Pages

క్రీమీ లేయర్ అవసరమా కాదా ??

     క్రీమీ లేయర్ అనేది నేడు అవసరమే .  సమాజం లో అన్ని కులాల్లోనూ, మతాల్లోనూ, ధనికులూ, పేదవారు ఉన్నారు.  అందుకే అంబేద్కర్ యొక్క కుమారుడు రాహుల్ అంబేద్కర్ ఈ మధ్య భారత దేశం లో అనేక ప్రాంతాలో పర్యటించారు .  ఆయన ఒక విషయం చెప్పారు.  రిజర్వేషన్లు అనేవి కులం, మతం వర్గాన్ని బట్టి కాకుండా ఆర్ధికం గా వెనుక బడిన వారికి ఎవరికైనా ఇచ్చేలా చట్టాలు ఉండాలి  అని నొక్కి చెప్పారు.  ఈ విషయం మన దేశం లో ఏ కుహనా రాజకీయ పార్టీలకు వినపడదు.  ఎందుకంటే వారికి కావలసింది కుర్చీలు , అధికారం. 
   ఇప్పుడు క్రీమీ లేయర్ విధానం పై అన్ని రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి.  6 లక్షలు పరిమితి సరిపోదు అనీ, దాన్ని 15 లక్షలకు పెంచమని గొడవ చేస్తున్నారు.  నేను చాలామంది బి .సి . కులాల వారిని అడిగి చూసాను.  వాళ్ళలో కోద్దా అత్యంత ధనవంతులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద అధికారులూ ఉన్నారు.  చాలా మంది ప్రభుత్వఉద్యోగులు ఉన్నారు.చాలా ప్రభుత్వ పదవులలో ఉద్యోగాలలో నెలకు 40,000 నుండి 50,000 వరకు జీతాలు వస్తున్నాయి.  ఏవో కొన్ని అటెండర్ , అటువంటి పోస్టుల్లో తప్పఅటువంటప్పుడు వారి జీతం సo,, కి 6 లక్షలు అవుతుంది కదా .  అంతే కాదు చాలామంది లేని వాళ్ళు అలానే ఉంటున్నారు .

      
         .దీనిలో ఎక్కువ భాగం వహించేది యూనివర్సిటీ ప్రొఫెసర్లు, టీచర్లు, ఇలా బాగా చదువుకున్న వారు , చదువు చెప్పేవారు .  వీళ్ళు వారి సబ్జక్ట్స్ వదిలేసి వీరికి తెలియని వేదాలు, చదవని రామాయణ భారతాలు, భాగవతం మొదలైన వాటిపై వ్యాఖ్యానాలు చేస్తుంటారు. తిక్క తిక్క గా సమాధానాలు ఇస్తుంటారు.  పోనీ వారిని ఎవరైనా " మీరు ఆ గ్రంధాలు చదివారా ? అని అడిగితే , మేము చదవలేదు, అసలు చదవాల్సిన పని లేదు" అని చెప్తుంటారు.  మరి అసలు ఆ గ్రంధాలు చదవకుండా విషయ పరిజ్ఞానం లేకుండా కేవలం మిడి మిడి జ్ఞానం, అనుభవ రాహిత్యం తో ఏ విషయాన్ని వాధించలేము.  ఆ వాదనలు ఎక్కువ కాలం నిలువవు .  కుల వాదం, కుల వివక్ష  పోవాలని వాదిస్తారు .  కానీ ఆచరించరు.  బ్రాహ్మణులలో ఉప కులాలు వారు కొట్టుకు చస్తుంటారు.  ఇక బి .సి .లలో కూడా ఒకరితో ఒకరికి పడదు.  SC, ST, వారిలో కూడా కొన్ని తెగల వారు కొన్ని తెగల వారిని తక్కువగా చూస్తుంటారు. 
       ఇంకా బి .సి . కులాల్లో వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఎదుగుతున్నారు .  మరి లేని వారి పరిస్థితి ఏమిటీ ?  అసలు ఆ లెక్కలు కూడా తీయాలి.  ఈ మధ్య కొంత మంది ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఆస్తులు కూడబెట్టి ఇల్లు కట్టి అద్దెలకు ఇవ్వటం, ఇంకా బినామీ పేర్ల తో వ్యాపారాలు చేస్తున్నారు.  మళ్ళీ వాళ్ళ పిల్లలకే రిజర్వేషన్స్, ఇంటర్వ్యూ తర్వాత పోస్టింగ్స్ కోసం డబ్బు వెదజల్లటం వంటివి చేస్తున్నారు.  దాని వల్ల వల్ల తోటి బీద వారు వారి కులం వారే ఎప్పటికీ పేదవారిగానే మిగిలిపోతున్నారు. అందుకే ఈ క్రీమీ లేయర్ కావాలి అని వారిలోనే ఒక వర్గం వారు సమర్ధిస్తున్నారు చాలా మంది డబ్బు, పదవి హోదా దక్కగానే వాళ్ళ వాళ్ళనే హీనంగా చూస్తుంటారు.  దర్పం వెలగ బెడుతూ, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు, కుటుంబ పరిస్థితులు, ఎక్కి వచ్చిన మెట్లు అన్నీ మర్చిపోయి ఏదో గొప్ప రాజ  వంశీకులు లాగా ప్రవర్తిస్తుంటారు. 
    ఈ మధ్య  కాలం లో మన దినపత్రికల్లో ఒక విషయం చదివాము అది ఏంటంటే విదేశాల్లో మన ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు లక్షల సంఖ్యలో స్థిరపదినట్లు.  ఆ లెక్కలు కూడా చూపించారు .  ఇలా జరగటానికి కారణం ఏమిటి ?  ప్రతిభావంతుల ప్రతిభ ఖండాలు దాటి విదేశాలకు వలస పోవటానికి కారణం ఎవరు ?  మన స్వార్ధ రాజకీయ నాయకులు.  వాళ్ళు వాళ్ళ స్వార్ధం కోసం వారికి నచ్చిన విధం గా చట్టాలు మర్చేస్తుంటారు.  కానీ విద్య, ఉద్యోగం, ఉపాధి, ప్రతిభ కు సంబంధించిన చట్టాలు మాత్రం వాటి కాల పరిమితి దాటిపోయినా, ప్రస్తుత సామాజిక పరిస్థితులకు ఏమాత్రం అనుగుణం గా లేకపోయినా వాటిని మార్చటానికి ధైర్యం చెయ్యరు. వాళ్ళు కులం, మతం, జాతి ఎత్తవద్దు అని నాటకాలు ఆడుతుంటారు.రాజ్యాంగాన్ని పువ్వుల్లో పెట్టి పూజిస్తుంటారు.  కానీ వారికి అనుగుణంగా దాన్ని మార్పు చేస్తుంటారు.  కానీ ప్రజలకు అవసరమైన చట్టాలు చెయ్యాలంటే వనికిపోతుంటారు,  వారి పదవి పోతుందేమో అని భయం. 

          ఇలాంటి స్వార్ధ రాజకీయ నాయకులు, క్రీమీ లేయర్ వద్దు అని వాదించే వర్గాలు, ప్రభుత్వాలు, ముటాతత్వం ఉన్నంత కాలం ప్రతిభ విదేశాలకు వెళ్ళిపోవటం, మేధావులు విదేశాలను బాగుచేయ్యటం  అది చూస్తూ మనం బాధ పడటం తప్ప చేసేది ఏమి లేదు.  రాజ్యాంగం లో సమూల మార్పులు చెయ్యాలి.  ఆధునికత కు అనుగుణం గా అందరికీ సమాన అవకాశాలు దక్కేవిధం గా సంస్కరింప బడాలి.  కానీ అది జరగాలంటే మళ్ళీ కొందరు సంఘ సంస్కర్తలు పుట్టాలి.    

some techniques to cure neck pain n spondylosys

మీరు మెడ నొప్పి ని తగిన్చుకోవటానికి కొన్ని జాగ్రత్తలు :-
     ఎప్పుడూ మెడను పూర్తిగా గుండ్రం గా తిప్పకండి .  సగం మాత్రమె తిప్పండి .  నిద్ర పోయే సమయం లో పలుచగా ఉన్న తలగడను భుజాల కిందుగా ఉండేలా అమర్చుకోవాలి .  మరీ మెత్తటి తలగడను వాడకండి .

       మీ మెడ నొప్పి తగ్గటానికి మీ భుజాలను ష్రగ్ చేస్తున్నట్లుగా మెడకు దగ్గరగా లాక్కుని 5 అంకెలు లెక్క పెట్టి మళ్ళీ వదలండి .  ఇలా కనీసం 5సార్లు చెయ్యండి .  మీ భుజాలను మొదట 5 సార్లు సవ్య దిశలో , ఆతర్వాత 5 సార్లు అపసవ్య దిశలో తిప్పండి .  మీ నుదుటిని అరచేతితో పట్టుకుని తలను ఆ అరచేతికేసి నొక్కుతూ 5 అంకెలు లెక్క పెట్టండి .  అలాగే రెండు చెంపలకు అరచేతిని నొక్కుతున్నట్లుగా ఇదేవిధం గా వ్యాయామం చెయ్యండి . 
    ఆ తర్వాత తల వెనుక చేతిని పెట్టుకుని కాసేపు తలను వెనుక వైపునకు నొక్కుతూ వ్యాయామం చెయ్యండి .  మెడ , వెన్ను , భుజం ఇలా ఏ ప్రాంతం లో నొప్పి ఉందొ అక్కడ కాపడం పెట్టండి .  చదువుతున్నప్పుడు, రాస్తున్నప్పుడూ , పేపర్ చూస్తున్నప్పుడూ తలను ఎక్కువగా వంచకండి  మీకంప్యూటర్ మోనిటర్, టీవీ చూసేటప్పుడు దానిలోకి తొంగి చూస్తున్నట్లుగా మెడను ఉంచకండి.  ఫోన్ మాట్లాడే సమయం లో భుజానికీ, తలకు మధ్య ఫోన్ ను ఇరికించి తలను పక్కకు తిప్పి మాట్లాడకండి .భుజాలను ముందుకు ఒంగేలా ఉంచకండి .
           ల్యాప్ టాప్ గానీ , కంప్యూటర్ మానిటర్ గానీ మీ కళ్ళ లెవెల్ కు సమానంగా ఉండేలా చూసుకోండి .  కంటికీ మానిటర్ కు మధ్యన 16 నుండి 22 అంగుళాల దూరం ఉండాలి.  అంతకు తక్కువ, ఎక్కువా ఉండటం మంచిది కాదు.  కంప్యూటర్ పై పని చేసే సమయం లో మీ మోచేతులను కుర్చీ చేతులపై ఆన్చి .. వాటికి సపోర్ట్ ఉండేలా చూసుకోండి .
   ఈ విధం గా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించటం వల్ల మెడ నొప్పి , కండరాల నొప్పి,స్పాన్దిలోసిస్  వంటి సమస్యల నుండి బయట పడవచ్చు . 

is one life enough?

    నా చిన్ననాటి మిత్రుడు ఒకాయన వచ్చారు , "గురువా! నేను హిందూ మతం లో పుస్తకాలు అన్నీ చదివి అంతా తెలుసుకున్నాను.  దేవతలు అందర్నీ ఆరాధించాను.  కానీ నాకు క్రిస్టియన్ మతమే నాకు దారి అని అనిపించింది.  అందుకే ఆ మతం పుచ్చుకున్నాను .  నా నిర్ణయం ఎలా అనిపిస్తుంది మీకు ?" అని అడిగాడు.  దానికి నేను " సరే మీకు నచ్చింది మీరు చేసారు .  o.k. కానీ నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి మీరు జవాబు చెప్పండి .  మీరు హిందూ మతం లో దేవుళ్ళు ఎవరిని ఆరాదించారు ?  అని అడిగాను .  దానికి ఆయన కొన్ని గ్రామ దేవతల పేర్లు చెప్పాడు .  గురువుగారూ ! నేను ఆ దేవతలను ఆరాధించాను.  కానీ నాకు ఈ మతమే కరెక్ట్ అనిపించింది అని చెప్పాడు .  అప్పుడు నేను ఆయన్ని అడిగా "మీరు హిందూ మత గ్రంధాలు చదివారా ?  అని  దానికి ఆయన లేదు గురువుగారూ ! నేను పెద్దగా చదవలేదు .  అయినా ఏమి ఉంది  వాటిలో ?  అన్నీ ఉత్త మాటలేగా! అంటూ కొంచం వ్యంగ్యంగా అన్నాడు .   దానికి నేను అతనితో అన్నాను , మీరు మొదటి మెట్టు లో నుంచే వెనక్కు వచ్చేసారు .  మరి ఇంకా ఈ మతాన్ని గురించి మాట్లాడటం అనవసరం  అని అన్నాను .

      అతనితో ఇంకా సంభాషించాలి అని  మనసుకి అనిపించలేదు .  ఆ తర్వాత నేను కూర్చుని హిందూ మత గ్రంధాలు  అవి ఏమిటి అంటే 4 వేదాలు, బ్రహ్మ సూత్రాలు, 18 పురాణాలు , 150 ఉపనిషత్తులు , భగవద్గీత, ఇంకా హిందూమతం లోనే 5 ముఖ్య మతాలు , వాటిపై త్రి మతాచార్యులు శంకర , రామానుజ , మధ్వాచార్యులు వ్రాసిన భాష్యాలు ఇవి అన్నీ ముఖ్యమైనవి.  ఇంకా ఇతర గ్రంధాలు ఇంకా లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి .  వీటిని మనం పూర్తిగా చదివి అర్ధం చేసుకోటానికి ఒక జీవిత కాలం సరిపోదు మతం గురించి నాకు తెలిసిన విషయాలు జ్ఞప్తికి తెచ్చుకోవటం మొదలు పెట్టాను .
        హిందూ మతం లోని 5 మతాలను శంకరాచార్యులవారు చట్టబద్ధం చేసారు .   అవి ఏమిటంటే
1. సౌరం -- అంటే సూర్యుడిని కొలవటం .   2. గాణాపత్యం -- అంటే గణపతిని ఆరాధించటం . 3. అంబికాం -- అంటే శక్తీ మాత దుర్గ ను పూజించటం .  4. శ్రీవిష్ణుం --  అంటే విష్ణువు ను పూజించటం . 5.  మహేశ్వరం -- అంటే శివుని ఆరాధన .  ఈ 5 కాక ఆయన 6వ మతాన్ని ఒక దాన్ని స్థాపించారు   అది ఏమిటంటే ఈ పైన చెప్పిన 5గురు దేవతలలో మన ఇష్ట దైవాన్ని ఒకరిని మధ్యలో ఉంచి మొత్తం మిగిలిన వారిని చుట్టూ ఉంచి పూజించటం .  ఆయన ఈ సిద్ధాంతాన్ని నిరూపించి మిగిలిన 75 మతాల వారిని ఓదించి వాటిని తీసివేసారు .  అందువల్లనే ఆయన ను షన్మత స్తాపనాచార్య అనే పేరుతో పిలుస్తారు .  ఆది శంకరులు అద్వైతాన్ని స్థాపించారు .  అంటే భగవంతుడు, జీవుడు వేరు వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే అని చెప్పారు .  ద్వైతము కానిది అద్వైతము  అని ప్రతిపాదన చేసి భాష్యం వ్రాసారు .దానినే శంకర భాష్యం అని అంటారు .  ఆయన జగద్గురువు అని పేరు పొందారు .   ఆతర్వాత కాలం లో మళ్ళీ మూదాచారాలు తిరగాబెట్టినప్పుడు రామానుజులు వచ్చి విసిష్టాద్వైతాన్ని స్థాపించారు .  ఆయన సమాజం లోని రుగ్మతలు తొలగించటానికి పాటుపడ్డారు .  అన్ని కులాలు , మతాల వారిని తన దగ్గరకు ఆహ్వానించారు .  ఆయన మనుష్యులలో బేధాలు లేవు అంతా ఒక్కటే అని ప్రబోధించారు .  ఆయన సిద్దాంతం ప్రకారం పరమాత్మ +ప్రకృతి +జీవుడు అంటే ఎలెక్ట్రాన్+ప్రోటాన్ +న్యూట్రాన్ లాగా కలిస్తే ఈ సృష్టి అని ప్రతిపాదించారు .  అదే విశిష్టాద్వైతం .  ఈ ప్రతిపాదన తో వ్రాసినదే శ్రీభాష్యం . 
   ఇక మూడవ వారు మధ్వాచార్యులు.  వీరిది ద్వైతం .  అంటే పరమాత్మ +జీవుడు ఇద్దరు వేరు వేరు అని .  ఈయన కూడా ఈ మతానికి భాష్యం వ్రాసారు .
  ఇలా హిందూ మతం లో ఈ ముగ్గురు రచనలు చదవాల్సి ఉంటుంది .  ఇంకా తులసీదాసు , కబీరు వంటి గొప్పవారి రచనలు , ఆళ్వారుల గ్రంధాలు , రామాయణ భారతాలు ఇవి అన్నీ సాహిత్యమే .  అసలు ఇంత వరకు చదివి అర్ధం చేసుకోత్తనికే సమయం సరిపోదు .
   ఇంకా ఒక్క ఖురాన్ , లేదా బైబిల్ చదివితే మొత్తం మతం గురించి తెలియదు .  హిందూ మతంగురించి తెలుసుకోవటానికి , వేదాంత అనుభూతిని పొందటానికి ఒక్క జన్మ సరిపోదు .

