కంచ ఐయులయ్య్య గారు వ్రాసిన “ పాదవందనాలు
ప్రమాణములు “ అనే శీర్షికన
ఆంధ్రజ్యోతిలో బ్రాహ్మిణిజం ,బ్రాహ్మణులపై వ్రాశారు.అలా అనేదానికంటే మరోసారి వారి
పంధాలో విషాన్ని కక్కారు అనిచెప్పవచ్చు .ప్రతికులములో ,ప్రతి మతములో కొన్ని
అవకతవకలు ఉండొచ్చు ,అంతమాత్రం చేత ఇక అస్తమానం అదే కాకిగోల .బ్రాహ్మణ కులం ,హిందూ
మతం తప్ప ఆయనకు ఇంకా ఏమి కనిపించవు ,ఇతర కులాల ,మతాల జోలికి వెళ్ళే దమ్ము ,ధైర్యం
లేవు .బాపనోళ్ళ పై ఏమి వ్రాసిన ఏమి కాదు
.వాళ్లకు ఐకమత్యం ఎలాగు వుండదు .రాజకీయ పక్షాలకు కూడా అదే ఇష్టం
అని అర్థం .ఆ రోజుల్లో నాగరికత అభివృద్ధి చెందుతున్న రోజుల్లో మొదట్లో చదువుకున్న
వాళ్ళు .అన్ని విషయాలలో అన్నీ తెల్సిన వాళ్ళు ఈ కులం వారే వుండేవారు .జ్ఞానం కోసం
జీవితాలని అంకితం చేయటం లో ను .ఆహార ,విహార విలాసాదులను భంధి౦ఛి తపస్సులు కావించి తే కానీ గణితం నుంచీ
వైద్యం వరకు ,వైద్యం నుంచి అర్చన ,నాట్యం
సాహిత్యం లాంటి అనేక రకాల కళ లవరకు ఋషుల రూపములో ,మునుల రూపములో వాళ్ళు
సృష్టించినవే .ఈ కాలములో దొంగ బాబా లు పెరుగుతున్నారు .వాళ్ళు
ఆస్తులు ,అంతస్తులు కూడపెడుతున్నారు .కానీ వాళ్ళంతా బ్రాహ్మణులు కారు .రక రకా లైన కులాల వారు ,మతాలవారు
వస్తూన్నారు .ఒక్క షిర్డీ సాయి బాబా వారు మాత్రం బ్రాహ్మణుల పిల్లవాడిగా పుట్టి
ముస్లిమ్స్ వారి ఇంట్లో పెరిగాడు .పీటాధిపతులు వేరు ,వారు కి ఒక ధర్మం ,వుంటుంది
వారు సంపాదించే కానుకలు వాళ్ళకు చట్టప్రకారం వ్రాసుకున్న చారిటి కి వెళ్ళిపోతా యి
.బ్రాహ్మణ అంటే అర్థం జ్ఞానం ,పదిమందికి ఆ జ్ఞానం పంచేవాడు .పోగుచేయటం ,పరిశోధన
చేయటం ,రానున్న తరాలకు దాచి ఇవ్వటం ఇవన్నీ బ్రాహ్మణుడి భాధ్యత .అంతేకాదు పూర్వకాలం
నుంచే దేశరక్షణ కోసం సైనిక శక్తి లో కూడా ప్రధాన భూమిక పోషించారు .చాలామంది
చనిపోయారు .అలానే దేశ స్వాతంత్ర వుధ్యములో చాలామంది బ్రాహ్మణులు వురికంబముల పై వ్రేలాడారు
.ఉత్తర భారతదేశం లో రికార్డుల్లోకి చాలా నమోదు అయ్యాయి.ఇంతగా ఎందుకు చెప్పాల్సి
వస్తున్నది అంటే బ్రాహ్మణుడు అంటే అతను గురించి మొత్తం తెలియాలి కదా ,అప్పుడు
నమస్కారం చేసే అర్హత ,ఆశీస్సులు ఇచ్చే అర్హత ఉన్నాయు అని తేల్చగలము. ఇప్పుడు
సమాజములో ఎలా వుంది అంటే పూర్వ కాలములో సంఘటనలు అయున ,ఈ కాలములో సంఘటనలు అయునా
