Pages

ugadi subhakankshalu

                                       






                                          మిత్రులు, సన్నిహితులు అందరికి హేమళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

 

HADHOD a herb for bones n joints

HADJOD herbfor bone and joint wellness  

   నల్లేరు అనే మూలిక గురించి మీరు విని ఉంటారు.  HADJOD. అనేది ఈ మూలిక యొక్క హిందీ పేరు. మన Generation, వారికి ఈ నల్లేరు, అవిసె పువ్వులు వంటి వాటిని వంటకాలు గా వాడేవారు అని తెలియదు.  కానీ మన అమ్మమ్మ - నాయనమ్మ ల తరాల వారు వాటిని ఆహారం గా తీసుకునేవారు.  మన దురదృష్టం కొద్దీ మనం ఇటువంటి పోషక విలువలు ఉన్న ఆహారాలు తినక పోవటం వలన వ్యాధి బారిన పడటం, వాటినే మందులుగా తీసుకోవలసి వస్తోంది .

       కీళ్ళ నెప్పులు మరియు ఎముక నెప్పులు  శేరీరంలో ఎక్కడ వున్న ఈ ఆయుర్వేదం మందు వాడవచ్చు .బాగా పనిచేస్తుంది .ఈ మందు లో ప్రధాన మూలిక నల్లేరు .అయితే ఆయుర్వేదం మందు ఏదైనా చాలా ఇతర ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది.  ఊబకాయం తగ్గిస్తుంది ,షుగర్ వ్యాధి వాళ్ళకు చాలా మంచి ది.శరీరములో రోగనిరోధకశక్తిని పెంచుతుంది  కోలెస్ట్రా లను తగ్గిస్తుంది.  ఆస్తమా వూపిరితిత్తుల సమస్యలను అదుపులో ఉంచుతుంది .  పూర్వ కాలములో దీనిని పచ్చడి గా చేసుకొని తినేవారు .అంతేకాదు విరిగిన ఎముకల పై వేసి ఈ నల్లెరుతో కట్టు కట్టేవారు.

     ఈ మూలిక ఇప్పుడు టాబ్లెట్స్ రూపం లో కూడా లభిస్తోంది .ఉదయం టిఫిన్ తరువాత 1 tab వేసుకోవచ్చు వ్యాధి తీవ్రత పట్టి 2 tab రాత్రి పూట కూడా వేసుకోవచ్చు.  astiposhak తో పాటు దీనిని కూడా వాడవచ్చు. ఇక పెయిన్ కిల్లర్ గా sallaki tabs వాడవచ్చు . అశ్వగంధతైలం  లేదా నారయణ తైలం లేదా moove లాంటి వి పైన రుద్ది వేడి నీళ్ళ తో కాపడం పెట్టుకుంటే మంచిది.

 
Photo
 

some remedies for knee and joint pains - part 1

     ఇప్పుడు ఈ మద్య కాలములో చాలా మంది మోకాళ్ళనెప్పులుతో,కీళ్లనెప్పులతోబాధలు పడుతూ వున్నారు.చాలామందికి మోనోపాజ్ [స్త్రీలలో 40,45 లలో ] అలానే మగవారిలో [మేనోఫాజ్ ] లలో హార్మోన్స్ సమతుల్యం లేకపోవటంతో ఈ సమస్యలు వస్తూవుంటాయి.అయితే ఈ రోజులలో చాలామందికి చిన్నవాళ్ళకి కూడా సమస్యలు వస్తూ వున్నాయి.దానికి చాలా కారణాలు వున్నాయి.శారీరకశ్ర మ  తగ్గిపోవటం .కల్తీపదార్దాలు రసాయానికపురుగుమందులు.రసాయనిక ఎరువులు  ఆహారం తో,   లోపాలకి పోవటం ,రోజూ త్రాగే పాలు కలుషితం అవుతున్నాయి .బర్రెలకు .గోవులకు పాలు కార్చే యాలని ఇంజక్షన్స్ఇస్తువుంటారు అవి కూడా లోపలికి పోయ శ రీరములో కలిసి వయస్సు తో పాటు సంబంధం లేకుండా అందరికి షుగర్ ,బి .పి లు .థై రాయుడు లాంటివి వస్తూ వున్నాయి.
 
