 
 
అంతలొనే ఘోరమైన విపత్తు సంభవించింది. ఇన్ని వేల యుగాలుగా ఆదిశేషుని వేయిపడగలపై బధ్రంగా వున్న భూగొళం వెంటనే పాతాళం వైపు పడిపోవడం ప్రారంభించింది. దానిపై నివాసముంటున్న వేల కోట్ల జీవరాశులు ప్రాణ భయంతో ఆర్తనాదాలు చేయడం ప్రారంభించాయి.
ఆదిశేషుడు జరిగిన దానిని చూసి తీవ్రమైన దుఖంతో మాంపడిపోగా తప్పశ్శక్తి సంపన్నుడన్న గర్వంతో విశ్వామిత్రుడు కమండలం లోని నీరు ధారపొసి ఆగు అంటూ భూమిని ఆజ్ఞాపించాడు. భోగోళం పతనం ఆగలేదు. పైపెచ్చు ఆది మరింత వేగంగా పడిపోవడం ప్రారంభించింది. అప్పుడు విశ్వామిత్ర మహర్షి పట్టరాని ఆగ్రహంతో “ నా తప శ్సక్తి అంతా ధారపోస్తున్నాను,వెంటనే ఆగు” అంటూ ఆజ్ఞాపించాడు.అయినా ఫలితం లేకపోయింది.
అప్పడు విశ్వామిత్రునికి అహంకార మైకం తొలిగిపోయింది. భూమిని ఆపడానికి తన తప: శ్సక్తి చాలదని తెలుసుకున్నాడు. ఏం చేయలా అని ఆలోచిస్తుండగా నారద మహర్షి అక్కడికి వచ్చి జరిగిన దానిని తెలుసుకొని” ఓ మహర్షి! నీవు ఎప్పుదైనా సజ్జన సాంగత్యం చేసి వుంటే ఆ ఫలితాన్ని వెంటనే ధారపొయు. భూపతనం ఆగిపోతుంది” అని సెలవిచ్చాడు.
 
 
అప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తీవ్రమైన ఆలోచనలో పడ్డాడు.తాను అందరితో తగవులు పెట్టుకోవడమే కాని సజ్జన సాంగత్యం చేసింది లేదు.సాటి ముని పుంగవులతో సజ్జన సాంగత్యం , సత్సంగం చేసింది కూడా లేదు.అయినా తాను వశిష్ట మహర్షి వద్దకు వెళ్ళిన సంగతి జ్ఞప్తికి తెచ్చుకొని ఆ పుణ్యాన్ని ధారపోయగా వెంటనే భూగోళ పతనం ఆగిపోయింది. ఆది శేషుడు యధావిధిగా తిరిగి భూమండలాన్ని తన తలకు ఎత్తుకున్నాడు.
మానవులలో దానవ మానవ గుణాలు రెండూ నిక్షిప్తమై వుంటాయి.సమయం సంధర్భం బట్టి ఏదో ఒక గుణం బయటకు ప్రకటితమౌతూ వుంటుంది. దుర్జనులతో సాంగత్యం చెస్తే అసుర గుణం బలీకృతమై ఎన్నో చెడ్డ పనులను చేస్తాం.
 
 
అందు వలన పైన వివరించినట్లుగా చెసిన పాప కర్మల తాలూకు ఫలితాన్ని అనుభవించేందుకు జనన మరణ చక్ర భ్రమణంలో పడిపోతాం.సజ్జన సాంగత్యం మనలో రజో తమో గుణాలను తగ్గించి సాత్విక భావాలను పెంచుతుంది.భగవత్ ధ్యానం, నామ స్మరణ,సంఘ సేవ, యజ్ఞ యాగాదులను నిర్వహించుట,పరుల పట్ల కరుణా కటాక్షాలను కలిగి వుండుట వంటి చక్కని కర్మలను చేసేందుకు ఎంతగానో సజ్జన సాంగత్యం తోడ్పడుతుంది. ఎక్కడ సత్సంగం జరుగునో అచ్చట దేవతలు స్థిర నివాసం చెస్తారన్నది శాస్త్ర వాక్యం. సత్కర్మలు భగవంతుని సన్నిధికి చేరేందుకు దారి చూపిస్తాయి.
 
