అది కోసల రాజ్యం . ఆ రాజ్యం పొలిమేరల్లో అంతా దట్టమైన అడవితో నిండి పోయింది . దాని మధ్యలో అడ్డం గా పరవల్లు తొక్కుతూ ప్రవహిస్తున్న మహానది . అక్కడ ఎన్నో మూలికలు , ఔషధ మొక్కలు ఉన్నాయి . ఎవర్నీ పట్టించుకోకుండా తనకు కావలసిన మూలికలు తెమ్పుకుంటున్నాడు వైద్యుడు రత్నాచార్యుడు. అక్కడికి దగ్గరలో ఉన్న ఒక వేప చెట్టు కింద ఇద్దరు రాజకుమారులు భోజనం చేస్తున్నారు . వారి మాటలు ఈ వైద్యుని చెవిన పడుతున్నాయి . ఫణీoద్రా! నీవు మంత్రి గారి అబ్బాయివి . నేను రాజు గారి అబ్బాయిని . ఇద్దరం ఇంత వరకు ఎటువంటి భేషజాలు లేకుండా సంతోషం గా గడిపాము . చాలా బాగుంది .అన్నాడు రాజ కుమారుడు రాజేంద్రుడు . ఇక చదువులతో పని లేదు . నీవు కోసల రాజ్యానికి మహామంత్రి వి అవుతావు. నీకు ఏమి తక్కువా ? మా తండ్రి గారు శూరసేన మహారాజుకి మీ కుటుంబం అంటే చాలా ఇష్టం కదా !" అలా అలా మాట్లాడుతూనే ఉన్నాడు రాజేంద్రుడు . ఏమిటి ఫణీoద్ర! ఇంతసేపు నేనే మాట్లాడుతున్నాను , నువ్వు ఏమి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. పైగా ఏంటి తీక్షణం గా చూస్తున్నావు ? అంటూ గంభీరం గా అడిగాడు రాజేంద్రుడు .
" నా కంటే చదువు , తెలివి తేటలు అన్నిట్లోనూ అర్హతలు సాధింఛి పై స్థాయి లో ఉన్నాడు . రాజ్యానికి తిరిగి వెళ్ళాక నేను రాజ దర్బారు లో మా తల్లితండ్రుల ముందు , సామంతుల ముందు , ఇతర అధికారుల ముందు నేను తల దించుకుని నిల్చోవలసి వస్తుంది .నేను విద్య లో ఎలా రాణించ గలను ? రాజ కుమారుడు బాగా చదివి ఎన్నో అర్హతలు , పతకాలు సంపాదించాడు . నా దగ్గర ఒక్కటి కూడా లేదు . నన్ను అందరూ తెలివి తక్కువ వాడు , వెర్రి వాడు అని అంటారేమో ? అని బాధ పడుతున్నాడు మంత్రి కుమారుడు ఫణీoద్రుడు. అంతేకాదు , తన చేతగానితనం తో రాజకుమారుడి పై ఈర్ష్య తో , ద్వేషం తో రగిలి పోతున్నాడు . మంత్రి పరిషత్తు వారు నన్ను సభ లో లేకుండా చేస్తారేమో , నా భవిష్యత్తు ఏమిటి ":అని ఆలోచిస్తూ కోపం తో ఊగిపోతున్నాడు మంత్రి కుమారుడు .
ఈ ఆలోచనలతో రాజేంద్రునితో మాట మాట పెంచాడు . చివరకు తన ఒరలోని కత్తిని తీసి రాజేంద్రుని డొక్కలో పొడిచాడు ఫణీoద్ర.
మా తండ్రి గారు , మీ తండ్రి గారు మా తండ్రి గారు మంచి స్నేహితులు . నిన్ను కూడా మంచిగా చదివించాలని ఇక్కడకు పంపించారు . మేం నీకు ఏమి ద్రోం చేసామని ఇలా తెగబడ్డావు ? అంటూ రాజేంద్ర గట్టిగా అడిగాడు .
" నువ్వు కోసల రాజ కుమారుడవు . నువ్వు రాజ్యం చేరకూడదు . నువ్వు చేరితే నా ప్రతిభ బైట పడుతుంది . నా డొల్ల తనం , నా తెలివి తక్కువ తనం , అంత తెలిసిపోతుంది . రాజ దర్బారు లో నాకు ఇక స్థానం ఉండదు . అందుకే నిన్ను చంపుతున్నాను ." అంటూ కసిగా సమాధానం చెప్పాడు ఫణీoద్ర. అసలు విషయం తెలుసుకున్న రాజేంద్రుడు చాలా ఆశ్చర్యం లో మునిగిపోయాడు . చాలా బాధ పడ్డాడు . " నీ చివరి కోరిక ఏమిటో చెప్పు , అది నేను తీరుస్తాను అంటూ వికటాట్టహాసం తో అడిగాడు ఫణీoద్ర.