      పీల్చే గాలిలో కూడా అనేక రకాల కాలుష్యం లోపలికి పోతూవున్నది. అందుకోసం కనీసం మొక్కలు బాగా పెంచాలి .కార్లకిబదులుగా సైకిళ్ళు వాడాలి .పంటలకు సహజ సిద్ద మైన పేడ, .ఎరువులు పంటలకోసం వాడాలి .సరే ఇక ఈ రోజుల్లో మోనోపాజ్ ,మెనోపాజ్ వాళ్లలో మోకాళ్ళ నెప్పులకు, కీళ్ళ నెప్పులకు ముఖ్యమైన కారణం D vitaman ,క్యాలిషియం ,అని తెలుసుకోవాలి .ఇదే విషయాన్ని పైన ఇదివరలో తెలుసుకున్నాం .ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలను చూద్దాము .మనం తిన్న ఆహారం లో ని క్యాలిష్యం శరీంరం లోకి చేరటానికి vitminD ఎంతో అవసరం అది బ్లడ్ టెస్ట్ ద్వారా చూసుకోండి .అది సరిపడా వుంటే ఇక వాడక్కర్లేదు
.
      ఎందుకంటే విటమిన్స్ ఎంతో మేలు అని ఎడాపెడా ఇష్టం వచ్చినట్లు వాడకూడదు విటమిన్స్ ఎక్కువగా వాడితే .వాటి పరిమితి పెరిగినా  కూడాsideeffects ఉంటాయి అని మరిచి పోవద్దు .ముశ్రూమ్స్ అంటే పుట్టగొడుగులు తినటం .మాంసాహారులు అయితే చేపలు తినటం మంచిది. ఉదయం సూర్యోదయంతరువాత ఏడు గంటలవరకు సూర్యరశ్మి లో గడపాలి .అలా D vitamin కావలసినంత లేకపోయినా triglisarides, bad cholestral కూడా బాగా పెరిగిపోతా యి .

     ఇక D విటమిన్ కావాల్సినంత పెంచుకున్నతరువాత క్యాలిషియంకూడా పెంచుకోవాలి .దానికోసం రోజు ఒక ఉసిరికాయతింటే చలామంచిది . దానిలోని C విటమిన్ కూడా D ని పెంచి క్యాలిష్యం పెరుగుదలకు దోహదపడుతుంది .ములగచెట్టు ఆకు లో సహజసిద్ధమైన క్యాలిష్యం విపరీతముగా వుంది .కా లీ ఫ్లవర్ లో కూడా క్యాలిష్యంవ  వి పరీతముగా వున్నది 
.                                     
     కాలి ఫ్లవర్ +5 మిర్యాలుపొడి  +HALFSPOON జీలకర్ర  +2 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి   +కొద్దిగా SALT కల్పి సూప్ లా చేసుకొని కొద్దిరోజులు పరగడుపున త్రాగితే కీళ్ళ నెప్పులు ,మెడ నెప్పులు మోకాలి నెప్పులు తగ్గిపోతాయి .


     పలుచని మజ్జిగ 1గ్లాసుడు తీసుకొని దానిలో రెండు స్పూన్లు[ మీడియంస్పూన్ ] మెంతుల పిండి బాగా కలిసేలా తిప్పి ప్రతిరోజూ త్రాగితే కూడా మోకాలి నెప్పులు తగ్గిపోతాయి రోజు మొత్తంలో ఎప్పడైన త్రాగవచ్చు,ముఖ్యముగా మోకాలి నెప్పులు కి బాగా పని చేస్తుంది .షుగర్ వాళ్ళకి చాలా మంచిది .ఇక తరువాత```250గ్రాము లు  మెంతులు ,100గ్రాములు వాము ,50 గ్రాముల నల్లజీలకర్ర ఈ మూడింటిని కలిపి  కొద్దిగా వేయుంచి పొడి తయారు చేసుకోండి .రొజూ రాత్రి భోజనం తరువాత ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక spoon పొడి కల్పుకొని త్రాగవలెను[ ,వేడినీటితో మాత్రమె ]ఇది తీసుకున్న తరువాత ఎటువంటి ఆహారం తీసుకోరాదు ,కాని 3 నెలలు మాత్రం తప్పక వాడితేనే మంచి ఫలితం వస్తుంది .

