చాలా మంది సాయి బాబాది ఏ కులం , ఏ మతం, అని అడుగుతుంటారు . నన్ను నా మిత్రులు కొంత మంది అడిగితే నేను చెప్పను సాయికి ఒక మతం , ఒక కులం అని ఏమి లేవు . అయినా భగవంతుడికి ఏ కులం, ఏ మతం, అని అంటే ఏమి చెప్పగలము ? అన్ని మతాలూ , అన్ని కులాలు , జాతులు , జీవులు సమస్తం సృష్టించిన వాడు , అన్నిటిలో ఉన్నవాడే భగవంతుడు అని చెప్పాను .
అయితే భక్తీ , వేదాంతం కోణం లో కాదు వాస్తవం గా ఎక్కడినుండి వచ్చాడు , ఎలా వచ్చాడు అని సందేహం అన్నారు . చాలా చారిత్రిక గ్రంధాలు , బాబా జీవిత చరిత్ర పారాయణ పుస్తకాలు , చూస్తె అందులో " కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తుడు వెంకూసా అని ఉండేవారు . ఆయన దగ్గర శిష్యుడే సాయిబాబా అని ఓ ఆధారం ఉంది . ఆయన దగ్గర శిష్యుడే సాయిబాబా అనే ఒక ఆధారం ఉంది . అలానే ఒక పేద బ్రాహ్మణ దంపతులకు ఆయన జన్మించాడు అని కూడా కొన్ని మరాథి గ్రందాల వల్ల తెలుస్తోంది . బాల్యం లోనే తల్లిదండ్రులను కోల్పోవటం వల్ల ఒక ముస్లిం కుటుంబం బాబా ని పెంచి పెద్ద చేసారు . ఆ సందర్భంలో బాబా వారు ముస్లిం కట్టుబాట్లు , ఆచారాలు , నమాజ్ పద్దతుల్లో పెరిగారు అని చెబుతారు . ఇటు హిందువు కూడా అయినందున ఆయనకుఅక్ భగవద్గీత , రామాయణ , భారతాలు వాటియందు కూడా సంపూర్తి గా జ్ఞానం సంపాదించారు అని తెలుస్తోంది . శ్రీకృష్ణుడు , శ్రీరాముడు లాగానే బాబా కి కూడా తల్లిదండ్రులు ఉన్నారు అని చెప్పే గ్రంధాలు ఉన్నాయి . ఏది ఏమైనా బాబా నేనే భగవంతుడు అని ఎప్పుడు చెప్పలేదు . అల్లాహ్ భగవంతుడు అని ,పాండురంగడు భగవంతుడు అని చెప్పేవారు . ఏది ఏమైనా పేద బ్రాహ్మణుడిగా పుట్టి , ఆ తరువాత ముస్లిం బాబాగా అయి , ఆపై కృష్ణ భక్తుడిగా , సుఫిమతం లో ఉండి షిర్డీ లో నివాసం ఉన్నట్లు తెలుస్తోంది . ఈ రకం గా చుస్తే ఆయన కుల మతాలూ లేని , వాటికి అతీతమైన భగవత్ స్వరూపం అని తెలుసుకోవాలి .
అలానే శ్రీ వేంకటేశ్వరుడు కూడా ఆకాశ రాజు కు అల్లుడు అని , ఆయన క్షత్రియుడు అని , ఆయన కత్తిని ధరించి ఉంటాడు అని , ఇంకా వేటకు వెళ్ళాడు అని అడిగారు . "లోక పరంగా హిందూ ధర్మ శాస్త్రం లో ప్రధానం గా 4 కులాలు ఉన్నాయి . అందులో క్షత్రియుడు అనే కులం వాళ్ళు తప్పనిసరిగా దేశరక్షణ , ప్రజారక్షణ చేయాలని ధర్మం . అందుకే రక్షించే వాడు , అందుకై యుద్ధం చేసేవాడు తప్పనిసరిగా క్షత్రియుడై ఉండాలని సూత్రం . ఇంకా నా విష్ణు : పృధివి పతిహి అని అంటారు అంటే రాజు సాక్షాత్తు విష్ణువు అంశ అని చెబుతారు . అందువల్లనే ఆయన చుట్టూ జనం , సింహాసనం , ఆడంబరత్వం , వైభవం , అలంకార ప్రియత్వం అన్నీ ఉంటాయి . ప్రతిసారి ఏదో ఒక అవతారం ఎత్తి , దుష్ట శిక్షణ , శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు . రక్షణ కోసం ఎన్నో పన్నాగాలు చేసే ప్రక్రియ రాజులో ఉంటుంది. ఇవి అన్ని ఉండటమే రాజ తత్వం , అదే విష్ణు తత్వం అని ",
