Pages

calories wise data of some veg n non veg items


A special statue of Sri Narasimha Swami which has hair, skin n even sweat



విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం ఇక్కడే... i భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. ఇక్కడ శైవం, వైష్ణవం తో పాటు జైనం, భౌద్ధం కూడా విరాజిల్లింది. ఈ క్రమంలో నిర్మించిన దేవాలయాలు, స్వయంభువుగా చెప్పుకునే విగ్రహాల్లో కొన్నింటి మర్మాలను తెలుసుకోవడం అసాధ్యమవుతోంది. వేలాది సంవత్సరాలుగా ఆ రహస్యాలను తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించినా సఫలం కాలేక పోతున్నారు. ఇక భక్తులు మాత్రం ఇదంతా దేవుడి మహత్యంగా భావిస్తూ తరతరాలుగా దేవుళ్లను కొలుస్తూ తమ కోరికలను తీర్చాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. కోరిన కోర్కెలు తీరిన తర్వాత మొక్కులు చెల్లిస్తూ ఇలాగే తమను, తమ బిడ్డలను చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. ఇటువంటి కోవకు చెందినదే ఓ స్వయంభువుగా చెప్పుకునే నారసింహుడి విగ్రహం. ఈ విగ్రహానికి చర్మం, వెంట్రుకలు ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఆ ప్రముఖ పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు


.. 1.దశావతారాల్లో ఒకటి... విష్ణు దశావతారల్లో ఒకటిగా చెప్పుకునే నరసింహావతారం ఉగ్రస్వరూపం. సింహపుతల, మనిషి మొండెం కలిగిన రూపంలోన నరసింహుడు మనకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం లోక కంటకుడిగా మారిన హిరణ్యకసిపుడిని సంహరించడం కోసమే ఇలా విచిత్రమైన రూపంలో ఈ నరసింహుడు భూమి పై అవతరించాడని తెలుస్తోంది. అటు మనిషితో కాని ఇటు జంతువుతో కాని, పగలు కాని రాత్రి కాని, ఇంటి బటక కాని లోపల కాని, భూమి పై కాని ఆకాశంలో కాని... ఏ ఆయుధంతో కాని హిరణ్యకసిపుడికి మరణం ఉండదు. దీంతో అతని ఆగడాలకు అంతు ఉండదు. ముఖ్యంగా విష్ణు భక్తులను చాలా హింసించేవాడు. చివరికి తన సొంత కుమారుడైన ప్రహ్లదుడిని కూడా వదలలేదు. ... 2. అందుకే నర..సింహ రూపం ఈ క్రమంలో విష్ణువు నరసింహుడి (మానవుడు, జంతువు కలగలిసిన రూపం) రూపంలో వచ్చి సాయంత్రం (పగలు రాత్రి కాని సమయం) సమయంలో ఇటి గడప (ఇంటి బయట కాదు లోపలా కాదు) పై కుర్చొని తన ఒళ్లో హిరణ్యకసిపుడిని అడ్డంగా పడుకోబెట్టుకుని (భూమి ఆకాశానికి మధ్య అన్న సంకేతం) తన చేతి గోళ్ల (ఏ వస్తువుతో చేసిన ఆయుదం కాదు) తోనే హిరణ్య కసిపుడి పొట్టను చీల్చి అతడిని సంహరిస్తారు. ఇది పురాణాల ప్రకారం నరసింహుడి అవతారం వెనుక ఉన్న కథనం. ... 3. దేశంలో అనేక చోట్ల ఈ విగ్రహాలు... దేశంలో అనేక చోట్ల నరసింహుడి విగ్రహాలు కనిపిస్తాయి. సదరు విగ్రహాలన్నీ చాలా వరకూ కొండల్లో గుట్టల పైన ఉంటాయి. ముఖ్యంగా నరసింహుడి దేవాలయాలన్నీ చాల వరకూ గుహాలయాలే. అయితే మనం ఇప్పడు చెప్పుకోబోయే విగ్రహం మాత్రం పచ్చని అడవుల్లో ఉంటుంది. ఈ విగ్రహం రూపుతో నుంచి ప్రతి ఒక్కటి ప్రత్యేకతను కలిగి ఉంటుంది.


4. స్వయంభువుడు... చర్మం వలే మెత్తగా ఉన్న విగ్రహం రూపంలో వెలిసిన వాడే హేమాలచల నరసింహుడు. చాలా చోట్ల నరసింహుడు లక్ష్మీ సమేతుడై ఉంటాడు. ఇక్కడ మాత్రం నరసింహుడు ఒక్కడే స్వయం భువుగా వెలిసినాడు. విగ్రహం పూర్తి నలుపు రంగులో కనిపిస్తుంది. .. 5. శిలాజిత్తు రూపం... అన్ని చోట్ల శిల రూపంలో కనిపిస్తే ఇక్కడ శిలాజిత్తు రూపంలో కనిపిస్తాడు. అంటే ఒంటికి చర్మం ఉన్నట్లు శిలను తాకితే మొత్తగా ఉంటుంది. మనకు నోరు, నుదురును గుర్తించవచ్చు. విగ్రహాలంకరణను అనుసరించి మీసాలు, చెవులు, ముక్కు తదితరాలను గుర్తించవచ్చు. నుదురు నుంచి పాదం వరకూ ఎక్కడ తాకినా సొట్ట పడుతుంది. మరలా యథాస్థితికి చేరుకుంటుంది. మనిషిని ముట్టుకున్నట్లు మెత్తగా ఉంటుంది. చర్మాన్ని తాకిన అనుభూతి కలుగుతుంది. .. 6. వెంట్రుకలు కూడా... ఇలా చర్మంకలిగిన నరిసింహస్వామి విగ్రహమే కాదు మరే ఇతర దేవుళ్ల విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. అభిషేకం చేసే సమయంలో స్వామి వారి విగ్రహం నుంచి వెంట్రుకలు రాలి పోతుంటాయి. ఆ అనుభూతి తమకు కలుగుతుందని ఇక్కడి పూజారులు చెబుతారు.. 7. నాభి నుంచి నిత్యం స్వేదం..ఇక స్వామి వారి నాభి నుంచి నిరంతరం స్రవాలు కారుతుంటాయి. దాన్ని స్వామి వారి స్వేదం అని అంటారు. ఈ స్వేదం అలా కారి పోకుండా అక్కడ చందనాన్ని ఉంచుతారు. ప్రతి శని, ఆది, సోమవారాల్లో ఈ చందనాన్ని భక్తులకు అందజేస్తారు. ఈ చందనం ప్రసాదంగా తీసుకుంటే సంతానలేమి సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం. 8. అన్ని కాలల్లో ఒకే విధంగా ప్రవహించే జలధారఇక స్వామి వారి పాదల నుంచి నీటి ఊట ఎల్లప్పుడూ పారుతూ ఉంటుంది. ఇది జలధారగా మారుతుంది. దీనిని చింతామణి జలధారగా పిలుస్తారు. అయితే స్వామి వారి పాదల నుంచి కొంత దూరంలో ఉన్న జలధారకు నీరు ఎలా వచ్చి చేరుతుందనేది ఎవరూ కనిపెట్టలేక పోతున్నారు. మరో విచిత్రమేమంటే అన్ని కాలాల్లోనూ ఈ జలధారలో నీటి వేగం ఒకే విధంగం ఉండటం..