Think before writing

         కసూరి రచన పై భౌతిక దాడులకు దిగటం కొంత భాదాకరమే అంటూ వ్యాసకర్తలు ఎడాపెడా వ్రాసిపారేస్తున్నారు.  గతం లో తమిళనాడు లో మనువు వ్రాసిన మనుస్మృతి పుస్తకాలు తగులబెట్టారు .  బ్రాహ్మణులు రోడ్లపై వెళ్తుంటే బట్టలు విప్పి కొట్టారు ఇతర కులాల వారు.  ఇంతకీ ఆ పుస్తకం 2000స0;; కు పూర్వం ఉన్న పరిస్థితులకు అనుగుణం గా వ్రాసినది.  ఇంకా గట్టిగా చెప్పాలంటే అది ఈ కలియుగం లో అమలు లో ఉండదు.  హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఇప్పుడు ఉండేది పరాశర సంహిత.  ఒక 1000స0;; తర్వాత అంబేద్కర్ వ్రాతలు పనికిరావని ఆ దారిన పొయ్యే వాళ్ళను కొడితే ఏమైనా అర్ధం ఉంటుందా ?  ఇదీ అంతే.
        పరమత సహనం అని ఈ రచయితలు రాస్తున్నారు.  ఈ సహనం విదేశాలకు పట్టదా ?  భారత దేశం పై ఎందరో దాడి చేసారు, సంపదలు దోచుకున్నారు .కానీ ఏనాడు మన దేశం ఇతర దేశాలపై ఉత్తుట్టిగానే అయినా దాడులకు వెళ్ళలేదు.  మన దేశపు సరిహద్దుల్లో మిలటరీ వాళ్ళు పడుతున్న కష్టాలు గురించి ఆలోచించండి .
        తప్పులు పాకిస్తాన్ వాళ్ళు చేస్తూ, మన దేశం వాళ్ళు చేస్తున్నారు అని అంతర్జాతీయ మీడియా లో బుకాయిస్తుంటే కనపడటం లేదా?ముషారఫ్ హయాం లో మన ఆర్మీ ఆఫీసర్స్ ని బంధింఛి చిత్ర హింసలకు గురి చేసి, వారి నాలుకలు కోసి, కళ్ళు పీకి, హింసలు పెట్టారు అప్పుడు మన దేశ భక్తులు ఏమి చేస్తున్నట్లు ?  తాగిన మైకం లో సరభ్ జిత్ సింగ్ పొరబాటుగా సరిహద్దు దాటి వెళ్ళిన నేరానికి అతడిని 30స0;;జైలు లో ఉంచారు.  చివరకు అక్కడే జైలు లో తోటి ఖైదీలతో రాళ్ళతో కొట్టించి చంపించారు.
         మనం చెప్పుకుంటూ పోతే ఇటువంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి.  ఆ దేశం లో హిందువులు ఎలా బ్రతుకుతున్నారు ? ఈ దేశం లో ముస్లిం లు ఎలా జీవిస్తున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే.  ఇన్ని జరిగినా కూడా మన దేశం అలాంటి ఒక గొప్ప దేశం పై స్నేహం చేయాలి అంటూ స్నేహ హస్తం ప్రతిసారీ అందిస్తూనే ఉండాలి వాళ్ళు ఎన్ని సార్లు వాతలు పెడుతున్న సరే అని వ్రాస్తున్న మన రచయితలను మనం గౌరవించాలి, సన్మానం చెయ్యాలి !! ఎందుకంటే వారిది చాలా విశాల హృదయం కదా మరి !!
           ఈ అవార్డులు, రివార్డులు తిరిగి ఇవ్వటానికి ముందు మన మేధావులు కొంచం ఈ విషయాలమీద ఆలోచించాలి.  ముందు దేశ ప్రజల మనసులో ఎటువంటి భావాలు ఉన్నాయో తెలుసుకోవాలి.  మనం పాకిస్తాన్ తో స్నేహం గా ఉండటం,వారి కళాకారులను గౌరవించటం ఇప్పటివరకూ జరుగుతూనే ఉంది.  కానీ వారు కూడా అదే గౌరవాన్ని మనకి ఇస్తున్నారా అని ఆలోచించాలి.
         అయినా మన దేశం లో పాకిస్తానీ కళాకారులు రావటం, ప్రదర్శనలు ఇవ్వటం, సినిమాలు, TV. లో నటించటం అన్నీ జరుగుతూనే ఉన్నాయి.  మరి ఇప్పుడు ఈ కులకర్ణి గారిని ఎందుకు వ్యతిరేకించారు అనేది ముందు అర్ధం చేసుకోవాలి .  మనం కసూరి ని ఒక రచయిత గా అంగీకరించ గలమా? అతను పాకిస్తాన్ మంత్రి  గా ఉండేవాడు.  రాజకీయ నాయకుడు.  మన దేశానికి వ్యతిరేకం గా పని చేసినవాడు.అటువంటి వాడిని మన మేధావులు గౌరవించాలి అని అనుకోవటం ఎంత వరకు సమంజసమో ఆలోచించండి .

please have some of these daily

రోజూ మీరు భోజనం లో తప్పక ఇవి ఉండేలా చూడండి :
1. పసుపు
2. సోయా పాలు  (50స0: దాటిన ఆడవారికి )
3. కరివేపాకు
4. పచ్చిమిర్చి
5. ఉల్లి మరియు వెల్లుల్లి
6. దాల్చిని చెక్క
7.  జీలకర్ర 
8. పప్పుధాన్యాలు
9. పాలు లేక పాల పదార్ధాలు
10.ఆకుకూరలు మరియు సలాడ్స్
ఇవి అన్నీ లేక కొన్ని అయినా మన రోజువారి ఆహారం లో ఉండేలా చూసుకుంటే మనకు బి .పీ ., షుగర్ , కొలెస్ట్రాల్, అజీర్ణం , గ్యాస్ అసిడిటీ వంటి చాలా సమస్యలు రాకుండా ఉంటాయి .  వీటి తోపాటు మానసిక ఒత్తిడి తగ్గించుకోటానికి యోగ , వ్యాయామం , ధ్యానం  కూడా అవసరం .  క్రమశిక్షణ పాటిస్తే ఆరోగ్యం మన సొంతం .

Do u know these?

హాయ్ !
ఇవి మేకు తెలుసా ?
అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి .
కరివేపాకు రక్త హీనతను తగ్గిస్తుంది
ఉలవలు తింటే ఊబకాయం తగ్గుతుంది
బ్లాకు టీ మధుమేహాన్ని దూరం గా ఉంచుతుంది
జామకాయలు హార్మోన్స్ లో హెచ్చు తగ్గులు నివారిస్తాయి
ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది
బీట్రూట్ రసం లో బి .పీ . సమస్యని తగ్గిస్తుంది
కీరదోసలో ఉండే సల్ఫర్, సిలికాన్ సిరోజాలకు మేలు చేస్తాయి
మునగాకు గ్యాస్త్రిక్ అల్సర్స్ ని దరి చేరనివ్వదు.
ఉల్లిపాయ శ్వాస కొస వ్యాదుల్ని తగ్గిస్తుంది
ఉల్లిపాయ ఇన్సులిన్ ని నియంత్రిస్తుంది, దానిలోని యాస్ప్రిన్ రక్తాన్ని గడ్డకట్టకుండా చేస్తుంది.

కాలుష్యం- జీవనం పై ప్రభావం

       ఆధునిక కాలం లో డబ్బు అవసరాలకు ఒక పరిమితి లేకుండా పోయింది .  పూర్వకాలం లో ఓ ఇల్లు  కొద్దిగా పొలం, ఒక సైకిల్ ఉంటె చూకు అనుకొనేవారు .  కానీ నేడు ఫ్లాట్, బండి , కారు, బ్యాంకు బాలన్స్, ఫార్మ్ హౌస్, బంగారం, ఎఫ్ .డి .లు , ఇలా ఎన్నో వాటికి తాపత్రయ పడుతున్నారు.  ఒకరిని చూసి ఒకరు పోటీ పడుతున్నారు . తప్పనిసరి రోజులు ఇవి.  దానితో ప్రతి మనిషీ కుల, మత, లింగ, వయో, వృత్తి భేదం లేకుండా డబ్బు సంపాదనలో పడిపోతున్నారు.  దేశాలు కూడా దాటి వెళ్ళాల్సి వస్తోందిఅయితే కొన్ని రకాల సంపాదనల తో మనిషి, జీవుల ఆరోగ్యం, ఉనికి పై తీవ్ర ప్రభావం పడుతోంది. 
        రైతులు వ్యవసాయం కోసం అప్పులు చేసి ఆ తర్వాత  వాతావరణం అనుకూలించక పంటలు సరిగ్గా పండక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  "వ్యవసాయాధారం భారత దేశం " అని ప్రభుత్వాలు ఊదర కొట్టతమే కానీ ఆ ప్రభుత్వాలు కూడా రైతుల గోడు పట్టించుకోవటం లేదు.  విజ్ఞాన పరం గా కంప్యుటర్ రంగం లో  చాలా అభివృద్ధి సాధించినా, ఎన్ని రాకెట్లు, ఉపగ్రహాలు ప్రయోగించినా ఆకలి కాగానే కడుపుకి అన్నం తినాలి గానీ కంప్యూటర్ చిప్స్ తినలేము కదా !  అఫ్ కోర్స్ ఈ pollution. ఈ కల్తీ ల పుణ్యమా అని ప్రతివారికీ షుగర్, బి.పీ. వల్ల ఎవరూ కడుపు నిండా తిండి తినటమే లేదు .  అప్పుడప్పుడూ తింటూ గ్యాస్, ఉబ్బరం తో సతమమవుతూ కాలం గడిపేస్తున్నారు .
        రైతులకు కూడా డబ్బుల అవసరం చాలా ఉంది.  అందుకే ప్రతి పంటకూ, ప్రతి చెట్టుకూ రసాయనిక మందులు వేస్తున్నారు. విత్తనం త్వరగా మొలకెత్తటానికి మందులు, త్వరగా పెరిగి కాయలు కాయటానికి మందులు, ఆ కాయలు పండ్లు అవటానికి మందులు ఇలా అన్నీ రసాయనిక మందులు పోసేస్తున్నారు .  ఇక అమ్మేవాళ్ళు ఇంకాస్త విషపు పొట్లాలు పెట్టి పండ్లు పండిస్తున్నారు.  ఇలా అన్ని మార్గాల్లో తినే అసలు పదార్ధం కంటే విషాలు తినేస్తున్నాం మనం .      
      అంతే కాదు మన విజ్ఞాన శాస్త్రం బాగా అభివృద్ధి చెంది ఆ శాస్త్రవేత్తలు ఆ పువ్వులు, ఈ కాయలు కలిపి కొత్త కొత్త పండ్లు, కాయలు పుట్టిస్తున్నారు.  దాని వల్ల  మనిషి జీన్స్ లోని R.N.A., D.N.A. ల లోనే మార్పులు వస్తున్నాయి.  అన్నీ సంకర జాతి అయిపోతున్నాయి.  ఇక పాడి పరిశ్రమ వాళ్ళు ఆవులు, గేదెలు కలిపి కొత్తగా జెర్సీ ఆవులు పుట్టిస్తున్నారు.  ఆ ఆవులు పాలు ఎక్కువగా ఇస్తాయి.  అయితే ఆ పాల వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి అని నిరూపిత మైంది.
      అలా ఆవులను గేదెలను సంకరం జరిపి పుట్టించటం సృష్టి విరుద్ధం .  అలానే అవి అధికం గా పాలు ఇస్తాయి అని వాటికి పిచ్చి తిండి పెట్టటం వల్ల  చాలా చెడు ఫలితాలు వస్తున్నాయి.  పూర్వ కాలం లో పశువులకు ఎండుగడ్డి, పచ్చిగడ్డి, తవుడు, చిట్టు ఇలా ఎంతో సహజ సిద్దమైన బలవర్ధక మైన ఆహారం పెట్టేవారు.  అందువల్ల ఆ పాలు తాగిన మనుషులకు కూడా మంచి ఆరోగ్యం ఉండేది.  కానీ ఇప్పుడు వాటిని చాలా వరకు కబెలాల్లో కోసి తినేస్తున్నారు.  ఇంకా మిగిలిన కొద్ది బర్రేలే ఎక్కువ పాలు ఇవ్వాలి.  అందుకోసం వాటికి హార్మోన్ ఇంజేక్షన్స్ ఇస్తున్నారు.  ఆ పాలు మనం తాగటం వల్ల మన శరీరాల్లో కి ఆ పదార్ధాలు వెళ్లి మనకి ఊబకాయం, ఇంకా కొన్ని జబ్బులు వస్తున్నాయి.  ఇంకా పెరిదాక్సిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల మనం పాలు తీయకుండానే అవే పాలని బిందేల్లోకి కార్చేస్తాయి.  ఆ పాల ద్వారా ఆ హర్మోనే మన శరీరం లోకి ప్రవేశిస్తుంది .  అందువల్లనే చిన్న  పిల్లల్లో కళ్ళ వ్యాధులు, బి.పీ. , ఎముకలలో బలం తగ్గిపోవటం మొదలైన జబ్బులు వస్తున్నాయి.       
       ఇంకా పాలు కృత్రిమం గా తయారు చేస్తున్నారు.  సబ్బు నురగ +పెయింట్ లో వాడె వైట్ నెర్+ఇంకా యూరియ+ ఇంకా కొన్ని రసాయనాలు కలిపి కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు.  ఇవి చాలా ప్రమాదకరం.  ఇంకా హెరిటేజ్,  అముల్, వంటి టాప్ బ్రాండ్ పాలల్లో కలుషితాలను బాలల హక్కల సంఘం బయట పెట్టింది.
     ఆ పాలను ఎవరు బాన్ చేయించ లేరు.  డాక్టర్స్ కూడా అవి వాడద్దు అని చెప్పరు.  వారికి కూడా పండగే పండగ.  మన బలహీనత లను వారు ఉపయోగించు కుంటున్నారు.  డబ్బు సంపాదిస్తున్నారు .
     ఈ మధ్య చైనా నుండి ప్లాస్టిక్ తో తయారు చేసిన బియ్యం కూడా దిగుమతి అవుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి.   ఇంతకు ముందు చైనా వాళ్ళు కృత్రిమ గుడ్లు తయారు చేసారు.  కానీ అవి ఎందుకో మార్కెట్ లో నిలబడ లేదు.డాక్టర్ లు  కూడా ప్రతి పత్రిక లో, ప్రతి చానల్ లో ఆరోగ్య సూత్రాలు, జాగ్రత్తలు చెప్తున్నారు.  అయితే ఈ రసాయనాలు, ఈ కల్తీలు, ఈ కాలుష్యం  గురించి ఏమీ మాట్లాడరు.  ఇవన్నీ ఇలా నడుస్తూ ఉంటేనే అందరికీ భ్రుతీ దొరుకుతుంది, పదిమంది ప్రజలు బ్రతుకుతున్నారు అనే అనుకుంటూ ఉన్నాడో ఏమో ఆ భగవంతుడు అని అడగాలనుంది. 
     ఏ పత్రిక చదివినా, ఏ టి .వి . ఛానల్ చూసినా రోజూ మీరు నడవండి, కొవ్వులు తినకండి, ఇన్ని గంటలు పడుకోండి, వ్యాయామం చెయ్యండి ....... అంటూ ఇలా చాలా జాగ్రత్తలు చెబుతారు.  కానీ ఏం లాభం ?  మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చిట్టచివరకు ఈ పైన చెప్పిన పదార్ధాలు అన్నీ మన పోషణ లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. మనం ఆ డాక్టర్స్, జగ్రత్తపరులు చెప్పినవి విని ఆచరించి ఏమి లాభం ?  ఈ కల్తీ పదార్ధాల వల్ల జరిగే చెడు జరిగిపోతోంది.  అందువల్లనే ఏ వ్యసనాలు లేకపోయినా చంటి పిల్లలు, స్త్రీలు కూడా రోగాల బారిన పడుతున్నారు.   

       ఈ సమస్యలు తీరాలంటే ప్రభుత్వం మేలుకోవాలి ఆరోగ్యమైన సమాజం కోసం తగు చర్యలు చేపట్టాలి.  కేవలం ప్రభుత్వమే కాక మన వంతు గా మనం చదువుకున్న వాళ్ళు అందరు సంఘం గా ఏర్పడి ప్రజలను చైతన్య పరిచే కార్యకలాపాలను తయారు చేసి వారిలో ఎవేర్నేస్ కలుగజేయాలి.  ఈ బాధ్యత మన అందరి పై ఉంది.  మనం ఇప్పుడు జాగ్రత్త పడితే మన రానున్న తరాలు, పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు.  నవ, ఆరోగ్య భారత నిర్మాణం జరుగుతుంది.
         
   