     పారిజాతం ఆకులు ఓ 5  ఆకులు తీసుకొని కషాయం కాచి చల్లార్చి తాగితే కీళ్ళ నెప్పులు ,మోకాలి నెప్పులు తగ్గిపోతాయి .ఎక్కవ ఆకులు వేసుకోవద్దు వేడి చేస్తుంది.  నేలవేము పొడి ఆయుర్వేదం షాప్ లలో దొరుకుతుంది దానిని తెచ్చి కొద్దిగా వ్యా ధి  తీవ్రత బట్టి 1 లేదా 2 స్పూన్లువేసిఒక గ్లాసు నీరు పోసి కషాయంకాచి త్రాగితే[ కావాలంటే తాటికల్కండ లేదా తేనె వేసుకోవచ్చు ] కీళ్ళ నెప్పులు అన్నీతగ్గిపోతాయి .ముఖ్యముగా కీళ్ళ వాతం,కీళ్ళ జ్వరం ,చికెన్ గున్యా వచ్చిన వాళ్ళకి ఈ మందు అద్బుతము గా పని చేస్తుంది .

     1/4  spoon పసుపు + 1 spoon జీలకర్ర , 1/2  spoon తాటికల్కండ ఓ గ్లాస్ నీరు పోసి  కషాయంకాచుకోవాలి బాగా ఇగిరిన తరువాత దానిని .రెండుపూటలా 50 mlనుంచి 100ml వరకు త్రాగుతువుంటే కీళ్ళల్లోవాపు ఎరుపు రంగు stiffness ,నొప్పి తగ్గిపోతాయి .ముఖ్యముగా ఇది artharities, మైగ్రే న్  వాళ్ళకు ఎక్కువ ఈ రకం నొప్పులు వస్తూవుంటా యి .

       వెలక్కాయ  లేదా వెలగపండు ఏదోవిధముగా లోపలికి తీసుకొంటే  అంటే పండులో షుగర్ వేసుకొని తిన్టమో లేక  వెలగ క్కాయని పచ్చడి గా చేసుకొని తిన్టమో చేస్తుంటే మనిషికి కావాల్సినంత క్యాలీషియం వచ్చి పడుతుంది.  మోనోపాజ్, మెనోపాజ్ వాళ్ళకు క్యాలిష్యంలోటు తీరితే చాలా సమస్యలు కీళ్ళకు సంబందించి పోతాయి .దానికోసం కొద్దిగా  బార్లీ గింజలు తీసుకొని కొద్దిగా salt వేసి ఉడికించి పెట్టుకోవాలి . దానిలో కొంచం కాచిన పాలు పోసి లోపలికి తీసుకొంటే రోజు అలా కొద్ది రోజులు చేస్తే కావలసినంత కాల్షియం  వచ్చి పడుతుంది.

      మోకాలు నొప్పితో బాధపడేవారు ప్రతిరోజూ ఓ కప్ లో అటుకులు వేసుకొని కొద్దిసేపు నానపెట్టుకొనితింటూ వుంటే ఆ రోజూ కి కావాల్సిన క్యాలిష్యం మనిషికి వచ్చేస్తుంది .పోహా[అటుకులు ]నానబెట్టుకొని ఉప్మాచేసుకొని  తింటూ వుంటే కూడా క్యాలిష్యంకావసినంత వచ్చి ఎముకల నెప్పులు,సమస్యలు తగ్గిపోతాయి .  బెండకాయలోను,తోటకూరలోను ,క్యాప్సికంలోను రాగుల పిండి  లో కూడా క్యాలిష్యం ,ఐరన్ పిచ్చిపిచ్చిగావుంటుంది .
  
        ఇక పైన వన్ని మేము చేసుకోలేము అంటే ఆయుర్వేదం షాప్ లలో దూత్ తాపెస్వర్ కంపెనీ లో అస్తిపోష్ క్ డబ్బా /110 rsవుంటుంది అది తెచ్చుకొని వాడుకోవచ్చు .అది వాడితే నేరేడు,కాకర కాయలు తినకూడదు .కాని కొద్దిరోజుల్లోనే కీళ్ళ నెప్పులు ,మోకాలి నెప్పులు తగ్గిపొతాయి .ఇంగ్లీష్ మందుల్లా రాళ్ళు వస్తాయి అనే భయం వుండదు.