 9. విదేశాలకు కూడా... ఈ ఇందులోని నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని భక్తులు విశ్వసిస్తారు. రాణి రుద్రమదేవి ఒకానొక దశలో పేరు తెలియని వ్యాధితో తీవ్రంగా బాధపడుతూ ఉంటే రాచవైద్యుల సూచనల మేరకు ఈ జలధార నీటిని తాగిందని దీంతో రోగం తగ్గి పోయిందని చెబుతారు. ఇదే విషయాన్ని భక్తులు కూడా నమ్ముతారు. మరోవైపు ఇక్కడి నీటిని విదేశాల్లో ఉన్న తమవారికి కూడ ఇక్కడి వారు పంపించడం ఆనవాయితీగా వస్తోంది. 10. కాలం తగ్గట్టు విగ్రహం రూపు... ఇక్కడి విగ్రహం వేసవిలో ఒక లాగా, మిగిలిన కాలాల్లో ఒకలాగా ఉంటుంది. వేసవిలో చాల పలచగా ఉండే విగ్రహం మిగిలిన కాలాల్లో వెనుక ఉన్న రాతి నిర్మాణం నుంచి ముందుకు చొచ్చుకు వచ్చి ఉంటుంది. గరిష్టంగా స్వామి వారి విగ్రహం నాలుగు అడుగులు ముందుకు వస్తుంది. దీనిని కూడా స్వామి వారి మహత్యంగా చెబుతారు. .. 11. స్థల పురాణం...ఆరోశతాబ్ధంలో దిలీపకులకర్ణి మహారాజు ఈ ప్రాంతాన్నిపరిపాలించాడు. ఆ సమయంలో ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో స్వామి వారు రాజు కలలో వచ్చి తవ్వకా లసమయంలో ఓ గునపం తన విగ్రహంలోని నాభి ప్రాంతంలో దిగిందని తెలిపారు. భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని భక్తులు సందర్శించే ఏర్పాటు చేయాలని చెబుతారు. స్వామి వారి ఆదేశాలను అనుసరించి అక్కడ రాజు దేవాలయాన్ని నిర్మిస్తాడు. ఇక నాభి గుచ్చుకున్న స్థలంలోనే స్రావాలు వస్తున్నట్లు భక్తులు భావిస్తున్నారు. 12. ఎక్కడ ఉంది. తెలంగాణ రాష్ట్రం జై శంకర్ భూపాల్ జిల్లా, మంగపేట మండలం, మల్లూరు గ్రామానికి దగ్గరా హేమచల నరసింహుడు కొలవై ఉన్నాడు. అడవుల్లో చెట్ల పొదలను దాటు కుంటూ వెళ్లాలి. పచ్చని అడవుల్లో ప్రశాంత వాతావరణంలో ప్రయాణం. ఈ ప్రాంతాన్ని మల్లూరు గుట్టఅని స్థానికంగా పిలుస్తారు.

According to Sri Bhagavatham 21 avataras of Sri Maha Vishnu


లోకపాలనకై విష్ణువు ధరించిన 21 అవతారాలను "ఏకవింశతి "అవతారములు అంటారు.

21 అవతారాలు

మహాభాగవతం ప్రధమ స్కంధంలో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కంధాలలో ఆయా అవతారాల గాథలు వివరంగా తెలుపబడ్డాయి. అవతారాలు లీలావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు అని వివిధ వర్ణనలతో ప్రస్తావించ బడుతాయి. ఆయా అవతారంలో భగవంతుడొనర్చిన కార్యం లేదా ప్రదర్శించిన అంశనుబట్టి ఈ విభాగం చెప్పబడుతుంది.

శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా చెప్పాడు అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమ యోగీంద్రులకు దర్శనీయుడు. ఈ అవతారాన్ని విరాడ్రూపమనీ అంటున్నారు. సకల సృష్టికీ, అవతారాలకూ ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం.

బ్రహ్మ అవతారము: 1
దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు.
వరాహ అవతారము: రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు.

నారద అవతారము: 2
దేవ ఋషియైన నారదునిగా అవతరించి సమస్త కర్మలనుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవ తంత్రాన్ని తెలియజేశాడు.
నర నారాయణ అవతారము: 3
ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్టానపూర్వకంగా శమదమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు.
కపిల అవతారము: 4
నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అపుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు.
దత్తాత్రేయ అవతారము:5
భగవానుడు అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయునిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు, మరికొందరు బ్రహ్మవాదులకూ ఆత్మవిద్యను బోధించి ఆశాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని వివరించే ఆ తత్వవిద్యకు "అన్వీక్షకి" అని పేరు.
యజ్ఞుడుయజ్ఞ అవతారము:6
భగవంతుడు రుచి మహర్షికి ఆకూడి కడుపున యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.
ఋషభ అవతారము: 7
భగవానుడు అగ్నీధ్రుని కొడుకు నాభికి మేరు దేవియందు జన్మించి (ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడై?) విద్వాంసులైనవారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు.
పృధు అవతారము: 8
పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహార యోగ్యాలయిన సస్యాదులను, ఓషధులను భూమిమీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు.
మత్స్య అవతారము: 9
చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు.
కూర్మ అవతారము: 10
దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు.
ధన్వంతరీ అవతారము: 11
అమృత కలశాన్ని ధరించి వచ్చినవారికి అందించాడు.
మోహినీ అవతారము:12
జగన్మోహినియై అమృతం దేవతలకు మాత్రం అందేలా చేశాడు.
వరాహావతారం:13
వరాహావతారం హిరణ్యక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము . రాక్షసునితో భయంకరంగా యుద్ధం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.
నృసింహ అవతారము:14
లోకకంటకుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి, భక్తుడైన ప్రహ్లాదుని కాచుటకు శ్రీనారసింహమూర్తియై ఉక్కు స్తంభం నుండి బయలువెడలినాడు.
వామన అవతారము:15
కపట వామనమూర్తియై బలిచక్రవర్తినుండి మూడడుగుల నేలను యాచించి, త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
పరశురామ అవతారము:16
మదోన్మత్తులై, బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియులపై ఇరవైఒక్క మారులు దండెత్తి వారిని దండించాడు.
వ్యాస అవతారము: 17
కృష్ణ ద్వైపాయనుడై ఒక్కటిగా ఉన్న వేదరాశిని విభజించాడు.
రామ అవతారము:18
పురుషోత్తముడైన శ్రీరాముడై రావణసంహారం కావించాడు.
బలరామ అవతారము, కృష్ణ అవతారము:19&20
బలరామ కృష్ణులుగా ఒకేమారు అవతరించి దుష్ట సంహారం కావించి భగవద్గీతను ప్రసాదించాడు.
బుద్ధ అవతారము:21
కలియుగాది సమయంలో కీకటదేశంలో బుద్ధనామంతో జన్మించి జనులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు.