ఇది సాంస్కృతిక నిరంకుశత్వం --- ఒక విశ్లేషణ

 
           పైన పేర్కొన్న వ్యాసాన్ని చదివాక నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచికోవాలని ఈ వ్యాసం వ్రాస్తున్నాను .  పై వ్యాసం లో కొన్ని విషయాలు మనకు ఇప్పటివరకు తెలిసిన వాటికి విరుద్ధం గా ఉన్నాయి .  మీరు కూడా చదవండి.  అప్పుడు మీకు కూడా అర్ధం అవుతుంది నేను ఏమి చెప్తున్నానో .  ఇక్కడ మన వ్యాసకర్త ఈ మధ్య మహారాష్ట్ర లో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఉటంకిస్తూ దానికి ఖండనలను వ్రాసారు .  తన యొక్కబాధ ను అందులో వ్యక్తపరిచారు .  అంత వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత తన వాదనను బలపరుచుకోవటానికి ఇచ్చిన explanations. ఎంత వరకు నిజమో మీరు కూడా ఆలోచించండి .  అందుకే నేను నా విశ్లేషణలు క్రింద రాస్తున్నాను .
         ఏ మాంసం అయినా తినవచ్చు గానీ మిషన్లలో పెట్టి ప్రాణం ఉండగానే హింస పెట్టి తినకండి .  ఇప్పుడున్న అల్ కబీర్ కబేళాలు అయితే ఇతర రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో పెట్టనివ్వ కుండా బహిష్కరించారు .  మర్రి చెన్నారెడ్డి హయాం లో ఇక్కడ మెదక్ జిల్లా లో నెలకొల్పారు .  ఒకప్పుడు దాన్ని మూసివేయమని  అరిచి గీపెట్టిన బి జె పీ వారు అధికారం లోకి వఛ్చాక ఆ విషయాన్ని మరిచారు .  అక్కడ ఆ కబేలాలలో పశువుల్ని మిషన్లలో పెట్టి, వాటి చర్మం వలిచి , నెత్తురు తీసి, ఎముకలు విరిచి ఆ తర్వాత చంపుతారు .  అది ఎంత క్రూరత్వం ?      అసలు ఆవులే కాదు ఎద్దులని, కోడేలని బర్రెల్ని కూడా ఇలాగే హింసిస్తున్నారు.
         అసలు మన మల్లేపల్లి లక్ష్మయ్య గారి లాంటి వారిని ఒకసారి ఆ కబెలాలకు వెళ్లి చూడమని చెప్పండి.  అప్పుడు తెలుస్తుంది అసలు జీవ హింస అంటే ఏమిటో !  వూరికే ఎప్పుడూ ఒకటే పాత పాటే పాడటం కాదు, పత్రికల్లో విషపు రాతలు రాయటం కాదు.  పశువుల్ని ప్రాణం ఉండగానే వాటి చర్మం వొలిచి రక్తం తీసి ఎముకలను విరవటం ఎంత ఘోరం, ఎంత హింస ? అసలు ఆలోచిస్తేనే మనసు క్షోభిస్తుంది, మెదడు మొద్దుబారి పోతుంది .  అసలు మానవత్వం ఎక్కడ ఉంది అని అనిపిస్తుంది .  మన తెలంగాణా జిల్లాల్లోనే కొన్ని ప్రాంతాలకు  వెళ్లి చూస్తె తెలుస్తుంది ఒక మతం వారు పసువులను చౌకగా కొనేసి లారీ ల్లోకి ఎక్కించి తీసుకువస్తారు .అప్పుడు ఆ లారీల్లో లెక్కకు మించి పసువులను ఎక్కించి కాళ్ళు అడ్డువస్తే ఇనుప కడ్డీలతో కొట్టి కాళ్ళు విరిచి ఒకదానిపై మరొకదాన్ని ఎక్కించి తీసుకువస్తారు .  అది ఎంత క్రూరత్వమో ఆలోచించారా ?  మరి బౌద్దులం, బుద్ధుని బోధనల్ని పూర్తిగా అర్ధం చేసుకున్నాం అని కొత్తకొత్త విషయాలు పత్రికల్లో వ్రాసేవారికి ఈ విషయాలు కనిపించటం లేదా ?  కేవలం పత్రికల్లో రాతలకే పరిమితమా వారి బౌద్ధం, అహింసావాదం ?  ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి .     మనకు జీవితం లో కన్నతల్లి కొంత కాలం మాత్రమే పాలు ఇచ్చి పెంచుతుంది .  కానీ ఆవులు, గేదెలు మతం మనకు జీవితాంతం పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ ఇస్తాయి .  మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి.  అటువంటి వాటికి ప్రతిఫలం గా మనం తిరిగి ఏమి ఇస్తున్నాము ? ఇంత చిత్రహింస పెట్టి చంపి తినటం. అదీ మన మానవత్వం. 
          పూర్వ కాలం లో పశువులు వట్టిపోయినా కూడా వాటికి ఇంత మేత పెట్టి వాటిని ప్రేమగా చూసుకునే వారు .  అడవిలో తప్పిపోయిన పశువుల కోసం కూడా చెట్ల కింద మేత, నీళ్ళు పెట్టేవారు.  వాటిని కన్నా బిడ్డల్లా చూసేవారు.  మరి ఇప్పుడు ఆధునికులు దీనికి పూర్తిగా విరుద్ధం గా ఉన్నారు .  వారు వాటిని వ్యాపార సాధనాలుగా చూస్తున్నారు .వాటివల్ల లాభం తీరగానే వాటిని కబెలాల్లో అమ్మేస్తున్నారు . అక్కడ వాటికి నరకం చూపిస్తున్నారు .  ఇది ఏమి మానవత్వం ?  అసలు ఎంత ఆలోచించినా అర్ధం కాదు మనకి.ఈరోజులలో కూడా మనం చూస్తున్నాం విపరీతమైన తాగుడు వల్ల, మాంస భక్షణ వల్ల చిన్న వయస్సు లోనే కొవ్వు చేరినవాళ్ళు, షుగర్ వ్యాధి గ్రస్తులు, ఊబకాయం, ఇలా వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో భాద పడుతున్నారు అధిక శాతం ప్రజలు.  సాయంత్రం అవగానే కల్లు దుకాణాలు, వైన్ షాప్స్ క్రిక్కిరిసి ఉంటున్నాయి .  భార్యాభర్తలు కూడా రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటున్నారు .  మనవ సంబంధాలు అపహాస్యం అవుతున్నాయి .  అతిగా తాగి తినే వాడికి ఆలోచన , సాలోచన ఉండవు .  అందుకే వాటిని వదిలెయ్యమని సమాజం లో అందరికీ బోధించారు పెద్దలు, త్రిమతాచార్యులు .
      ఆనాటి యజ్ఞ యాగాదులలో కంటే నేటి ప్రతి నగరం లో, ప్రతి ప్రాంతం లో మాంసం విక్రయాలకోసం పశువులను విపరీతం గా చంపుతున్నారు .  మరి లక్ష్మయ్య గారు చెప్పినట్లు వ్యవసాయం పశు సంపద దెబ్బ తినకుండా ఆనాటి బుద్ధుడు చేసిన పనే నేటి B.J.P. వారు చేస్తున్నారు అని అనుకోవచ్చు కదా !ఇక అక్కడి బీహార్ లోని బౌద్ధులు ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యాపించి ఉన్న మన మూలాలను పెకిలించి వేస్తుంటే ఇక్కడి వారు చోద్యం చూస్తూ ఊరుకుంటారా ?
      అలానే శైవమత స్తావరాల్లోకి వైష్ణవం చొచ్చుకుని వస్తే వారు వాళ్ళ మతాన్ని కాపాడుకోటానికి చాలా మంది వైష్ణవులను వీరభద్రపల్లాలతో కొట్టి చంపారు .  మరి ఇక్కడ ఇరువర్గాలు ప్రాణాలు మనుషులవే కదా ! ఈ గొడవలవల్ల శ్రీవైష్ణవులు ఇక్కడ మైనార్టీలు అయ్యారు .  మరి వారికి reservations. ఇస్తారా ?   
        ఒక్కసారిగా మల్లేపల్లి లక్ష్మయ్య గారి వ్యాఖ్యానం వల్లబౌద్ధం అర్ధం, ఉనికి కూడా మారిపోయాయి.  అసలు బుద్ధుడు చెప్పింది ఏమిటి ?  అసలు జీవ హింస వద్దు అని చెప్పాడు ఆయన .  ఆకలితో ఉన్న జీవికి ఆకలి తీరిస్తే అదే ఆ అనుభూతే దైవం అని చెప్పాడు .  అసలు వ్యవసాయ సంక్షోభం అంటూ ఆయన ఆలోచించ లేదు .  ఇవి అన్నీ మన సొంత వ్యాఖ్యానాలు .  మితిమీరిన యాగాల వల్ల పశు సంపద తగ్గిపోతోంది అని అందుకే ఆయన ఈ వ్యవసాయాన్ని రక్షించడానికే అలా అన్నాడు అని రాసారు .  మరి ఇప్పుడు యాగాలు, బలులు లేవు కదా ! మరి ఇప్పుడు పశు సంపద ఎందుకు తగ్గిపోతోంది ?  మిషన్లలో పెట్టి వందలు , వేల సంఖ్యలో పశువుల్ని చంపి తింటూ ఉంటె మరి ఇప్పుడు రైతులు వ్యవసాయం ఎట్లా చేస్తారు ?... బౌద్ధం మాది అని చెప్తున్న దళితులూ, కొన్ని కులాల వారు ఇలా ప్సువుల్ని హింసించి మరీ వాటి మాంసం తింటూ మద్యం తాగుతూ ఉంటె అది జీవ హింస కాదా ?  అది బుద్ధునికి వ్యతిరేకం కాదా ? 
         మరి బౌద్ధం ఏమి చెబుతుందో ఈ రచయితలకు గుర్తు రావటం లేదా ?  "ఏ జీవినీ హింసించ వద్దు .  వాటి ప్రాణం తీసే హక్కు నీకు ఎవరు ఇచ్చాడు ?" అని కూడా బుద్ధుడు ప్రశ్నించాడు. వ్యవసాయ సంక్షోభం ... ఇవన్నీ ఆయన ఆలోచించలేదు . అసలు ఘంటాపధం గా చెప్పాలంటే ఏ రకమైన హింస కూడా వద్దు అన్నాడు . టన్నుల కొద్దీ మాంసం లాగించి , పెగ్గుల కొద్దీ మందు తాగి వూగమని బుద్ధుడు చెప్పలేదు .  అవి అన్నీ తప్పుడు మార్గాలు అని చెప్పాడు . బ్రాహ్మణులూ చేసినా ఏ కులం వారు చేసినా అది తప్పే అని నొక్కి చెప్పాడు .  అదే విషయం తర్వాత త్రిమతాచార్యులు శంకర, రామానుజ, మధ్వలు చెప్పారు .  
         అశోకుడు కూడా బౌద్ధం పాటించటం మొదలు పెట్టినాక అహింసా వాదానికి ప్రాముఖ్యం ఇవ్వటం వల్ల అతని సైన్యం బలహీనమైనది .  అతని విరోధులకు అది పెద్ద ఆయుధం అయ్యింది .  అందువల్లనే అతని తరువాత అతని రాజ్యం చిన్నాభిన్నమైంది.  అతని కుమారులు బలహీనులయ్యారు .  అందుకే వారి సామ్రాజ్యం పతనమైంది అని చరిత్రకారులు చెప్తారు .   
     శాఖాహారులకు కొంత మేర B6, B12, Zinc. అందని మాట నిజమే కానీ శాఖాహారం పూర్తిగా బలం ఇవ్వదు అని అనటం ఎంతమాత్రం సబబు కాదు .  ఉదాహరణకు కోడి రామమూర్తి అంతర్జాతీయం గా కుస్తీ పోటీల్లో ప్రసిద్ధుడు . ఆయన శాఖాహారి.  ఇంకా ఎంతో మంది ప్రముఖులు శాఖాహారులే.  అంతెందుకు ?  ఎంతో బలమైన జంతువులు ఏనుగు, ఖడ్గ మృగం కూడా శాఖాహారులే .  కోళ్ళు, మేకలు మొదలైన జంతువులు మాంసం కోసమే పెంచుతారు కనుక వాటిని తినడం లో తప్పు లేదు అని నా ఉద్దేశ్యం .  కానీ జంతువులను బ్రతికి ఉండగానే హింసించి చంపటం ఎంతవరకు సబబో ఆలోచించండి .     
        నాకు, ఇంకా నా మిత్రులు కొంత మంది కి ఒక సందేహం అది ఏంటంటే అసలు బుద్ధుడు వ్యవసాయ సంక్షోభం, రైతులు, సమాజ ఆర్ధిక వ్యవస్థ వీటి అన్నింటి గురించి ఆలోచిస్తే అసలు ఆయన సన్యాసం ఎందుకు తీసుకుంటాడు ?  ఆయన రాజుగా రాజ ధర్మం నిర్వర్తించే వాడు .  ఆయన అసలు ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ చెయ్యలేదు.  ఆయన అసలు హింసకు వ్యతిరేకి.  జీవ హింస నేరం కనుక చేయవద్దు  అనేది ఆయన ప్రధాన బోధన. 
        మనకి ఇష్టమైన మతాన్ని, ధర్మాన్ని ఆచరించే అవకాశం స్వేచ్చ మనకి మన రాజ్యాంగం ఇచ్చింది.  దానిని మేధావులు సద్వినియోగం చేసుకోవాలి .  ఇంకా తెలియని వారికి చెప్పి వివేక వంతుల్ని చెయ్యాలి అంతే గానీ ఇలా తప్పుదోవ పట్టించకూడదు.  మనకు ఇష్టమైన వ్యక్తులు, విషయాలను ఎక్కువ చేసి గొప్పగా చూపటానికి వారు చెయ్యని పనుల్ని వారికి ఆపాదించటం, అన్ని మంచి కార్యాలు వారివల్లే అని ప్రచారం చెయ్యటం, అలాగే మనకి ఇష్టం లేని వారిని అనవసరం గా చులకనగా మాట్లాడటం,  వారు చేసిన మంచి పనుల్ని కూడా చేదుగా వక్రీకరించటం, వేరేవారికి ఆపాదించటం ఇది నిజమైన మేధావుల లక్షణమా ?  అంబేద్కర్ ని గొప్పగా చూపటానికి మహాత్మా గాంధీ గారిని తక్కువ చెయ్యవలసిన అవసరం లేదు.  మన మేధావులు ఇటువంటి చిన్న చిన్న విషయాలు మనసులో పెట్టుకుని వ్యాసాలూ రాస్తే మన సమాజానికి ఎంతో మంచి జరుగుతుంది .
           

కృష్ణం వందే జగద్గురుం

        అందరికీ  శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు .    "కృష్ణం వందే జగద్గురుం "  అంటే  జగద్గురువు అయిన కృష్ణ భగవానునికి నమస్కారములు  అని కదా అర్ధం .  శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములలో శ్రీకృష్ణ అవతారం సంపూర్ణ అవతారం అనగా ఇలా వచ్చి అలా వెళ్ళటం కాకుండా ఆయన ఈ భూమండలం పై మానవునిగా పుట్టి , మానవుని వలెనీ పెరిగి , మన జీవితం లో ధర్మం ఎలా ఆచరించాలొ, ధర్మం మానవులను ఎలా రక్షిస్తుందో తెలియజేసాడు .  అందుకు అవసరమైన సంఘటనలు మన కాళ్ళ ముందు జరిపించి చూపించాడు .

          ఈ మధ్య కాలం లో బ్రహ్మ కుమారీ సమాజం వారు ఒక చోట ఉపన్యాసం చెపుతూ ఉంటె విన్నాను , అందులో వారు " కృష్ణుడూ , రాముడూ శివుడిని పూజించారు .  దీనిని బట్టి మనకు తెలిసింది ఏమిటి అంటే వారు గొప్పవారే కానీ మన లానే మనుషులు దేవతలు కారు .  ఎందుకంటె వారికి వచ్చిన సమస్యలు తొలగించు కోవటానికి వారికి శక్తి లేక వారు శివుడిని పూజించారు .  కనుక వీరికంటే శివుడు గొప్పవాడు , భగవంతుడు కనుక మనం కూడా శివుడిని పూజించాలి " అని చెప్పారు .  ఇక్కడ మొదటగా ఆలోచించ వలసిన విషయం శివ కేశవులు ఇద్దరూ ఒక్కటే  ఇంకా చెప్పాలంటే త్రిమూర్తులు ముగ్గురూ ఒక్కరే ... అని తెలుసుకోవాలి
            ఇంకా మనకు స్పష్టం గా అర్ధం కావాలంటే శ్రీకృష్ణుని విశ్వరూపము చూడండి.  అందులో ఆయన తలలు అన్నీ వరుసగా ఉంటాయి .వినాయకుడు , నారసింహుడు , శివుడు , హనుమంతుడు , ఇలా అన్ని రూపాల్లో ఆయనే .  అన్నీ ఆయన ఒక్కడే .  అందుకే ఈ ఉపనిషత్తు వాక్యం లో ఇలా అన్నారు "ఏకదాసీథ్  బహుదా వదంతి "  అంటే బ్రహ్మ పదార్ధం ఒకటే దానినే పండితులు బహు రూపాలుగా వర్ణించారు . కనుక భగవంతుడు ఒక్కడే .  అవసరాలను బట్టి వివిధ రూపాలలో అవతారాలుగా మారి లోక రక్షణ చేపడుతుంటాడు .పైగా మానవ రూపం లో విష్ణువు రావటం వల్ల అక్కడ వైకుంటం ఖాళీ అయ్యింది .  అప్పుడు ఎవర్ని ఆరాధించాలి ?  పైగా ఇక్కడ మానవుడిగా ఉన్నాడు కనుక శివుడ్ని పూజించాడు .  ఇక్కడ కృష్ణావతారానికి వస్తే  అది మధుర భక్తి .  ఆయన భక్తులకు భగవత్ గీత ను ఉపదేశించాడు . జ్ఞానం అందించాడు .   వ్యక్తిత్వ వికాసాన్ని బోధించాడు .టీం వర్క్ ఎలా చెయ్యాలో చేసి చూపించాడు . కృష్ణార్జునులుగా స్నేహం ,  బావా బావమరిది అనుబంధం , బలరామ కృష్ణులు గా అన్నదమ్ముల అనుబంధం , ఇలా అందరినీ మురిపించాడు .
 
         ఎక్కడ కృష్ణార్జునులు ఉంటారో అక్కడ విజయం సిద్ధిస్తుంది . అని చెప్తూ ఉంటారు అంటే కృష్ణుడు ఇక్కడ మార్గ నిర్దేసకుడుగా ఉంటె, అర్జునుడు ఆయన చెప్పిన మార్గాన్ని అనుసరించి   విజయం సాధించాడు .


          భగవంతునికి ఆడంబరం గా పూజలు చేయనక్కర్లేదు .  ఆయనే చెప్పాడు "నన్ను మనస్ఫూర్తిగా తలంచి నా పాదాల వద్ద ఒక తులసిదలాన్ని  బక్తి గా సమర్పించినా చాలు అహంకారం విడిచి సదా నన్ను ఆరాధిస్తే చాలు వారి క్షేమం నేను చూస్తాను " అని .  ఈ ఒక్క మాట చాలు  మనం ఆయన భక్తులుగా ఆయన వెంట పరుగుపెత్తతానికి.  హరే రామ హరే రామ రామ రామ హరే హరే   హరే కృష్ణ హరే కృష్ణ  హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే  అని అనుకున్నా చాలు మనకు ఎన్నో లాభాలు చేకూరుతాయి

From KALI TO KRISHNA




In one of the many Tantrik mystic traditions of Bengal, the goddess Kali, often addressed as Tara, is identified with Krishna, locally known as Keshto. Both share the same dark-complexion, Shyam-ranga, and their partners, Shiva in case of Kali, and Radha in case of Krishna, are fair as camphor, Karpura-gaur. The stories that connect these two very distinct traditions – the blood sacrifice demanding Tantrik tradition of Kali and the vegetarian Brahmanical Vaishnava tradition of Krishna – come through in phrases and couplets that make up some of the songs of Baul minstrels and even kitchen tales. The emotion that overrides all others in these stories is one of love, pure love, that transcends the demands and limitations imposed by customs and law.
They say that Shiva never spoke a single word until Shakti came into his life as Parvati. She became not only his wife, but also his student, asking questions, discussing and deliberating with him, till he revealed to the world the mysteries of life. So one day, she asked him, “What is love?” All he did then was look at her and smile. “Tell me, please, what is love?” she asked, turning away to hide her blush. This is what he said.

“When you come to me as Annapoorna, the goddess of food, and feed me and ask for nothing in return, I feel love. For you have taken care of my hunger unconditionally. When you come to me as Kamakhya, the goddess of pleasure, and hold me intimately as no one does do, I feel love. For  you have made me the object of your desire. This is bhog. This is one kind of love. But there is another kind of love.

“When you come to me as Gauri, demure and delicate, and allow me to dominate you, demand things of you, take you for granted, knowing fully well that you cannot be dominated by anyone, I feel love. You made me play dice, laugh at the simple pleasure of games. You made me make you dolls and enjoy entertaining you. When you come to me as Durga, bearing weapons in your hand, and protect me, I feel secure and safe, and cared for, I also feel love. This is shakti. This is power. By granting me power over you, by defending me, protecting me, empowering me, you make me feel loved. This is the second kind of love. But there is yet another kind of love.
“When you dance atop me as Kali, naked with hair unbound, unafraid to be yourself, unafraid to be powerful and vulnerable and unafraid of being judged and mocked, I feel love. You make me open my eyes. I realize that Lalita, the beautiful one, is also Bhairavi, the fearsome one. I realize Mangala, the auspicious one, is also Chandika, the violent one. I see you totally, without judgment, and I realize I am capable of seeing the truth. That you allow me to see you fully, without judgment, tells me that I have become trustworthy. Thus you become the mirror, the Parvati darpan, that reflects who I am. You help me discover myself. You become my Saraswati. You reveal the true meaning of ‘darshan’. In joy, I dance. I become Nataraj.
“Thus there are three kinds of love: love for the body that grants satisfaction, love for the heart that grants security and love for the head that grants wisdom. Animals can give the first and the second, only humans can give the third because they have the third eye hidden inside the head. The first two loves spring from Kama, god of desire, and they sustain life on earth. But the third kind of love springs from Kamantaka, from the destruction of desire, unmotivated by fear of death.”