అన్నిటికి బ్రాహ్మణులే అని తిట్టిపోయటం అలవాటుఅయుపోయంది .దానికి మీడీయా కూడా వంత
పాడుతోంది. ఇంత చెప్పిన నాస్తికులు ,కమ్యునిస్టులు ఏమంటారు .బ్రాహ్మణులే ఇవన్ని
వ్రాసుకున్నారు అని , మరి ఇవన్నీ
బ్రాహ్మణులు కూడా ఆచరిస్తూన్నారుగా వాళ్ళు ఉపవాసాలు ,ఉపదేశాలు పూజలు అభిషేకాలు
,దానధర్మాలు మొత్తం వాళ్లకు ఏమి
చెబుతున్నారో అది మొత్తం ఆచరిస్తూన్నారు కదా ఇక . .కనీసం బ్రాహ్మణ కులములో ఎవరైనా ఐకాన్
గురించి వ్రాసేటప్పుడు అగ్రకులం లేక మధ్యతరగతి కుటుంబం అని వ్రాస్తూ వుంటారు .బ్రాహ్మణ
కులములో అని వ్రాయరు . .ఎందుకు మీడియా కు వివక్ష ? ఈ మధ్య నిర్మలా సీతరామన్ కి
రక్షణ మంత్రి ఇచ్చి నప్పుడు ఆమె గురించి అలానే వ్రాశారు ,ముఖ్యముగా సాక్షి లో
అలానే వచ్చింది .మీడియా లో అం తా
కమ్యునిస్టు భావజాలం ఎక్కువగా వుండటం కారణం .అన్నిమతాల్లోను ,అన్నిదేశాలలోను
పురాతన కాలములో ఆయా మతపెద్దలు పాలనలో కొంత మార్గదర్స్ కత్త్వం చేసేవారు. రాజులు
,మంత్రులు .పాలనాధికారులు సైతం వారికి
నమస్కారం లేదా పాదాభివందనం చేసి ఆశీర్వచనం తీసుకొనేవారు .ఈ దేశములో
బ్రాహ్మణులు వేదములు ,అనేక దైవ స్తోత్రములు చదువుతూవుంటారు కాబట్టి ,ఓనిష్టతో నీయమ బద్ద
జీవితం గడుపుతారు కాబట్టి వాళ్ళ నోటితో నాలుగు మంచి మాటలు అన్పించుకొని ,వాళ్ళ
పాదాలను తాకి ఆశీర్వచనం తీసుకుంటారు .అంతేకాదు వాళ్ళు సమాజానికి చేస్తున్నసేవ ,దానికోసం వారి తపన
,దానికోసం వారి అనుసరించే దీక్ష.పవిత్రమైన జీవనం వీటి అన్నింటికి కృతజ్ఞతలు కోసం
కూడా పాదాభి వందనం చేస్తారు .శ్రీరాములవారు ,శ్రీకృష్ణభగవానుడి దగ్గరనుంచి
వస్తూవున్న ఆచారం .ఇక ఆధునిక కాలములో ఏ పెద్దలు నుంచి అయునా ,తల్లితండ్రులు,ఇంట్లో
,కుటుంబములో తనకంటే పెద్దలు ఆడ మగ
ఎవరికైనా పాద నమస్కారం చేయవచ్చు .ఇక స్వంత ఇంట్లో వాళ్ళు అయునా సరే ఓ సత్
బ్రాహ్మణుడు కనపడితే వెళ్లి నమస్కారం పెట్టుకోమని పంపిస్తారు . కుల మత భేదం
లేకుండా వయస్సులోవున్న పెద్దవారి అందరి ఆశీర్వచనం విలువైనదే కాని బ్రాహ్మణ ఆశీర్వచనం అత్యంత
విలువైనది .ఎందుకంటే వాళ్ళు అంతా సప్త ఋషుల సంతానం ,అంటే సాక్షాత్తు
భగవంతుడు, ఆయన అవతారములు తో సంభ౦ ధములు వున్న ఋషుల సంతానం అని ఈ నాటి వరకు ప్రతి
హిందూవులు అయున భారతీయులకు ఓ గట్టి నమ్మకం .అది కూడా దొంగ బాబా లు కు వర్తించదు .
