Pages

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే - part-6

      ఇంకో ఉదాహరణ చెప్పుకొందాం వేసవి కాలములో కొత్తకుండ లో ని నీటిని త్రాగితే ఎలా వుంటుంది. మన శేరీరానికి అలవాటు పడేంత వరకు జలుబు చేస్తూవుంటుంది .అలానే కొత్తగా .సి లో కి వెళ్లి పడుకొంటే ఏమవతుంది .జలుబు ,ముక్కు కారటం ,తల నొప్పి లాంటివి వస్తాయి . ఇవన్ని ఇలా ఎందుకు జరుగుతున్నాయి .అదే మనలోని ప్రకృతి తత్త్త్వం .బైట ప్రకృతి కి మనలోని ప్రకృతి కి వున్న బంధాన్ని కొంత మార్చి చల్లదనం కోసం ప్రయత్ని౦ చాం .తాత్కాలికముగా మారటానికి కొంత టైం పడుతుంది .ఇంకా ప్రకృతి చాలా చాలా రకాలుగా వుంటుంది .కొంతమంది మెల్లగా మాట్లాడతారు.కొంతమంది దురుసుగా మాట్లాడతారు .దీనిని మనవాళ్ళు . వాడి ప్రకృతే అంత అంటూ వుంటారు .ప్రకృతి అంటే ఇక్కడ సూక్ష్మరూపములో మనలో వుండే కొన్ని లక్షణాలు .అలానే బైట ప్రకృతి లో మనం చూస్తూవుంటాం వున్నట్టు వుండివర్షం. అకాలవర్షం ,ఎండలు తుఫాను లు ,గాలులు ఎలా ఉంటాయో మన మదిలో ,మన నడవడికలో కోపతాపాలు ,సంతోషాలు బాధలు దుఖాలు ఇది కూడా ప్రకృతి లక్షణములు .ప్రకృతి లో నష్టాలు ,మనిషి,లేక జీవి జీవితములో ఆటుపోట్లు ,బైట ప్రకృతిలో విలయాలు , మనిషి జీవితములో కోలుకోలేని దెబ్బలు ఇవన్నిచూస్తూవుంటే బైట ప్రకృతికి మన శేరీరములో పెద్ద పాత్ర ,మనజీవితములో పెద్ద భాగస్వామం వుంది అని అర్థం అవుతుంది కదా .ఇది అంతా కనపడకుండా జరిగేది .ఇక కనిపించేలా జరిగేది మనకు సుపరిచితమే .

         ఆకులు పండ్లు దుంపలు నీళ్ళు పాడి పంటలు చెట్లు చేమలు .గుహలు ,కొండలు రాళ్ళు రప్పలు ,లోహాలు ,లోహసత్త్వాలు మందులు ఇవన్ని మనకు ప్రత్యక్షంగా ఉపయోగించు కుంటూనేవున్నాంకదా ,ఇక్కడ మీకో విషయం చెప్పాలి మనిషిలో కాని .జంతువుల్లో కాని అంటే జీవి ఏదైనా రోగము వచ్చినప్పుడు ప్రకృతి లోని మూలికలు వాడుతూ ఉంటాము అంటే దాని అర్థం మనలోని ప్రకృతి కి సమస్య వచ్చిన ప్పుడు బైట ప్రకృతి లోని మూలము తో సరిదిద్దుకుంటున్నాముకదా ,మనలో భూమిలో వుండే మూలకాలు మన రీరములో కూడా సూక్ష్మ రూపములో ఉంటున్నాయి అందుకే సోడియం ,పొటాషియం ,జింక్ బంగారం లాంటివి స్వర్ణ భస్మం .లోహభాస్మం ఇలా ఎన్నో భస్మాలుగా ఆయుర్వేదం లో వాడుతూవుంటారు .ఇంగ్లీష్ వైద్యం లో కూడా విటమిన్స్ ,మినరల్స్ జింక్ క్యాప్సుల్స్ గా వాడుతూవుంటాం .కాబట్టి ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి .ప్రకృతి ఒడిలో ,ప్రకృతి లోపల ,మనలో ప్రకృతి ,అంత ఎందుకు ఉచ్వాస,నిచ్వాశ శ్వాస ,ప్రకృతి ప్రాణం కి ఆధారం ప్రకృతి .

       పూర్వకాలములో ప్రకృతి పచ్చగా .చెట్లు,చేమలు తో కళకళ లాడుతూ వుండేది .దాని స్వంత బిడ్డల్లాంటి పక్షులు తో అందాన్ని ,ఆనందాన్నిపొందుతూ ,మనకు గూడా ఇస్తూ ఆరోగ్యముగా రక్షక వలయములా కాపాడుతూ వుండేది . అటువంటి ప్రకృతిని నాశనం చేశాము భగవంతుడు ఇచ్చే పవిత్ర .పంచభూతాలను యధా తధముగా మన జీవ కొటికి అందించే తల్లి ప్రకృతి మాత. ముందు చెట్లు ధ్వంసం చేసాం , తరువాత పక్షులను కూలగొట్టి తినేశాము.మనకు మేలు చేసే పశువులను అన్నిటిని మిషన్స్ లో వేసి రక్త మంసాలను పిండుతూవున్నాము .బ్రహ్మజ్ఞానం చెప్పే పండితులను తూలనాడి ,ప్రతిభకు మంటపెట్టి వాళ్ళను దూరం పెట్టాం ,విదేశాలకు పొట్ట బట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు .మత్తుఅలవాటుచేసుకొని విచక్షణ కోల్పోయి ప్రకృతి ప్రతిరూపాలు అయున స్త్రీలని హింసలు పెడుతున్నాము .ఒక్కపూట లో కోటీశ్వరుడు అవటానికి ధర్మాన్ని ఖూనీ చేస్తున్నాము .ఇది అంతా ఎందుకు చెప్పుతున్నాను అంటే శంకర,రామానుజ ,మధ్వాచార్యులు వారంతా త్రాగుడు ,మత్తు ,జూదము లకి దూరముగా ఉండమన్నారు .అప్పుడు కాని బుర్ర పని చేయదు ,అప్పుడు తప్పులని సరిచేసుకుంటాము.అప్పుడు వ్యవస్థ బాగుంటుంది .


0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online