Shakti smiled and she offered Shiva a boon for this wonderful anwer. And he said, “As Shyama, the dark Goddess, who is Kali and Shakti, you have taught me love. You have danced atop me, forced me to open my eyes, turn from shava (corpse) to Shiva. Grant me the chance to do the same to you.” So the Goddess asked Shiva to descend on earth as the fair Radha whose love and pining would make her descend as the dark-one Krishna.

And it is Radha who taught Krishna the meaning of love as Shakti had once taught Shiva. He was until he met her but a butter-loving cowherd who fought demons and teased milkmaids but the presence of Radha changed it all. Just as Kali transformed Shiva into Nataraj, Radha made Krishna take up the flute and make music. Just as Kali had made Shiva give up his autonomy and understand the value of the not-so-autonomous other, the pining beloved, Radha helped Krishna understand the limitations of society, the struggle between faith in divinity and fidelity for the husband. Radha was demanding, as Kali once had been. Radha sat on Krishna as Kali stood on Shiva. The two thus mingled in merged in roles and thoughts and feelings. But there was one crucial difference.

Kali had made the wandering hermit, Shiva, into a rooted hermit, Shankara. Radha did the very opposite. She remained a flower stuck to the branch of a tree while Krishna became the bee that moves on after enriching himself with the nectar. And so fulfilled by Radha’s love, Krishna left Madhuban for Mathura. Kali had revealed love through shringara, romance, as only Krishna can. Radha revealed love through vairagya, renunciation, as only Shiva can.

సృష్టి లోని వైచిత్ర్యం

అక్షరాలూ అనుబంధం తో బంధం అవుతాయి
సుందరమైన వయ్యారాలతో మాయ చేస్తుంటాయి
అందాలను రంగరించి మూస పోస్తాయి
మనస్సున చొప్పించి శిల్పం చెక్కుతాయి
వయస్సు ను బంధించి పల్లకిలా మోయిస్తాయి .
మనసును దారం చేసి ఆశల కుసుమాలను గుచ్చేస్తాయి
శరీరాన్ని తేలిక చేసి ఆనందపు ఊయలలు ఊపుతాయి
కళ్ళలోని చూపులను పట్టి మత్తు ఎక్కిస్తాయి
ఎందమావుల్లా కావు , ఎడారి ఒయాసిస్సులా ప్రకాసిస్తాయి
కోర్కెల గుర్రాలపై వయస్సును సవారి చేయిస్తాయి 
 ఆశలు ప్రేమకై ఒక రూపం పోస్తాయి
ప్రేమ ఆ రూపం మేడలో ఆశల మాల వేస్తుంది
కనురెప్పల మధ్య ఆ రూపం ఉంది పోతుంది
కనుల కొలనులో ఆ అక్షరాల రూపం కలగా ఎదుగుతుంది
మనస్సు ఆర్ద్రత తో ఇంకో మనస్సును అతుకుతుంది
ప్రేమ గూటిలో రెండు శరీరాలు ఒకేపాట పాడతాయి
ఎనో కొత్త రాగాలు మధురమైన అనుబంధం గా జన్మిస్తాయి
జన్య జనక రాగాలు అనుభూతి గా మిగిలిపోతాయి .

some useful info. reg. potasium

       దేహం లో పొటాషియం లోపిస్తే హైపో కీలమియా అనే తీవ్రమైన పరిస్థితి కి దారి తీయవచ్చు.  దాని లక్షణాలు కండర్రాలు బలహీనత , కండరాలు పట్టేయటం , కడుపు ఉబ్బినట్లు ఉండటం , ఉన్నట్లుంది మల బద్ధకం , తల తిరిగి పడిపోవటం , అలసటగా అనిపించటం , దేహం లోని నీరు త్వర త్వరగా మూత్రం రూపం లో బయటకు వెళ్ళిపోవటం వంటివి కొన్ని .  పొటాషియం లోపం జీవ క్రియలపై ప్రభావం చూపుతుంది .  అయితే ఇది ఒకేసారిగా కూడా దాడి చేస్తుంది .

       ఈ పొటాషియం లోపాన్ని అధిగమించటానికి మనం కొన్ని ఆహార పదార్ధాలను తీసుకోవాలి .  బీన్స్ , పాలకూర , ఉడికించిన బంగాళదుంప , ఆప్రికాట్ , పెరుగు, పుట్టగొడుగులు , అవకాడో , అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది .  బంగాలదుంపలు , అరటి పండ్లు అందరికీ అందుబాటులో ఉంటాయి .  కానీ అధిక బరువు భయం తో ఇవి తీసుకోక పోవటం కూడా ఈ లోపానికి కారణం .  కనుక మనం ఈ పదార్ధాలను కూడా ఉపయోగించాలి మన ఆహారం లో .

      డయాబెటిస్  ఉన్న వారు ఆలుగడ్డ అప్పుడప్పుడూ ఉడికించి తినవచ్చు .  దానిని గ్రీన్ సలాడ్  మొదలైన వాటితో కలిపి తినవచ్చు . 

some health tips about minerals n nuts

1.  ఆహారం లో ఉప్పు ఎక్కువగా తింటే శరీరం నుండి కాల్షియం బయటకు పోతుంది .
2.  జీడిపప్పు, పిస్తా , పొద్దుతిరుగుడు పువ్వు గింజల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది .
3.  వాల్ నట్స్, అవిసె గింజల్లో ఒమేగా 3 ఫాటి యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి .  అవి శరీరం లో మంచి
     కొలెస్ట్రాల్ ను పెంచుతాయి .
4.  వేరుసెనగలు, బాదం పప్పు లలో పొటాషియం కూడా ఉంటుంది .  ఇది మూత్రం లో కాల్షియం
     బయటకు పోకుండా సహాయ పడుతుంది .
5.  50 సం,, వయస్సు దాటినా వారికి రోజుకు 1200mg. కాల్షియం అవసరం .  ఒక కప్పు పాలల్లో
     300mg. కాల్షియం ఉంటుంది .  పాలు, పెరుగు శరీరం లో కాల్షియం పెరుగుదలకు ఉపయోగ
     పడతాయి .
 

Mother's Day

మాతృ దేవో భవా
పిత్రు దేవో భవా
ఆచార్య దేవో భవా
అతిధి దేవో భవా
  ఇలా భారతీయ సంస్కృతి లో అందరికీ సముచిత స్థానం, గౌరవాన్ని ఇస్తూ కన్న తల్లికి మొదటి స్థానాన్ని ఇచ్చింది .  మొదటి సారిగా తల్లికి నమస్కారం చేస్తాము .  అందుకే దేవతలను ఉచ్చరించే టప్పుడు కూడా లక్ష్మీనారాయణులు , పార్వతీపరమేస్వరులు  సరస్వతీ బ్రహ్మలు  అని చెప్పుకుంటాము .  అలానే భారతమాత  అనీ , వేద మాత అనీ అంటాము .  ఇలా అన్ని విషయాలలో స్త్రీ కి పవిత్ర స్థానం ఇవ్వబడింది . యత్ర నార్యస్తు పూజ్యంతే  రమంతే తత్ర దేవతాః   ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో  అక్కడ దేవతలు కొలువై ఉంటారు " అని మనువు ధర్మ శాస్త్రం లో చెప్పాడు .  అటువంటి భారత దేశం లో ఈనాడు విచ్చల విడిగా విదేశీ నాగరికత , సంస్కృతి ప్రవేశించాయి .  o.k. మంచి ఎక్కడి నుండి అయినా తీసుకోవచ్చు .అసలు మంచి అంటే ఏమిటీ ?  పది మందికీ మేలు చేసి , సంతోషం కలిగించేదే మంచి . 
       విదేశీ సంస్కృతి లో కొన్ని దేశాలలో పిల్లలు యుక్త వయస్సులో అంటే 16 సంవత్సరాల  వయస్సులో తల్లిదండ్రులను , కుటుంబాన్ని వదిలి స్వతంత్రంగా ఎదగటానికి , జీవించటానికి ఇంటి నుండి బయటకు వెళ్లి పోతారు . (మన భాషలో రెక్కలు వచ్చి ఎగిరిపోవటం అంటారు )  అదే మన దేశం లో అయితే తల్లితండ్రుల నుండి , కుటుంబం నుండి బయటకు వెళ్ళటం ఉండదు .  పుట్టిన దగ్గరినుండి తల్లితండ్రులతో, అక్క చెల్లెళ్ళతో , అన్నదమ్ములతో అంతా కలిసి ఉంటారు .  ఉద్యోగరీత్యా మరొక వూరికి వెళ్ళవచ్చు.  అంతే గానీ మన బంధాలు మారిపోవు .
      అందువల్లనే మనకు మథర్స్ డే ,ఫాదర్స్ డే  అంటూ ఉండవు .  మనకు వారితో కలిసి ఉండటం రోజూ ఒక పండుగే .  రోజూ అంతా కలిసే ఉన్నప్పుడు ఈ ప్రత్యేక పండుగ అంటూ ఏమి ఉంటుంది ? విదేశాలలో చిన్న వయసు లోనే బాధ్యతలు తెలుసుకొని ఎవరిదారి వారు విడిపోతారు . చాలా మంది వృద్ధాప్యం లో కి వచ్చే సరికి అసలు భార్య , భర్త ఎవరో, ఏమిటో కూడా కొన్ని కుటుంబాలలో తెలియదు .  అసలు వారికి  వివాహ వ్యవస్థ పై కూడా నమ్మకం సన్నగిల్లింది .  అందుకే వారు తమ తల్లితండ్రులను వెతుక్కుంటూ వెళ్లి కృతజ్ఞతలు చెప్పుకోవటం , ప్రత్యేకం గా పండుగ చేసుకోవటం జరుగుతోంది . ofcourse. ఇప్పుడు మన దేశం లో కూడా చాలా విషయాల్లో విదేశీ బాట లో నడుస్తున్నారు యువత .  ముఖ్యం గా ప్రేమలు , పెళ్ళిళ్ళు , విడాకులు , హార్దిక సంబంధాల నుండి ఆర్ధిక సంబంధాల వరకు అలానే నడుస్తున్నాము .
     మన దేశం లో ఇంకా కుటుంబ వ్యవస్థ అన్ని మార్పులు చెందలేదు.  ఇంకా మనం తల్లితండ్రులతో కలిసి ఉండటం జరుగుతోంది .  మనం పండుగలు , ఆచార వ్యవహారాలూ అన్నీ కుటుంబం తో కలిసే జరుపుకుంటున్నాము .  అందువల్లనే ఇంకా మన దేశం లో ఈ ప్రత్యెక దినోత్సవాలూ, సత్కారాలు అవసర పడలేదు .  కానీ ఇప్పుడిప్పుడే మారుతున్న సమాజ పరిస్థితుల వల్ల న్యూక్లియర్ కుటుంబాలు వచ్చేసాయి.  పెళ్ళిళ్ళు కాగానే భార్యాభర్తలు విడిగా వెళ్ళిపోతున్నారు .  ఇంకాస్త ముందుకు వెళ్లి డేటింగ్ అంటూ పెళ్ళికి ముందే కలిసి తిరుగుతున్నారు .  ఇంకొన్ని ఆధునిక పోకడలు ముదిరి తల్లితండ్రులను వ్రుద్ధాస్రమాల్లొ చేర్పిస్తున్నారు .  అందువల్లనే మన దేశం లో కూడా ఈ మథర్స్ డే, ఫాదర్స్ డే జరుపుకోవటం ఆశ్చర్యం కాదు అని కొందరు సంప్రదాయ వాదులు పెదవి విరవటం సహజమే.      మరి ఈ విపరీత ధోరణుల వల్ల యువతీ యువకుల ఆలోచనలు మారుతున్నాయి .  దాని వల్ల మన భావి తరాలకు  మన కుటుంబ వ్యవ్యస్థ , పవిత్ర వివాహ వ్యవస్థ పై నమ్మకం సడలుతోంది .  ఈ వ్యవస్థలకు తూట్లు పడుతున్నాయి . 
  ఇంకా ఈ కొత్త పండుగలు వ్యాపార వర్గాలకు చాలా లాభం తెచ్చి పెడుతున్నాయి .  ఇంకా ప్రకటనలు , రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ , కానుకలు , వాటికి అంతే లేదు .  అందువల్ల వారు కూడా ఈ విషయాలను ప్రోత్సహిస్తున్నారు అని అనిపిస్తోంది .  కానీ ఇది  విపరీత ధోరణులకు దారి తీస్తోంది .
   మన సమాజం లో చాలా మార్పులు వస్తున్నాయి .  మనుషుల్లో సంబంధాలు , బంధాలు చేదిరిపోతున్నాయి .  ఇంట్లో అమ్మమ్మలూ , నాయనమ్మలో లేక పోవటం ఇంకా పిల్లలు ఒంటరితనం లో పెరగటం వల్ల కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి ఆలోచనల్లో . 
    కానీ మనం కూడా బాధ్యత గా ఆలోచించి మన సమాజ హితాన్ని దృష్టిలో ఉంచుకుని నడవాలి .  మన కుటుంబ వ్యవస్థ ను సక్రమంగా కాపాడితే ఈ మథర్స్ డే, ఫాదర్స్ డే ప్రత్యేకం గా జరుపుకోవలసిన అవసరం లేదు .  మనం అందరం ఈ విషయాలను గురించి ఆలోచించ వలసిన అవసరం, అమలు చెయ్య వలసిన సందర్భం ఇదే !

జ్ఞాన సంపద

                     "కరాగ్రే వసతే లక్ష్మీ , కర మధ్యే సరస్వతీ
                      కర మూలే  స్థితే గౌరీ , ప్రభాతే కర దర్శనం "
  అని పురాణాలు  చెబుతున్నాయి .   సరస్వతి , లక్ష్మి , దుర్గ లు త్రి మాతృకలు .  ఈ సమస్త సృష్టి లో మానవులు అంతా స్మరించుకుంటారు .  సరస్వతి మాత జ్ఞానానికి ప్రతీక . లక్ష్మీ మాత సంపదకు, దుర్గామాత  అమితమైన శక్తి లేక బలానికి ఆధారం .  అయితే ఈ ముగ్గురు అమ్మలు కూడా జగదంబ అవతారాలు అని తెలుస్తోంది .

        కొందరు సరస్వతి మాత ఇష్టంగా ,ఇంకా కొందరు లక్ష్మీమాత ఇష్టం గా , మరి కొందరు దుర్గామాత ముఖ్యం అనుకోని ఆరాధించేవారు ఉన్నారు .  అష్టలక్ష్మి రూపం లో లక్ష్మి మాత ను 8 రకాలుగా ఆరాధిస్తూ ఉంటాము .  అలాగే దుర్గామాత ను , సరస్వతీ మాతను కూడా వివిధ రూపాలలో కొలుస్తూ ఉంటాము .  ఎవరు ఎలా ఆరాధించినా ఆ జగదంబ నే కదా !
       పార్వతీ పరమేశ్వరులు , లక్ష్మీ నారాయణులు , సరస్వతీ బ్రహ్మ లు గా చెప్పుకునే ముందు అసలు భగవంతుని తత్వం తెలుసుకోవాలి .  అసలు భగవంతుడు ఒక్కటిగానే ఉండెను .
 
     "ఎకోహ వై నారాయణ్  ఆసీత్
    న బ్రహ్మా నైసానహ  నే మేధ్యా వా పృధివీ
    న నక్షత్రాణి నాగ్నిర్న సూర్యో న చంద్రమాః
    స ఏకాకీ న రమతే ................"   

ఆ తరువాత  సృష్టి ప్రారంభములో రెండుగా విభజించుకొనెను అని ఉపనిషత్తులు ద్వారా తెలుస్తుంది .  అర్ధనారీస్వరులు, సగం శివుడు సగం అమ్మవారు , శ్రీ మహా విష్ణువు వక్షస్థలం పై లక్ష్మి . బ్రహ్మ నాలుకపై సరస్వతి అని తెలుస్తుంది .

    ఈ ఆధునిక యుగం లో కూడా జెనెటిక్స్ వారు చెప్పేది కూడా మనిషి లో స్త్రీ పురుష లక్షణాలు రెండు ఉంటాయి .  ఏ సంబంధమైన  జన్యువులు , హార్మోన్లు ఎక్కువగా ఉంటె ఆ లింగ రూపం లో మనిషి స్వరూప ,స్వభావాలు ఉంటాయి  అని , వారు ఆ రూపం లో వ్యవహరిస్తారు అనీ .  ఇంకో విధం గా చూస్తె ఈ భూ మండలం పై ఉన్న మానవులంతా ఒకే రకమైన శరీర నిర్మాణం , అవయవాల అమరిక విధానం ఉంది .  అంటే మానవత్వ సంబంధ మైన తత్వం ఒకటే . దేశ సంస్కృతి , సంప్రదాయాలు , ఆచారాలు వేరుగా ఉన్నా మానవులు అంతా ఒక్కటే కదా ! అందుకే ఒక చోట వైద్య శాస్త్రం అభ్యసించిన వాడు ప్రపంచం లో ఎక్కడైనా , ఏ దేశం లోనైనా వైద్యుడి గానే పని చేస్తాడు , అధ్యయన పద్ధతుల్లో మాత్రమే తేడాలు ఉంటాయి .       అలానే అమ్మవారి రూపం అయినా, అయ్యవారి రూపం అయినా, ప్రతి మనిషి లో, ప్రతి ప్రాణిలో, ప్రతీ వస్తువు లో గోచరం అవుతూ ఉంటాయి .  దానినే ఆది శంకరులు అద్వైతం గా చెప్పారు .  శ్రీ రామానుజులు  విశిష్టాద్వైతం గా చెప్పి తత్వ త్రయాన్ని చూపించారు .  అవే ప్రకృతి , పరమేశ్వరుడు , జీవుడు  అని మూడు రూపాలు అని చెప్పారు .  దానినే ఆధునికులు ఎలెక్ట్రాన్, ప్రోటాన్, మరియు న్యూట్రాన్ గా చెబుతున్నారు .