The Architectural Miracle - Brihadeswaralaya of Tanjavur

T

A very tricky poem describing both Shiva n Vishnu


*గమ్మత్తైన పద్యం*

పూర్వం ఒక రామ భక్తుడు....  రాముడంటే వల్లమాలిన ప్రేమ. శివుడి పేరు ఎత్తడు.
ఒకసారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి "రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇవ్వండి" అన్నాడు.
ఆ పెద్దాయనకీ తెలుసు ... ఇతడికి శివుడు అంటే పడదని. సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు.


 "విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను. మీ విష్ణువు సంతోషిస్తాడు. చదువుకో" అంటూ.

గవీశపాత్రో నగజార్తిహారీ
 కుమారతాతః శశిఖండమౌళిః।
 లంకేశ సంపూజితపాదపద్మః
 పాయాదనాదిః  పరమేశ్వరో నః॥


 ఆశ్చర్య పోయాడు చదవగానే.
అందులో ఏమని చెప్పబడింది? పరమేశ్వరః నః పాయాత్  అని. అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం . తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వరునికి  విశేషణాలు. అర్ధం చూడండి...


గవీశపాత్రః ... గవాం ఈశః  గవీశః .... ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనం గా కలవాడు గవీశపాత్రః. అంటే సదాశివుడు. నగజార్తి హారీ ... నగజ అంటే పార్వతీ దేవి ... ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ ... అంటే సాంబశివుడే. 

కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం ... కుమారస్వామి యొక్క తండ్రి అయినవాడు శివుడే నిస్సందేహంగా. శశిఖండ మౌళి: ... అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.


లంకేశ సంపూజిత పాద పద్మ: ... లంకాధిపతి అయిన రావణునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ.  అనాదిః ... ఆది లేని వాడూ  ... అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ,

అటువంటి పరమేశ్వరః నః పాయాత్ .... వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం.

అర్ధం తెలియగానే మతి పోయింది. వ్రాసిన వాని మీద పిచ్చ కోపం వచ్చింది. అది పట్టుకుని తెగ తిరిగాడు.
చివరికి ఒకాయన "అది విష్ణువుని కీర్తించేదే ... ఏమీ అనుమానం లేదు" అని అతడిని ఓదార్చాడు.


ఇది మరో ఆశ్చర్యం.
అనాది అనే మాటలో ఉంది అంతా. కిటుకు చూడండి ....


పరమేశ్వరుడు ఎలాటివాడూ  అంటే అనాదిః అట. అంటే ఆది లేని వాడు. అంటే పరమేశ్వరలో ఆది అక్షరం లేనివాడు.
ఇప్పుడు ఏమయ్యింది? రమేశ్వరః అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా!


గవీశపాత్రః ... లో గ తీసెయ్యండి .. వీశపాత్రః అవుతుంది. విః  అంటే పక్షి అని అర్ధం. వీనామ్  ఈశః  వీశః ... పక్షులకు రాజు అంటే గరుడుడు, ఏతా వాతా గరుడ వాహనుడైన విష్ణువు.

నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసెయ్యండి .... గజార్తి హారీ ... గజేంద్ర మోక్షణము చేసిన విష్ణువు.

కుమారతాతః .... ఆది అక్షరం తీసేస్తే ... మారతాతః .... మన్మధుని తండ్రి అయిన విష్ణువు.


శశిఖండ మౌళి: ... మొదటి అక్షరం లేకపోతే శిఖండమౌళిః... నెమలిపింఛము ధరించిన విష్ణువు.
  
లంకేశ సంపూజిత పాద పద్మ: ... మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి ... కేశ సంపూజిత పాద పద్మ: ... క అంటే బ్రహ్మ, ఈశః అంటే రుద్రుడు ... అంటే బ్రహ్మ రుద్రేంద్రాదులు బాగుగా పూజించిన పాదపద్మములు కల విష్ణువు. అతడు మనలను కాపాడు గాక ....


గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు .... విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .

ఇప్పటికి అతడు శాంతించాడు.

సమన్వయించుకోకపోతే జీవితాలు దుర్భరం ఔతాయి. సర్వదేవతలలో  విష్ణువుని దర్శించగలిగితే వాడు వైష్ణవుడు. సర్వ దేవతలలో శివుని  దర్శించగలిగితే వాడు  శైవుడు.  ఇది మన భారతీయ కవితా వైభవము.

The significance of OM in the Creation of this Universe




శ్రీమద్భాగవతము

సృష్టి దిగివచ్చిన క్రమము.... శబ్దబ్రహ్మము ప్రణవ స్వరూపము. దానిని‌ వైఖరీ వాక్కుగా ఉచ్చరించుట వలన అవ్యక్తమైన బ్రహ్మ స్థితి నుండి వ్యక్తమైన సృష్టి పుట్టినది.

బ్రహ్మకు కూడా పైనున్న పరమాత్మ స్వరూపుడైన దైవము అవ్యక్తుడై ఉండి, ఈ ఉచ్ఛారణముల వలన వైఖరీ వాక్కు మూలమున వ్యక్త స్వరూపుడై ఉన్నాడు.

ఈ రెండు స్థితులలో ఉన్న మొత్తము పరమాత్మ పరిపూర్ణ స్వరూపుడు. ఇట్లు సృష్టిగా అతడు ఉచ్ఛారణ రూపమున వెలువడుచున్నపుడే ఇంద్రాదులు తనయందు శక్తులుగా ఇమిడి ఉండిరి. వారితో నిండి ఉండియే అతడు వ్యక్త స్వరూపుడగును....?శ్రీమద్భాగవతము 3(2)-౩౮౮

  పైన వీడియో లోని  శ్రీభాగవతం  విషయం  ఇందులో  కాంటెక్స్ట్  ఒకసారి  కలిపి  ఆలోచించండి

video of some wonderful shiva temple images


Maha Shivaratri

శివరాత్రి పర్వదినం కూడా ముక్కోటి ఏకాదశి లాగానే అత్యంత పవిత్రమైనది .శివునకు ,లేదా శైవులకు సంభందిచిన మోక్ష ప్రదేశం కైలాసం , అలానే శ్రీ వైష్ణవులకు వైకుంఠం మోక్ష ప్రదేశం .ఏది ఏమైనా ఒక్కటే బ్రహ్మ పదార్ధం ,అంటే భగవంతుడు ఒక్కడే వివిధ రూపాలలో ,ఎవరకి ఎలా కావాలో అలా కనిపిస్తూవుంటాడు .ముఖ్యముగా హిందూవుల పండుగలు ప్రతీ రోజూ ఏదో ఒక విశేషం తో సంవత్సరం అంతా అలరిస్తూనే ఉంటాయి .ప్రపంచములో ఎవరి సంస్క్ర్యతి ,ఎవరి నాగరికత వారి వారి కి చాల గొప్పది .అయుతే మన భారతీయ సంస్కృతి మాత్రం ,అది ఒక జీవన విధానం .అది ఒక మహా సముద్రం నీకు ఎంత కావాలో అంత వరకే సీసా లో ద్రవములా పట్టుకొని వాడుకోవచ్చు .