 
కలి ప్రాభవాం అధికంగా వున్న ఈ రోజులలో సత్సంగం అంత త్వరగా దొరకదు. మానవులు ధనార్జనే ముఖ్య ధ్యేయం గా బ్రతుకుతూ మానవతా విలువలకు త్రిలోదకాలిస్తున్నారు.అరిష డ్వర్గాలకు బానిసలైపోతూ దానవ గణానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు.మంచితనం అన్నది మచ్చుకైనా కనిపించదం లేదు.
 
 
అంతటా స్వలాభం, స్వార్ధం, అవినీతి, హింసా విలయ తాండవం చేస్తున్నాయి.అటువంటి పరిస్థితులలో సత్సంగం దొరకడం బహు కష్టం. కాని ఆశావహ ధృక్పధంతో, సానుకూలంగా యత్నిస్తే సజ్జన సాంగత్యం దొరకడం కష్టమే కాని దుర్లభం కాదు. అయితే ఈ సత్సంగం అనే పూదోతలో కలుపు మొక్కలు విరివిగా మొలకెత్తడం అనివార్యం. అట్టివారి మాయలో పడక,అప్పడప్పుడు ఆ కలుపు మొక్కలను ఏరిపారవేయడం చేస్తుండాలి.లేకపోతే అద్బుతమైన పూదొట కలుపు వనంగా మారే ప్రమాదం వుంది.

A small video about Srirkishna Tatwam




Hi Friends,  We know about Maha Bharatha n Srimadbhagavatam.  In these Maharshi Veda Vyasa depicted the great doings of Lord Vishnu in detail.  We all r fascinated by Lord Sri Krishna.  We all love him n he is the most intriguing person in the whole of Maha Bharatha.  We all get some doubts reg. certain things why they happened to pandavas when they r with Sri Krishna.  So here r some answers which r in the same Maha Bharatha.  Bhagavan Sri Krishna himself answered our doubts in his conversation with his childhood friend Uddhava.  Pls. watch this video.

Lord Subrahmanya n Valli Devasena part - 2

     మన అందరికి కార్తికేయునికి సుబ్రహ్మణ్య స్వామి అనే ఇంకొక పేరు కూడా ఉంది అని తెలుసు.  కానీ కొంత మంది కి ఆయన అవతారం అసలు ఎందుకు వచ్చిందో తెలియదు.  ఇంకా మనకి అందరికి తెలుసు సుబ్రహ్మణ్య స్వామి కి వల్లి, దేవసేన అనే ఇద్దరు భార్యలు ఉన్నారు అని .  కానీ మనకి వారి కళ్యాణం ఎలా జరిగిందో పూర్తిగా తెలియదు.  ఆ కథ మనం ఇప్పుడు తెలుసుకుందాము.  

శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి


దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో "శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మవృత్తాంత విశిష్టత సమీక్షగాతెలుసుకుందాము.

పూర్వం మూడులోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న "తారకా సురుడు" అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై! దేవతలు బ్రహ్మదేవుని శరణువేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబలసంపన్నుడు, అమితబలశాలి, వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్లకాని వానికి మరణములేదు. కావున! మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రికగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం శెలవిచ్చారు.


అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి, శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు! దేవతలు మన్మధుని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మధుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురు అయినా! పార్వతి పరమేశ్వరుల కళ్యాణానికి మన్మధుడు కారణ భూతుడవుతాడు.
కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్ధనమేరకు పునర్జీవింపబడతాడు.


ఇలా ఉండగా! పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందసమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లుపొదలో విసర్జిస్తారు. అంత ఆ ఆరుతేజస్సులు కలసి ఆరుముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు.


ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అనియు, సుబ్రహ్మణ్యస్వామి అనియు నామాలతో పిలువసాగిరి.


కారణజన్ముడైన ఈ స్వామి పార్వతి పరమేశ్వరులు, దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి, వానిని దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడ్నిచేసి, తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు.

అంతట ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపందాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి తారకాసురుని సంహరించి విజయుడైనాడు.

సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపిన ఈ రోజును "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి"గా పరిగణిస్తారని, సర్వులకు పూజ్యనీయులైన శ్రీ వేదవ్యాసులవారు దీని విశిష్టతను వివరిస్తారు.

ఈ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వార్కి గ్రామాలు, పట్టణాలు అనుబేధము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. ఈ రోజున "శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు తీర్ధములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.
ఈ స్వామి ఆరాధనవల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని; పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్‌సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగినవారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు, వెండి, పూలు పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.

