Pages

some health tips

1.  జీలకర్ర ని నూనె లేకుండా వేయించి దానిని పొడి చేసి కొద్దిగా ఉప్పు కలిపి  ఒక చెంచా పొడిని  ప్రతిరోజు భోజనం మొదటి ముద్ద లో కొద్దిగా ఆవునెయ్యి తో తింటే ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది .  షుగర్ కూడా కంట్రోల్ లోకి వస్తుంది . 
2.  రోజు ఒక గ్లాసు పలుచని మజ్జిగ తాగండి .  దానివల్ల బి.పీ . కంట్రోల్ అవుతుంది . షుగర్ కి కూడా మంచిది కొలెస్ట్రాల్ తగ్గుతుంది .  ఒంటి లోని వేడి తగ్గుతుంది .  కాల్షియం తక్కువ ఉన్న వారికి ఇది చాలా మంచిది .  రాత్రి పూట పెరుగు తినకూడదు .
3.  భోజనం ప్రారంభం లో ఒక స్పూన్ ఆవునెయ్యి వేసుకుని తినండి .  ఆవు నెయ్యి తినటం వల్ల కొలెస్ట్రాల్ ప్రాబ్లం రాదు .  కీళ్ళు అరిగిపోకుండా కాపాడుతుంది .  ఇంకా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది .  ఎముకలు బలం గా అరిగిపోకుండా ఉంటాయి .
4.  సైనస్ తో బాధ పడేవారు మంచి ఆవునెయ్యి తీసుకుని దానిని కరిగించి రోజు రాత్రిపూట నిద్ర కి ముందు రెండు ముక్కుల్లో 3 చుక్కలు వంతున వేసుకుని పడుకుంటే ఆ ప్రాబ్లం తగ్గుతుంది ఇంకా బ్రెయిన్ నరాలకు , ముక్కు గొంతు కు కూడా మంచిది .
5.  మనిషి లో ఉండే వాత, పిత్త , కఫము అనబడే 3 సమానముగా ఉంచేది త్రిఫలా చూర్ణం .  ఇది అన్ని ఆయుర్వేదం షాపులలో దొరుకుతుంది .  రోజు రాత్రి పూట ఒక స్పూన్ పొడిని అరగ్లాసు నీటిలో గాని , మజ్జిగ లో గానీ కలుపుకుని తాగితే అది చాలా రకాలైన అజీర్ణ సమస్యలు తగ్గిస్తుంది .  ఇంకా మనకు హాని కలిగించే ee-koli. వంటి బాక్టీరియా ను కూడా చంపుతుంది .
6.  త్రిఫలా చూర్ణం కళ్ళకు , చర్మానికి, జుట్టు కు కూడా మంచిది .  గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగినా , తేనే లో కలుపుకుని ఒక స్పూన్ తీసుకున్నా కూడా మంచిది . 
7.  ప్రతిరోజు 2 వెల్లుల్లి గర్భాలు తినండి .  అలా చేయటం వల్ల B.P. కంట్రోల్ లో ఉంటుంది .  గుండెల్లో మంటని అదుపులో పెడుతుంది.  కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది .  అలానే ఉల్లి పాయను రోజు తినటం వలన రక్తం సాఫీగా , గడ్డలు కట్టకుండా ఉంటుంది .  ఇంకా వీటి వలన చాలా లాభాలు ఉన్నాయి .  కనుక ఇవి తప్పక ఆహారం లో చేర్చుకోండి. 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online