   ఏకాగ్రతతో స్వామికి దండం పెట్టుకొని తరిస్తావా అలా అయునా తరించవచ్చు ,కాదు పూవులు అర్పించి ,అర్చన చేస్తానంటావా ,అలా కూడా చేయవచ్చు ,కొద్దిసేపు దేవాలయములో స్వామి వారి ని చూసుకొంటూ ధ్యానం లేక భజన ఏదో ఒకటి చేసుకొంటాను అంటావా అల కూడా చేసుకొని తరించవచ్చు లేదు పురాణం చెప్పి తరించవచ్చు ,స్వామి వారి ని పొగడి లేక కీర్తనలతో పాడి కూడా తరించవచ్చు లేక భగవంతుడి పేరు పై మానవసేవ చేయవచ్చు ,జీవులకు ఆహారం పెట్టవచ్చు ..అలా కాదు కాసిని నీళ్ళు అర్ఘ్యం,ఇచ్చుట లేక అర్పించుటనో చేసి కూడా తరిస్తానంటే అల కూడా చేయచ్చు . అదిగో అదే నేటి శివ రాత్రి నాడు చేసే ముఖ్య మైన తంతు .అభిషేకం .శివ భగవానుడు అభిషేక ప్రియుడు ,కాసిని నీళ్ళు ఆయన పై గుమ్మరించి రెండు పూలు పెట్టి మనస్సు పలకం పై ఆయన రూపం స్మరించి తే చాలు ఎంతో మేలు ,ఎంతో మంచిది . కాని నేటి రోజుల్లో ఆడంబరత్త్వం పెరిగి భక్తి తగ్గిపోతుంది .


ఉపవాసం ,జాగరణ ,అంటూ ఏదో కాలక్షేపం వెతుక్కొంటూ న్నారు .అస్సలు నా దృష్టిలో ప్రతిరోజూ జపతపాదులు చేసుకోనేవాళ్ళ కు ప్రత్యేకంగా అంటూ ఏమి వుండదు .ఆచారం అంటూ వూరికే కష్టం పెంచు కొని మనలిని తిట్టుకొంటూ చేయాల్సిన పని లేదు .అర్ధరాత్రి లింగోద్భవం వరకు ఉండలేని వారు ,అవి అన్ని పా టించలేని వారు సింపుల్ గా దేవుని ఎదుట కూర్చొని కొద్ది సేపు ఆయనను మనస్సులో స్మరించి ,తీర్ద్ ప్రసాదాలు తీసుకొని వెళ్ళినా చాలు ,మనం చేసుకున్న జీవాత్మ connection rechaarge అయు పోతుంది .కావలిసింది మంచి మనస్సు ,మనస్సు తో చేసే పని ముఖ్యం .దానిని కలిగించటానికి ఇన్ని రకాల సేవ లు పెట్టారు .అది తెల్సుకోండి చాలు . దీ కుదరక పొతే ఓం నమ శివాయ అని మీకు కుదిరిన అన్నిసార్లు జపం చేసుకొని నమస్కారం పెట్టి హాయుగా పడుకోండి .పంచ భూతాత్మక మైన రీరమే శివం ,ఇక లోపల అంతర్యామి గా నారాయణుడి ఉంటాడు అని పెద్దలు చెబుతారు .ఇది ఏమైనా భక్తీ గా ,ఆర్తిగా భగవంతుడిని పూజించండి ,భజించండి అంతేకాని మూడనమ్మకాలను పెంచుకొని రీరాన్ని కష్ట పెట్టుకోకండి ,మీ పెద్దలను ,పిల్లలను భాధలకు గురిచేయకండి ,మనలోను ,బైట అంతటా భగవంతుడు నిండి వున్నాడు ,మీరు ఎలా అయునా ఆయనను స్మరించుకొని తరించవచ్చును .భగవంతుని కి కావలసినది శుద్దమైన మనస్సు .దానిలో రెండు నిమషాలు ఆయన చిత్రం ఊహించుకొని నమస్కారం చే సుకొని మీ విన్నపాలు చెప్పుకోండి .జరిగే మంచి ఎలాగూ జరుగుతుంది కదా .



 

A beautiful story depicting the qualities of Brahma Vishnu Maheswara

మాఘపురాణము 28వ అధ్యాయం
 
 
విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ
పూర్వము బ్రహ్మ, ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని. నేను సర్వేశ్వరుడను, పధ్నాలుగు లోకములకు అధిపతిని నేనే అన్నాడు శివుడు. కాదు, ఈ పధ్నాలుగు లోకాలను, సమస్త చరాచర జీవరాశినీ, సృష్టించిన సృష్టికర్తను నేను. కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు. వాదప్రతివాదములు, తర్కమీమాంసలతో వెయ్యేళ్ళు గడిచిపోయినవి. ఇద్దరూ వాగ్వివాదంలో మునిపోయారేమో సృష్టి కార్యం అంతా స్తంభించి పోయింది. అంతట శ్రీమహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ, ఈశ్వరులు ఇద్దరూ సమస్త లోకములూ ఇమిడివున్న ఆ రూపమును తిలకించి నిశ్చేష్టులైనారు. సప్త సముద్రాలు, సమస్త విశ్వమూ, ప్రకృతి భూత భవిష్యత్ వర్తమానములన్నీ కనిపించుచున్నాయి. అ విరాట్ రూపుని ఎడమచెవిలో శంకరుడు, కుడిచెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపమునకు ఆద్యంతములు లేవు. సర్వత్రా తానై ఉన్నాడు. అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాధిదేవులు, దేవతలు, రాక్షసులు, మునులు సమస్తమూ భగవంతుని కీర్తిస్తూ కనపడుచున్నారు. నదీనదములు, పర్వతములు, కొండలు, గుట్టలు, జలపాతములూ సమస్తమూ కనపడుచున్నవి. భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లబడుతున్నాయి. కోటి సూర్య కాంతుల వెలుగులలో ప్రకాశింపబడుతున్నాడు. సామాన్యులకు సాక్షాత్కరించని, వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు. ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివర ఎక్కడో తెలియడం లేదు.
 
 ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్న వారే అధికులనీ, బ్రహ్మ, ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు. ఇరువురూ వెంటనే బయలుదేరి వెయ్యేళ్ళు తిరిగి ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక యథాస్థానానికి వచ్చి ఇట్లు తలపోశారు. ఆహా! ఏమి ఇది? బ్రహ్మ, ఈశ్వరులైన మేము ఈ విరాట్ స్వరూపుని ఆద్యంతములు కనుగొనలేక పోయితిమి. అంటే మనం అధికులం కాదన్నమాట. సమస్తమునకూ మూలాధారమైన శ్రీమహావిష్ణువే మనకంటే అధికుడన్నమాట. సృష్టి స్థితి లయ కారకుడతడే. అతడే సర్వాంతర్యామి. జగములనేలే జగదాధారుడతడే. పంచభూతాలు, సూర్యచంద్రులు, సర్వమూ ఆ శ్రీమన్నారాయణుడే. కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వమూ అయి వున్నాడు. మనమంతా ఆయన కుక్షిలోని కణములమే అని నిర్ణయించుకున్నవారై శ్రీమహావిష్ణువును స్తోత్రం చేయగా విష్ణువు విరాట్ రూపమును వదిలి యథారూపమును ధరించి మీరెంతో కాలమునుండి వాదించు కొనుచున్న విషయము తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించాను. నా విరాట్ రూపముయొక్క ఆది మధ్యాంతములను తెలుసుకొనలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేశారు.
 
 మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపెదను వినండి. “సమస్తమునకూ మూడు గుణములు నిర్దేశించబడ్డాయి. వీటీనే త్రిగుణములు అంటారు. అవి సత్త్వరజస్తమోగుణములు. మీరు రజస్తమో గుణములు కలిగిన వారు. ఎవరైతే సత్త్వరజస్తమో గుణములు కలిగిఉందురో వారే గొప్పవారు. తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి. అవి సృష్టిస్థితి లయలు. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయమునకు ఈశ్వరుని అధిపతులుగా చేసితిని. కావున వీరిని త్రిమూర్తులు అందురు. త్రిమూర్తులు అనువారు ముగ్గురు కాదు. ఏక స్వరూపమే. సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపులమైనాము. కావున మీరు వేరు, నేను వేరు అనునది లేదు. అంతా ఏకత్వ స్వరూపమే. కావున మన ముగ్గురిలో ఎవరికీ పూజలు చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి. త్రిమూర్తులమైన మనలో భేదముండదు. రజస్తమో గుణముల ప్రభావముచే మీరిట్లు ప్రవర్తిన్చిరి. శాతమునొంది చరింపుడు. బ్రహ్మదేవా! నీవు ఎక్కడినుండి ఉద్భావిన్చావు? నా నాభికమలము నుండియే కదా! కావున నీకును, నాకును బెధమున్నడా? లేదు. అట్లే ఓ మహేశ్వరా! ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనమును తెలియగోరి నారదుడొకనాడు నీ మహాత్మ్యమును తెలుపమనగా నేను నీయొక్క మహిమను సర్వస్వమును వినిపించితిని. నాటినుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకూ విస్తరింపజేశాడు. ఓ సాంబశివా! నువ్వు నిర్వికార నిరాకల్పుడవు. శక్తి స్వరూపుడవు, త్రినేత్రుడవు, సర్వేశ్వరుడవు, ఆదిదేవుడవు నీవే. ఆత్మ స్వరూపుడవు నీవే. భోళా శంకరుడవైన నీవే ఇంత పంతము పట్టదగునా? నేనే నీవు, నీవే నేను అందుకే శివకేశవులని భక్తులు భజియుంతురే! పూజింతురే! నిత్య సత్య స్వరూపుడవు. నిత్యానంద రూపుడవు. నిత్య ధ్యాన స్వరూపుడవు. అర్థ నారీశ్వరుడవు. నీవుకూడా నాతొ సమనుడవే” అంటూ బ్రహ్మకు, శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేసెను. కావున మాఘమాసమందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడగు ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తులగుటయే కాక స్వర్గార్హత పొంది సుఖించగలరు.

శివాభిషేకాలు - వాటి ఫలితాలు

శివాభిషేకాలు - వాటి ఫలితాలు


1 గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.
2 నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.
3 ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును.
4 పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.
5 ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
6 చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.
7 మెత్తని చేక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును.
8 మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.
9 తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.
10 పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.
11 కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.
12 రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.
13 భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.
14 గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.
15 బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.
16 నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును.
17 అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నముతో శివ లింగానికి మొత్తంగా అద్ది (మెత్తుట) పూజ చేయుదురు - ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచి పెట్టెదరు, చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన).
18 ద్రాక్షా రసముచే అభిషేక మొనర్చిన ప్రతి దానిలో విజయము లభించగలదు.
19 ఖర్జూర రసముచే అభిషేకము శత్రుహానిని హరింప జేస్తుంది.
20 నేరేడు పండ్ల రసముచే అభిషేకించిన వైరాగ్య సిద్ది లభించును.
21 కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తివ్తము లభించును.
22 నవరత్నోదకము చే అభిషేకము ధాన్యము, గృహ, గోవృద్దిని కలిగించును.
23 మామిడి పండ్ల రసము చేత అభిషేకము చేసిన దీర్ఘ వ్యాధులు నశించును.
24 పసుపు నీటితో అభిషేకించిన మంగళ ప్రదము అగును - శుభ కార్యములు జరుగ గలవు.


ఓం నమః శివాయ.

A real wonder woman n great human being

 
Friends we all need motivation to do things in life.  Sometimes we get from our own life incidents n some times with the happenings in others' lives.  Most of us try to achieve something which is in our reach n easy to achieve without many hardships.  But there r some people who get motivated from their own personal life events.  Even if they lose someone very dear to them, they try to save others n save them the sorrow which they r experiencing.  The lady in this above mentioned article is one of those.  She lost her husband very early in life due to some health ailments n without the proper treatment on time.  She suffered a lot.  But she wanted to help others who r needy.  But she didn't have the means to do that.  She wants to build a health care hospital to save the people's lives.  But she is a poor lady who sells vegetables to earn her livelihood.  But she didn't  get disappointed n worked very hard to achieve her goal.  she started a small health care center in her own hut n her own son who is a doctor, started treating the patients for free.  later on she collected funds n built a hospital.  After that she got aid from the Govt n stopped taking funds from donars.  Later she built another hospital also in another village.  A Nursing school near the hospital.  This lady even though became old, regularly visits all the clinics n personally supervises all the facilities everyday.  Finally The Govt. recognized her services n felicitated with Padmashree.  But all these titles r too small for the services she is giving to the poor n needy.  She n the people like her r real Bharat Ratnas.  Kudos to Subhashini Mistri..
 

What is the Panchayatanam according to Hindu religion?

పంచాయతనం  అని మన వారు పెద్దలు అందరూ అంటూ ఉంటారు .  అసలు పంచాయతనం అంటే ఏమిటి?  దీనిని ఎవరు ప్రతిపాదించారు ? అని చాలామంది కి వచ్చే సందేహం. 

పంచాయతనం అంటే ఐదుగురు దేవతా మూర్తులున్న పీఠం. ఆదిత్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, పరమేశ్వరుడు. మూర్తులంటే విగ్రహాలు కావు. ఆయా దేవతలకు ప్రతిరూపాలుగా భావించే శిలలు.
 
ఆదిత్యుడికి ప్రతి రూపం  స్ఫటికం. గోళీకాయంత ప్రమాణంలో ఉండే స్ఫటికం సూర్యునిగా పూజలందుకుంటుంది.

అంబికకు ప్రతిరూపం నాపరాయి వలే ఉంటుంది. ఇందులో సువర్ణం ఉంటుందంటారు. కొన్ని నాపరాళ్లలో బంగరు రంగు గీతలుంటాయన్నది విదితమే కదా! దీనిని చంద్రశిల అంటారు.

విష్ణువు సాలగ్రామ రూపంలో ఉంటాడని అందరికే తెలిసిన విషయమే. ఇందులో జీవశక్తి ఉంటుంది. ఈ సాలగ్రామాలు ఉత్తరాన, హిమాలయాల్లో ప్రవహించే గండకీ నదిలో లభ్యమౌతాయి.

గణపతి జేగురు రంగులో ఉండే శిలలో ఉంటాడు. ఇవి శోణానదిలో ఉంటాయి. శోణం అంటే ఎరుపు, లేదా అగ్ని వర్ణం.  శోణానది మైనాక పర్వతంలో పుట్టి గంగలో కలుస్తుంది. ఈ నదిలో లభించే శిలలను శోణభద్ర వినాయక మూర్తులని అంటారు.
 