ఇటువంటి పుణ్యప్రదమైన "శ్రీ సుబ్రహ్మణ్యషష్ఠి" నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము.
పండుగ విశేషాలు
 ఈనాడు ఉదయాన్నే స్నానం చేయటం, ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ అర్పిస్తుంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. పురాణాలలో సుబ్రహ్మణ్యస్వామి వివాహితుడుగా కనిపిస్తాడు. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను అందుకే ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది.



"సుబ్బరాయుడి పెళ్లి చూచి వద్దాం రండి" అన్న పాట పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు.
అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్య మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి (కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు) పూజ చేయటం, వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించటం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో, షష్ఠి నాటి ఉపవాసం ఉండి మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనావయితీ.
తమిళ ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం.



ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడి పంచదారతోనూ, పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది.

సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం. అలా వానలో తగ్గాక చేసుకోవలసిన పనులను చేసుకోవటానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు. సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉంది.
ఉపవాసం ఉండి సర్ప మంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్ళీ సంవత్సరం వరకూ గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఓ నమ్మకం ఉంది.
సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం వల్ల సామాజిక ప్రయోజనం ఏమిటి? అని అనేవారికి ఈ వ్రత విధిలోని దానాలే సమాధానం చెబుతుంటాయి.



మార్గశిర మాసమంటే చలి పులిగా మారి పీక్కుతినే మాసం. ఈ మాసంలో చలి బాధను తోటివారు పడకుండా చూడమని సందేశం ఇస్తుంది. ఈ వ్రతం అందుకే ఉత్తరీయాలు, కంబళ్ళు, దుప్పట్లు లాంటివి వ్రతంలో భాగంగా దానం చేయాలని పెద్దలు చెబుతుంటారు. మార్గశిర షష్ఠినాడే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి లాంటి వ్రతాలను కూడా చెయ్యాలని వ్రత గంథాలు పేర్కొంటున్నాయి.


సుబ్బరాయుడు బాలుడైన బాల సుబ్రహ్మణ్యంగా పెద్దవాడైన సుబ్రహ్మణ్యంగా, స్కందుడుగా, షణ్ముఖుడుగా ఇలా అనేక రకాలుగా, అనేక రూపాలలో ఈ షష్ఠినాడు పుజలందుకోవటం జరుగుతుంది.

 


 












 

Lord Subrahmanya n Valli, Devasena part - 1

వల్లీ,దేవసేనా,సమేత సుబ్రహ్మణ్యస్వామి స్వరూపం - అంతరార్థం.


1. వల్లీ - సుబ్రహ్మణ్య స్వామి :-

వల్లీ అనే మాటకి తీగ, లత అని అర్థం.  తీగ అల్లుకొని   అలా పైకి వెడుతుంది క్రిందనే అలా ఉండిపోతే లాభంలేదు.  దానికో కొయ్యకావాలి ఆ కొయ్యని అల్లుకొని తీగ పైకి వెడుతూ ఉంటుంది.  పురాణాన్ని పరిశీలిస్తే సుబ్రహ్మణుడు చెట్టుగా మారిన ఘట్టం కూడా ఉంది.  లతా-వృక్షములు సాధారణంగా కలిసియుంటాయని చెప్పబడతాయి.  ఒక తీగ చెట్టుకి అల్లుకున్నట్టుగా వల్లీ సుబ్రహ్మణ్యుడిని అల్లుకుంటుంది.  పురాణాలలో సంకేతవాదాలు, ప్రతీకవాదాలు ఉంటాయి.  క్రిందన తీగ(అనగా మనలో  కుoడలిని) చుట్టలు చుట్టుకొని ఉంటే లాభం లేదు. ఆ తీగ పైకి పాకాలి.  మూలాధారం నుంచి సుషుమ్న అనబడే వెన్ను కొయ్యని అల్లుకొని పైకి పాకుతున్న శక్తిలతే వల్లీ.  కుండలినీ శక్తి అనబడే ప్రాణశక్తి చేత అల్లుకోబడిన ఆత్మస్వరూపుడే సుబ్రహ్మణ్యుడు.  వల్లీ అనగా కుండలినీ శక్తి.


