Pages

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-1

             జగతిలో  క్రీస్తుపూర్వములోఅనేక మతములు ఉండేవి  .అవి మొత్తము 75మతములు అవైదిక ,వైదికములు అనేవి ఉండేవి .ఎవరి ఇష్టము వచ్చినట్లుగావారు వారి మతములను ఆరాదిస్తువుండేవారు .అప్పుడుశంకరాచార్యులు వారు  ఆ 75 మతాలవారిని వాదములో ఓడించి కేవలము 5 మతాలవారిని అంగీకరించి దిశానిర్దేసెముచేసారు .అందుకే వారిని జగద్గురు అని పిలిచేవారు .ఆ తరువాత ఇంకొక మతముని కల్పి షన్మతస్థాపనాచార్య గా చరిత్రలో నిలిచిపోయారు .అయుతే  ఈ 5 , 6, మతాలవారికి వారిలో వారేకొట్లాడుకోవటంఅనాదినుంచి జరుగుతూనే వుంది .ఆదిత్యము, అంబికాం, విష్ణుం ,గణనాధ౦,మహేశ్వరం అనే 5 మతాలవారిలో ఎవరికివారే మా దేవుడు గొప్ప ,మా దేవుడు గొప్ప అని ఒకరిని ఒకరు విమర్శ౦ చుకుంటూ వుంటారు.

     పార్వతిపరమేశ్వరులు ఆది దంపతులు అని ఒకరు మా లక్ష్మీనారాయణలే ఆదిదంపతులు అని ఒకరు చెపుతారు .ఇక మా సుర్యనారాయణుడు  ప్రత్యక్ష దైవముకదా అని కొందరుభక్తులు చెబితే ,దానిలో శివలింగం కనబడుతుంది అని మరొకరు , అందులో జగన్మాత కనపడుతోంది అని ఇంకొకరు  ఇలా వాదోపవాదములు జరుగుతువుంటాయి .శివలింగంమొదలు ఎక్కడో బ్రహ్మ విష్ణువులు కనిపెట్టలేకపోయారు చూసారా .అంటారు.శైవులు ఇక మహాశివుడే బ్రహ్మ,విష్ణు మహేశ్వరులు ను సృష్టించాడు అని వాళ్ళు ఆయన ఆధీనములో నడుస్తారు అని వాళ్ళే చెబుతారు .అప్పుడు శ్రివైస్ట్ నవులూ కాదు కాదు  శ్రిమన్నారాయణుడే ముగ్గరు ని సృష్టించాడు వాళ్ళు బ్రహ్మ,విష్ణు మహేస్వర్లు అని వాళ్ళు అంటారు .ఇంకా ఈ ముగ్గురు సమానమైన వాళ్ళు కాబట్టి మహాశివు డి లింగాన్ని చూదలెకపోయారు,అదే శ్రీమన్నారాయణుడు అయుతే కనిపెట్టగలడు .అని వాళ్ళు చెబుతుంటారు .ఇక శివలింగానికి రాముడు ,కృష్ణుడుపూజలు చేసారు తెలుస్సా అంటారు వాళ్ళు .అవును వైకుంటము నుంచి వచ్చిన దేవదేవుడు ఇక ఎవరికీ నమస్కారముచేయాలి .అందుకే తరువాత దైవము శివుడికి చేయటమేరామా,కృష్ణావతారములు చేసిన లింగ పూజ అంటారు వాళ్ళు .