మహేశ్వరుడు బాణలింగ రూపంలో పూజలందుకుంటాడు. ఇది కూడా చిహ్న రూపమే. బాణలింగాలు నర్మదానదిలో లభిస్తాయి. ఇవి శివలింగాకృతిలో ఉంటాయి.

పంచాయతనం పూజా గృహాల్లోనూ, దేవతార్చనా మందిరాల్లోనూ ఉంటుంది. కొన్ని గర్భ గుడుల్లో కూడా ఉంటాయి. కానీ గుళ్ళల్లో ఉన్న పంచాయతనంలో విగ్రహాలుంటాయి. తిరుమలలో, శ్రీశైలంలో, కాళహస్తిలో పంచాయతనాలు లేవు.. మూల విరాట్ఠులు మాత్రమే ఉంటారు. గృహస్థులు ఎచటికేగినా పంచాయతనాన్ని తమ వెంట తీసుకుని వెళ్లి పూజలు చెయ్యాలి. మధ్యలో ఉన్న శిలను బట్టి పంచాయతనానికి పేరు ఉంటుంది.

ఉదాహరణ:
విష్ణుపంచాయతనం అంటే సాలగ్రామం మధ్యలో ఉంటుంది.

fish drawing Sudarshan chakra




Hi friends, this is a rare video depicting one of the nature's wonders which is beyond our imagination.  We the humans always think we r superior to all the beings on this planet.  But there r some small creatures with lesser faculties who r able to create some really complex things.  Pls. watch this video n enjoy.

What evolution really means??

ప్రియ మిత్రులారా ఎప్పటిలాగే  ఈ వ్యాస రచయుత  బ్రాహ్మణులు ,హిందూవులు , పురాణాలు ,ఋషులు పై  దాడి చేసారు .మొత్తముగా భారతీయ సంస్కృతి పై  నే దాడి .ఇతర మతాల జోలికి  కాని ,ఇతరకులాల జోలికి కాని వెళ్ళే సత్తా ,దమ్ము లేవు .ఒకవేళ వెళ్ళితే పరిణామాలు ఎలా ఉంటాయో వీళ్ళకు బాగా తెలుస్సు . వీళ్ళ రాతలకు ఇక కాలం చెల్లిపోతుంది .ఎం దుకంటే అందరు చదువుకొంటున్నారు ,అన్ని దేశాలు వెళ్ళీ అక్కడ సంస్కృతి ,నాగరికత  లు పరిశీలించి చూస్తున్నారు .అక్కడ లేని విలువలు ఇక్కడ మన దేశములో  ఏమి వున్నాయి ?అని వాళ్ళంతట వాళ్ళే స్వంతముగా అర్థం చేసుకొంటున్నారు .ఇక ఇటువంటి రచయుతలు వ్రాసేది ఎప్పుడూ ఒక్కటే అది  .మన దేశ సంస్కృతి  ని  తిట్టుకుంటూ ,మా సంస్కృతి లో ఎమీ లేదు ,అన్నీ మూడనమ్మకాలే ,ఇతర మతాలవారుమనదేశానికివచ్చినాగరికత,సంస్కృతి ,అన్నిశాస్త్రాలు ,జ్ఞానంవిజ్ఞానంమనకు నర్పారు.వేదాలు ,ఉపనిషత్తులు ,బ్ర్హహ్మసూత్రాలు భగవద్ఘీత  అంతా మూఢనమ్మకాలే .18 పురాణాలు ఉత్త డొల్లె వాటిలోనుంచి నేర్చుకోనేది ఏమి లేదు అట .ఈ వ్యాస రచయుత చెప్పేది అది .
 
అంతేకాదు కాదు వీళ్ళు చెప్పే బౌద్ధమే  చాలా కచ్చితమైన నిజం   .ఇప్పుడు ప్రపంచానికి   ఎక్కడో పుట్టిన   మార్క్స్ ,ఏంజెల్స్ ,మావో లు  చెప్పిన  సిద్దాంతాలు కావాలి అట .  ము ఖ్యముగా మన దేశానికి వాళ్ళే ఆదర్శం అట ,దీనిని ఆచరించే వాళ్ళు నిజమైన మనుషులు ,దేశ భక్తులు  అట .ఇక ఆ వాదం కి బలం  చేకూరాలని కొంతమంది మార్కిసిస్ట్ భావజాలం ,లేదా నాస్తిక వాదం మెండుగా ఉన్నవారి రచనలు వెతికి తెచ్చి ఉదహరిస్తూ వుంటారు .వీరి అందరికి రాహుల్ సాంక్రుత్సాయన్ వ్రాసిన పుస్తకాలు ,ముప్పాళ రంగనాయకమ్మ , కంచే ఆయు లయ్య ,గౌరీ లంకేష్  వీరి రచనలు  , ఇంకా హిందువులను  ,తిట్టే రచనలు వెతికి పట్టుకొని తీసుకువస్తారు. .ఒక్క పురాణం కాని ఒక్క ఉపనిషత్ శాంతి మంత్రం కాని వీళ్ళ ముఖాలకు రావు .కనీసం పంచ సూక్తాలు ఉంటాయి .వాటిలో ఒక్కటి చదివి తెల్సుకున్న బాగుంటుంది ,అవన్నీ వదిలేయండి .కనీసం శ్రీమద్భాగవతము పూర్తిగా చదివినా చాలు .చదివిన వారు ఎవరైనా సరే   వితండ వాదానికి కాని , నాస్తిక వాదానికి కాని ,ఇంకో ఇతర మతం లోనికి కాని వెళ్ళలేరు .విమర్సించే వారు ఎవరినా సరే ముందు మూలం చదవండి ,అంతే కాని ఎవరో వ్రాసిన riview లు చదివి విమర్సలకు దిగకండి .మిడి మిడి జ్ఞానం తో హిందూవుల మత గ్రంథాలు జోలికి పోవద్దు .
 
బైబిల్ చదివితే క్రిస్టీ యానిటి అర్థం అవతుంది .అలానే ముస్లిం ఖురాన్ చదివితే ఇస్లాం అర్థం అవుతుంది .కాని ఒక మతగ్రంధం చదివితే హిందూమతం తెల్సుకోవడం కష్టం .ఎందుకంటే చాలామంది మునులు ,మహర్షులు ,ప్రకృతి ,జంతువులు కళలు ,వైద్యం ,విద్య చాల ఉంటాయి .కేవలం భక్తీ ,వేదా౦ తమే కాదు అందుకే అది ఓ మతం కాదు ఓ జీవన విధానం .అయునప్పటికి ఏదైనా ఓ శ్రీమద్భాగవతము  లేక  గీత ఒకసారి చదవండి .మూఢనమ్మకాలు ప్రతీ మతములో ,ప్రతీ దేశ ములోను వున్నాయి .కొన్ని దేశాలలో క్రిస్టియన్ మతం  వ్యాప్తి చెందుతూ వున్న తరుణములో ముఖ్యముగా ఆఫ్రికన్ దేశాలలో కొన్ని జాతుల ను అంతమొంది౦ చటానికి మహిళల ,,పురుషుల రహస్య అంగాలను సైతం ఖండించి మతమార్పిడులు లాంటి ఆగడాలు   హిందూ మతం  ఎప్పుడు  చేయలేదు .ఈ దేశములో ఏ మతం వారు ఏమి చేసినా  సహించి౦ది .పైగా అన్ని మతాలలోని మంచిని ఏరుకొని ఆచరిస్తూ అందరిని కుటుంబ సభ్యుల్లా  చూడటం అల్వర్చుకొంది. కొన్నివందల సంవత్సరాలు  ఏమి పాడుచేస్తున్నా ,వారికి కమ్మ్యునిస్ట్లు  లు వంత  పాడుతూన్న సహించి వూరుకొంది .ఇక ఇప్పుడు నెత్తిన ఎక్కి చాతకాని దద్దమ్మలు అంటే మాత్రం భరించ లేక ఎదురుదాడి కి తెగపడుతున్నారు హిందూవులు .
 