      పైన చెప్పిన వన్నిచేయాలనిలేదు .మనకు వీలుగా వున్నవి ఒకటి ,రెండు చేసుకొని బైట పడవచ్చు .ఎదిఎమైన ఇంగ్లీష్ మందుల్లగా వెంటనే పని చేయవు ,ఆయుర్వేదం ,సిద్దవైద్యం కొంత టైం తీసుకుంటా యి .కానీ సంపూర్ణమైన ,శాస్వతమైన ఫలితాలను ఇస్తుంది .ఇంగ్లీష్ మండుల్లా sideeffects వుండవు .కాని మనం పైన చెప్పుకున్న ఆయుర్వేదం లేదా గృహ వైద్యం కొద్దిరోజులు అ యి నా వాడితే మంచి ఫలితాలు ఇస్తుంది .

       నిలబడి నీరు త్రాగకండి.కూర్చుని త్రాగండి .కూర్చుని భోజనం చేయటం ఎంతో మంచిది .నిలోచోనిమూత్రం పోయకండి క్రింద కూర్చుని పోసుకోవటం చాలా మంచిది.

ఇంగ్లీష్ మందుల్లో ని painkillars ని ఎక్కువగా వాడటం మంచిది కాదు .అయితే ఇంగ్లీష్ మందుల్లో ultracet సేఫ్ డ్రగ్ అంటున్నారు అది కూడా ఎక్కువ వాడకూడదు , ఆయుర్వేదంలో painkillars గా  sallaki టాబ్లెట్స్400mg వాడవచ్చుదీనిలో ఇంకాస్త పవర్ ,strong,forte, అని వుంటుంది కొంచం costవుంటుంది.  అది కూడా మంచిదే

      చింతగింజలపొడి [coffepodi షాప్ లో దొరుకుతుంది ] కొంత తీసుకొని దానికి సమానముగా తుమ్మబంక [ఆయుర్వేదం షాప్ లో దొరుకుతుంది ] ఈ రెండు మిక్స్ చేసి లోపలికి ప్రతి రోజు కొంత తీసుకోవాలి దానివల్ల మోకాలి చిప్పలలో అరిగి పోయున చోట గుజ్జు వచ్చి మోకాలి నొప్పులు తగ్గిపోతాయి .అలానే మొకాలిచిప్పలపై కలబంద గుజ్జు గుండ్రముగా పట్టిచ్చండి కొన్నిఘంటలువుంచి రుద్దండి.కదిగేసుకోండి ‘లేదా నువ్వులనూనె లో చింత గింజల పొడి కల్పి రాత్రి పడుకోనేటప్పుడుమొకాలిచిప్పలు పై పట్టించి గుండ్రముగా వ్రాసి పైన గుడ్డ కట్టు కొండి రాత్రంతా వుంచి తెల్లవారి కడిగేసు కోండి.



Photo
 

Legumes n Lentils help in reducing obesity

   Today am going to write about legumes n Lentils.  These super r foods packed with vital nutrients.  They r high in protein, low in fat.  They r packed with some carbohydrates n dietary.  They provide us vitamins B6, A, C. They provide calcium, iron, Folate, Zinc n some other vital minerals which r essential for our health. 

    In Indian cooking these Lentils n Legumes r an essential part.  we all have some favourite dishes like Rajma chaval, Chole Bature, Kaabuli chana Moong daal kichidi etc.....  we do remember our Mothers adding green peas n chickpeas in some curries like cabbage, brinjal, grated coconut n some leafy vegetables also.  In our temples also especially in South India they give cooked chickpeas as Prasad on some festivals.

   These foods help us in fighting obesity also.  We can loose weight without loosing the intake of vital nutrients.  If u include these in ur daily meals, u can easily achieve the requisite results.  Beans, chickpeas, Kidney Beans, Lobia, double beans, Peas n Peanuts r some Legumes.  Nuts also come under this category.  Lentils r also of this group. 

   We all know eating sprouts is good for health.  We prepare n eat Lentil sprouts along with vegetable sprouts.  Here am going to give u one easy recipe with any of these seeds to reduce weight.  It is really easy to prepare n u can have it as it tastes really good.

   Take just 100 grams of any of these Beans, Peas, like Kidney beans, green peas, Lobia, chickpeas etc.... soak them in water over night.  in the morning remove the water n clean them.  cook them without oil by just adding water. Take 3 r 4 Tomatoes n cut them in to pieces. When the beans r half cooked, then add these Tomatoes, later on add salt to taste, some pepper powder.  When they r completely cooked, take half tea spoon cow ghee n heat it, when it is hot add half a spoon jeera n some curry leaves n pour the mix just like tadka.  U can add coriander leaves r mint leaves also to garnish.  It serves to 2 people. 