        ఉదా ,,కు ఒక మోటారు సైకిల్ తీసుకుందాము .  మోటారు సైకిల్ కనిపెట్టటం విజ్ఞానం అంటే జ్ఞానానికి సంబంధించినది  అంటే సరస్వతీ మాత .  అలానే ఆ మోటారు సైకిల్ తయారు చేయటం ఖర్చు తో కూడుకున్నది , ఆ పెట్టుబడి లక్ష్మి అమ్మవారు.  ఇక ఆ తరువాత ఆ మోటారు లో ఉద్భవించే శక్తీ , పరుగులు తీసే c.c.లు , హార్స్ పవర్ లు అంతా శక్తీ మాత అంటే దుర్గా దేవి .ఇలా మోటారు సైకిల్ కి అన్వయించుకుంటే త్రి మాతఅలానే  ఓ టేప్ రికార్డర్ లో క్యాసెట్ వుంటుంది , దానిలోనుంచి  పాటలు వినిపిస్తు ఉంటాయి.  అ  పాటలు కానీ  అ క్యాసెట్ కానీ అ యంత్రం కానీ తయారు చేసిన  విదానం అంతా సరస్వతిమాత  ఇక  ఆ ఖర్చు ఆ నిర్వహణ అంతా లక్ష్మిమాత  ఇక ఆ యంత్రం  విద్యుత్ కానీ బ్యాటరీ కానీ ఉంటేనే నడుస్తుంది. లేకపోతే పని చేయదు .  అంటే శక్తీ మాత కావాలి .  ఆ దుర్గామాత అంశఆ విద్యుత్, పవర్  అని పిలుస్తాము కదా. ఒక్కొక్క విషయం లో ఒక్కో మాత రూపం ఎక్కువగా భాసిల్లుతూ ఉంటుంది . 

       విద్య వఛ్చిన వాళ్ళ దగ్గర ధనం ఉండదు అనీ, ధనం ఉన్న వాళ్ళ దగ్గర విద్యలు ఉండవు అనీ, లక్ష్మీ సరస్వతులు అత్తా కోడళ్ళు అనీ, వారి ఇద్దరికీ మధ్య వైరం అనీ అంటుండే వారు పూర్వులు .ఇక సరస్వతీ మాత భక్తులు జ్ఞాన సరస్వతీ అని కొలుస్తూ ఉంటారు .  అష్ట సరస్వతులలో ఆమె ఒక రూపం గా కొలుస్తుంటారు భక్తులు.

    ఏది ఏమైనా ధనం కావాలా ? జ్ఞానం కావాలా అంటే ఎక్కువ శాతం మనుష్యులు కోరుకునేది ధనమే అంటారు.  అయితే ధనానికి ఎంత విలువ ఉందొ జ్ఞానానికి అంతే విలువ ఉంది.  లు ఎలా నిక్షిప్తమై ఉంటారో తెలుస్తుంది .  అందుకే వాహనం ఇనుపది అయినా విజయ దశమి నాడు దానికి పూజలు చేస్తుంటాము .
డబ్బు సంపాదించాలంటే జ్ఞానం కావాలి, ఆ డబ్బు నిలుపుకోవాలంటే కూడా జ్ఞానం ఉండాలి.  ఆ జ్ఞానం లేని వాడు తాగుడు - తందనాలకు, విలాసాలకు తగలేసి ఆ తరువాత తన అజ్ఞానానికి చాలా బాధ పడతాడు .  డబ్బు తో చదువు కొనేవాళ్ళు ఉన్నారు.  చదివుతో డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు .  అది ఏ రకమైనా పదిమంది మానవులకు ఉపకారం చేస్తే ఆ చదువూ , ఆ జ్ఞానం పారమార్ధికం అవుతుంది .

        ఇక అసలు జ్ఞానం లోకి వెళితే అసలు ఈ చదువులు , డిగ్రీ లు , ఈ ఉద్యోగాలు  సంగతి కాదు, అసలు వేదాంత జ్ఞానం  మో
క్షానికి  ఉద్దేశించ బడినది అసలైన జ్ఞానం అనీ, బ్రహ్మ సూత్రాలు, ఉపనిషత్తులు , వేదం , పరమాత్మ గురించిన జ్ఞానం అని చెప్పారు మన పూర్వులు .

     అందుకే ఉత్తర భారత దేశం లో భక్తి శాఖ, జ్ఞాన శాఖ  అని రెండు విధములైన భక్తి మార్గాలు బయలుదేరాయి .  ప్రపంచం అంతటా నిండి ఉన్న దేవుడ్ని వివిధ ప్రాణులూ , జీవుల్లో , వివిధ వస్తువుల్లో , ప్రకృతి లోనూ చూడటం , తెలుసుకోవటం జ్ఞానం అని ఒకరు అంటే , మరొకరు ఆ భగవంతుడ్ని గొప్పగా ఊహించి, ఆడీ  పాడీ , భజించి , అలంకరించి, పూజించి, ఆరాధించి  ఆనందించడమే భక్తీ అని ఇంకొక శాఖ వారు చెప్పారు .  కానీ ఈ రెండు శాఖల వారి ధ్యేయం మాత్రం మోక్షం అని తెలుస్తుంది .       మరి జ్ఞానం లో కూడా హేతువాదం అయినా, నాస్తిక వాదం అయినా కూడా  భాగాలే .  అవి కూడా మానవ సమాజానికి అవసరం .  అవి లేక పోతే అజ్ఞానం లోపడి అవస్థలు పడుతూ ప్రతీ మూఢ నమ్మకానికీ  అవుతూ ఉంటారు మానవులు .  కాబట్టి జ్ఞానం అనేది ఒక వెలుగు , ఓ జ్యోతి , అంధకారం నుండి జీవన బాట చూపేది.  అందుకే బుద్ధుడు "భగవంతుని కంటే జ్ఞానం గొప్పది" అని చెప్పాడు. 

     ఇంత ప్రపంచం, ఇన్ని సుఖాలు , ఇన్ని సౌకర్యాలు ఇచ్చి జీవుడు ఎలా నడుచుకోవాలో , ఎలా ఉంటె మోక్షాన్ని పొందుతాడో చెప్పినది అంతా జ్ఞానమే.  ఉదాహరణకు డబ్బు పుష్కలం గా ఉన్న వాళ్లకు సమస్యలు, కష్టాలు  ఉండవు అని కొందరు అనుకోవచ్చు .  కానీ చాలా సంవత్సరాలు అందరి అనుభవాలు , అందరి జీవితాలు పరిశీలిస్తే ఎవరికీ ఉన్నంతలో వారి కష్టాలు, సమస్యలు ఉంటాయి అని అర్ధం అవుతుంది .  ఉన్నవాడికి ఆ డబ్బు దాచుకోవటానికి నానా ప్రయాసలు పడతాడు .  లేని వాడు డబ్బు కూడబెట్టటానికి అవస్థలు పడతాడు .  ఉన్నవాడికి తింటే పడదు .  లేని వాడికి తినాలంటే ఉండదు .  ఇది అంతా కూడా మనిషి ఆలోచనల ఫలితమే .

     ఏది ఏమైనా జ్ఞానం ఎంత గొప్పదీ అంటే మనిషి కి జీవ పరిణామాన్ని తెలియజేసేది అదే కదా .      నేటి ప్రపంచం లో చాలా విప్లవాత్మక మార్పులు వచ్చాయి .  ఉదాహరణకు ఇంతకు ముందు చెరువుల్లో స్నానాలు , బట్టలు ఉతకటం వంటి పనులు చేసేవారు .  కానీ నేడు ఎక్కువ మంది ప్రజలు అలా చేయటం లేదు.  టాయిలెట్స్ వంటివి వాడుతున్నారు . 

      మనకు జ్ఞానం తెలియటం వాళ్ళ మన సంపదను, తెలివి తేటలను సద్వినియోగం చేసుకోవచ్చు సమాజ సేవ ద్వారా .  ప్రస్తుత పరిస్థితుల్లో లక్ష్మి కటాక్షం పెరిగిపోతుంది కానీ జ్ఞానం లేక స్వార్ధం పెరిగి పోతోంది సమాజం లో .  అందుకే మనం, మన ఇల్లూ బాగుంటే చాలు మిగతా వారు ఎలా ఉన్న ఫరవాలేదు అని ఆలోచిస్తున్నారు ఎక్కువ మంది .  కానీ మన సంస్కృతి లో అది చాలా తప్పు .  "సర్వే జనాః  సుఖినో భవంతు " అని మన భారతీయ సంస్కృతి చెబుతుంది .

   జ్ఞానం చెబుతూ సంస్కరణలు చేసిన మహాత్ములూ , సంఘ సంస్కర్తలూ ఇంకా చెప్పాలంటే కొన్ని అవతారాలు కూడా సరస్వతీమాత యొక్క జ్ఞాన రూపం అయితే  వారిని పోషిస్తూ , వారి బాటన నడుస్తూ , వారి జ్ఞాన బోధను ఆచరిస్తూ , ప్రపంచం నుమూలలా ప్రచారం చేస్తూ పాటుపడిన చక్రవర్తులు  లక్ష్మీ రూపం అని అనుకోవచ్చు .

   కనుక మనిషికి ఈ మూడు సంపదలూ కావలసినవే .  డబ్బు లేనివాడు అది సంపాదించటానికి కాస్త పడాలి అని తెలుసుకుని శ్రమ చేసి బ్రతుకుతాడు . డబ్బు ఉన్నవాడు జ్ఞానం తో తెలివిగా ఉపయోగించుకొని పది మందికీ ఉపయోగపడే పనులు చేస్తాడు.  ఆ జ్ఞానం వల్లనే మనిషి యుగ యుగాల నాగరికతలు ప్రపంచం లో జరిగిన , జరుగుతున్న మార్పులు తెలుసుకో గలుగుతున్నాడు . ఈ రకం గా ఇద్దరూ ప్రపంచాన్ని శక్తీ తో నడిపిస్తారు.

    ధన రూపం లో లక్ష్మీమాత ప్రపంచాన్ని పోషిస్తుంది.  జ్ఞాన రూపం లో సరస్వతీ మాత ప్రపంచానికి మార్గ నిర్దేశం చేస్తుంది .  శక్తీ రూపం లో దుర్గామాత ప్రపంచాన్ని నడిపిస్తుంది .  కనుక ఈ ముగ్గురూ వేరువేరు రూపాల్లో కనిపించినా అంతా ఒక్కటే.  అదే అందరికీ ఆ జగన్మాత .
 
 

few health tips

1.         ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ అరకప్పు  టొమాట జ్యూస్ అరకప్పు కలిపి అందులో కొద్దిగా తేనే కల్పిత్రాగితే వ్యాధి నిరోధక శక్తీ పెరుగుతుంది .

 2.      మెంతులు  దొరగ  వేయించి  మిక్సి  పట్టి  అరస్పూన్ పొడి కొద్దిగా నీళ్ళ లో కల్పి పరగడుపున లేక   అన్నం  తినే ముందు కానీ అది త్రాగితే  కొలెస్ట్రాల్ , ట్రై గ్లిసరైడ్స్ తగ్గిపోతాయి .


3.     ఈ మెంతి  పొడి షుగర్ వ్యాధికి కూడా మంచిది .


4.     చేమదుంప  ధైరాయిడ్  గ్రంధి పని తీరును మెరుగుపరుస్తుంది .  షుగర్ వ్యాధి ఉన్నవారు  వేపుడు కాకుండా కూరలాగా చేసుకుని తినవచ్చు.  ఇది ఎముకలకు బలాన్నిస్తుంది .


5.     జీలకర్ర దోరగా వేయించి  పొడి చేసి , అందులో ఉప్పు కలిపి ప్రతిరోజు  అన్నం లో ఒక చెంచా పొడిని కలిపి తింటూ ఉంటె అజీర్ణం , కొలెస్ట్రాల్ , అసిడిటీ, ఆకలి వేయక పోవటం వంటి సమస్యలు తగ్గుతాయి .

short story - final part

     సభ అంతా ప్రశాంతంగా ఉంది .  అందరూ రత్నాచార్యుడు  ఏమి చెబుతాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .  అప్పుడు వైద్యుడు ఆ పత్రాన్ని పరిశీలించి " మహారాజా! ఈ లేఖ లో యు. రా . అనగా  యువరాజు  సి . అనగా శిరస్సు ను ఖ . అనగా ఖండించెను .  యువరాజు శిరస్సు ను ఎవరో నరికి చంపారు ప్రభు !"అని చెప్పాడు వైద్యుడు .  ఆ మాటలు విన్న మహారాజు నిర్ఘాంత పోయాడు .  "ఫణీంద్ర ! నీకు అంత తెలుసు కదా నిజం చెప్పు" అంటూ రాజు గర్జించాడు.  అప్పటికే భయం తో వొనుకుతున్న ఫణీంద్ర నాకు ఏమీ తెలియదు ప్రభూ అంటూ బుకాయించాడు.
    "చూడండి రాజా ! ఈ ఫణీంద్ర బాగా చిన్న వాడు .  ఈర్ష్యతో , ఆవేశం తో యువరాజు ను డొక్కలో పొడిచి చంపాడు .  నీళ్ళలో పడవేసాడు .  ఆ దృశ్యాన్ని నేను చూసాను ." అంటూ చెప్పుకుపోతున్నాడు వైద్యుడు .      "ఇది నేను నమ్మను .  ఈ పని నేను చేసినట్లు సాక్ష్యం ఏమిటి ?" అని అడిగాడు ఫణీంద్ర .  సాక్ష్యం కావాలా ?  అయితే చూపిస్తాను . నేను పండితుడిని కాను .  వైద్యుడిని .  మారు వేషం లో వచ్చాను .  అంటూ తన వేషం తీసి చూపించాడు .
     "ఆచార్యా !  మీరు దేవుడిలా వచ్చారు .  మా యువరాజు ఏమి అయ్యాడు ?  చెప్పండి  అంటూ వైద్యుడు రాత్నాచార్యుడి  చేతులు పట్టుకున్నాడు  మహారాజు .  "మహారాజ! మీరు చాలా మంచివారు , ధర్మ ప్రభువులు .  కనుక దైవం మీతోనే ఉన్నాడు . అందుకే మీ కుమారుని కాపాడాడు నా ద్వారా .  యువరాజుని భద్రం గా మీ దగ్గరకు చేర్చాను " అని అంటూ యువరాజు వేషం తీసేసి చూపించాడు రత్నాచార్యుడు.
   ఒక్క సారిగా కనుల ముందు కనిపించిన పుత్రుని చూసి రాజు ఆనందంతో పొంగిపోయాడు .  అతనిని కౌగలించుకొని నుదురు ముద్దాడాడు .  ఈ విషయం అంతా తెలిసిన మహారాణి  సభకు వచ్చిరాజేంద్రను  ఆనంద భాష్పాలతో అక్కున చేర్చుకుంది .    రాజకుమరున్ని జీవితునిగా చూసిన ఫణీంద్ర నివ్వెరపోయాడు .  పారిపోవాలని ప్రయత్నించాడు .  అది గమనించిన ఫణీంద్ర తండ్రిగారైన మహామంత్రి  అతడిని బంధించమని రాజ భటులను ఆజ్ఞాపించాడు .  ఆయన ఆజ్ఞ మేరకు ఫణీంద్ర ను గొలుసులతో బంధించారు .
    మహారాజు మహా మంత్రి తో " మీరు మా కుటుంబానికి తరతరాలుగా సేవలు అందిస్తున్నారు .  ఈ క్లిష్ట సమయం లో మా కర్తవ్యమ్ ఏమిటి అని అడిగాడు .  దానికి మహామంత్రి " మహారాజా ! చట్టం, న్యాయం అందరికీ సమానమే .  ఇక్కడ కూడా మనం చట్టం లో ఈ నేరానికి నిర్ణయించిన శిక్ష నే అమలు పరచాలి " అని అన్నాడు .మా రాజ్య స్తాపన అప్పట్లో మీరే చేసారు. మా పెద్దల తగ్గరనుంచి మీరే గురువులు  సలహాదారులు ఇప్పుడు ఇంత బాధాకరమైన  సందర్బం  వస్తుంది  అనుకోలేదు అంటూ రాజుగారు కాస్తంత బాధతో మాట్లాడుతున్నారు .  "రాజా ! తప్పు ఎవరు చేసినా తప్పే .  న్యాయం అనేది నిష్పక్షపాతం గా ఉండాలి .  ఫణీంద్ర చేసింది రాజ ద్రోహం .  ఇతనికి ఉరి శిక్ష ఖరారు చేయటమే తగిన నిర్ణయం " అంటూ తీర్పు వెలువరించాడు .  మంత్రి పరిషత్తు ఆమోదించింది .  కానీ రాజుగారు మాత్రం తన నిర్ణయాన్ని వెలువరించలేదు .
   ఆ రాత్రి అంతా ఆలోచించాడు రాజుగారు .  తెల్లవారింది .  ఫణీంద్ర ను ఇనుప గొలుసులతో బంధించి సభ లో రాజుగారి ముందు ప్రవేశ పెట్టారు .  అందరూ రాజు గారు ఏమి నిర్ణయం వేలువరిస్తాడా అని ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు .  అప్పుడు రాజుగారు " కొద్ది రోజులు మేము మా కుమారుడు లేక పుత్ర శోకం తో బాధ పడ్డాము .  మళ్ళీ ఇలా మా గురువుగారు , మహా మంత్రి ఆ బాధ అనుభవించడం మాకు ఇష్టం లేదు .  కనుక మేము ఫణీంద్ర కు యావజ్జీవ కారాగార శిక్ష విదిస్తున్నాము " అని ప్రకటించాడు .     రాజుగారి తీర్పు విన్న సభికులు అందరూ రాజు గారిని అభినందించారు .  మహా మంత్రి  "మహారాజా ! మేము ఫణీంద్ర చేసిన పనులకు సిగ్గు తో తల ఎత్తుకోలేక పోతున్నాము .  మేము అడవులకు వెళ్లి తపస్సు చేసుకుంటూ శేషజీవితం గడుపుతాము " అని అన్నాడు .  రాజుగారు దానికి ససేమిరా ఒప్పుకోలేదు. కానీ మంత్రి గారు ఒప్పించారు .  అప్పుడు రాజు , మంత్రి వర్యా ! మా యువరాజు పట్టాభిషేకం వరకూ అయినా ఉండండి  అని అడిగాడు .  అందుకు అంగీకరించాడు  మహా మంత్రి.
     రాజుగారు వైద్యుడు రత్నాచార్యుడిని అభినందించాడు .  తమ యువరాజును కాపాడి తమకూ , రాజ్యానికి మేలు చేసినందుకు ఏమినా కోరిక కోరుకోమన్నాడు .  కానీ అందుకు వైద్యుడు అంగీకరించలేదు .  మహారాజా ! మేము మా విధిని నిర్వర్తిన్చాము .  మాకు ఇంకా ఏమి కోరికలు లేవు అని అన్నాడు .  అప్పుడు రాజుగారు ఆయనని ఘనం గా సన్మానించాడు . యువరాజు పట్టాభిషేకానికి వైద్యుని కుటుంబ సమేతం గా రమ్మని ఆహ్వానించాడు మహారాజు . 
      యువరాజు పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించి ఏర్పాట్లు చేసారు . దానికి రెండు రోజుల ముందు వైద్యుడు తన భార్య ను , కుమార్తె ను తీసుకుని రాజ మహలుకు వచ్చాడు .  వైద్యుని యొక్క కుమార్తె గిరిజ అందానికి , ఆమె స్వభావానికి ముగ్దురాలైంది మహారాణి .  యువరాజు రాజేంద్ర కూడా గిరిజను వివాహం చేసుకోవాలని అనుకుని తన తల్లిదండ్రులకు తెలియపరిచాడు .  వారు అందుకు అంగీకరించి రత్నాచార్యుడు దంపతులకు ఈ విషయం తెలుపగా వారు ఆశ్చర్య చకితులై ఆనందం తో అంగీకరించారు .  నిర్ణయించిన శుభ ముహూర్తం లో యువరాజుకి వివాహం పట్టాభిషేకం జరిగాయి .  దానితో రాజ పరివారం , ప్రజలు కూడా ఆనందించారు . 

