సభ అంతా ప్రశాంతంగా ఉంది . అందరూ రత్నాచార్యుడు ఏమి చెబుతాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . అప్పుడు వైద్యుడు ఆ పత్రాన్ని పరిశీలించి " మహారాజా! ఈ లేఖ లో యు. రా . అనగా యువరాజు సి . అనగా శిరస్సు ను ఖ . అనగా ఖండించెను . యువరాజు శిరస్సు ను ఎవరో నరికి చంపారు ప్రభు !"అని చెప్పాడు వైద్యుడు . ఆ మాటలు విన్న మహారాజు నిర్ఘాంత పోయాడు . "ఫణీంద్ర ! నీకు అంత తెలుసు కదా నిజం చెప్పు" అంటూ రాజు గర్జించాడు. అప్పటికే భయం తో వొనుకుతున్న ఫణీంద్ర నాకు ఏమీ తెలియదు ప్రభూ అంటూ బుకాయించాడు.
"చూడండి రాజా ! ఈ ఫణీంద్ర బాగా చిన్న వాడు . ఈర్ష్యతో , ఆవేశం తో యువరాజు ను డొక్కలో పొడిచి చంపాడు . నీళ్ళలో పడవేసాడు . ఆ దృశ్యాన్ని నేను చూసాను ." అంటూ చెప్పుకుపోతున్నాడు వైద్యుడు . "ఇది నేను నమ్మను . ఈ పని నేను చేసినట్లు సాక్ష్యం ఏమిటి ?" అని అడిగాడు ఫణీంద్ర . సాక్ష్యం కావాలా ? అయితే చూపిస్తాను . నేను పండితుడిని కాను . వైద్యుడిని . మారు వేషం లో వచ్చాను . అంటూ తన వేషం తీసి చూపించాడు .
"ఆచార్యా ! మీరు దేవుడిలా వచ్చారు . మా యువరాజు ఏమి అయ్యాడు ? చెప్పండి అంటూ వైద్యుడు రాత్నాచార్యుడి చేతులు పట్టుకున్నాడు మహారాజు . "మహారాజ! మీరు చాలా మంచివారు , ధర్మ ప్రభువులు . కనుక దైవం మీతోనే ఉన్నాడు . అందుకే మీ కుమారుని కాపాడాడు నా ద్వారా . యువరాజుని భద్రం గా మీ దగ్గరకు చేర్చాను " అని అంటూ యువరాజు వేషం తీసేసి చూపించాడు రత్నాచార్యుడు.
ఒక్క సారిగా కనుల ముందు కనిపించిన పుత్రుని చూసి రాజు ఆనందంతో పొంగిపోయాడు . అతనిని కౌగలించుకొని నుదురు ముద్దాడాడు . ఈ విషయం అంతా తెలిసిన మహారాణి సభకు వచ్చిరాజేంద్రను ఆనంద భాష్పాలతో అక్కున చేర్చుకుంది . రాజకుమరున్ని జీవితునిగా చూసిన ఫణీంద్ర నివ్వెరపోయాడు . పారిపోవాలని ప్రయత్నించాడు . అది గమనించిన ఫణీంద్ర తండ్రిగారైన మహామంత్రి అతడిని బంధించమని రాజ భటులను ఆజ్ఞాపించాడు . ఆయన ఆజ్ఞ మేరకు ఫణీంద్ర ను గొలుసులతో బంధించారు .
