Pages

కాల్షియమ్ part 2

మహిళల్లో కాని పురుషులలో కాని 45 సo,, దాటినా తరువాత శరీరములో కాల్షియమ్ ఉత్పత్తి నిలిచి పోతుంది . అందుకనే ఎముకలు బలహీన పడుతూ ఉంటాయి . రెండు విధాలుగా మనం ఆ సమస్య నుంచి బయట పడవచ్చు

 1 ) శారీరక శ్రమ శరీరము లో అన్ని భాగాలు కదిలే వ్యాయామము. దీనిలో కాళ్ళను  చేతులును ఎక్కువగా కదిపే వ్యాయామం చెయ్యాలి.   ఎక్కువుగా శ్రమ పడే శరీర భాగాలకు మెదడు ప్రత్యేకముగా శరేరము నున్చి కాల్షియమ్ తెప్పించి యిస్తుoది. అందుకే వ్యాయామము చేయాలి.

2 ) ఇక బయట నుంచి కాల్షియమ్ తీసుకోవచ్చు అదీకూడా ఇంగ్లీష్ మందుల కంటే సహజ సిద్ధమైన పెరుగు, మజ్జిగ, సిట్రస్ పండ్లు, నిమ్మ, బత్తాయి, నారింజ etc.... ఇంకా పెసలు, శనగలు మొలకలు, రాగుల పిండి, సీతాఫలము లాంటి పండ్లలో బాగా కాల్షియమ్ ఉంటుంది.

 ఆయుర్వేదం లో అయితే ధూప్ పాపెశ్వర్ కంపని వారి అస్థిపోషక్ దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాని కాకరకాయ నేరేడు కాయ వంటివి దీనికి పత్యము. మోకాలు నెప్పులు ఉన్నవారు కూడా పైన చెప్పిన అష్టి పోషక్ వాడితే లాభము కనపడుతుంది.  మోకాలి  చిప్ప పై చింత గింజల పొడి నువ్వుల నూనెలో బాగా కలిపి ముద్దలా కలిపి  రాత్రి వేళ పట్టు లా  వేసుకోవాలి తెల్లవారి తీసేయచ్చు అలా కొన్ని రోజులు చేయటo ద్వారా మోకాలి నెప్పులు తగ్గు ముఖము పడతాయి.

 ఇంకా ఒక చెంచాడు మెంతుల పిండి కప్పు మజ్జిగలో కలిపి రోజు తీసుకోవాలి మోకాలి నెప్పులు నయము అవుతాయి అయితే థైరాయిడ్ వారికి మెంతులు పడవు అని  గ్రహించాలి.  

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online