    .

story part - 5

"మాది కోసల రాజ్యం .  మా తండ్రి గారు ఇంద్ర నీల చక్రవర్తి .  మా తల్లి గారు రాణి లక్ష్మి కల్యాణి ." అని చెప్పాడు రాజేంద్ర వినయంగా .  ఆ తరువాత వైద్యుని కుటుంబానికి  ఫణీంద్ర చేసిన మొత్తం ద్రోహం అంతా వివరం గా చెప్పాడు .  ఫణీంద్ర కుతంత్రం విన్న వారు ముగ్గురూ ఆశ్చర్య చకితులయ్యారు .  కొద్ది రోజులు రత్నాచార్యుని వైద్యం తో పూర్తిగా కోలుకున్నాడు రాజేంద్ర .  ఆ తరువాత వారు ఇద్దరు కలిసి ఒక పధకం ఆలోచించారు ఫణీంద్ర మోసాన్ని బయట పెట్టటానికి .  ఇద్దరూ మారు వేషాలలో కోసల రాజ్యానికి వచ్చారు . రాజ్య ప్రధాన ద్వారం వద్ద వీరిని రాజ్య రక్షక భటులు అడ్డుకున్నారు .   "అయ్యా ! మేము ఇద్దరం గురు శిష్యులం మా గురువుగారు మహా పండితులు .  మహారాజు వద్ద మా ప్రతిభ ను ప్రదర్శించి ఏమైనా బహుమానం పొందాలని వచ్చ్చాము .  కాస్తంత అనుజ్ఞ ఇవ్వండి లోనికి వెళ్ళటానికి " అని అన్నాడు మారు వేషం లో ఉన్న యువరాజు రాజేంద్ర .
          కొద్దిసేపు వేచి ఉన్న తరువాత వారికి లోనికి వెళ్ళటానికి అనుమతి లభించింది .  ఇద్దరూ లోనికి ప్రవేశించారు.  సభ లో రాజుగారు సింహాసనం మీద ఆసీనులై ఉన్నారు .  యువరాజు రాజేంద్ర కి తన తండ్రిని చూడగానే భరించలేని ఆనందం , బాధ ఒకేసారి కలిగాయి .  అతని కన్నుల్లో నీరు చూసి రత్నాచార్యుడు ఆటను ఎక్కడ బయట పడిపోతాడో అని ఆందోళన చెంది, అతని చేతిని గట్టిగా నొక్కి కొద్దిసేపు తనని తానూ సంభాలించుకోమని చెవిలో చెప్పాడు .  "మహారాజా ! వీరు ఇరువురు మహా పండితులట.   వీరి పేరు రత్నాచార్యులు.  ఆ ప్రక్కన ఉన్న వ్యక్తీ ఈయన శిష్యుడు"  అని చెప్పాడు  వారిని తీసుకు వచ్చిన భటుడు .
     అప్పుడు మహారాజు వారిరువురికి స్వాగత సత్కారాలు చేసాడు .  పిమ్మట "స్వామీ ! ఎంత మంది పండితులు వచ్చినా ఈ ప్రత్యెక వాక్యానికి అర్ధం చెప్పలేక పోతున్నారు .  తమరు  మహా పండితులు అని విన్నాము .  దయ చేసి ఈ ప్రహేళిక ను పూరించండి .  ఇది మా యువరాజు మాకు పంపిన చివరి సందేశం .   యు .రా .సి.ఖ . అంటే అర్ధం తెలిపి మాకు, మా చక్రవర్తి కి మేలు చెయ్యండి" అని వినయం గా అడిగాడు మహా మంత్రి .దానికి రత్నాచార్యుడు " నేను నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను .  కానీ నాకు అసలు ఏమి జరిగిందో వివరం గా చెప్పండి " అని అడిగాడు .  అప్పుడు మహామంత్రి  ఫణీంద్ర చెప్పిన అన్ని విషయాలు పూర్తిగా చెప్పి ఆ పత్రాన్ని ఆయన చేతిలో పెట్టాడు .
       అప్పుడు ఈ గురు శిష్యులు ఇద్దరికీ ఫణీంద్ర చేసిన మొత్తం కుట్ర పూర్తిగా అవగతమైంది .  మహారాజు తన పుత్రుని తలచుకొని బాధ పడసాగాడు .  ఈ పండితుడు ఈ ప్రసన కు ఏమి సమాధానం చెప్తాడా అని ఎదురు చూస్తున్నారు సభికులు అందరూ .  అప్పుడు రత్నాచార్యుడు  ఆ పత్రాన్ని చూసి ఇందులో చెప్పటానికి పెద్ద విషయం ఏముంది మహారాజ ! ఇది చాలా చిన్న  విషయం అని చాలా తేలికగా అన్నాడు .  అప్పుడు మహారాజు "  ఆచార్యా ! ఇప్పటి వరకూ ఎవరూ కూడా ఈ ప్రహేళికను వివరించలేక పోయారు .  మీరేమో చాలా తేలికగా చెప్తాను అంటున్నారు . ఇంతకీ  విషయాన్ని వివరించండి". అంటూ సంతోషం గా లేచి దగ్గరకు వస్తూ అన్నాడు .
       అప్పుడు  నేను చెప్పింది గుర్తు ఉందిగా అంటూ వైద్యుని చెవిలో గుసగుస లాడాడు రాజేంద్ర .  ఓ .. ఇది నువ్వు కత్తిపోటుకు గురి అయినప్పుడు రాసిన్దేగా అంటూ అడిగాడు వైద్యుడు .  అవునని తల ఊపాడు రాజేంద్ర ."మహారాజా ! మీకు ఈ పత్రాన్ని ఇచ్చిన వ్యక్తిని ఇక్కడకు పిలిపించండి . మొత్తం పరిశీలించి చెబుతాము" అని అన్నాడు రత్నాచార్యుడు .  ఆచార్యుడు ఇంత బాగా నటిస్తున్నందుకు ఆనంద పడ్డాడు రాజేంద్ర . కానీ స్వంత రాజ్యం లో తండ్రి ముందు తను కూడా నాటకం ఆడుతున్నందుకు బాధ పడ్డాడు .  కానీ పరిస్థితులు అనుకూలం గా లేనప్పుడు రాజనీతి లో ఇటువంటివి సహజం అని తనను తానూ సమాధాన పరచుకున్నాడు .  పైగా ఇంత కుట్ర చేసిన ఆ యువ మంత్రి  ఎలా ఉన్నదో తెలియాలి కదా. అని అనుకుంటూ ఉన్నాడు .  రాజుగారు సరేనంటూ ఫణీంద్ర ని తీసుకురమ్మని భటులను పంపారు .
       ఈ విషయం అంతా తెలుసుకున్న ఫణీంద్ర తన మనసులో " ఇంత వరకూ ఎవ్వరూ కూడా ఇలా చెయ్యలేదు .  నన్ను పిలవటం గానీ అనుమానించటం గానీ జరుగ లేదు .  వీరికి నా నిజస్వరూపం ఏమైనా తెలిసి పోయిందా ఏమిటి " అని అనుకున్నాడు .  కొంచం భయం భయం గా సభ లోనికి వచ్చాడు .

short story - part - 4

అలా ప్రయత్నాలు చేసి , చేసి విసిగి పోయిన రత్నాచార్యుడు  ఇంటికి చేరుకుంటున్నాడు .  ఇంతలో ఇంటిలోనుండి ఏవో అరుపులు పెద్దగా వినిపిస్తున్నాయి .  దానితో ఆందోళన చెంది కంగారుగా పరుగున వచ్చి లోనికి చూసాడు .  అతని భార్యా , కుమార్తె  లోపల గదిలో తలుపులు వేసుకుని ఉన్నారు . రాజకుమారుడు రాజేంద్ర ఎదురుగా ఒక పెద్ద పులి నిలబడి ఉంది .  ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ , వెర్రి చూపులు చూసే రాజేంద్ర పులిని చూసిన హతాత్పరినామం తో అటూ ఇటూ ఆయుధం కోసం వెతకసాగాడు .   రత్నాచార్యుడు రాజేంద్ర ఏమి చేస్తాడా అని చూస్తున్నాడు .  కానీ అతనికి కూడా భయం గానే ఉంది .  ఎందుకంటే రాజేంద్ర కు ఏమి విద్యలు వచ్చో  పూర్తిగా తెలియదు .  అందుకే తన దగ్గర ఉన్న బాకు తీసుకుని సిద్ధం గా ఉన్నాడు ఆ పులిపై విసరటానికి .  కానీ ఇంతలో రాజేంద్ర అటూ ఇటూ చూసి అక్కడ  అన్నం ఉడుకుతున్న పొయ్యిని చూసాడు .  వెంటనే వేగం గా ఆ పొయ్యి లోని మండుతున్న కట్టెను తీసుకుని పులికి చూపించాడు .  దానితో దాని ముందుకు వచ్చి ఆ మంటను చూపి దడిపించసాగాడు .  ఆ మంటను చూసి భయపడి పులి అడవి లోకి పారిపోయింది .  ఆ విషయం చూసి వైద్యుడు చాలా ఆనందించాడు .  ఇంతలో ఈ కదలికల కారణంగా అలిసిన రాజేంద్ర కళ్ళు తిరిగి కింద పడ్డాడు .  వెంటనే వైద్యుడు , ఇంట్లో ఉన్న అతని భార్య , కూతురు గబగబా అతని దగ్గరకు వచ్చారు .  వైద్యుడు అతని ముఖం పై నీరు చల్లి అతనికి స్పృహ రప్పించాడు .  స్పృహ వచ్చిన రాజేంద్ర వైద్యుడిని చూసి " ఆచార్యా !  మీరు ఎవరు ?  నేను ఇక్కడ ఎందుకు వున్నాను ?  నన్ను పొడిచిన మంత్రి  కుమారుడు ఏమయ్యాడు " అని ప్రశ్నించాడు రాజేంద్ర మాటలు విన్న వైద్యుడు "కుమారా ! నువ్వు కోలుకున్నవా ?  నీ ఆరోగ్యం గురించి నేను చాలా ఆందోళన పడ్డాను .  నువ్వు ఆ భగవంతుని దయ తో మామూలు స్థితి కి చేరుకున్నావు . " అంటూ ఆనంద భాష్పాలు తో రాజేంద్రను హత్తుకున్నాడు .  అతనికి జరిగిన విషయం అంతా వివరంగా చెప్పాడు రత్నాచార్యుడు.  " ఇన్నాళ్ళూ మా కుటుంబం అంతా నీ సేవ లోనే ఉన్నాము .  ఈమె నా భార్య సౌదామిని , ఇదిగో ఈమె నా కుమార్తె గిరిజా రత్న తిలక . అని పరిచయం చేసాడు  వైద్యుడు .  యువరాజు కు తెలివి వచ్చి అంతా మాములుగా మాట్లాడుతున్నాడు అని ఆనంద పడింది గిరిజ .  అతని వంక సూటిగా చూడలేక సిగ్గు తో ముడుచుకు పోయింది మొగ్గలా .  ఆమెను చూసి రాజేంద్ర చాలా ఆశ్చర్య పోయాడు ఆమె అందానికి ముగ్ధుడై పోయాడు .  ఇంత అందాల రాసిని నేను ఎక్కడా చూడలేదు .  అని ఏవో ఊహల్లో మునిగిపోయాడు రాజేంద్ర . 
   ఇంతలో "  కుమారా ! నీకు గతం గుర్తు వచ్చింది కదా !  నీ తండ్రి గారు ఎవరూ ?  మీ రాజ్యం ఎక్కడా ?  మీ తండ్రి గారి నామధేయం ఏమిటి ?  అసలు ఏమి జరిగిందో వివరం గా చెప్పగలవా ?" అని ప్రశ్నించాడు వైద్యుడు .

story part - 3

     వైద్యుడు రత్నాచార్యుడు  రాజేంద్ర ను ఎలాగోలా లేపి కూర్చుండ పెట్టాడు . అతనిని అతని గురించిన ప్రశ్నలు అడగటం మొదలు పెట్టాడు .  కానీ రాజేంద్ర తలకు తగిలిన గాయం వల గతం మర్చిపోయాడు .  ఏమి అడిగినా చెప్పలేక పోతున్నాడు .  మాటిమాటికీ తడబడుతూ వెర్రి చూపులు చూస్తూ ఏమి గుర్తు లేక తడబడుతున్నాడు . అతని స్థితిని అర్ధం చేసుకున్న వైద్యుడు అతని గాయాలకు లేపనం పూసి ,ఏదో కషాయం అతనికి పట్టించి  అతనికి సపర్యలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు .       కాలం అలా గడుస్తోంది .  ఇక్కడ కోసల రాజ్యం లో  రాజు గారు ఎందఱో పండితులను పిలిపించి యువరాజు పంపిన ఆ "యు . రా .సి .ఖ ." అన్న దాని అర్ధం తెలుసుకోవటానికి ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు . ఎంత ప్రయత్నం చేసిన దాని అర్ధం తెలియటం లేదు .  రాజు గారు తన తరువాత రాజ్యానికి వారసులు లేరని దిగులు పడుతున్నాడు . వయో భారం తో బాధ్యతలు నిర్వహించటం కష్టం గా ఉంది రాజు గారికి .  మహా మంత్రి  కూడా వృద్ధుడు  అవటం తో ఫణీంద్ర మహా మంత్రి అయ్యాడు .  ఇంకా రాజ కార్యాలు అన్నీ ఫణీంద్ర చక్క బెట్టవలసి వస్తోంది .  కానీ ఫణీంద్ర కి ఏమాత్రం అనుభవం లేదు పైగా దుడుకు స్వభావం .  దానివల్ల కొందరు అధికారులు రాజుగారితో మోర పెట్టుకున్నారు .కానీ ఏమి చేయలేక రాజుగారు  "చేతికి అంది వఛ్చిన యువరాజుని దూరం చేసావు .  అతనే ఉంది ఉంటె నాకు, ప్రజలకు ఈ బాధలు తప్పేవి .  ఇంకా మనస్సాంతి ఉండేది అని , ఇలా ఎందుకు చేసావు భగవంతు  ఇక్కడ అడవిలో వైద్యుడు రత్నాచార్యుడు రాజేంద్ర ను మామూలు మనిషిని చెయ్యటానికి పరిపరివిధాలుగా ప్రయత్నిస్తున్నాడు .  అతనికి రాజేంద్ర యువరాజు అని తెలుసు .  కానీ ఎ రాజ్యానికి వారసుడో తెలియదు .  ఆటను ఎక్కడివాడో తెలుసుకోవటానికి అడవి అంతా గాలిస్తున్నాడు .  నదిలో అతడు పడిన చోటులో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని వెతికాడు కానీ ఏమి దొరకలేదు .  యువరాజుకి గతం గుర్తుకు రావటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు .  సంజీవని మూలిక దొరికితే బాగుండు అని అనుకుంటున్నాడు .  తన చిన్న తనం లో ఒక కద ప్రచారం లో ఉండేది .  కీకారణ్యం లో కాకులు పెట్టిన గూడు చూడాలి .  అందులో పాము పడుకుని ఉన్నదా అని చూడాలి ఒక వేల అలా కనిపిస్తే ధైర్యంగా ఆ గూడు తీసుకుని పారే నీళ్ళలో వెయ్యాలి అప్పుడు ఆ పాము కాస్తా పుల్లలా మారుతుందట .  అదే సంజీవని అని చెప్పేవారు .  కానీ వైద్య శాస్త్రం లో అటువంటివి లేవు .  అందువల్ల అది అంత బోగస్ అని అనుకున్నాడు . డా అంటూ దేవుని దగ్గర మోర పెట్టుకుంటున్నాడు రాజుగారు .