శివుడు లయకారుడు . నిజానికి ఒక్కడే పరమాత్మ అనేక అవతారాలుగా మారి కనిపిస్తూ ఉంటాడు. మరి శ్రీరాముడు , శ్రీకృష్ణుడు శివ పూజ చేసారు కదా అని కొందరు ప్రశ్నించారు . నిజమే వైకుంట వాసుడైన శ్రీ మహావిష్ణువు బయలుదేరి భూమిపై మానవునిగా అవతరించాడు కాబట్టి పైన దైవం శివునికి నమస్కరించి విధేయుడిగా ఉండాలి . అంతే కాదు మానవుడు దైవాన్ని స్మరించాలి అన్న సత్యాన్ని మనకు బోధించటం కోసం శ్రీరాముడు , శ్రీకృష్ణుడు ఆ విధం గా ఆచరించి చూపించారు . నిజానికి బ్రహ్మ , విష్ణువు , మహేశ్వరులు మూడు రూపాలు ఒక్కటే . మనకు ఆధారం కావాలంటే శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనం దృశ్యాన్ని గుర్తు తెచ్చుకుంటే అందులో అందరు దేవతలు కనిపిస్తారు . అంటే పరమాత్మ ఒక్కడే , చేసే పని కోసం , జీవులకు సౌలభ్యం కోసం, దేనికోసం దానిగా విభజించుకొని భక్తవత్సలుడై జీవులకోసం , జీవులపై ప్రేమను కురిపిస్తూ , జీవులందరూ తన సంతానమే అని, అందరిని చూసి మురిసిపోతుంటాడు .కోరికలు కర్మలలో పడకుండా తన బిడ్డలందరూ తన వద్దే ఉండాలని ఆయన స్వార్ధం . మనమే కోరికలు పెంచుకొని , కర్మలను పెంచుకుని ఆయనకు దూరమై కష్టాలు పడుతుంటాము. ఇక్కడ స్వామివారు ప్రభువు , రాజాధిరాజు , రక్షించేవాడు , అన్ని హక్కులు , శక్తియుక్తులు కల వాడు అని అర్ధం . అంటే రాజు క్షత్రియుడు అయినాడని ఒక నమ్మకం . అంతేకాని భగవంతుడికి కులం , మతం అని , ఇంకా ఇతరామైన తేడాలు ఏమి ఉండవు . ఎందుకంటే విశ్వం అంత ఆయనే . అడుగు అడుగు వ్యాపించి ఉంటాడు . ఆయన తయారు చేసిన ఒక మేజిక్ ఈ విశ్వం . అంతటా వ్యాపించి ఉండటంవల్లె విష్ణువు అయినాడు . ఆ విష్ణువు అవతారం శ్రీనివాసుడు . కలియుగానికి అధిపతి గా ఉంటూ , లోకం లో పాపాలన్నీ పటాపంచలు చేస్తూ భక్తజనులను రక్షిస్తూ ఉంటాడు . ఆ బాధ్యత ఆయన తీసుకున్నాడు . కనుక కలియుగం లో తొట్టతొలి గా వెంకటేశ్వరునికి నమస్కారం చెయ్యాలి . ఆ తరువాత మనకు ఇష్టదైవాన్ని పూజించవచ్చు .
అయితే భక్తీ , వేదాంతం కోణం లో కాదు వాస్తవం గా ఎక్కడినుండి వచ్చాడు , ఎలా వచ్చాడు అని సందేహం అన్నారు . చాలా చారిత్రిక గ్రంధాలు , బాబా జీవిత చరిత్ర పారాయణ పుస్తకాలు , చూస్తె అందులో " కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తుడు వెంకూసా అని ఉండేవారు . ఆయన దగ్గర శిష్యుడే సాయిబాబా అని ఓ ఆధారం ఉంది . ఆయన దగ్గర శిష్యుడే సాయిబాబా అనే ఒక ఆధారం ఉంది . అలానే ఒక పేద బ్రాహ్మణ దంపతులకు ఆయన జన్మించాడు అని కూడా కొన్ని మరాథి గ్రందాల వల్ల తెలుస్తోంది . బాల్యం లోనే తల్లిదండ్రులను కోల్పోవటం వల్ల ఒక ముస్లిం కుటుంబం బాబా ని పెంచి పెద్ద చేసారు . ఆ సందర్భంలో బాబా వారు ముస్లిం కట్టుబాట్లు , ఆచారాలు , నమాజ్ పద్దతుల్లో పెరిగారు అని చెబుతారు . ఇటు హిందువు కూడా అయినందున ఆయనకుఅక్ భగవద్గీత , రామాయణ , భారతాలు వాటియందు కూడా సంపూర్తి గా జ్ఞానం సంపాదించారు అని తెలుస్తోంది . శ్రీకృష్ణుడు , శ్రీరాముడు లాగానే బాబా కి కూడా తల్లిదండ్రులు ఉన్నారు అని చెప్పే గ్రంధాలు ఉన్నాయి . ఏది ఏమైనా బాబా నేనే భగవంతుడు అని ఎప్పుడు చెప్పలేదు . అల్లాహ్ భగవంతుడు అని ,పాండురంగడు భగవంతుడు అని చెప్పేవారు . ఏది ఏమైనా పేద బ్రాహ్మణుడిగా పుట్టి , ఆ తరువాత ముస్లిం బాబాగా అయి , ఆపై కృష్ణ భక్తుడిగా , సుఫిమతం లో ఉండి షిర్డీ లో నివాసం ఉన్నట్లు తెలుస్తోంది . ఈ రకం గా చుస్తే ఆయన కుల మతాలూ లేని , వాటికి అతీతమైన భగవత్ స్వరూపం అని తెలుసుకోవాలి .
