Pages

story part - 5

"మాది కోసల రాజ్యం .  మా తండ్రి గారు ఇంద్ర నీల చక్రవర్తి .  మా తల్లి గారు రాణి లక్ష్మి కల్యాణి ." అని చెప్పాడు రాజేంద్ర వినయంగా .  ఆ తరువాత వైద్యుని కుటుంబానికి  ఫణీంద్ర చేసిన మొత్తం ద్రోహం అంతా వివరం గా చెప్పాడు .  ఫణీంద్ర కుతంత్రం విన్న వారు ముగ్గురూ ఆశ్చర్య చకితులయ్యారు .  కొద్ది రోజులు రత్నాచార్యుని వైద్యం తో పూర్తిగా కోలుకున్నాడు రాజేంద్ర .  ఆ తరువాత వారు ఇద్దరు కలిసి ఒక పధకం ఆలోచించారు ఫణీంద్ర మోసాన్ని బయట పెట్టటానికి .  ఇద్దరూ మారు వేషాలలో కోసల రాజ్యానికి వచ్చారు . రాజ్య ప్రధాన ద్వారం వద్ద వీరిని రాజ్య రక్షక భటులు అడ్డుకున్నారు .   "అయ్యా ! మేము ఇద్దరం గురు శిష్యులం మా గురువుగారు మహా పండితులు .  మహారాజు వద్ద మా ప్రతిభ ను ప్రదర్శించి ఏమైనా బహుమానం పొందాలని వచ్చ్చాము .  కాస్తంత అనుజ్ఞ ఇవ్వండి లోనికి వెళ్ళటానికి " అని అన్నాడు మారు వేషం లో ఉన్న యువరాజు రాజేంద్ర .
          కొద్దిసేపు వేచి ఉన్న తరువాత వారికి లోనికి వెళ్ళటానికి అనుమతి లభించింది .  ఇద్దరూ లోనికి ప్రవేశించారు.  సభ లో రాజుగారు సింహాసనం మీద ఆసీనులై ఉన్నారు .  యువరాజు రాజేంద్ర కి తన తండ్రిని చూడగానే భరించలేని ఆనందం , బాధ ఒకేసారి కలిగాయి .  అతని కన్నుల్లో నీరు చూసి రత్నాచార్యుడు ఆటను ఎక్కడ బయట పడిపోతాడో అని ఆందోళన చెంది, అతని చేతిని గట్టిగా నొక్కి కొద్దిసేపు తనని తానూ సంభాలించుకోమని చెవిలో చెప్పాడు .  "మహారాజా ! వీరు ఇరువురు మహా పండితులట.   వీరి పేరు రత్నాచార్యులు.  ఆ ప్రక్కన ఉన్న వ్యక్తీ ఈయన శిష్యుడు"  అని చెప్పాడు  వారిని తీసుకు వచ్చిన భటుడు .
     అప్పుడు మహారాజు వారిరువురికి స్వాగత సత్కారాలు చేసాడు .  పిమ్మట "స్వామీ ! ఎంత మంది పండితులు వచ్చినా ఈ ప్రత్యెక వాక్యానికి అర్ధం చెప్పలేక పోతున్నారు .  తమరు  మహా పండితులు అని విన్నాము .  దయ చేసి ఈ ప్రహేళిక ను పూరించండి .  ఇది మా యువరాజు మాకు పంపిన చివరి సందేశం .   యు .రా .సి.ఖ . అంటే అర్ధం తెలిపి మాకు, మా చక్రవర్తి కి మేలు చెయ్యండి" అని వినయం గా అడిగాడు మహా మంత్రి .దానికి రత్నాచార్యుడు " నేను నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను .  కానీ నాకు అసలు ఏమి జరిగిందో వివరం గా చెప్పండి " అని అడిగాడు .  అప్పుడు మహామంత్రి  ఫణీంద్ర చెప్పిన అన్ని విషయాలు పూర్తిగా చెప్పి ఆ పత్రాన్ని ఆయన చేతిలో పెట్టాడు .
       అప్పుడు ఈ గురు శిష్యులు ఇద్దరికీ ఫణీంద్ర చేసిన మొత్తం కుట్ర పూర్తిగా అవగతమైంది .  మహారాజు తన పుత్రుని తలచుకొని బాధ పడసాగాడు .  ఈ పండితుడు ఈ ప్రసన కు ఏమి సమాధానం చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు సభికులు అందరూ .  అప్పుడు రత్నాచార్యుడు  ఆ పత్రాన్ని చూసి ఇందులో చెప్పటానికి పెద్ద విషయం ఏముంది మహారాజ ! ఇది చాలా చిన్న  విషయం అని చాలా తేలికగా అన్నాడు .  అప్పుడు మహారాజు "  ఆచార్యా ! ఇప్పటి వరకూ ఎవరూ కూడా ఈ ప్రహేళికను వివరించలేక పోయారు .  మీరేమో చాలా తేలికగా చెప్తాను అంటున్నారు . ఇంతకీ  విషయాన్ని వివరించండి". అంటూ సంతోషం గా లేచి దగ్గరకు వస్తూ అన్నాడు .
       అప్పుడు  నేను చెప్పింది గుర్తు ఉందిగా అంటూ వైద్యుని చెవిలో గుసగుస లాడాడు రాజేంద్ర .  ఓ .. ఇది నువ్వు కత్తిపోటుకు గురి అయినప్పుడు రాసిన్దేగా అంటూ అడిగాడు వైద్యుడు .  అవునని తల ఊపాడు రాజేంద్ర ."మహారాజా ! మీకు ఈ పత్రాన్ని ఇచ్చిన వ్యక్తిని ఇక్కడకు పిలిపించండి . మొత్తం పరిశీలించి చెబుతాము" అని అన్నాడు రత్నాచార్యుడు .  ఆచార్యుడు ఇంత బాగా నటిస్తున్నందుకు ఆనంద పడ్డాడు రాజేంద్ర . కానీ స్వంత రాజ్యం లో తండ్రి ముందు తను కూడా నాటకం ఆడుతున్నందుకు బాధ పడ్డాడు .  కానీ పరిస్థితులు అనుకూలం గా లేనప్పుడు రాజనీతి లో ఇటువంటివి సహజం అని తనను తానూ సమాధాన పరచుకున్నాడు .  పైగా ఇంత కుట్ర చేసిన ఆ యువ మంత్రి  ఎలా ఉన్నదో తెలియాలి కదా. అని అనుకుంటూ ఉన్నాడు .  రాజుగారు సరేనంటూ ఫణీంద్ర ని తీసుకురమ్మని భటులను పంపారు .
       ఈ విషయం అంతా తెలుసుకున్న ఫణీంద్ర తన మనసులో " ఇంత వరకూ ఎవ్వరూ కూడా ఇలా చెయ్యలేదు .  నన్ను పిలవటం గానీ అనుమానించటం గానీ జరుగ లేదు .  వీరికి నా నిజస్వరూపం ఏమైనా తెలిసి పోయిందా ఏమిటి " అని అనుకున్నాడు .  కొంచం భయం భయం గా సభ లోనికి వచ్చాడు .

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online