2. దేవసేన - సుబ్రహ్మణ్య స్వామి :-

యోగభాషలో, శాస్త్రభాషలో దేవతలంటే మన ఇంద్రియశక్తులు. అవి ఇంద్రియాధిదేవతలు.  మన పురాకృత సుకృతం బట్టి ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఇంద్రియంలో కూర్చుంటుంది.  దానితో మనం మంచి పని చేస్తే అక్కడి దేవత శభాష్ అంటుంది.చెడ్డపని చేస్తే ఛీఛీ అని తిడుతుంది.  అవి శభాష్ అంటే పుణ్యాలై, ఛీఛీ అంటే దోషాలై మనకి లభిస్తాయి.మనం చేసే పనులు ఏ  ఇంద్రియంతో చేస్తామో ఆ ఇంద్రియశక్తే పరీక్షిస్తూ ఉంటుంది.అవి శక్తిని ఇచ్చి సాక్షిగానే చూస్తూ ఉంటాయి.  నేత్రాలకి సూర్యుడు, చేతికి ఇంద్రుడు, ఇలా ఒక్కొక్కదానికి ఇంద్రియాధిదేవతలు ఉంటారు.  ఇన్ని దేవతలు శక్తులు మనలో ఉన్నాయి.ఒక సేనాపతి సేనలతో వెళ్ళి యుద్ధం ఎలా చేస్తాడో మన శరీరంలో "నేను" అనేవాడు కూడా ఇంత సేన లేకపోతే వాడు పనిచేయలేడు.  కనుక మన ఇంద్రియశక్తులే దేవసేనలు.  వీటినన్నిటికి కలిపి ఒక నాయకుడులా నడిపించేవాడే మనలో "అహంరూపచైతన్యం", ఒకటున్నది.  అదే దీన్ని చూడు, దాన్ని విను అని ఇంద్రియాలకి చెప్తోంది.  మనలో ఉన్న ఆత్మచైతన్యమే ఇంద్రియరూప దేవసేనలని నడుపుతోంది.

3. వల్లీ దేవసేనా సహిత సుబ్రహ్మణ్యేశ్వరుడు:-

ఇంద్రియరూప దేవసేనలకి పతియై, కుండలినీరూప వల్లీశక్తితో అల్లుకొని,మనలో ఉన్న పరమాత్మ చైతన్యమే వల్లీదేవసేనాసమేత  సుబ్రహ్మణ్యస్వామి.  ఈ స్వామిని ఆరాధించటం వలన మనకు ఆత్మజ్ఞానం , పరమాత్మ తత్వం బోధపడుతుంది.
ఇంకా ఈ స్వామి గురించిన విషయాలు మరిన్ని తెలుసుకుందాము.

 

Pic.s of the medicines in the article


Urinal infections - some ayurvedic medicines, home remedies

నాటి రోజుల్లో చాలా మంది urinal infections తో బాధ పడుతూ వున్నారు. అస్తమానం జ్వరం వచ్చి పోతుంటే ,ఒళ్ళు వెచ్చబడి తగ్గుతూ వుంటే అది urinary infection కి ఒక సంకేతం . .మూత్రం కి వెళ్ళినప్పుడు మంట గా ను ,దురద గా ను అని పిస్తూ వుంటుంది . బొట్లు ,బొట్లు గా వస్తూ వుంటుంది .కొంతమందికి లోపల urinary track,లోను ,కొంతమందికి bowl అంటే మూత్రాశయం లోను అలా రక రకా లు గా వస్తూ వుంటుంది .కొంతమందికి ఇవి ఎమీ కనిపించకుండా మూత్రములో నురుగు కొంచం కనిపిస్తూ వుంటుంది .ఇంకా కొంతమందికి urine చాలా smell గా వుంటుంది . ఇంకా కొంతమందికి రహస్యాంగం ములో దురద కూడా వుంటుంది . ఆడవారికి తెల్లబట్ట రూపములో infection లక్షణాలు కనిపిస్తూఉంటాయి .ఏదిఏమైనా infection ఎక్కువ కాలం వుంటే అవయవాలు దెబ్బ తింటా యి .కాబట్టి infection ఏదైనా త్వరగా వదిలించుకోవడం ఉత్తమం



 . కొన్ని సార్లు షుగర్ పేషెంట్ లక్షణాలకు దగ్గరలో ఉంటాయి ,అంత మాత్రం చేత షుగర్ అని భయపడగూడదు . ముందుగా పురుషులలో చూద్దాం .మనం పైన చెప్పుకున్న లక్షణాలలో కొన్ని వుండి జననాంగం దురద వుండటం ఒకరకం ,పై లక్షణాలు ఏమి లేకుండా ఒక్క సమస్య అంగం దురద గా ఉంటూ వుంటుంది .అప్పుడు కొబ్బరి నూనె ను అంగం పైన ,లోపల ముందు భాగములో బాగా పూత గా పూర్వ కాలములో పెద్దవాళ్ళు రాయుంచే వారు. అలా రెండు లేక మూడు రోజులు రాసుకోంటే చాలు . చిన్న చిట్కా తో నయం అయు పోతుంది . ఇది అంగం శుభ్రత లోపించడం వల్ల, urine పాస్ చేసిన తరువాత నీటి తో శుభ్ర పరచుకోవాలి . సోప్ తో చేతులు కడుక్కోవాలి ,కనీసం స్నానం చేసేటప్పుడు అయునా చేసుకోవాలి .