story part - 2

            ఒక్క సారిగా ప్రసాంతతను భగ్నం చేస్తూ పెద్ద శబ్దం నీళ్ళలో .  దానికి అదిరిపోయిన పక్షులు చెట్లగుబుర్ల లోనుండి రెక్కలు టపటపా శబ్దం చేస్తూ గాల్లోకి ఎగిరిపోయాయి .  అక్కడే మూలికలు ఏరుకుంటున్న రత్నాచార్యుడు ఆ శబ్దానికి ఉలిక్కిపడి పక్కకి చూసాడు .  గుర్రపు డెక్కల అలికిడి విని చెట్ల గుబుర్ల చాటున దాక్కుని ఎవరికీ కనపడకుండా అంతా గమనించ సాగాడు .
        ఇతనిని గమనించని ఫణీంద్ర , రాజేంద్ర ను నీళ్ళలోకి పడవేసి వెంటనే గుర్రం పై వేగంగా వెళ్ళిపోయాడు .  ఆటను వెళ్ళిన తరువాత కొంత సేపు వేచి చూసి అప్పుడు చెట్ల గుబురులో నుండి బయటకు వచ్చి నది వైపుకు వెళ్ళాడు వైద్యుడు .  అక్కడ నీళ్ళలో ఉన్న రాజేంద్ర ను చూసాడు .  నీళ్ళు తగలటం తో స్పృహ లోకి వఛ్చిన రాజేంద్ర కొద్దిగా కదులుతూ మూలుగుతున్నాడు .      పరీక్షగా చూసిన వైద్యుడు రత్నాచార్యుడు ఫరవాలేదు , ఇతనిని బ్రతికించా వచ్చు అని అనుకున్నాడు .  అటూ  ఇటూ పరికించి చూసి ఒక తాడు తెఛ్చి నీళ్ళలో కనిపిస్తున్న రాజేంద్ర కాలికి ఉచ్చు వేసి తన గుర్రానికి కట్టి మెల్లిగా నీటినుండి బయటకు తీసాడు .  ఆ తర్వాత అతన్ని తన నివాసానికి తీసుకు వచ్చాడు .  అతని గాయానికి మందు పూసి పక్క పై పడుకోబెట్టాడు . 
      పక్షుల కిల కిలా రావాలు విని కళ్ళు తెరిచి చూసాడు వైద్యుడు .  అప్పుడే తెలతెల వారుతోంది .  సూర్య కిరణాలు ముఖం పై పడుతున్నాయి .  రాత్రి అంత కాపలా గా ఉండటంవల్ల కొంచం అలిసిపోయి నిద్రల్లోకి ఎప్పుడు జారుకున్నదో తెలియలేదు .  నిద్ర లేవగానే వెంటనే ఒక్కసారి అంత గుర్తు వచ్చింది .  వెంటనే ఆత్రుతగా రాజేంద్ర వైపు చూసాడు .ఆటను ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు . సూర్య కిరణాలు ముఖం పై పడటం తో మెల్లమెల్లగా కళ్ళు తెరిచి కాళ్ళు చేతులు కదిలిస్తూ లేవటానికి ప్రయత్నిస్తున్నాడు రాజేంద్ర .  అతనిలో కదలికలు చూసి రత్నాచార్యుడు ఆతను బ్రతుకుతాడని ఆనంద పడ్డాడు .        ఇక గుర్రం పై చాలా దూరం ప్రయాణం చేసి మంత్రి  కుమారుడు కోసల రాజ్యం చేరుకున్నాడు .  మంత్రిగారి బంధువులు , రాజకుమారుని స్నేహితులు , రాజ భటులు అందరు ఎదురేగి స్వాగతం పలికారు  రాకుమారుడు రాజేంద్ర గురించి అందరూ ఆరా తీయసాగారు .  ఫణీంద్ర ముందుగా తన తండ్రి గారైన మంత్రి వద్దకు వెళ్లి ఆయన కౌగిలించుకొని ఏడవటం మొదలు పెట్టాడు .  దానితో కంగారు పడ్డ తల్లిదండ్రులు ఇద్దరూ ఏమి జరిగిందని అడగటం మొదలు పెట్టారు .  రాజకుమారుడు తిరిగి రాలేదన్న వార్త తెలిసిన రాజ దంపతులు పరుగు పరుగున వచ్చి ఆందోళన పద సాగారు .  అసలు ఏమి జరిగిందో చెప్పు కుమారా !  నేను సైన్యాన్ని పంపుతాను అని లాలిస్తూ అడగ సాగాడు మంత్రి .  రాజుగారు కూడా ఫణీంద్ర ను దగ్గరకు తీసుకుని " నాయనా ! నాకు అయినా చెప్పు .  అసలు ఏమి జరిగింది ?" అని బ్రతిమలాడ సాగాడు .
     అప్పుడు ఫణీంద్ర  "రాజా ! ఏమి చెప్పమంటారు ?  మేమిద్దరం చాలా దూరం ప్రయాణం చేయటంవల్ల  అలిసిపోయి అడవిలో ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుంటే మాకు కొంచం నిద్ర పట్టింది .  నేను తిరిగి మెలకువ వచ్చి చూసే సరికి విషపు పురుగు కాటుకు గురి అయ్యి బాధ పడుతున్నాడు రాజేంద్ర .  నేను ఏంటో ప్రయత్నించి చూసాను .  కాని నా మిత్రుడిని దక్కించుకోలేక పోయాను .  ఇక చేసేది ఏమి లేక అక్కడే నదిలో శవాన్ని పడవేసి ఏడ్చుకుంటూ తిరిగి వచ్చాను " అని చెప్పాడు ఫణీంద్ర .తమ కుమారుని మరణ వార్త విన్న రాజ దంపతులు దుక్ఖితులై రోదించ సాగారు .  అందరు వారిని పరామర్శించ సాగారు .  తను చెప్పిన విషయాన్ని అందరు నమ్మడం తో ఫణీంద్ర సంతోషించాడు .
    ఇక్కడ అడవిలో వైద్యుని ఇంట్లో ఉన్న రాజేంద్ర ను బ్రతికించటానికి రత్నాచార్యుడు  అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు .  సపర్యలు చేస్తూ రాత్రింబగళ్ళు  కంటికి రెప్పలా కాపాడుతున్నాడు .  మెల్ల మెల్ల గా రాజేంద్ర మత్తు లో నుండి బయటకు వచ్చాడు .  కాని తలకు తగిలిన గాయంకారణం గా ఎక్కువ గా ఏమి మాట్లాడ లేక పోతున్నాడు .  ఫణీంద్ర అతడిని నదిలో పడవేసినప్పుడు ఒక రాయి గట్టిగా తగలటం వాళ్ళ తలకు గాయమైంది రాజేంద్రకు .  ఈ కారణం గా పదేపదే నిద్రలోకి జారుకుంటున్నాడు రాజేంద్ర .  అతడిని మామూలు స్థితి లోనికి తీసుకు రావటానికి రత్నాచార్యుడు తన వైద్య విద్యా పరిజ్ఞానాన్ని అంత ఉపయోగిస్తున్నాడు .
      ఇక్కడ కోసల రాజ్యం లో ఫణీంద్ర ను అన్ని వివరాలు గ్రుచ్చి గ్రుచ్చి అడుగుతున్నారు . అతను కూడా ఎవరికీ అనుమానం రాకుండా బ్రహ్మాండం గా నటిస్తూ రాజేంద్ర నుతలుస్తూ  ఏడుస్తున్నాడు .  అందువల్ల అక్కడి వారు ఎవరూ కూడా అసలైన  విషపు పురుగు వీదేనని గుర్తించ లేక పోయారు .  ఇంతలో ఫణీంద్ర  రాజుగారితో "రాజా ! నా మిత్రుడు నాకు ఒక పత్రము పై ఏదో రాసి ఇచ్చాడు .  అది మీకు అందించమని చెప్పాడు  అంటూ " ఆ పత్రాన్ని రాజుకు అందించాడు .    ఆ పత్రాన్ని చదివితే అందులో  " యు .రా .సి .ఖ "  అని మాత్రం రాసి ఉంది .  ఎంత ప్రయత్నం చేసినా అక్కడ ఉన్న సభికులు ఎవ్వరికీ దాని అర్ధం బోధ పడలేదు .  రాజు గారు దాని అర్ధం తెలుసుకోమని మంత్రి పరిషత్తు కు అప్పచెప్పారు . త్వరగా దీని రహస్యాన్ని చేదించండి అని ఆజ్ఞ జారి చేసాడు .

A Short Story - మంత్రం చాటు కుతంత్రం Part - 1 ( by Marimganti. Ranganayakamma)

       అది కోసల రాజ్యం .  ఆ రాజ్యం పొలిమేరల్లో  అంతా దట్టమైన అడవితో నిండి పోయింది .  దాని మధ్యలో అడ్డం గా పరవల్లు తొక్కుతూ ప్రవహిస్తున్న మహానది .  అక్కడ ఎన్నో మూలికలు , ఔషధ మొక్కలు ఉన్నాయి .  ఎవర్నీ పట్టించుకోకుండా తనకు కావలసిన మూలికలు తెమ్పుకుంటున్నాడు వైద్యుడు  రత్నాచార్యుడు.  అక్కడికి దగ్గరలో ఉన్న ఒక వేప చెట్టు కింద ఇద్దరు రాజకుమారులు భోజనం చేస్తున్నారు .  వారి మాటలు ఈ వైద్యుని చెవిన పడుతున్నాయి .         ఫణీoద్రా!  నీవు మంత్రి గారి అబ్బాయివి .  నేను రాజు గారి అబ్బాయిని .  ఇద్దరం ఇంత వరకు ఎటువంటి భేషజాలు లేకుండా సంతోషం గా గడిపాము .  చాలా బాగుంది .అన్నాడు రాజ కుమారుడు రాజేంద్రుడు .   ఇక చదువులతో పని లేదు .  నీవు కోసల రాజ్యానికి మహామంత్రి వి అవుతావు.  నీకు ఏమి తక్కువా ?  మా తండ్రి గారు శూరసేన మహారాజుకి మీ కుటుంబం అంటే  చాలా ఇష్టం కదా !"  అలా అలా మాట్లాడుతూనే ఉన్నాడు రాజేంద్రుడు .  ఏమిటి ఫణీoద్ర! ఇంతసేపు నేనే మాట్లాడుతున్నాను , నువ్వు ఏమి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.  పైగా ఏంటి తీక్షణం గా చూస్తున్నావు ? అంటూ గంభీరం గా అడిగాడు రాజేంద్రుడు . 
      " నా కంటే చదువు , తెలివి తేటలు అన్నిట్లోనూ అర్హతలు సాధింఛి పై స్థాయి లో ఉన్నాడు .  రాజ్యానికి తిరిగి వెళ్ళాక నేను రాజ దర్బారు లో మా తల్లితండ్రుల ముందు , సామంతుల ముందు , ఇతర అధికారుల ముందు నేను తల దించుకుని నిల్చోవలసి వస్తుంది .నేను విద్య లో ఎలా రాణించ గలను ? రాజ కుమారుడు బాగా చదివి ఎన్నో అర్హతలు , పతకాలు సంపాదించాడు .  నా దగ్గర ఒక్కటి కూడా లేదు .   నన్ను అందరూ తెలివి తక్కువ వాడు , వెర్రి వాడు  అని అంటారేమో ?  అని బాధ పడుతున్నాడు  మంత్రి కుమారుడు ఫణీoద్రుడు.  అంతేకాదు , తన చేతగానితనం  తో రాజకుమారుడి పై ఈర్ష్య తో , ద్వేషం తో రగిలి పోతున్నాడు .  మంత్రి పరిషత్తు వారు నన్ను సభ లో లేకుండా చేస్తారేమో , నా భవిష్యత్తు ఏమిటి ":అని ఆలోచిస్తూ కోపం తో ఊగిపోతున్నాడు  మంత్రి కుమారుడు .
  ఈ ఆలోచనలతో రాజేంద్రునితో మాట మాట పెంచాడు . చివరకు తన ఒరలోని కత్తిని  తీసి రాజేంద్రుని డొక్కలో పొడిచాడు ఫణీoద్ర.
   మా తండ్రి గారు , మీ తండ్రి గారు  మా తండ్రి గారు మంచి స్నేహితులు .  నిన్ను కూడా మంచిగా చదివించాలని ఇక్కడకు పంపించారు . మేం నీకు ఏమి ద్రోం చేసామని ఇలా తెగబడ్డావు ? అంటూ రాజేంద్ర గట్టిగా అడిగాడు .
   " నువ్వు కోసల రాజ కుమారుడవు . నువ్వు రాజ్యం చేరకూడదు .  నువ్వు చేరితే నా ప్రతిభ బైట పడుతుంది .  నా డొల్ల తనం , నా తెలివి తక్కువ తనం , అంత తెలిసిపోతుంది .  రాజ దర్బారు లో నాకు ఇక స్థానం ఉండదు .  అందుకే నిన్ను చంపుతున్నాను ." అంటూ కసిగా సమాధానం చెప్పాడు ఫణీoద్ర.     అసలు విషయం తెలుసుకున్న రాజేంద్రుడు చాలా ఆశ్చర్యం లో మునిగిపోయాడు .  చాలా బాధ పడ్డాడు .  "  నీ చివరి కోరిక ఏమిటో చెప్పు , అది నేను తీరుస్తాను  అంటూ వికటాట్టహాసం తో అడిగాడు ఫణీoద్ర. 
      దానికి రాజేంద్ర ఆలోచించి ఒక పత్రం ఇవ్వమని అందులో  యు . రా . శి. ఖ .  అని వ్రాసి , ఇది ఒక మంత్రం .  దీన్ని చదివితే , అర్ధం చేసుకుంటే రాజ్యానికి మంచిది , అందుకే దీన్ని రాజు గారికి అందించగలవు  అని అంటూ పడిపోయాడు రాజేంద్ర .
    ఫణీంద్ర  ఆ కాగితాన్ని అటూ ఇటూ తిప్పి చూసుకున్నాడు .  ఎంత చదివినా ఆ మాట అర్ధం కాలేదు .  చివరకు దాన్ని కూడా దాచుకున్నాడు .  నిస్తేజం గా పడివున్న రాజేంద్ర ని తీసుకుని గుర్రం పై అడవిలోనికి కొంత దూరం తెసుకు వెళ్ళాడు . 

uses of Honey n cinnamon

1.  Arthritis.  కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్లు కొంచం నీళ్ళలో ఒక స్పూన్ తేనే , ఒక స్పూన్ దాల్చిని చెక్క పొడి కలిపి మెత్తని పేస్టు లా చేసి శరీరం లో నొప్పి , వాపు ఉన్న చోట  రాసి మసాజు చేస్తే నొప్పి త్వరగా తగ్గుతుంది .  అలాగే రోజు ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక చెంచ దాల్చినిచెక్క పొడిని కలిపి బ్రేక్ఫాస్ట్  ముందు తీసుకుంటే chronic-arthritis. తగ్గుతుంది .
2.  Hair-loss.  దీనితో బాధ పడేవారు హాట్ ఆలివ్ ఆయిల్ , దాల్చిని చెక్క పొడి , ఒక చెంచ తేనే మిక్స్ చేసి దీన్ని తల స్నానానికి ముందు తలకు పట్టించి 15 నిమిషాల తరువాత తల స్నానం చేసుకోవాలి.  ఇది చాలా బాగా పని చేస్తుంది .

Few more health tips

  
           మిత్రులారా !  ఈ బ్లాగ్ లో నేను కొన్ని హెల్త్ టిప్స్ కూడా పొందు పరుస్తున్నాను .  దీనివల్ల మనకు చాలా ఉపయోగం గా ఉంటుంది .  మీరు కూడా మీకు తెలిసిన చిట్కాలు మీ కామెంట్స్ లో వ్రాయండి .  మనం అందరం కొత్త విషయాలు తెలుసుకోవచ్చు .


1. రోజూ 2 లేక 3 ఎందు ఖర్జూర పండ్లు తింటూ ఉంటె ఎముకల వ్యాధులు రావు .
2.  ఎముకల బలానికి టొమాటోలు కూడా బాగా ఉపయోగ పడతాయి . వీటిలో సోడియం అధికం గా ఉంటుంది .  కాని టొమాటోలు పచ్చిగా కంటే ఉడికించి తీసుకుంటే ఎక్కువ ఉపయోగం గా ఉంటుంది .
అధిక బరువు తగ్గాలనుకునే వారు  రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో పాటు రెండు టొమాటోలు కొద్దిగా నువ్వుల నూనె తో ఉడికించి దానిలో ఉప్పు కొద్దిగా మిరియాల పొడి కలిపి తింటుంటే మంచి ఫలితం ఉంటుంది .
3.  ఎముకలు బలానికి , ఇంకా విరిగినవి అతకటానికి కూడా తేనే ఉపయోగ పడుతుంది .  రోజు ఉదయం , సాయంత్రం కూడా ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 1 లేక 2 చెంచాలు తేనే కలిపి తాగితే ఎముకలు అతుక్కుంటాయి.
 

Few Health Tips

         1.  డయాబెటిస్ తో బాధ పడే వారు ప్రతిరోజూ ఉదయం 4 కరివేప రెమ్మలు నిద్ర లేవగానే తింటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి .
         2.  దాల్చినచెక్క  మెత్తగా పొడి చేసి రోజు ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 1/2 చెంచా పొడి కలిపి ఆ నీటిని ప్రతిరోజూ  మధ్యాహ్నం , రాత్రి భోజనానికి అరగంట ముందు తాగితే అది చాల సమస్యలకు మందు .దానివల్ల షుగర్ , బి .పీ ., కొలెస్ట్రాల్  అదుపులో ఉంటాయి .  అలాగే అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది .
        3.  రోజు ఒక జామకాయ తింటే గుండె జబ్బులు కూడా రావు .  మనకి కావలసిన విటమిన్ c. లభిస్తుంది .

