Pages

త్రిఫల చూర్ణం /మాత్రలు -- ఉపయోగాలు, కాల్షియమ్ part 1

ప్రశ్న. త్రిఫలను ఉదయమైన రాత్రి అయిన భోజనానికి ముందు తీసుకోవాలా  లేదా భోజనానoతరము తీసుకోవాలా  ?

జ : మూల రోగము, భగందర రోగము కడుపుకు సంబంధించిన రోగములు నయము చేసుకోవాలంటే రాత్రిపూట భోజనము చేసిన తర్వాత ఒక చిన్న చెంచాడు పాలతోగాని వేడి నీళ్ళతో గాని తీసుకోవాలి.

ఇక ఉదయము తీసుకునేవారు అల్పాహారానికి ముందు ౪౫ నిమిషాలు ముందే త్రిఫల చూర్ణం తీసుకోవాలి. ఇప్పుడు మరొక విషయము తెలుసుకుoదాము. వాగ్భాతుడు చెప్పిన అత్యుత్తమైన పదార్థము త్రిఫల చూర్ణము దీనితోబాటుగా కొన్ని చెప్పుకున్నాము శొంఠీ. ఇంగువ జీలకర్ర వీటిలో మరొక గొప్ప ఔషధము మెంతులు. ఇవి వాత+కఫరోగాల్ని తగ్గిస్తాయ. కానీ పిత్తాన్ని పెంచుతాయి. పిత్త సంభంద రోగాలు,అసిడిటి, అల్సర్స్ పెప్టిక్ అల్సర్స్, నోటిలోకి నీరు రావడము భోజనము చేసిన రెండు గంటల తర్వాత కూడా నోటిలో రుచి ఉండటము. త్రెంపులు వెక్కిళ్ళు రావటం ఇవన్ని పైత్యరోగాలు. ఈ పిత్త సంభంద రోగాలు ఉన్నవారు తప్ప , వాత+కఫ రోగాలు ఉన్నవారు మాత్రము మెంతులు బాగా తీసుకోవచ్చు.

వాత రోగాలు అంటే, కీళ్ళ నొప్పులు, భుజాల నోప్పులు,మోకాళ్ళ,నడుము నొప్పులు లాంటివి ఉన్నవారు. మెంతులు ఉపయోగించే విధానము. రాత్రిపూట ఒక గ్లాసు గోరువేచ్చని లేదా వేడి నీటిలో గాని చెంచ మెంతులు నానబెట్టి ఉదయాన్నే బాగా నమలి నమిలి తినాలి. ఒకేసారి మింగి తినడము వల్ల అంత ప్రయోజనము ఉండదు. బాగా నమిలి తినడము వలన అది మీ లాలాజలము కలిసి లోనకి వెళ్లి మీకు ఎక్కువ మేలు చేస్తుoది. ఎక్కువుగా మనవాళ్ళు మెంతులు పచ్చళ్ళలో ఉపయోగిస్తారు. ఇలా మెంతులు వేసి ఉన్న ఏ పచ్చడి అయిన మీరు సంతోషముగా తినవచ్చు . కొన్ని పచ్చళ్ళలో వాము కూడా వేస్తారు. ఈ మెంతులు వాము వేసిన పచ్చ్ల్లలో ఔషధ గుణములు ఎక్కువుగా ఉంటాయి. నీటిలో నానిన మెంతులు కంటే నూనెలో నానిన మెంతుల ఔషధ గుణాల విలువలు చాల ఎక్కువ. కనుక మీరు ఇంగువ , వాము, మెంతులు ఉన్న పచ్చళ్ళు తీసుకోవటము మంచిది. ఔషధులు లేని పచ్చడి తీసుకోకూడదు.

మరొక విషయము, భోజనము చేసిన తరువాత సున్నము తో తమలపాకు వేసుకునే వారు జీవితములో వాతరోగల బారినపడరు. ఎప్పటికి మెంతులు కంటే సున్నము ఎక్కువ వాతనాశిని, ఆధునిక వైద్య శాస్త్రము ప్రకారము కూడా శరీరములో కాల్శియుం తగ్గితే 50 కిపైగా జబ్బులు వచ్చే అవకాశము యున్నది.. ఇవన్ని నొప్పుల రూపములోనే ఉంటాయి. ఎక్కువుగా ఎముకలకి సంభందించిన నెప్పులు ఇంకా రక్తానికి కఫానికి సంభందించిన రోగాలు కూడా వస్తాయి. కాబట్టి ఎపుడు శరీరము లో కాల్షియమ్ తగ్గకుండా చూసుకోవాలి. శరీరములో కాల్షియమ్ అనీ పోష్టకాహారము యుండటము వలెనే మిగతా పోషకాలన్నీ ఉపయోగ పడతాయీ. ఇది ఎన్నో సంవత్సరాల ప్రయోగ ఫలితముగా చెప్పబడినది.


దీని అర్ధము చూడoడి మీ శరీరములో ఏ విటమిన్ అయిన తెలియబడా లంటే? ముఖ్యంగా కాల్షియమ్ ఉండాలి. ఇది కూడా శరీరము 40 నుంచి 45 సంవత్సరాల వరుకు మనము స్వీకరిoచే ఆహారము లో నుంచి కాల్షియమ్ తయారు అవుతుంది. కాల్షియమ్ ఎక్కువుగా ఉండీ పదార్థాలు పాలు, పెరుగు ,మజ్జిగ,వెన్న, నెయ్యి వీటిలో కాల్షియమ్ పుష్కలంగా ఉంటుంది. మిగతావాటిలో అనగా నారింజ, కమల, బత్తాయి ద్రాక్ష వంటి పుల్లటి ఫలాలో కూడా కాల్షియమ్ పుష్కలంగా ఉంటుంది, అలాగే మామిదిపండులో కూడా ఉంటుంది. పండ్ల అన్నిటిలో కాల్షియమ్ పుష్కలంగా ఉండే పండు అరటి పండు. అరటిపండు కాల్షియమ్ యొక్క బాoడాగారము. ఇది తేలిక గ కూడా అరుగుదల అవుతుంది . కనుక అరటిపండు తప్పకుండగా ప్రతిరోజు తీసుకోవాలి. ఈ పండ్లలోని కాల్షియమ్ మనకు 40 నుంచి 45 సంవత్సారాల వరకే తయారు అవుతుoది.


45 సంవత్సారాలు పూర్త్హి కాగానే స్త్రీలకూ నేలసరులు ఆగిపోయిన తరువాత, శరీరము కాల్షియమ్ తీసుకునే తయారుచేసుకొనే సామర్ధ్యము తగ్గిపోతుంది. ఎంతగా మీరు కాల్షియమ్ తీసుకున్నపటికి కాల్షియమ్ జీర్ణము చేసే గ్రంథులు, ఉత్పత్తి ఆగిపోతుoది. అప్పుడు కాల్షియమ్ జీర్ణము కావడము చాల కష్టమౌతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు కాల్షియమ్ భయట నుండి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే స్త్రీలందరు గుర్తు ఉంచుకోండి. 45 సంవత్సారాల తరువాత సున్నం తీసుకోవటము తప్పనిసరి పురుషులు కూడా తప్పకుండ 45 సంవత్సారాల తరువాత సున్నము తీసుకొనవలెను. అందుకే మన దేశము లో తాంబూలము తీసుకొనుట అలవాటు ఉన్నది, తమలపాకు ఎప్పుడు సున్నం తోనే వేసుకోవాలి, కాచు వాడకూడదు.            

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online