 అన్ని మతాలూ ఈ సనాతన మతం నుంచే ఉద్భవించాయి. చంద్రుడు ,సూర్యుడు నక్షత్రం లాంటి ఆరాధనీయ చిహ్నాలన్నీ ఈ హిందూమతములో ఆరాధిమ్పబడుతున్నవే,  ఇది అన్ని మతాలవారికి తెలుస్సు అయునా   ఏమి తెలీయనట్టు నటిస్తుంటే ఎంత అని చెప్పగలం .నిరంజన నిరాకర స్వరూపం , ఏ విగ్రహం  లేకుండా ఆరాధన చేయటం హిందూమతం లో ఉన్నదే .అదే యోగ ,medetation అదే ధ్యానం . భద్రాచలం  శ్రీసీతారామకళ్యాణం  కు నవాబులు పంపించే తలంబ్రాలు అబద్దమా ,తిరుపతి వెంకన్న కి ఓ ముస్లిం 108 పెద్ద సైజు కమలాలు ( ప్రతి మంగళవారం ఉదయం 7.౩౦ కి svbc TTD ఛానల్ లో అష్టదళ పాద పద్మారాధన మనం చూడవచ్చు ) అబద్దమా ? మదురై మీనాక్షి దేవాలయములో బ్రిటిష్ వాళ్ళ district  collecter  రోజ్ పీటర్ ని ప్రమాదం నుంచి బైట పడేసిన విషయం అబద్దమా ?ఒకవేళ మీరు నాస్తికులయితే ఓకే మీరు అన్ని మతాలను సమానముగా criticize చేయండి .ఒక్క హిందువులనే టార్గెట్ చేయటం మానుకోండి .

వేదాలు అబద్దం అంటారు .ఉపనిషత్తులు అభద్డం అంటారు ,ఇక గీత ,పురాణాలు పచ్చి అభద్డం .కానీ మీరు చెప్పే కాలం చెల్లిన ఎర్ర జండా మాటలు మాత్రం నిజాలు .బౌద్ధం నిజం ,ఇతర మతాల గ్రంథాలు మాత్రం నిజాలు .ఒక్క భాగవత పద్యం మీ జన్మ లో ఎప్పుడైనా విన్నారా ,కనీసం చదవటానికి ప్రయత్నం చేసారా ? అవునులే నోరు తిరిగి చావదు కదా ,ఆ అక్కసు అంతా పండితులు ,బ్రాహ్మణులు పై తీర్చుకోవడం .శృతి,స్మ్రుతి ,పురాణ ,ఇతిహాసం  లు వీటి ఆధారము గా భారతదేశ చరిత్రను అంచనా వేస్తారు .అంతేకాని సంస్క్తుత  పంచ కావ్య ములు అంటే తెలియని వాళ్ళు ,ఏదో వేమన పద్యాలూ రెండు నోటికి రాగానే నేను సాహితీవేత్తను ,పండితుడిని ,అనేసుకొని ఏకంగా వేదాలు ,ఉపనిషత్తులు డొల్ల అనే హిందువుల మనోభిప్రాయాల పై దెబ్బ కొట్టద్దు. పురాతన పండితులవి ,ఆ శాస్త్రాలు అబద్దం అంటున్నారు ,మరి మీరు ఇచ్చిన కొటేషన్లు ,వికటకవులు ,మీ రాతలు మేము నమ్మాలి .సర్వేపల్లి రాధా కృష్ణన్ ,రాజేంద్ర ప్రసాద్ మోక్షగుండం ,అబ్దుల్ కలాం,pvనరసింహారావు ఓ తిరుమల తిరుపతి దేవస్తానం ,ఓ బెనారస్ ,ఓ ఉడిపి ఓ వాజపేయు .ఓ ఆయుర్వేదవైద్యం ,భారతీయ కర్నాటక సంగీతం రాజులు కట్టించిన పెద్ద పెద్ద దేవాలయాలు ఇవన్ని వుత్తోత్తివే ,మీరు ,త్రిపురనేని రామస్వామి ,కంచ ఐలయ్యా  ,లక్ష్మయ్య,  ఏచూరిసీతారం ,అరుంధతిరాయ్ ,  ముప్పాళ్ళ రంగానయక మ్మ , మీరు చెప్పినవే వేదం అని తలచి కోటానుకోట్ల సంవత్సరాలు భారతీయసనాతన సంస్కృతిని ,మట్టిలో పూడ్చి దానిపై ఎర్ర జండా ఎగరవేసి రష్యా వారికీ గాని ,చైనా వారికి గాని లేక మైనారిటీ మతాల వారి దేశాలకు గాని అప్పచేప్పితే మీకు ,మీ వాదానికి చాల గొప్ప సంతోషం కదా .నేను మీకు చెప్పేది ఒక్కటే ఎవరో వికటకవులు వ్రాసినవి చదవకండి ,మూలం పుస్తకాలు తెచ్చి చదవండి ,అవి జర్నలిస్ట్ లకు అర్థం కావు అప్పుడు ఒక పండితుడి దగ్గరకు వెళ్లి అర్థం చెప్పించుకొని చూడండి .ఇంకో విషయం  కొన్ని కొన్ని శాస్త్రాలు సమ కాలీన సమాజ పరిస్తితులను పట్టి ఉంటాయి  వేల సంవత్సరాల నాటి రచనలు ఇప్పుడు చదివి ఈ నాటి  కాలానికి ,సమాజానికి ,ప్రజానీకానికి ,ఆచారాలకు అన్వయుం చు కొ కోడదు .ex ఇప్పటి రాజ్యాంగాన్ని ,కొన్ని వేల సంవత్సరాలు తరువాత చదివి విమర్శిస్తే పొంతన సరిపోదు ,కాలాన్ని ,యుగ ధర్మాన్ని బట్టి కొన్ని పురాణాలు ఉంటాయి .అని చెప్పడం  నా ఉద్దేశం .
 