భక్తి కాలమ్

       చాలా మంది  సాయి బాబాది ఏ కులం , ఏ మతం, అని అడుగుతుంటారు .  నన్ను నా మిత్రులు కొంత మంది అడిగితే నేను చెప్పను సాయికి ఒక మతం , ఒక కులం అని ఏమి లేవు . అయినా భగవంతుడికి ఏ కులం, ఏ మతం, అని అంటే ఏమి చెప్పగలము ?  అన్ని మతాలూ , అన్ని కులాలు , జాతులు , జీవులు సమస్తం సృష్టించిన వాడు , అన్నిటిలో ఉన్నవాడే భగవంతుడు అని చెప్పాను .
    అయితే భక్తీ , వేదాంతం కోణం లో కాదు వాస్తవం గా ఎక్కడినుండి వచ్చాడు , ఎలా వచ్చాడు అని సందేహం అన్నారు .         చాలా చారిత్రిక గ్రంధాలు , బాబా జీవిత చరిత్ర పారాయణ పుస్తకాలు , చూస్తె అందులో " కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తుడు వెంకూసా అని ఉండేవారు .  ఆయన దగ్గర శిష్యుడే సాయిబాబా అని ఓ ఆధారం ఉంది .   ఆయన దగ్గర శిష్యుడే  సాయిబాబా అనే ఒక ఆధారం ఉంది .  అలానే ఒక పేద బ్రాహ్మణ దంపతులకు ఆయన జన్మించాడు  అని కూడా కొన్ని మరాథి గ్రందాల వల్ల తెలుస్తోంది .   బాల్యం లోనే తల్లిదండ్రులను కోల్పోవటం వల్ల ఒక ముస్లిం కుటుంబం బాబా ని పెంచి పెద్ద చేసారు .  ఆ సందర్భంలో బాబా వారు ముస్లిం కట్టుబాట్లు , ఆచారాలు , నమాజ్ పద్దతుల్లో పెరిగారు అని చెబుతారు .  ఇటు హిందువు కూడా అయినందున ఆయనకుఅక్ భగవద్గీత , రామాయణ , భారతాలు వాటియందు కూడా సంపూర్తి గా జ్ఞానం సంపాదించారు అని తెలుస్తోంది . శ్రీకృష్ణుడు , శ్రీరాముడు లాగానే బాబా కి కూడా తల్లిదండ్రులు ఉన్నారు అని చెప్పే గ్రంధాలు ఉన్నాయి .  ఏది ఏమైనా బాబా నేనే భగవంతుడు అని ఎప్పుడు చెప్పలేదు .  అల్లాహ్  భగవంతుడు అని ,పాండురంగడు భగవంతుడు అని చెప్పేవారు .  ఏది ఏమైనా పేద బ్రాహ్మణుడిగా పుట్టి ,  ఆ తరువాత ముస్లిం బాబాగా అయి , ఆపై కృష్ణ భక్తుడిగా , సుఫిమతం లో ఉండి షిర్డీ లో నివాసం ఉన్నట్లు తెలుస్తోంది . ఈ రకం గా చుస్తే ఆయన కుల మతాలూ లేని , వాటికి అతీతమైన భగవత్ స్వరూపం అని తెలుసుకోవాలి .
      అలానే శ్రీ వేంకటేశ్వరుడు కూడా ఆకాశ రాజు కు అల్లుడు అని , ఆయన క్షత్రియుడు అని , ఆయన కత్తిని ధరించి ఉంటాడు అని , ఇంకా వేటకు వెళ్ళాడు అని అడిగారు .  "లోక పరంగా హిందూ ధర్మ శాస్త్రం లో ప్రధానం గా 4 కులాలు ఉన్నాయి .  అందులో క్షత్రియుడు అనే కులం వాళ్ళు తప్పనిసరిగా దేశరక్షణ , ప్రజారక్షణ చేయాలని ధర్మం .  అందుకే రక్షించే వాడు , అందుకై యుద్ధం చేసేవాడు  తప్పనిసరిగా క్షత్రియుడై ఉండాలని సూత్రం .  ఇంకా  నా విష్ణు : పృధివి పతిహి  అని అంటారు  అంటే రాజు సాక్షాత్తు విష్ణువు అంశ అని చెబుతారు .  అందువల్లనే ఆయన చుట్టూ జనం , సింహాసనం , ఆడంబరత్వం , వైభవం , అలంకార ప్రియత్వం అన్నీ ఉంటాయి . ప్రతిసారి ఏదో ఒక అవతారం ఎత్తి , దుష్ట శిక్షణ , శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు .  రక్షణ కోసం ఎన్నో పన్నాగాలు చేసే ప్రక్రియ రాజులో ఉంటుంది.  ఇవి అన్ని ఉండటమే రాజ తత్వం , అదే విష్ణు తత్వం అని ",
శివుడు లయకారుడు .  నిజానికి ఒక్కడే పరమాత్మ అనేక అవతారాలుగా మారి కనిపిస్తూ ఉంటాడు.  మరి శ్రీరాముడు , శ్రీకృష్ణుడు శివ పూజ చేసారు కదా అని కొందరు ప్రశ్నించారు . నిజమే వైకుంట వాసుడైన శ్రీ మహావిష్ణువు బయలుదేరి భూమిపై మానవునిగా అవతరించాడు  కాబట్టి పైన దైవం శివునికి నమస్కరించి విధేయుడిగా ఉండాలి . అంతే కాదు మానవుడు దైవాన్ని స్మరించాలి అన్న సత్యాన్ని మనకు బోధించటం కోసం శ్రీరాముడు , శ్రీకృష్ణుడు  ఆ విధం గా ఆచరించి చూపించారు .  నిజానికి బ్రహ్మ , విష్ణువు , మహేశ్వరులు  మూడు రూపాలు ఒక్కటే .  మనకు ఆధారం కావాలంటే శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనం దృశ్యాన్ని గుర్తు తెచ్చుకుంటే అందులో అందరు దేవతలు కనిపిస్తారు . అంటే పరమాత్మ ఒక్కడే , చేసే పని కోసం , జీవులకు సౌలభ్యం కోసం, దేనికోసం దానిగా విభజించుకొని భక్తవత్సలుడై జీవులకోసం , జీవులపై ప్రేమను కురిపిస్తూ , జీవులందరూ తన సంతానమే అని, అందరిని చూసి మురిసిపోతుంటాడు .కోరికలు కర్మలలో పడకుండా తన బిడ్డలందరూ తన వద్దే ఉండాలని ఆయన స్వార్ధం .  మనమే కోరికలు పెంచుకొని , కర్మలను పెంచుకుని ఆయనకు దూరమై కష్టాలు పడుతుంటాము.      ఇక్కడ స్వామివారు ప్రభువు , రాజాధిరాజు , రక్షించేవాడు , అన్ని హక్కులు , శక్తియుక్తులు కల వాడు అని అర్ధం .  అంటే రాజు క్షత్రియుడు అయినాడని ఒక నమ్మకం .  అంతేకాని భగవంతుడికి కులం , మతం అని , ఇంకా ఇతరామైన తేడాలు ఏమి ఉండవు .  ఎందుకంటే విశ్వం అంత ఆయనే .  అడుగు అడుగు వ్యాపించి ఉంటాడు .  ఆయన తయారు చేసిన ఒక మేజిక్ ఈ విశ్వం .  అంతటా వ్యాపించి ఉండటంవల్లె విష్ణువు అయినాడు .  ఆ విష్ణువు అవతారం శ్రీనివాసుడు .  కలియుగానికి అధిపతి గా ఉంటూ , లోకం లో పాపాలన్నీ పటాపంచలు చేస్తూ భక్తజనులను రక్షిస్తూ ఉంటాడు .  ఆ బాధ్యత ఆయన తీసుకున్నాడు .  కనుక కలియుగం లో తొట్టతొలి గా వెంకటేశ్వరునికి నమస్కారం చెయ్యాలి .  ఆ తరువాత మనకు ఇష్టదైవాన్ని పూజించవచ్చు .

ఎన్నాళ్ళిలా ??

  ఈ column. లో వ్రాసిన దానికి , అగ్ర కులాలకు ఏమిటి సంబంధం ?  ఎపుడో వేదాలు చదవనివ్వలేదు అనే విషయం ఇప్పుడు అవసరమా ?  నీచం గ చూసారు నీచంగా చూసారు  అని , మాది నీచపు జాతి అనీ మీరే అరిగిపోయిన రికార్డు లా మాటి మాటికీ గుర్తు చేస్తున్నారు . 
   ఇక్కడ సందర్భం దళితుడిని కొట్టింది కొందరు O.B.C. వారు .  అగ్ర కులాలు , బ్రాహ్మణులూ , వేదాలు మొదలైన విషయాలు ఇక్కడ సందర్భం కాదు .  ప్రతి దానిక్కి ఇవే కారణాలు కాదు , అలాగే ప్రతిరోగానికి ఒకటే మందు కాదు .  ఇలా అన్నింటికీ ఒకటే విధం గా చూడటం , అన్నిటికి ఒకటే కారణం చూపటం డొల్లతనం గా ఉంది .  మేధావులు ఇకనైనా మారండి . దళిత సోదరులలో ఉన్న ఆత్మా న్యూనతా భావాన్ని ( inferiority-complex) తొలగించటానికి ప్రయత్నం చేస్తే జాతి , సమాజం అభివృద్ధి చెందుతాయి .

మన భవిత

మిత్రులారా !  నేను ఇక్కడ కొన్ని వార్తపత్రికల్లోని వ్యాసాలు మీ ముందు ఉంచుతున్నాను .  అవి మీరు కూడా చదవండి . పైన వ్యాసాలలో మనం ఒక విషయం గమనించ వచ్చు .  అసలు జరిగిన విషయం ఒకటైతే  వ్రాసిన వ్యాఖ్యానం మరొకటి .  ఎవరి అభిప్రాయం వారి సిద్ధాంత కోణం లోకి వెళ్లి వ్రాస్తున్నారు .  అసలు జరిగిన సంగతి వదిలేసి దాన్ని వారికి నచ్చిన , వారు నమ్మిన సిద్ధాంత పరంగా చూసి ఆ మూస లోనే దాన్ని వ్యక్తీకరిస్తున్నారు మనం చిన్నప్పుడు చదివిన ఆవు వ్యాసం లాగా . చివరకి ఈ పెద్దల రాతల వల మనం కూడా అన్ని విషయాలని కులం , మతం అనే కోణం లోనే చూస్తున్నాం .  అసలు అవి మర్చిపోయి బ్రతకలేక పోతున్నాం .  కొన్ని క్రింది కులాల గురించి ఆధునిక తరం వాళ్ళు మర్చిపోయారు . వీరి ఇంటికి వారు , వారి ఇంటికి వీరు వస్తు పోతూ ఉన్నారు , కలిసి చదువుకుంటున్నారు , పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు . ఇలా జనం ఆలోచనా విధానం లో మార్పులు వచ్చినా ఈ పైన ఉదహరించిన లాంటి వ్యాసాల వల్ల వీరు కొన్ని కులాల వారి గతాన్ని తవ్వి చూపుతున్నారు .  నిజానికి విజ్ఞాన యుగం లో కూడా మన మనసులకి సంకెళ్ళు వేస్తున్నారు .    ఒక విషయం మాత్రం నిజం అది ఏమిటంటే ప్రతి జీవి ఇంకొక జీవిని దోచుకోవటం నిజం  కాదు  కాదు .. సహజం అయిపొయింది .  నిజానికి అన్ని మతాలలోను , కులాలలోను ధనవంతులు , బీదవారు ఉన్నారు అందువల్ల ప్రభుత్వం ఆర్ధికంగా వెనుకబడిన వారిని గుర్తించి ఆదుకోవాలి .తెలివితేటలూ ఉండి ఆర్ధిక కారణాల వల్ల చదువుకోలేని వారికి సహాయం చెయ్యాలి .  ఈ మేధావులు అటువంటి విషయాలపై చర్చలు జరిపి , వ్యాసాలూ రాసి జనాన్ని చైతన్య పరచాలి .  అంతేగాని ఇలా అన్నిటిని ఒకే మూసలో చూసి అన్నిటికి ఒకటే అర్ధం తీయరాదు .  అందరికి మంచి జరగాలి .  మనం ఆ దిశగా అడుగులు వెయ్యాలి  






   


 
 

మూలాలను తెలుసుకోండి

         అన్ని మతాలలోను , అన్ని కులాల్లోనూ  గొప్పతనం ఉంది .  భారతీయ సంస్కృతిలో ప్రతి చెట్టుకు ప్రతి పుట్టకు , ప్రతి జంతువుకు ...ఒక గొప్పతనం ఆపాదించబడింది .  అంతదాకా ఎందుకు రాక్షసులను హీనం గా చూస్తాము .  కానీ , రాక్షసులు కూడా వారి వారి పూర్వజన్మలలో మంచివారిగా ఉండి ఒక చెడ్డపని వల్ల శాపం పొంది అలా పుట్టారని పురాణాల్లో చెప్పబడింది .
       పాము , పంది, దగ్గర్నుంచి ఉడుత వరకు అన్ని ప్రాణులు భగవంతుని స్వరూపం అని మన సంస్కృతి చెబుతోంది .  మల్లెచెట్టు పువ్వులకు మంచి పరిమళం ఉంది, అది మనసుకు వైద్యం చేస్తుంది .  అలానే జిల్లేడు చెట్టు పువ్వుకు ఒక గొప్పతనం ఉంది . అది శరీరానికి వైద్యం చెయ్యటానికి పనికివస్తుంది .  పెద్దగా కనిపించే వేపచెట్టు గొప్పతనం వేప చెట్టుదే .  ఇలా ఎన్నో భగవంతుని సృష్టిలో అన్నింటిలోను ఏదో ఒక గొప్పతనం ఉంది .  ఒక చెట్టు గొప్పతనం చూసి వేరొక చెట్టు దాని గొప్పతనాన్ని తక్కువ చేసుకుని ఈర్ష్య పడటం లేదు .  అలానే అన్ని ప్రాణులూ , జీవులూ కూడా ... ఒక్క మనిషి తప్ప ....భగవంతుని సృష్టి లో అన్నీ సమానమే అన్న సత్యం ప్రతి మనిషి తెలుసుకోవాలి .  ఈర్ష్య , ద్వేషం  రగుల్చుకుంటూ పొతే మనిషి , ఈ ప్రపంచం ఏమవుతుంది ?           పురాణపురుషులు, పురాణాలు , పురాణాలు వ్రాసినవారు అందరూ బ్రాహ్మణులు కాదు .  శ్రీరాముడు , శ్రీకృష్ణుడు , వ్యాసుడు , వాల్మీకి , శబరి , గుహుడు ఇంకా అనేక మంది ఉన్నారు  బ్రాహ్మణులు కానివారు .   కానీ వారిని అందరినీ బ్రాహ్మణులు నెత్తిన పెట్టుకుని , వారి మర్గాన నడుచుకోమని చెబుతున్నారు .  మరి బ్రాహ్మణులే పురాణాలు , కట్టుకధలు వ్రాసారు అని అనుకుంటే పైన చెప్పిన వాళ్ళు అందర్నీ వాళ్ళు మా వారే అని వ్రాసి ఉండవచ్చు కదా .
       ప్రతి ఒక్కరు పురాణాలు కాని , చరిత్రలు కానీ మూలాలు చదవండి . మధ్యన వచ్చిన వారి వ్యాఖ్యానాలు , అర్ధాలు , వ్రాతలు చదివి అదే నిజం , అవే గొప్పవి , యదార్ధమైనవి అని అనుకోవద్దు . ఉదాహరణకు  రావణాసురుడు , మహిషాసురుడు , నరకాసురుడు మొదలైన వారంతా దోపిడీకి గురి అయినవారని , మంచి వారు అయినాగాని కుల వివక్ష తో వారిని అలా చిత్రీకరించారని , వారంతా మనకు ఆదర్శ పురుషులు అని చెబుతున్నారు.  అలా చెప్పేవారు ఎవరైనా వాల్మీకి రామాయణం గాని తులసి దాసు రచన గాని  చదవలేదు .  వారు రామాయణ , భారతాలు చదవలేదు . వారికి అంత ఓపిక ఓర్పు లేవు .  పైగా మేము ఆ పురాణాలు చదవలేదు అని గర్వం గా చెబుతున్నారు . వారికి అంత ఓర్పు , ఓపికా లేవు .  మిత్రులారా ! దయ చేసి మూలాలు చదవండి అది చరిత్ర అయినా , పురాణం అయినా సరే .   చరిత్రలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చెయ్యటం, వాస్తవాలను వారి వారి దృష్టికోణం లో చూపటం జరుగుతోంది .  దానికి రాజకీయ , సామాజిక కారణాలు ప్రభావాలు చాలా ఉండచ్చు .  ఉదాహరణకు బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని పాలించినప్పుడు మన చరిత్రని వారికి నచ్చిన విధం గా మార్చివేసారని కొందరి అభిప్రాయం .  అలాగే రాహుల్ సాంకృత్యాయన్ , కౌసంబి వంటి వారు కూడా వారు చూసిన కమ్యూనిస్ట్ కోణంలోనే చరిత్రని చూసి భాష్యం వ్రాసారు .  అదే ఫైనల్ అన్నారు .  మూలాలు చదువుకునే పండితులు అయితే భాష్యాలను పట్టించుకోరు .  కానీ మనవంటి సామాన్యులు అవి చదివి అదే నిజమని నమ్ముతున్నాము .  అది కరెక్ట్ కాదు .  ప్రతి దాని మూలం చదువుకోవాలి .
          ఇప్పటి వార్తా పత్రికలలో రాజకీయ పార్టీల పత్రికలూ కూడా ఉంటున్నాయి .  ఆ పత్రికలలో వచ్చే వ్యాసాలూ చాలావరకు తప్పుదోవ పట్టిస్తున్నాయి ప్రజలని .  పైగా గురువు ఎవరైనా అన్ని చదువుకున్న వారు దొరకటం చాల అదృష్టం ఇప్పటి రోజుల్లో .   ఉదాహరణకు మన సంస్కృతీ లో సంఘ స్వరూపం గురించి ఐతరేయ బ్రాహ్మణా పురుష సూక్తం లో ఓ విషయం ఉంది .  అదేమిటంటే " బ్రాహ్మణులూ విరత్పురుషుని ముఖం నుండి పుట్టారని , క్షత్రియులు భుజాలనుంది , వైశ్యులు ఊరువుల నుండి , శూద్రులు పాదాల నుండి పుట్టారని వ్రాసి ఉంది .  అది యదార్ధమే .  కాని ఇక్కడ కొంతమంది ఈ విషయాన్ని ఆసరాగా తీసుకుని సూద్రుల మెప్పు కోసం , వారిని రెచ్చ గొడుతూ  చూసారా ! మిమ్మల్ని పాదాలతో పోల్చారు , ఇదంతా బ్రాహ్మణుల కుట్ర అని ఏదేదో వ్రాస్తూ ఉంటారు .  దానికి ఇంకొంత మంది అగ్నికి ఆజ్యం పోసే విధం గా దినపత్రికలలో రెచ గొట్టే వ్యాఖ్యలు వ్రాస్తూ ఉంటారు .  పైగా మేము ఇలా రాసి అసలయిన శూద్రులకు , పేదలకు బడుగు వర్గాల వారికి మేలు కోసం అంటూ వార్తల్లోకి వస్తుంటారు .  ఇదంతా తమని తాము వార్తల్లోకి తెచ్చుకోవతనికే .ఇటువంటివి చదివి అదే నిజమైన జ్ఞానం అని అనుకోకండి .  అసలైన జ్ఞానం నిస్వార్ధ పరులైన గురువుల నుండి తెలుసుకోండి .  అసలు పైన చెప్పిన విషయం లో నిజమైన గురువుల అర్ధం ఏంటంటే అయ్యా ! మిమ్మల్ని పాదాలతో పోల్చారు అని మీరు బాధ పడుతున్నారు కానీ దానిలోని పరమార్ధం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ శరీరం దేని మీద ఆధారపది ఉందొ తెలుసా ?  పాదాల మీదనే.  కాళ్లు లేకపోతె ఈ దేహం నిలవదు .  కుప్పకూలిపోయి దాని స్వరూపం నిర్మాణమే దెబ్బ తింటుంది .  ఒక భవనానికి పునాది ఎక్కడ ఉంటుంది ?  అట్టడుగున ఉన్న భూమిలో ఉంటుంది .  అలానే సూద్రుడు పైనే ఆధార పది ఉంది ఈ సంఘం .  సూద్రుడు గట్టిగా ఉంటేనే ఈ సంఘం , సంస్కృతి , పాడి పంటలు అన్నీ .  మనం అంతా అన్నం తినగలుగుతాము అందుకే ఎవరైనా దణ్ణం పెట్టేటప్పుడు పాదాలకి పెడతారు .పాదాలు పట్టుకుంటారు తెలుసా !  మీకు ఈ సత్యం బోధ పడే ఉంటుంది ఇప్పుడు .  కాబట్టి ప్రతి విషయాన్ని మంచి గురువుల దగ్గర అభ్యాసం చేసి , లోతుగా ఆలోచించి స్వయం గా పరిశీలించి అర్ధం చేసుకోవాలి .  అంతేకాని ఏవో కొన్ని పత్రికలూ , పుస్తకాలు , ఇంటర్నెట్ లో వ్యాసాలూ చదివి అదే నిజమని భ్రమ పడకండి .  మూలాలను తెలుసుకోండి .
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online