దానికి రాజేంద్ర ఆలోచించి ఒక పత్రం ఇవ్వమని అందులో యు . రా . శి. ఖ . అని వ్రాసి , ఇది ఒక మంత్రం . దీన్ని చదివితే , అర్ధం చేసుకుంటే రాజ్యానికి మంచిది , అందుకే దీన్ని రాజు గారికి అందించగలవు అని అంటూ పడిపోయాడు రాజేంద్ర .
ఫణీంద్ర ఆ కాగితాన్ని అటూ ఇటూ తిప్పి చూసుకున్నాడు . ఎంత చదివినా ఆ మాట అర్ధం కాలేదు . చివరకు దాన్ని కూడా దాచుకున్నాడు . నిస్తేజం గా పడివున్న రాజేంద్ర ని తీసుకుని గుర్రం పై అడవిలోనికి కొంత దూరం తెసుకు వెళ్ళాడు .
" నా కంటే చదువు , తెలివి తేటలు అన్నిట్లోనూ అర్హతలు సాధింఛి పై స్థాయి లో ఉన్నాడు . రాజ్యానికి తిరిగి వెళ్ళాక నేను రాజ దర్బారు లో మా తల్లితండ్రుల ముందు , సామంతుల ముందు , ఇతర అధికారుల ముందు నేను తల దించుకుని నిల్చోవలసి వస్తుంది .నేను విద్య లో ఎలా రాణించ గలను ? రాజ కుమారుడు బాగా చదివి ఎన్నో అర్హతలు , పతకాలు సంపాదించాడు . నా దగ్గర ఒక్కటి కూడా లేదు . నన్ను అందరూ తెలివి తక్కువ వాడు , వెర్రి వాడు అని అంటారేమో ? అని బాధ పడుతున్నాడు మంత్రి కుమారుడు ఫణీoద్రుడు. అంతేకాదు , తన చేతగానితనం తో రాజకుమారుడి పై ఈర్ష్య తో , ద్వేషం తో రగిలి పోతున్నాడు . మంత్రి పరిషత్తు వారు నన్ను సభ లో లేకుండా చేస్తారేమో , నా భవిష్యత్తు ఏమిటి ":అని ఆలోచిస్తూ కోపం తో ఊగిపోతున్నాడు మంత్రి కుమారుడు .
ఈ ఆలోచనలతో రాజేంద్రునితో మాట మాట పెంచాడు . చివరకు తన ఒరలోని కత్తిని తీసి రాజేంద్రుని డొక్కలో పొడిచాడు ఫణీoద్ర.
మా తండ్రి గారు , మీ తండ్రి గారు మా తండ్రి గారు మంచి స్నేహితులు . నిన్ను కూడా మంచిగా చదివించాలని ఇక్కడకు పంపించారు . మేం నీకు ఏమి ద్రోం చేసామని ఇలా తెగబడ్డావు ? అంటూ రాజేంద్ర గట్టిగా అడిగాడు .
" నువ్వు కోసల రాజ కుమారుడవు . నువ్వు రాజ్యం చేరకూడదు . నువ్వు చేరితే నా ప్రతిభ బైట పడుతుంది . నా డొల్ల తనం , నా తెలివి తక్కువ తనం , అంత తెలిసిపోతుంది . రాజ దర్బారు లో నాకు ఇక స్థానం ఉండదు . అందుకే నిన్ను చంపుతున్నాను ." అంటూ కసిగా సమాధానం చెప్పాడు ఫణీoద్ర. అసలు విషయం తెలుసుకున్న రాజేంద్రుడు చాలా ఆశ్చర్యం లో మునిగిపోయాడు . చాలా బాధ పడ్డాడు . " నీ చివరి కోరిక ఏమిటో చెప్పు , అది నేను తీరుస్తాను అంటూ వికటాట్టహాసం తో అడిగాడు ఫణీoద్ర.
దానికి రాజేంద్ర ఆలోచించి ఒక పత్రం ఇవ్వమని అందులో యు . రా . శి. ఖ . అని వ్రాసి , ఇది ఒక మంత్రం . దీన్ని చదివితే , అర్ధం చేసుకుంటే రాజ్యానికి మంచిది , అందుకే దీన్ని రాజు గారికి అందించగలవు అని అంటూ పడిపోయాడు రాజేంద్ర .
ఫణీంద్ర ఆ కాగితాన్ని అటూ ఇటూ తిప్పి చూసుకున్నాడు . ఎంత చదివినా ఆ మాట అర్ధం కాలేదు . చివరకు దాన్ని కూడా దాచుకున్నాడు . నిస్తేజం గా పడివున్న రాజేంద్ర ని తీసుకుని గుర్రం పై అడవిలోనికి కొంత దూరం తెసుకు వెళ్ళాడు .
0 comments:
Post a Comment