కొంతమందికి మగ లేక ఆడ వారిలో యురిన్ పాస్ చేసి రాగానే అంగం మంట గా వుండటం ,లోపల కొంచం నొప్పిగ అన్పించడం జరుగుతూ వుంటుంది . ఇది బాగా ఒ౦ ట్లో వేడి ఎక్కువగా చేయటం వల్ల వస్తూవు౦టూ౦ ది .(overheat) .అయుతే నీరు బాగా త్రాగాలి .కాస్తంత పంచదార నీటిలో వేసుకొని త్రాగాలి లేక నిమ్మకాయ షర్బత్ తీసుకొంటే కూడా తగ్గిపోతుంది .లేక పెరుగు లో కాస్త౦ పంచదార వేసుకొని తినాలి .అయుతే .షుగర్ పేషెంట్లకు ఇది పడదు కదా అందుకే పడుకొని బొడ్డులో ముగ్గు పోసుకొని నీటి తో తడపాలి బాగా పలుచగా ,బురదలా చేసుకొని కొద్ది సేపు వుంచుకోవాలి ,ముగ్గు దొరక్కపోతే గుడ్డ (cloth ) తీసుకొని ,బాగా తడిపి కొద్దిగా మడతపెట్టి ,మందముగా బొడ్డు పైన వేసుకోవాలి .అలా ప్రదేశం అంతా చల్లగా అయు కూడా సమస్య తగ్గిపోతుంది ,లేదా కొన్ని మంచు ముక్కలు తీసుకొని ice bag లో వేసి బొడ్డు పైనా ,లివర్ వుండే ప్రదేశములో కాపడం పెట్టుకోవాలి ,లేక భోజనం ప్రారంభములో తొలి ముద్ద లో కాస్తంత నెయ్యి,కొంచం పంచదార వేసి తినాలి .షుగర్ వున్న వాళ్ళు కొద్దిగా పంచదార వేసుకోవాలి .ఇవి పెద్దలు పూర్వ కాలములో వాడే చిట్కాలు ,వీటి వాల్ల sideeffects రావు .



ఇక infection లో పల వున్న వాళ్ళు ,పైన చెప్పుకున్నట్లు గా లక్షణాలు కనిపిస్తే ఆయుర్వేదం లో చంద్రప్రభావటి(chandraprabhavati) అనే టాబ్లెట్ వాడతారు .అది ఒక డబ్బా వాడాలి .రోజూ – 1 సమస్య ఎక్కువగా వుంటే ఉదయం -1, రాత్రి -1 వేసుకోవాల్సి వుంటుంది ,ఇది safedrug . ఇక విదేశాలలో అయుతే infection వస్తే వాళ్ళు అస్సలు మందు వాడరు మీకు తెలుస్సా ? అక్కడ natural గా సమస్యను తగ్గిస్తారు .ఎలా అంటే బాగుగా నీరు త్రాగమంటారు .ఎక్కువగా నీరు త్రాగి ఎక్కువసార్లు baathroom కి వెళ్ళమంటారు .అలా చేయడం వల్ల natural గా urinal infection పోతుంది .