ఒకసారి అప్పటి రాష్ట్రపతి బాబు
రాజేంద్రప్రసాద్ కాశి వెళ్ళారు .అక్కడ శివుడి ప్రత్యేక పూజలలో పాలుగొని వచ్చారు
.అప్పటి ప్రధాని నెహ్రు ఆయనను వివరణ అడిగారు .నేను రాష్ట్రపతి అయునంత మాత్రాన నా
సెంటిమెంట్లు.నా పూజలు ,వ్యక్తిగత అభిప్రాయాలు నావి నాకు ఉంటాయి .అవి మానుకోవాల్సిన
అవసరం నాకు లేదు .నేను ఒక మనిషి గా ,ఓభక్తునిగా మందిరానికి వెళ్లాను .ఇది నేనుఎవరి
నెత్తినా రుద్దలేదు .ఇది అందరూ చేయండి అని నేను ఎక్కడా ఉపన్యాసం ఇవ్వలేదు .కాబట్టి
నేను ఎవరికి వివరణ ,సంజాయుషి ఇవ్వనవసరం లేదు .అని గట్టి గా చెప్పారు .అలానే ఒకసారి
సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి హోదాలో
రష్యా వెళ్ళారు .అక్కడ అధ్యక్షుడు ఈయనను కలవటం కోసం వేచి వున్నారు .తెల్లటి
వస్త్రాలు లో వుండి ఆయన ఏదో పుస్తకం చదువుకుంటున్నారు .ఒక్కసారి గా రాధాకృష్ణన్ ని
చూసి అక్కడే నమస్కారం చేస్తూ మౌనముగా నిలబడిపోయాడు ఆ రష్యా అధ్యక్షుడు . ఆ తరువాత ఆయనలో ఏదో మహత్తరమైన తేజస్సు వుంది
అని అక్కడ ఉన్నవారితో ,రాధాకృష్ణన్ గారితో కూడా చెప్పారట .ఇక బ్రిటిష్ వాళ్ళ టైం
లో చాలామంది బ్రాహ్మణ జమిందారులు ఎక్కువ శాతం కరణాలు విదేశం వెళ్లి ఇంగ్లీష్
చదువులు చదువుకొని వచ్చే వారు .సూట్ బూట్లతో తిరిగే వారు .ఇంగ్లిష్ మాట్లాడుతూ
నోట్లో పైప్ పెట్టుకొంటూ వేష ,భాషలు
మార్చివేసేశారు. మరి అటువంటి డ్రెస్సులు కంచ ఐలయ్యా గారు ఎందుకు వేసుకుంటున్నారు
.షెప్పర్డ్ పేరు పెట్టుకొని ఆ రకమైన డ్రెస్
వేసుకోకుండా వుంటే వాళ్ళని అవమానించినట్లు కాదా .బ్రాహ్మణుల్లా వేష ,భాషలూ నేర్చుకొని పంతులు ,బోధన విషయాలు
లో వుండి మళ్ళీ బ్రాహ్మణులు పై అక్కసు ఎందుకు .మనం అనేక సీరియల్స్ లో
సంభాషణలు ఎప్పట్నించో వింటూ ఉన్నాము .అవి
ఎక్కువ శాతం బ్రాహ్మణ రచయు త లు ను౦చీ వచ్చినవే .సభ్యత ను ,సంస్కారం చెప్పేవిగా
ఉంటాయి .వెర్రిపప్పా, నీకు ఛాదస్తం ,పైత్యమా,తలతిరుగుతుందా ,లాంటివి ఎన్నో మాటలు
వింటూవుంటారు ఇప్పుడు కూడా ఆ సీరియల్ వింటూ పరికించం డి ,మీకే తెలుస్తుంది .దండం
పెట్టి ఆశీర్వచనం తీసుకుంటే అదేదో తప్పుజరిగిపో యునట్టు కులాల కుళ్ళు పట్టుకొచ్చి
పెరుతెచ్చుకోవదం వారి నైజం కి నిదర్సనం .మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు కి చెప్పి
చూడండి వారు ఇవి విని ఆచరిస్తారా చూడండి .ముందు ఇల్లు గెలవండి .అన్ని హిందూ
మతగ్రంధాలు చదవగలరు ,ముందు మీరు వెంటనే
చేయాల్సిన పని మీకు వాటిలో జ్ఞానం సున్నా అని అందరికి తెలుస్సు .ప్రపంచం అంతా
బ్రాహ్మణులు నిండి వున్నారు .మీరు పాకిస్తాన్, వెళ్ళితే ఈబ్రాహ్మనిజం,కనిపించడు
,ఇది ఏమైనా అధ్యాపక.ఆచార్య ప౦తులు
ఉద్యోగములో వున్నప్పుడు ఆ వుధ్యోగం.ఆ డ్రెస్ ఆ చదువు త,ఆయన వయస్సు తగ్గట్టుగా
,హుందాగా వ్యవహరిస్తే చాలా బాగుంటుంది .చాలామంది phd లు ఉద్యోగాలు లేక రోడ్ల పై
తిరుగుతూవున్నాం .మీ వుద్యోగం మీ అదృష్టమే నిజముగా .
skip to main |
skip to sidebar
కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
0 comments:
Post a Comment