   If u r on a strict diet, then just eat this as it is without any roti r bread.  Other wise u can eat it with two slices of multigrain bread r brown bread, some rotis r pulkas also.  U can have this as breakfast r dinner.  It is good for children as a snack in the evening.  We tried this recipe at home n had good results. Pls. try this.  Have good health.  Eat healthy n reduce weight at the same time by eating some low calorie foods.

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-4

     మానవ అవతారములో వచ్చిన శ్రీరాముడు ,శ్రీకృష్ణుడు .వైకుంతం వదిలి వచ్చిన శ్రీ మహావిష్ణువుఆయన రూపానికి ఆయనే పూజ ఎలా చేస్తారు . అందుకే శివ భగవానునికి మానవరూపములో వున్న వాళ్ళు పూజలు చేసారు .ఇక షిర్డీసాయిబాబావారు ,రామకృష్ణపరమహంస, రమణమహర్షి, శంకరాచార్యులవారు,  భగవద్ రామానుజాచార్యులువారు, మధ్వాచార్యులువారు, గురురాఘవేంద్ర స్వామివారు వీరు అంతా భగవంతుడు పైన వున్నవాడు అని ,ఆయన అన్ని శక్తులు యుక్తులు గలవాడు ఆయనే అంటూ ఆయనపై స్తోత్రాలు చదివేశారు.  నేనే భగవంతుడిని అని ఎక్కడాచెప్పలేదు.

       శ్రీకృష్ణభగవానుడు భగవద్ఘీత లో యోగాన్ని పరిచయం చేశాడు.  దానిపై ఒక అద్యాయం వుంది.  అలా౦టి ధ్యానం,యోగం వీళ్ళుతీసుకొని మేము కనిపెట్టాం అని చెబుతూ పైగా ఆ దేవాలయాలలోకి వెళ్ళకండి మన శక్తి ఆ గుళ్ళో దేవుడు లాగేసుకుంటాడు అని చెప్పటం విడ్డూరముగా వుంది .ఇంకా భగవద్ఘీత లో శ్రీకృష్ణపరమాత్మ అన్ని ,సమస్త జీవులలో నేనే అంతరాత్మ గా వున్నాను అని ఆయనే స్వయంగా చెప్పారు.

     భగవంతుడిఆరాధన  5 క్రమాలుగా వుంటుందిఅని హిందూ పురాణాలు చెప్పాయి .1 పర 2 వ్వ్యూహ ౩ విభవ 4 అంతర్యామి 5 అర్చన.  1. పర అంటే పై లోకాలు కైలాసం , వైకుంటం ఇక 2. వ్యూహం అంటే సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న రూపాలుగా వుండే .భగవంతుడు .ఇక 3. విభవ అంటే వైభవం దేవాలయాలు .మందిరాలు క్షేత్రాలు తీర్దాలు లో వుండే భగవంతుడు  తరువాత4. అంతర్యామి అంటే అందరిలో వుండే భగవంతుడు  ఇదే అందరు కూర్చుని చేసే మెడిటేషన్ అంటే మన లోపలి భగవంతుడి ని జ్యోతి గా ఆరాధించటం .ఇక తరువాత 5. అర్చన  అనగ మనం ఇళ్ళలో చేసుకునే పూజలు ,  ఇలా 5 రకాలుగా వుంటుంది ఇదివరలో ఉన్నదే ఈ మెడిటేషన్  కాకపోతే ఈ కలియుగములో అంతర్యామి ని తెలుసుకోవటం ,ధ్యానం కోసం ఏకాగ్రత వుండటం కష్టం అని అర్చన పెట్టారు .మెడిటేషన్  అందరికి సాద్యంకాడు పరమాత్మ కి స్నానం .అభిషేకం పూలదండలు వేయటం ఇవ్వన్నిసాద్యంకాడు . పరమాత్మ కి పూల దండ వేయాలంటే మెడిటేషన్ చేస్తూన్నవాళ్ళుపూల దండ ని మెళ్ళో వేసుకోలేరు కదా.