     ఇక అమ్మవారి భక్తులు అమ్మ అందరిని కన్నది అందుకే అమ్మ కంటే గొప్పవాళ్ళుఎవ్వరు వుండరు .జగన్మాత ,ఆదిపరాశక్తిఅమ్మవారు  మూడు పిండాలును సృస్టించినది.అవి అండాడం   బ్రమ్మాండం  పిండాండ౦ ఈ మూడింటికి  మళ్ళిముగ్గురిని సృష్టించింది .వారు బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు వారిలోఎవరో ఒకరిని పెళ్లి చేసుకోమని కోరింది .బ్రహ్మ ,విష్ణువులు ,అందుకు ఒప్పుకోలేదు .మహేశ్వరుడు ఒక షరతు పెట్టాడు .ఆదిపరాశక్తి అమ్మవారికి ఉన్న మూడవకన్ను తనకు ఇస్తేపెళ్లి చేసుకుంటాను అని ఒప్పుకున్నాడు .అలా ఆ జగదంబ మూడవకన్ను ఇచ్చి శివుడిని పెళ్లి చేసుకుంది .అందుకే త్రిమూర్తులులో చివరివాడు శివుడికి అంతశ క్తి వచ్చింది .అని వాళ్ళు.అంటారు .జగన్మాత అమ్మ లేకపోతె ఎవ్వరు చిన్నపని కూడా చేయలేరు తెలుస్సా అంతెందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రుడు కుబేరుడు లాంటివాళ్ళను మంచం కోళ్లలా చేసుకొని ఆ పట్టే మంచం ఫై అమ్మవారు సింహాసనేస్వరిగా కూర్చుని వుంటుంది .అంటారు అమ్మవారి భక్తులు. .మహిషాసురుడిని చంపడానికి దేవతల అందరినుంచి ఆయుధాలను తీసుకొని ముఖ్యముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నుంచి ఆయుధాలను తీసుకొని ఆ రాక్షసుడిని సంహరించినది ,అని వాళ్ళు చెబుతూవుంటారు .

     ఇక బ్రహ్మ ,శివుడు దుష్టులకు వరా ల్లివ్వడము  శ్రీమహావిష్ణువు ,  వరాలు పొంది లోకాలను ఇబ్బందులు పెడుతున్న ఆ దుష్టరాక్షసులను చంపడము కోకొల్లలు లేవా అని విష్ణుభక్తులు అంటారు .అప్పుడు  పరమశివుడి కి ప్రవర వుండదు తెలుస్సా ఆయన ఆదిమద్యాంత రహితుడు ఆయనకు వంసవృక్షం లేదు .అదే విష్ణువుకి ,ఆయన అవతారములకు ప్రవర ,వంసవ్రుక్షంవుంది .కాబట్టి శివుడే మొదటి ఆది దేవుడు అని వాళ్ళు చెబుతారు .అబ్బాఅదేమీ కాదు శ్రీ మహావిష్ణు ప్రతిసారి దుస్ట శిక్షణ కోసం అనేక అవతారములు ఎత్తాల్సివస్తుంటు ౦ ది.అందుకే ఆ కృతజ్ఞతకోసం ఆ అవతారం కు కారణమైన వారి ని మానవులు తలుచుకోవటానికి వచ్చినవి .అంతెకాని శ్రీమహావిష్ణువుకూడా ఆదిమద్యాన్తరహితుడు .ఆయనే తొలిఆది దేవుడుఅంటారువాళ్ళు.ఇక దేవదానవులు క్షీరసాగరమధన సమయములో హాలాహలం పుట్టి తే సృష్టి నాశనముఅవుతువుంటే శివుడు దానిని గొంతులో పెట్టుకున్నాడు .తెలుస్సా ,అనివాళ్ళు అంటే అవును మా నారాయణుడు శివుడిని ఆదేసించాడు.అంతేకాదు క్రిందికి వెళ్ళకుండా గొంతులోనే నొక్కి పట్టుకున్నాడు మా నారాయణుడు .అంటారు విష్ణు భక్తులు . అయినా మా నారాయణుడు ఆ క్షీరసాగర మాధనములో మంద్రపర్వతంవీపు ఫై మోస్తూ వీపు అంతా నల్గ గొట్ట్టు కోలేదా ఆ అవతారం ,ఇంకా జగన్మోహిని వేషం వేసే పనులు చాలా వున్నాయి.కాబట్టి శివుడిని ఆ హాలాహలం త్రాగామన్నాడు .అదికాక ఆయన లయకారుడు కాబట్టి ఆయన దానికి అధిపతి కాబట్టి ఆ బాద్యత ఆయనకు ఇచ్చాడు అంటారు వాళ్ళు .శివై క్యం పొందాడు అంటారు వాళ్ళు కైలాసం అందరికి వస్తుంది కాని వైకుంటం కోటి మందిలో ఒక్కరికే వస్తుంది తెలుస్సా అని వాళ్ళు అంటారు.