మహారాజు మహా మంత్రి తో " మీరు మా కుటుంబానికి తరతరాలుగా సేవలు అందిస్తున్నారు . ఈ క్లిష్ట సమయం లో మా కర్తవ్యమ్ ఏమిటి అని అడిగాడు . దానికి మహామంత్రి " మహారాజా ! చట్టం, న్యాయం అందరికీ సమానమే . ఇక్కడ కూడా మనం చట్టం లో ఈ నేరానికి నిర్ణయించిన శిక్ష నే అమలు పరచాలి " అని అన్నాడు .మా రాజ్య స్తాపన అప్పట్లో మీరే చేసారు. మా పెద్దల తగ్గరనుంచి మీరే గురువులు సలహాదారులు ఇప్పుడు ఇంత బాధాకరమైన సందర్బం వస్తుంది అనుకోలేదు అంటూ రాజుగారు కాస్తంత బాధతో మాట్లాడుతున్నారు . "రాజా ! తప్పు ఎవరు చేసినా తప్పే . న్యాయం అనేది నిష్పక్షపాతం గా ఉండాలి . ఫణీంద్ర చేసింది రాజ ద్రోహం . ఇతనికి ఉరి శిక్ష ఖరారు చేయటమే తగిన నిర్ణయం " అంటూ తీర్పు వెలువరించాడు . మంత్రి పరిషత్తు ఆమోదించింది . కానీ రాజుగారు మాత్రం తన నిర్ణయాన్ని వెలువరించలేదు .
ఆ రాత్రి అంతా ఆలోచించాడు రాజుగారు . తెల్లవారింది . ఫణీంద్ర ను ఇనుప గొలుసులతో బంధించి సభ లో రాజుగారి ముందు ప్రవేశ పెట్టారు . అందరూ రాజు గారు ఏమి నిర్ణయం వేలువరిస్తాడా అని ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు . అప్పుడు రాజుగారు " కొద్ది రోజులు మేము మా కుమారుడు లేక పుత్ర శోకం తో బాధ పడ్డాము . మళ్ళీ ఇలా మా గురువుగారు , మహా మంత్రి ఆ బాధ అనుభవించడం మాకు ఇష్టం లేదు . కనుక మేము ఫణీంద్ర కు యావజ్జీవ కారాగార శిక్ష విదిస్తున్నాము " అని ప్రకటించాడు . రాజుగారి తీర్పు విన్న సభికులు అందరూ రాజు గారిని అభినందించారు . మహా మంత్రి "మహారాజా ! మేము ఫణీంద్ర చేసిన పనులకు సిగ్గు తో తల ఎత్తుకోలేక పోతున్నాము . మేము అడవులకు వెళ్లి తపస్సు చేసుకుంటూ శేషజీవితం గడుపుతాము " అని అన్నాడు . రాజుగారు దానికి ససేమిరా ఒప్పుకోలేదు. కానీ మంత్రి గారు ఒప్పించారు . అప్పుడు రాజు , మంత్రి వర్యా ! మా యువరాజు పట్టాభిషేకం వరకూ అయినా ఉండండి అని అడిగాడు . అందుకు అంగీకరించాడు మహా మంత్రి.
రాజుగారు వైద్యుడు రత్నాచార్యుడిని అభినందించాడు . తమ యువరాజును కాపాడి తమకూ , రాజ్యానికి మేలు చేసినందుకు ఏమినా కోరిక కోరుకోమన్నాడు . కానీ అందుకు వైద్యుడు అంగీకరించలేదు . మహారాజా ! మేము మా విధిని నిర్వర్తిన్చాము . మాకు ఇంకా ఏమి కోరికలు లేవు అని అన్నాడు . అప్పుడు రాజుగారు ఆయనని ఘనం గా సన్మానించాడు . యువరాజు పట్టాభిషేకానికి వైద్యుని కుటుంబ సమేతం గా రమ్మని ఆహ్వానించాడు మహారాజు .
యువరాజు పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించి ఏర్పాట్లు చేసారు . దానికి రెండు రోజుల ముందు వైద్యుడు తన భార్య ను , కుమార్తె ను తీసుకుని రాజ మహలుకు వచ్చాడు . వైద్యుని యొక్క కుమార్తె గిరిజ అందానికి , ఆమె స్వభావానికి ముగ్దురాలైంది మహారాణి . యువరాజు రాజేంద్ర కూడా గిరిజను వివాహం చేసుకోవాలని అనుకుని తన తల్లిదండ్రులకు తెలియపరిచాడు . వారు అందుకు అంగీకరించి రత్నాచార్యుడు దంపతులకు ఈ విషయం తెలుపగా వారు ఆశ్చర్య చకితులై ఆనందం తో అంగీకరించారు . నిర్ణయించిన శుభ ముహూర్తం లో యువరాజుకి వివాహం పట్టాభిషేకం జరిగాయి . దానితో రాజ పరివారం , ప్రజలు కూడా ఆనందించారు .