ఇక గృహ వైద్యములో అయుతే ఇలా చేయండి . శరీరములో ఎక్కడ infecti on వచ్చినా సరే ఒక పని చేయవచ్చు ,అది ఏమిటంటే దానిమ్మ చెట్టు బెరడు అంటే పచ్చి చెక్క కొద్దిగా ,మరియు దానిలో దానిమ్మ కాయ పండు లేదా పచ్చిది పైన వుండే పొట్టు అదే డిప్పలు మొత్తం కాస్తంత ఎక్కువ తీసుకొని ,కొంచం ఎక్కువ నీరు పోసి బాగా ఇగర పెట్టాలి అది ఇగిరి గ్లాసెడు చిక్క్గగా అయున తరువాత వడ కట్టుకోవాలి . పర కడుపునా అంటే EMPTYSTOMACH లో కొద్ది కొద్ది గా తీసుకోవాలి కొద్ది సార్లు అలా చేయాలి ,అది దాచుకొని రాత్రి కూడా చేసుకోవచ్చు ,అలానే మరుసటిరోజు ఉదయం అలానే అలా మీకు వున్న INFECTION వున్న తీవ్రత పట్టి కొన్ని రోజులు చేసుకోవాలి . కషాయం వల్ల sideeffects ఎమీ వుండవు .కొద్ది కొద్ది రోజూ తయారు చేసుకొంటే మంచిది .ఇక రీరములో ఎక్కడ infection వున్నా సరే చచ్చిపోతుంది .లోపల లివర్,ప్రేవులు కిడ్నిస్ ఎక్కడైనా సరే .ఇక లోపల వచ్చే infecti on ఒక్కొకసారి , మనం ఆచరించే శుభ్రత తో సంభంధం లేదు ,లోపల జరిగే జీవక్రియల వాల్ల ,కొన్నిసార్లు విషాలు ,అదే టాక్సిన్స్ రిలీజ్ అవటం వల్ల కూడా లోలోపల infection లు వస్తూ ఉంటాయి . ఇక ఇంకా కషాయం వలన పిల్లలకు కానీ పెద్దలకు కానీ కడుపులో వున్న అన్ని రకాల పురుగులు ,ఏలికపాములు,వార్మ్స్ అన్నీ చస్తాయు .


అయుతే పిల్లలకు కషాయం డోస్ తగ్గించి ఇవ్వాలి .వాళ్లకు రోజూ ఉదయం 2 లేక 3 spoon లు త్రాగించవచ్చు.మరీ చిన్నపిల్లలు అయుతే డ్రాప్స్ నోట్లో వేస్తె చాలు .ఇది గృహ వైద్యం . ఉదయం వేళల్లో వేప చివుళ్ళు కొద్దిగా రోజూ తిన్నా కూడా నులిపురుగులు చస్తాయు . రక్తం కూడాశుభ్ర పడి చక్కగ ,ఎర్రగా మెరుస్తుంది.చర్మం లోని రోగాలు పోతాయి .కానీ అదే పని గా తింటే వేడి చేస్తుంది .ఏదైనా అతి చేయకూడదు .అదే ఆయుర్ వేదములో అయుతే సురక్తా అనే టానిక్కు కొనుక్కుని త్రాగినా కూడా చర్మం ,రక్తం శుభ్ర పడతాయి .అయుతే గంధ కి సోదక్ అనే sulpher కలిసిన ఆయుర్ వేదం టాబ్లెట్స్ తో కలిపి వేసుకోవాలి .1 tab కి 2 మూతలు సిరప్ తో వేసుకుంటారు .


ఇక హోమియో లో sulpher 25 పవర్ ఇస్తూ వుంటారు కొన్ని సార్లు . ఇక కొంతమందికి మధ్య వయస్సు లో అన్ని రకాల గా infection మందులు వాడినా కూడా దురద ,మంట తగ్గక పొతే షుగర్ టెస్ట్ లు చేయుం చుకోవాలి .


 ఇక కొంత మందికి sugar వాళ్ళు infection వుండి ,urinaryproblems తో బాధ పడుతూ spremcount తక్కువ గా అయుపోతు న్నవాళ్ళు baidyanath వారి Tarkeswara ras tablets వాడితే అన్నిటికి పరిష్కారం దొరుకుతుంది . అలానే షుగర్ వాళ్ళ కు నోరు ఎండిపోవడం ,గొంతు ఎండిపోవడం urinary infection ,నీరు అస్తమానం త్రాగాలని అనిపించే విపరీతమైన దాహం , అధిక మూత్రం ,అస్తమానం వెళ్లాలని అనిపించడం వీటి అన్ని౦ టికి ఒకే ఒక్క టానిక్కుJambavasavaadi దీనిని రొజూ లోపలికి తీసుకొంటూ వుంటే చాలా బాగా పని చేస్తుంది .పైవి అన్నియు ఆడ మగ ఇద్దరు వాడవచ్చు.



ఆయుర్ వేదిక్ మందులైన సరే ఓం ధన్వన్థరి నారాయణా యన మహా; ఓం నమో నారాయణాయ అని తూర్పు దిక్కుకి తిరిగి మందులు సేవించాలి .(తరువాయి భాగం లో ఆడవారిలో infecti on సమస్యలు )



 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online