Pages

మన భవిత

మిత్రులారా !  నేను ఇక్కడ కొన్ని వార్తపత్రికల్లోని వ్యాసాలు మీ ముందు ఉంచుతున్నాను .  అవి మీరు కూడా చదవండి . పైన వ్యాసాలలో మనం ఒక విషయం గమనించ వచ్చు .  అసలు జరిగిన విషయం ఒకటైతే  వ్రాసిన వ్యాఖ్యానం మరొకటి .  ఎవరి అభిప్రాయం వారి సిద్ధాంత కోణం లోకి వెళ్లి వ్రాస్తున్నారు .  అసలు జరిగిన సంగతి వదిలేసి దాన్ని వారికి నచ్చిన , వారు నమ్మిన సిద్ధాంత పరంగా చూసి ఆ మూస లోనే దాన్ని వ్యక్తీకరిస్తున్నారు మనం చిన్నప్పుడు చదివిన ఆవు వ్యాసం లాగా . చివరకి ఈ పెద్దల రాతల వల మనం కూడా అన్ని విషయాలని కులం , మతం అనే కోణం లోనే చూస్తున్నాం .  అసలు అవి మర్చిపోయి బ్రతకలేక పోతున్నాం .  కొన్ని క్రింది కులాల గురించి ఆధునిక తరం వాళ్ళు మర్చిపోయారు . వీరి ఇంటికి వారు , వారి ఇంటికి వీరు వస్తు పోతూ ఉన్నారు , కలిసి చదువుకుంటున్నారు , పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు . ఇలా జనం ఆలోచనా విధానం లో మార్పులు వచ్చినా ఈ పైన ఉదహరించిన లాంటి వ్యాసాల వల్ల వీరు కొన్ని కులాల వారి గతాన్ని తవ్వి చూపుతున్నారు .  నిజానికి విజ్ఞాన యుగం లో కూడా మన మనసులకి సంకెళ్ళు వేస్తున్నారు .    ఒక విషయం మాత్రం నిజం అది ఏమిటంటే ప్రతి జీవి ఇంకొక జీవిని దోచుకోవటం నిజం  కాదు  కాదు .. సహజం అయిపొయింది .  నిజానికి అన్ని మతాలలోను , కులాలలోను ధనవంతులు , బీదవారు ఉన్నారు అందువల్ల ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వారిని గుర్తించి ఆదుకోవాలి .తెలివితేటలూ ఉండి ఆర్ధిక కారణాల వల్ల చదువుకోలేని వారికి సహాయం చెయ్యాలి .  ఈ మేధావులు అటువంటి విషయాలపై చర్చలు జరిపి , వ్యాసాలూ రాసి జనాన్ని చైతన్య పరచాలి .  అంతేగాని ఇలా అన్నిటిని ఒకే మూసలో చూసి అన్నిటికి ఒకటే అర్ధం తీయరాదు .  అందరికి మంచి జరగాలి .  మనం ఆ దిశగా అడుగులు వెయ్యాలి  






   


 
 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online