      ఉపనిషత్తుల్లో భగవంతుడి గురించి జ్ఞానము చెప్పబడినది .హిందూ మతములో జ్ఞాన శాఖ ,భక్తిశాఖ అని రెండు మార్గములుగా చెప్పబడినది . ఈ మెడిటేషన్  జ్ఞానశాఖ లో భాగము అని చెప్పవచ్చును.  అనేక రుచులతో వండిన ఓ పులుసు కుండ ఒకటి వుంది అనుకోండి . దాని లో నుంచి ఓ ముక్క తీసుకొని పిండితే అదే అన్ని రుచులు గల పులుసు ని ఇస్తుంది .అంటే ఇక్కడ ప్రపంచం అంతా భగవంతుని తో ని౦డివున్నది.అని ,ఈ ప్రపంచములో ఏ వస్తువు ,ఏ జీవి ,ఏ ప్రాణి ని పిండిన అదే భగవతత్వం కనిపిస్తుంది.  అంతేకాదు ఉపనిషత్తులో చెప్పిన విధముగా ఒక కుండ లో నీరు నింపి అందులో ఉప్పు కలపండి ,ఇప్పుడు అది ఉప్పునీరు అవుతుంది .ఇప్పుడు ఎవరైనా ఉప్పుని తీసి చూప గలమా  లేదే . అలానే ప్రపంచం,  ప్రపంచం లోని అన్ని జీవుల్లోను భగవంతుడు ,భగవత్ తత్వం ని౦ డి వుంది .మనలిని మనం పిండి చూసుకోవటమే మెడిటేషన్ అంటే లోపలి అంతర్యామి గా వున్నది ఆ మహావిష్ణువు పైన శరీరం అనే పంచభుతాత్మక౦ శివుడు అని చెప్పబడినది .

       ఈ మెడిటేషన్ అనే విధానం కొత్త ఏమి లేదు ,కాకపోతే మెడిటేషన్ చెప్పేవాళ్ళం దేవుళ్ళం మమ్మల్ని కొలవండి .మేము మనలో వుండే తరంగాలు [వేవ్స్] ని ఎటు కావాలంటే అటు తిప్పెస్తాము .ఇక్కడ కూర్చుని విశ్వాన్ని శాసిస్తాము ,గుళ్ళో దేవుడి కంటే మేము ,మా శక్తి చాలా గొప్పది ,ఓస్థలం, ఓ విగ్రహంలోని, ఓఫోటో లోని జీవం మేము కనిపెట్టి చెబుతాము . ఇవ్వన్ని ఎంతవరకు నిజం ,ఎంతవరకు సబబు మనం కాస్త ఆలోచించాలి .అలానే సాయుబాబా వారు రాఘవేంద్ర స్వామి వారు ని ఆరాధించేవాళ్ళం మనం చాలామంది వున్నాము కదా .మరి మన పరిస్తితి ఏమిటి అనుకోవచ్చు నిజముగా వారు దైవ దూతలే.  అంతేకాదు బ్రహ్మ ,విష్ణు మహేశ్వర రూపాలే అనుకోవాలి.   అంతేకాని ఒక దేవుడి గొప్పతనం చెప్పటానికి ,ఇంకో దేవుడి ని తక్కువగా చెప్పగూడదు,చూపగూడదు.  పైగా  పురాతనము గా వస్తూన్న దైవరూపాలను ,దేవుళ్ళను విమర్శించి, మొన్న మొన్న సాధు సంత్, బాబా లను, మాతాజీ లను ఆరాధిస్తూ, కృత యుగము నుంచి వస్తున్నదైవాలను, దైవ రూపాలను  తూలనాడటం కూడా మహాపాపం అని తెలుసుకోవాలి.

Holi Wishes

          May this festival of colours sprinkle lots of colors in ur life
                  Make it more colourful n bring new hope n joy
                             HAPPY HOLI TO U ALL.

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-3

          మాతృదేవోభవ ,పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిధి దేవోభవ ఈ నాలుగు ప్రతి వాళ్లకి కలిగించేది ఆ పైన వున్న భగవంతుడే .మాతా పితలు జన్మ ఇచ్చి ప్రపంచాన్ని పరిచయం చేస్తారు .గురువు దేవుడి  చేరుకునేమార్గాన్ని చూపిస్తాడు .అతిది పుణ్యాన్ని ఇస్తాడు .ఈ సందర్భాలలోకొన్ని కళలు ,కొన్ని మాయలు ప్రదర్సి౦చవలసిరావచ్చు .అంతమాత్రము చేత పైన వున్న భగవంతుడికి lఎవ్వరు సమానము కాలేరు ,గురువులు రెండు రకాలు లౌకిక గురువులు ,అలౌకిక గురువులు లౌకిక గురువులు అంటే ఏ కోర్స్ చేయాలి,ఏ చదువు చదవాలి ఎలా చదివితే అనకున్న ఆశయం సాధిస్తాము ,అది బోధించే వాళ్ళు .ఆ గురువులు కూడా చాలా అవసరమే ముందు బ్రతుకు జీవితమే ముఖ్యం కదా.