     శివుడు పంచభూతాలుశరీరం లోపలి అంతర్యామి జీవుడు శ్రీమన్నారాయణుడుగా ఉంటాడు .అస్సలు కాసి నగరములో శివుడే ఉంటాడు అక్కడే అందరిని సృస్టించాడు .ప్రలయకాలములో కూడా ఆ నగరం వుంటుంది.అని శివభక్తులు చెబుతారు అంతేకాదు ప్రళయకాల ములో శివుడు తాండవము చేస్తూవుంటేభయపడి లక్ష్మినారాయణులు ఒకరిని ఒకరు కౌగిలించుకు౦టారుఅని శివ భక్తులు చెబుతారు ఓరి పిచ్సివాళ్ళారా నరసింహావతారముఘట్టములో శివుడితో సహా అందరుదేవతలు పరగులు పెట్టలేదా?ప్రళయకాలము   లో   ఇక.లయకారుడు ఆ పనిలో ఉంటే ఆ సప్తసముద్రాలపై   మర్రిఆకు పై వటపత్రశాయిగా పవళించి ఎంజాయ్ చేస్తాడు మా దేవుడు శ్రీమహావిష్ణువు .కాసీనగరముఇక ఎంత గొప్పదైనాప్రతీ జీవి చెవిలో చివరిలో రామనామ తారక మంత్రం చెబుతారు తెలుస్సా ., ఇక శ్రీమద్భాగవతములో ఒక రాక్షసుడిని కాపాడటానికి వచ్చిన శివుడిని నిలువరించి వెనుకకు పంపి యించలేదా అంటారు శ్రివిష్ణుభక్తులు .శ్రీహరి భక్తుడు దక్షుడి తల నరికించాడు.పరమశివుడు తెలుస్సా అని వాళ్ళు అంటే దూర్వాసుడి బారి నుంచిఅంబరీషుడిని రక్షించాడు మా శ్రీహరి అంటారు శ్రీవైష్ణవులు.

       శ్రీవైష్ణవము లో భక్తులను భాగవతోత్తములు అంటారు .బ్రహ్మవైవర్తి పురాణముప్రకారం శ్రీమన్నారాయణుని కొలిచే పరమభాగవతో త్త ములలో మొదటివాడు ఆ మహాశివు డే అని వాళ్ళు చెబుతారు .అందుకే దాసభక్తిలో  దాసుడిగా హనుమాన్ ఎవరు పరమశివుడిఅవతారము కాదా?అంటారు వాళ్ళు .ఇక శివభక్తులు వినాయకుడి అవతారంఎవరు సాక్షాత్త్త్ట్  విష్ణువు కాదా అంటారు వాళ్ళు .రాక్షసులంతా శివుడి భక్తులు కాదా వాళ్ళకు ఎడాపెడా వరాలు ఇస్తువుంటే ,చివరకు దేవతలపై కి రాక్షసులు అంతా దాడికి రాగ అప్పుడు శ్రీ మహా విష్ణువు కాదా కాపాడేది అని వాళ్ళు అంటారు .శివుడి తలపై గంగ ఉద్భవించినది  కదా అంటే  విష్ణు పాదోద్భవేత్గంగా విష్ణు పాదాలనుంచి గంగ పుట్టింది కదా అని వాళ్ళు అంటారు .శివుడు తలలో సహస్రార కమలములో ఉంటాడు బుద్దిని నడపిస్తాడుఅని శివభక్తులు అంటే శ్రీమహావిష్ణువు బొజ్జలో వుండి శరీరము మొత్తానికి తిన్నఆహారము ద్వారా శక్తినిఇస్తున్నాడు లేకపోతె అస్సలు బుర్రే పనిచేయదు అని వీళ్ళు అంటారు .కొంతమంది పరిశీలకుల అభిప్రాయం ప్రకారముగా శివుడిని పుర్షుడిగా  విష్ణువుని స్త్రీ గా భావించి  జరిగిన మోహములో ఆయప్ప స్వామి ఉద్భవించాడు అని ఇదిఅంతాశివ భక్తులు విష్ణు భక్తులపై కసిగా వచ్చిన ,కావాలని తీసుకొచ్చిన ఒక పురాణము అనే వాళ్ళు ఉన్నారు.

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online