.
"చూడండి రాజా ! ఈ ఫణీంద్ర బాగా చిన్న వాడు . ఈర్ష్యతో , ఆవేశం తో యువరాజు ను డొక్కలో పొడిచి చంపాడు . నీళ్ళలో పడవేసాడు . ఆ దృశ్యాన్ని నేను చూసాను ." అంటూ చెప్పుకుపోతున్నాడు వైద్యుడు . "ఇది నేను నమ్మను . ఈ పని నేను చేసినట్లు సాక్ష్యం ఏమిటి ?" అని అడిగాడు ఫణీంద్ర . సాక్ష్యం కావాలా ? అయితే చూపిస్తాను . నేను పండితుడిని కాను . వైద్యుడిని . మారు వేషం లో వచ్చాను . అంటూ తన వేషం తీసి చూపించాడు .
"ఆచార్యా ! మీరు దేవుడిలా వచ్చారు . మా యువరాజు ఏమి అయ్యాడు ? చెప్పండి అంటూ వైద్యుడు రాత్నాచార్యుడి చేతులు పట్టుకున్నాడు మహారాజు . "మహారాజ! మీరు చాలా మంచివారు , ధర్మ ప్రభువులు . కనుక దైవం మీతోనే ఉన్నాడు . అందుకే మీ కుమారుని కాపాడాడు నా ద్వారా . యువరాజుని భద్రం గా మీ దగ్గరకు చేర్చాను " అని అంటూ యువరాజు వేషం తీసేసి చూపించాడు రత్నాచార్యుడు.
ఒక్క సారిగా కనుల ముందు కనిపించిన పుత్రుని చూసి రాజు ఆనందంతో పొంగిపోయాడు . అతనిని కౌగలించుకొని నుదురు ముద్దాడాడు . ఈ విషయం అంతా తెలిసిన మహారాణి సభకు వచ్చిరాజేంద్రను ఆనంద భాష్పాలతో అక్కున చేర్చుకుంది . రాజకుమరున్ని జీవితునిగా చూసిన ఫణీంద్ర నివ్వెరపోయాడు . పారిపోవాలని ప్రయత్నించాడు . అది గమనించిన ఫణీంద్ర తండ్రిగారైన మహామంత్రి అతడిని బంధించమని రాజ భటులను ఆజ్ఞాపించాడు . ఆయన ఆజ్ఞ మేరకు ఫణీంద్ర ను గొలుసులతో బంధించారు .
మహారాజు మహా మంత్రి తో " మీరు మా కుటుంబానికి తరతరాలుగా సేవలు అందిస్తున్నారు . ఈ క్లిష్ట సమయం లో మా కర్తవ్యమ్ ఏమిటి అని అడిగాడు . దానికి మహామంత్రి " మహారాజా ! చట్టం, న్యాయం అందరికీ సమానమే . ఇక్కడ కూడా మనం చట్టం లో ఈ నేరానికి నిర్ణయించిన శిక్ష నే అమలు పరచాలి " అని అన్నాడు .మా రాజ్య స్తాపన అప్పట్లో మీరే చేసారు. మా పెద్దల తగ్గరనుంచి మీరే గురువులు సలహాదారులు ఇప్పుడు ఇంత బాధాకరమైన సందర్బం వస్తుంది అనుకోలేదు అంటూ రాజుగారు కాస్తంత బాధతో మాట్లాడుతున్నారు . "రాజా ! తప్పు ఎవరు చేసినా తప్పే . న్యాయం అనేది నిష్పక్షపాతం గా ఉండాలి . ఫణీంద్ర చేసింది రాజ ద్రోహం . ఇతనికి ఉరి శిక్ష ఖరారు చేయటమే తగిన నిర్ణయం " అంటూ తీర్పు వెలువరించాడు . మంత్రి పరిషత్తు ఆమోదించింది . కానీ రాజుగారు మాత్రం తన నిర్ణయాన్ని వెలువరించలేదు .