అంతే కాదు ,భారతీయ పురాణాలలో ఎక్కువ శాతం క్రింది కులాల వారే వున్నారు ex:18పురాణాలువ్రాసినవ్యాసుడు,వాల్మికి ,శ్రీకృష్ణుడు,శ్రీరాముడు ,గుహుడు ,శబరి,ఆళ్వార్లు ,విశ్వామిత్రుడు వీరు అంతా బ్రాహ్మణులు కాదు ,కాని బ్రాహ్మణులు అంతా వీరు చెప్పిన మార్గములో నడిచారు .మూఢనమ్మకాలు పై తిరగుబాటు చేసిన బ్రాహ్మణులే అడవుల్లోకి  వెళ్లి ఉపనిషత్తులు ,అరణ్యకాలు రచించారు .భోదాయనుడు ,గౌతముడు ఇద్దరు మహర్షులు ,వారిలో గౌతముడిని అంబేత్కర్ అను సరించాడు.. హిందూ మతం ఓ మహా సముద్రం దానిలోకి చాల పిల్లకాల్వలు వస్తాయి .పోతాయి .ఆ మహా సముద్రాన్ని ఎవరు అపవిత్రం చేయలేరు .చాలామంది ప్రయత్నం చేసి దెబ్బతిని పోయారు .కొంత కలుషితం చేసారు  అయుతే అది తాత్క్కాలికము   మాత్రమే.అనాదినుంచ.ఎవ్వరినీ ఇబ్బందులకు గురిచేయకుండా అనేక దెబ్బలకు గురిఅయున మాట వాస్తవం .అందుకే ఇప్పుడు హిందూవాదులలో భరించే సహనం దాటిపో యింది .  అందుకే హిందూ మతంలో అతివాదులు సహజసిద్దముగా పుట్టుకొని వస్తున్నారు ,వాళ్ళు ఎవరూ కుహనా లౌకిక వాదం వినే స్తితి లో లేరు . రసో వై స;   ఇది ఫాణిని అస్టాద్యాయ లోనిది .అది ఒక్కటి చాలు దానిని 8 రకాలుగా పరిశోధించి చెప్పాడు .ఆ రోజుల్లోనే శ రీరములో రసాలు స్రవించే గ్రంధులు గురించి చెప్పిన విధం ఆ 8 లో ఒక రకం .హిందూ మతం లో ఆచరణ లో కానీ ,పురాణాలలో కానీ విజ్ఞాన శాస్త్రం చాలా వుంది .మీకు చే తనైతే పరిశోధన చేయండి .మీరు నాస్తికులా ఓకే ,అన్ని మతాల జోలికి వెళ్ళండి .విప్పి చెప్పుకోండి .



చివరలో మీరు వ్రాసిన మనువు ,యాజ్ఞవల్క్యుడు ,భ్రుగువు ,పరాశరుడు లాంటి వారి రచనలు కు నేను చెప్పినది వర్తిస్తుంది . ప్రతీ విషయం కూడా మూడు రకాల అర్థాలు కలిగి వుంటుంది . ఒకటి సంధర్బం రెండు పదానికి అర్ధం ,మూడు అనుభవం నాలుగు ఆచారం,సంప్ర దాయం ప్రాంతీయవాడుక కాబట్టి మనం కొన్ని పుస్తకాలు కొనేసి చదువుతా అంటే కుదరదు ఓ గురువు దగ్గర కు వెళ్లి చదువుకోవాలి .   అంతే కాదు ఇప్పుడు మన  వేష భాష లు కూడా,మనల్ని కన్న తల్లితండ్రులు ,తాతలు ,భాష ,సాహిత్యం ,కళలు etc    భారతీయ సంసృతి కి సంభందిచినవే అని గుర్తుఎరిగితేమంచిది .
  
   పై న  రచయుత వుదహరించి న రసాయన శాస్త్రవేత్త సత్యపాల్ ఆలోచించినది ఏమిటంటే  ఏదో సంస్థలో వుద్యోగం చేసినంత మాత్రాన ఆ సంస్థ కు జాతి సంస్కృతి ని ,నాగరికత ని ,భారతీయతని తాకట్టు పెట్టి అమ్ముకోవాల్సిన పని లేదు .పైన రచయు త  వివేకనందని  కనీస౦ వివేకానంద అని  చాలా తేలిగ్గా సంభోదిచాడు ,అంటే ఈయన గారి పాండిత్యానికి  వివేకానందా కూడా సరిపోవడం లేదు .ఓకే  ఆ   వివేకానందే విదేశం వెళ్ళినప్పుడు భగవద్ఘీతను  సభలో ఓ రాశి లో అట్టడుగు లోనున్నప్పుడు    పైకి తెచ్చి పెట్టి ఉపన్యాసం మొదలు పెట్టాడు .విదేశం నుంచి స్వదేశం రాగానే ఇక్కడి నేలను ,మట్టిని ముద్దాడాడు ,అంతేకాని దాస్ కాపిటల్ విదేశి పుస్తకాన్ని  ఏమి నెత్తిన పెట్టుకోలేదు . ఆయన గురువు కాషాయం ధరించిన రామకృష్ణుడు ,ఇక మీకు ఇవన్ని అంటరానివి కదా మరి వాళ్ళని ఎప్పుడూ తల్వకండి .ఇక జాతి మొత్తం కూడా మెండల్ కనిపెట్టిన హై బ్రీడ్ తిని ఎంత ఆరోగ్యముగా ఉంటున్నారో మీకు తేలీ యనిది కాదు ,అలానే విదేశీయులు కనిపెట్టిన పురుగు మందులు కూడా కడుపులోకి పోయి చిన్న చిన్న పిల్లలకే ఎలాంటి రోగాలు వస్తూవున్నాయో అందరికి తెలుస్సు .సుభాస్ పాలేకర్ స్వదేశి ,ప్రకృతి వ్యవసాయానికే    రైతులంతా వెళ్ళుతున్నారు .ఇక లమార్క్  ,,మెండ ల్ గురించి చాలా చదివాము ,వాళ్ళకంటే  ముందుగా ,ఎప్పుడో మన పురణాలలోనే దశావతారములు ఘట్టం ఈ జీవపరిణామ సిద్దాంతాన్ని వివరించి చెబుతోంది అని చాలా మంది విదేశీయులు రీస ర్చ్ పేపర్స్ తయారుచేశారు .పరిశోధనలు ఎప్పుడూ ఒకేలా వుండవు .కొత్త కొత్త విషయాలు ఎక్కడో అక్కడ బైట పడుతూనే ఉంటాయి .ఒకప్పుడు షుగర్ వ్యాధి వాళ్ళను చిలకడదుంప ,బంగాల దుంప తినవద్దు అనే వారు పరిశోధకులు ,కానీ ఇప్పుడు ఏమి చెబుతున్నారు ఉడికించి తినవచ్చు,నూనెలో వేయుంచి తినవద్దు  ఎందుకంటే   ఎక్కువ కేలోరీస్ వచ్చి షుగర్ పెర్గుతుంది ,అని వాళ్ళు కొత్త పరిశోధనలో చెబుతున్నారు .కాబట్టి పరిశోధనలు కూడా అనేక రకాలు   స్వదేశి   ,విదేశి లు .కాకపొతే ప్రతీ విషయాన్ని ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకొని సంఘ పరివారు కు అంటగట్టి సంది జ్వరం వచ్చిన వాళ్ళులా ఏదేదో మాట్లాడకూడదు .తెల్ల కళ్ళద్దాలు అయుతే స్వచ్ఛముగా అన్నీ కనిపిస్తాయు  అది గమనించి నడుచుకోవడం మంచి ఆరోగ్య వంతుడి లక్షణం .లేకపోతె  మీ ఆవేశం పరివార్ కే అత్యంత లాభం కలిగిస్తుంది
 


 
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online