           ఇకఅలౌకిక గురువులు వీళ్ళు మోక్షాన్ని జ్ఞానాన్ని .పుణ్యాన్ని ,ఎలా సంపాదించుకోవాలో ,చెబుతారు .కొందరు గురువులు ,పీతాదిపతులు అయితే ఓ దైవ మంత్రం కూడా ప్రసాదించి ఉపాసనావిధానం అవ్వన్నీ ప్రసాదిస్తారు .ఆ సందర్భాలలో కొంతమందిగురువులకు  కొన్నిరకాల అతీంద్రియ శ క్తులు వస్తూవుండవచ్చు అంతమాత్రము చేత .ఎవ్వరు ఆ పైన వున్న కనపడని భగవంతుడు కాలేరు .అయుతే అటువంటి వారిని దైవాంససంభూతులు అని పిలవవచ్చు .ఎప్పుడైనా ఆత్మ, మహాత్మా.పరమాత్మ అని మూడు స్తితులు ఉంటాయి .ఆత్మ అంటే మనలాంటి  సామాన్యులు ,మహాత్మ అంటే గొప్పవారు పరమాత్మ అంటే పైన వున్న భగవంతుడు

         గురువులు  పీటాధిపతులు ని  మహాత్ములు అని చెప్పవచ్చు.అయితే శ్రీరాముడు,శ్రీకృష్ణుడు ని దైవాలుగా గుడి కట్టి పూజించటం లేదా అని ఒక సందేహం రావచ్చు ,కాని ఒక విషయం తెలుసుకోవాలి రాముడు ,కృష్ణుడు వాళ్ళది ఈ యుగం కాదు .ఆ యుగములలో దేవతలు , నారదుడు భూలోకములో చక్కగా విహరించేవాళ్ళు.కాబట్టి దైవము యొక్క పరిపూర్ణ శక్తి జ్యోతిలా ప్రకాశిస్తూ  ఓ తేజస్సు ఆ రూపాల చుట్టూ కనపడేది .కాని ఇది కలియుగం కలి ప్రవేసించిభూలోకములో అందరిని కలుషితము చేసుకుంటూ పోతువుండటం ఈ యుగం లక్షణం .అందుకే భగవంతుడు ప్రత్యక్షముగా రాడు.కనిపించడు.వస్తే గిస్తే దైవం మానుష రూపేణ అన్నారు కాబట్టి ఆపదల్లో .కష్టాల్లో .నిజమైనభక్తులకు మనిషిగా కనపడి .లేదా మనిషి లో వుండిసహాయం చేసి వెళ్ళిపోతాడు .కాబట్టి భగవంతుడి కి వున్న శక్తులు ,లీలలు ,అర్థం కావటమే కష్టం ఇక ఆయన శక్తులు మానవుడికి అందులో కలియుగములో అసాధ్యం .

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-2

     హరి హరులు ఇద్దరు ఒక్కరే,  ఒక్కరే రెండు రూపాలలో వున్నారు,   అంతేకాని మనం అనుకొనే శృ౦గారం కాదు.  మనుషుల్లోలా గర్భిణి, సెక్స్ లు  కావు అవి.   ఐనా వైష్ణవులు మళ్లి చెబుతూ ఒకవిష్ణు సాలగ్రామాన్ని పూజిస్తే కాశిలో కోటి శివలింగాలు పూజి౦చినట్లే అని పద్మపురాణములో సాక్షాత్తు శివభగవానుడు చెప్పినట్లు వు౦దికదా అని వాళ్ళు మరల మరల ఉదాహరిస్తువుంటారు.  ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి.   ఒక హీరో గురించి ఒక పుస్తకం వ్రాస్తున్నాము అన్కోండి, ఆ హీరో గొప్పతనం గురించే వ్రాస్తారుకాని ఇంకో కరి గొప్పతనం గురించి వ్రాయరు కదా!  ఏ దేవుడి గురించి వ్రాస్తే ,ఏ దేవత గొప్పతనం గురించి ఆ దేవుడే గొప్ప అని వ్రాస్త్తారు కదా అంతే అని తెలుసుకోవాలి, పైగా ఈ దేవుడే,మిగతాదేవతల కంటే గొప్ప అని వ్రాసి వుంటుంది అని కూడా తెలుసుకోవాలి . 