ఆ రాత్రి అంతా ఆలోచించాడు రాజుగారు . తెల్లవారింది . ఫణీంద్ర ను ఇనుప గొలుసులతో బంధించి సభ లో రాజుగారి ముందు ప్రవేశ పెట్టారు . అందరూ రాజు గారు ఏమి నిర్ణయం వేలువరిస్తాడా అని ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు . అప్పుడు రాజుగారు " కొద్ది రోజులు మేము మా కుమారుడు లేక పుత్ర శోకం తో బాధ పడ్డాము . మళ్ళీ ఇలా మా గురువుగారు , మహా మంత్రి ఆ బాధ అనుభవించడం మాకు ఇష్టం లేదు . కనుక మేము ఫణీంద్ర కు యావజ్జీవ కారాగార శిక్ష విదిస్తున్నాము " అని ప్రకటించాడు . రాజుగారి తీర్పు విన్న సభికులు అందరూ రాజు గారిని అభినందించారు . మహా మంత్రి "మహారాజా ! మేము ఫణీంద్ర చేసిన పనులకు సిగ్గు తో తల ఎత్తుకోలేక పోతున్నాము . మేము అడవులకు వెళ్లి తపస్సు చేసుకుంటూ శేషజీవితం గడుపుతాము " అని అన్నాడు . రాజుగారు దానికి ససేమిరా ఒప్పుకోలేదు. కానీ మంత్రి గారు ఒప్పించారు . అప్పుడు రాజు , మంత్రి వర్యా ! మా యువరాజు పట్టాభిషేకం వరకూ అయినా ఉండండి అని అడిగాడు . అందుకు అంగీకరించాడు మహా మంత్రి.
రాజుగారు వైద్యుడు రత్నాచార్యుడిని అభినందించాడు . తమ యువరాజును కాపాడి తమకూ , రాజ్యానికి మేలు చేసినందుకు ఏమినా కోరిక కోరుకోమన్నాడు . కానీ అందుకు వైద్యుడు అంగీకరించలేదు . మహారాజా ! మేము మా విధిని నిర్వర్తిన్చాము . మాకు ఇంకా ఏమి కోరికలు లేవు అని అన్నాడు . అప్పుడు రాజుగారు ఆయనని ఘనం గా సన్మానించాడు . యువరాజు పట్టాభిషేకానికి వైద్యుని కుటుంబ సమేతం గా రమ్మని ఆహ్వానించాడు మహారాజు .
యువరాజు పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించి ఏర్పాట్లు చేసారు . దానికి రెండు రోజుల ముందు వైద్యుడు తన భార్య ను , కుమార్తె ను తీసుకుని రాజ మహలుకు వచ్చాడు . వైద్యుని యొక్క కుమార్తె గిరిజ అందానికి , ఆమె స్వభావానికి ముగ్దురాలైంది మహారాణి . యువరాజు రాజేంద్ర కూడా గిరిజను వివాహం చేసుకోవాలని అనుకుని తన తల్లిదండ్రులకు తెలియపరిచాడు . వారు అందుకు అంగీకరించి రత్నాచార్యుడు దంపతులకు ఈ విషయం తెలుపగా వారు ఆశ్చర్య చకితులై ఆనందం తో అంగీకరించారు . నిర్ణయించిన శుభ ముహూర్తం లో యువరాజుకి వివాహం పట్టాభిషేకం జరిగాయి . దానితో రాజ పరివారం , ప్రజలు కూడా ఆనందించారు .
.
0 comments:
Post a Comment