అలానే శ్రీ వేంకటేశ్వరుడు కూడా ఆకాశ రాజు కు అల్లుడు అని , ఆయన క్షత్రియుడు అని , ఆయన కత్తిని ధరించి ఉంటాడు అని , ఇంకా వేటకు వెళ్ళాడు అని అడిగారు . "లోక పరంగా హిందూ ధర్మ శాస్త్రం లో ప్రధానం గా 4 కులాలు ఉన్నాయి . అందులో క్షత్రియుడు అనే కులం వాళ్ళు తప్పనిసరిగా దేశరక్షణ , ప్రజారక్షణ చేయాలని ధర్మం . అందుకే రక్షించే వాడు , అందుకై యుద్ధం చేసేవాడు తప్పనిసరిగా క్షత్రియుడై ఉండాలని సూత్రం . ఇంకా నా విష్ణు : పృధివి పతిహి అని అంటారు అంటే రాజు సాక్షాత్తు విష్ణువు అంశ అని చెబుతారు . అందువల్లనే ఆయన చుట్టూ జనం , సింహాసనం , ఆడంబరత్వం , వైభవం , అలంకార ప్రియత్వం అన్నీ ఉంటాయి . ప్రతిసారి ఏదో ఒక అవతారం ఎత్తి , దుష్ట శిక్షణ , శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు . రక్షణ కోసం ఎన్నో పన్నాగాలు చేసే ప్రక్రియ రాజులో ఉంటుంది. ఇవి అన్ని ఉండటమే రాజ తత్వం , అదే విష్ణు తత్వం అని ",
శివుడు లయకారుడు . నిజానికి ఒక్కడే పరమాత్మ అనేక అవతారాలుగా మారి కనిపిస్తూ ఉంటాడు. మరి శ్రీరాముడు , శ్రీకృష్ణుడు శివ పూజ చేసారు కదా అని కొందరు ప్రశ్నించారు . నిజమే వైకుంట వాసుడైన శ్రీ మహావిష్ణువు బయలుదేరి భూమిపై మానవునిగా అవతరించాడు కాబట్టి పైన దైవం శివునికి నమస్కరించి విధేయుడిగా ఉండాలి . అంతే కాదు మానవుడు దైవాన్ని స్మరించాలి అన్న సత్యాన్ని మనకు బోధించటం కోసం శ్రీరాముడు , శ్రీకృష్ణుడు ఆ విధం గా ఆచరించి చూపించారు . నిజానికి బ్రహ్మ , విష్ణువు , మహేశ్వరులు మూడు రూపాలు ఒక్కటే . మనకు ఆధారం కావాలంటే శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనం దృశ్యాన్ని గుర్తు తెచ్చుకుంటే అందులో అందరు దేవతలు కనిపిస్తారు . అంటే పరమాత్మ ఒక్కడే , చేసే పని కోసం , జీవులకు సౌలభ్యం కోసం, దేనికోసం దానిగా విభజించుకొని భక్తవత్సలుడై జీవులకోసం , జీవులపై ప్రేమను కురిపిస్తూ , జీవులందరూ తన సంతానమే అని, అందరిని చూసి మురిసిపోతుంటాడు .కోరికలు కర్మలలో పడకుండా తన బిడ్డలందరూ తన వద్దే ఉండాలని ఆయన స్వార్ధం . మనమే కోరికలు పెంచుకొని , కర్మలను పెంచుకుని ఆయనకు దూరమై కష్టాలు పడుతుంటాము. ఇక్కడ స్వామివారు ప్రభువు , రాజాధిరాజు , రక్షించేవాడు , అన్ని హక్కులు , శక్తియుక్తులు కల వాడు అని అర్ధం . అంటే రాజు క్షత్రియుడు అయినాడని ఒక నమ్మకం . అంతేకాని భగవంతుడికి కులం , మతం అని , ఇంకా ఇతరామైన తేడాలు ఏమి ఉండవు . ఎందుకంటే విశ్వం అంత ఆయనే . అడుగు అడుగు వ్యాపించి ఉంటాడు . ఆయన తయారు చేసిన ఒక మేజిక్ ఈ విశ్వం . అంతటా వ్యాపించి ఉండటంవల్లె విష్ణువు అయినాడు . ఆ విష్ణువు అవతారం శ్రీనివాసుడు . కలియుగానికి అధిపతి గా ఉంటూ , లోకం లో పాపాలన్నీ పటాపంచలు చేస్తూ భక్తజనులను రక్షిస్తూ ఉంటాడు . ఆ బాధ్యత ఆయన తీసుకున్నాడు . కనుక కలియుగం లో తొట్టతొలి గా వెంకటేశ్వరునికి నమస్కారం చెయ్యాలి . ఆ తరువాత మనకు ఇష్టదైవాన్ని పూజించవచ్చు .
0 comments:
Post a Comment