       శ్రీమత్ రామాయణం కూడా శివ మరియు విష్ణు భక్తుల వాదనల ఘట్టం అనే వారు వున్నారు .బ్రాహ్మణ మరియు క్షత్రియ రాజుల  మద్య వ చ్చిన యుద్ధం అనే వాళ్ళ వున్నారు ,శంకరాచార్యుల వారు అయుతే అన్ని దేవుళ్ళ పై స్తోత్రాలు పాడి మన చేత పాడించ టానికి సిద్దం చేసి ఇచ్చారు .ఇక బౌద్ధమతము వారు అయుతే దశాఅవతారములలో బుద్దుడు అంటే ఎవరో తెలియదు.   ఇప్పుడు మనం చదివే శాక్య వంశపు రాజు బుద్దుడు చెబుతారు .  ఇది నిజం కాదు .  పురాణములలో నారాయణుని అవతారము వేరే బుద్దభగ్ వానుడు వున్నాడు అది తెలుసుకోవాలి. ఇక ఈ బౌద్దులు అయునా బుద్ధుడు చెప్పిన మధుమాంస ములు వదిలిపెట్టుట ,అహింస ను ఆచరించుట చేస్తున్నారా అంటే అది ఎప్పుడో వదిలేశారు.  బుద్దుడి ఆచరణ లేదు కాని బొమ్మలు మాత్రం ప్రతిచోట పెడుతుంటారు.  ప్రతి ప్రాణి లోను,  అన్ని జంతువుల్లోనూ భగవంతుడు వున్నాడు.   దేనిని హింసించకూడదు అని చెబితే ఎవరు ఆచరి౦చడం లేదు.  సరికదా జంతువులను హింస పెడుతూ అనేక ఆటలు,పోటీలు పెట్టి రకరకాల హింసలకు గురి చేస్తున్నారు  .పెద్దవాళ్ళు,గొప్పవాళ్ళు కూడా వంతపాడటము విడ్డూరంగా వుంది. 

       ఇక మెడిటేషన్ ,యోగ అంటూ కొన్ని కొత్త మత మార్గాలు వచ్చాయి.వాళ్ళు చెప్పేది ఏమిటంటే మెడిటేషన్ చేస్తే చాలు .ఏ దేవుడి గుడి కి వెళ్లక్కరలేదు .ఎందుకంటే ఆ గుడిలో వుండే దేవుడి కంటే మనమే ఎక్కువ ,మనలో వున్నశక్తి గుడికి వెళ్తే  ఆ గుడిలోని దేవుడు మనలోని శక్తిని లాగేస్ట్టాడు అని తెగ ప్రచారము చేసేస్తున్నారు .గృహప్రవేశము లాంటి శుభకార్యాలలో కూడా ఏ వ్రతాలు చేసుకోకుండా ఆ మెడిటేషన్ పెద్దల ,ఫోటోలు పెట్టుకుంటున్నారు.ఎవరి ఇష్టం వారిది కాని ఇక్కడ మనము వివిధ రకాల భక్తిని తెలుసుకుంటున్నాము.రాముడు,కృష్ణుడు శివుడు వాళ్ళకంటే మా వేవ్స్.మా మెడిటేషన్ చాలా పురాతనమయినది అని వాళ్ళు చెబుతారు .అంతేకాదు ఆ మెడిటేషన్ చెప్పిన గురువుకి దేవుడిగా భావించి అసలు పూర్వమునుంచి చెప్పుకొనే దేవుడి చిహ్నాలు ను ఆ గురువు కాళ్లదగ్గర పెట్టటం ఇతరులకి భాధాకరం గా గోచరిస్తుంది .అంటే శ౦ఖ చక్రాలు ,స్వస్తిక్లు, శ్రీ యంత్రాలు గురువు పాదాలపై ,పాదాల దగ్గర  పెట్టటము తులసి ,తులసిదండలు గురుపాదాలపై పెట్టటం  కూడా కొందరి సనాతన భక్తులకి భాదాకరముగా వుంటుంది  
 
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online