నా చిన్ననాటి మిత్రుడు ఒకాయన వచ్చారు , "గురువా! నేను హిందూ మతం లో పుస్తకాలు అన్నీ చదివి అంతా తెలుసుకున్నాను. దేవతలు అందర్నీ ఆరాధించాను. కానీ నాకు క్రిస్టియన్ మతమే నాకు దారి అని అనిపించింది. అందుకే ఆ మతం పుచ్చుకున్నాను . నా నిర్ణయం ఎలా అనిపిస్తుంది మీకు ?" అని అడిగాడు. దానికి నేను " సరే మీకు నచ్చింది మీరు చేసారు . o.k. కానీ నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి మీరు జవాబు చెప్పండి . మీరు హిందూ మతం లో దేవుళ్ళు ఎవరిని ఆరాదించారు ? అని అడిగాను . దానికి ఆయన కొన్ని గ్రామ దేవతల పేర్లు చెప్పాడు . గురువుగారూ ! నేను ఆ దేవతలను ఆరాధించాను. కానీ నాకు ఈ మతమే కరెక్ట్ అనిపించింది అని చెప్పాడు . అప్పుడు నేను ఆయన్ని అడిగా "మీరు హిందూ మత గ్రంధాలు చదివారా ? అని దానికి ఆయన లేదు గురువుగారూ ! నేను పెద్దగా చదవలేదు . అయినా ఏమి ఉంది వాటిలో ? అన్నీ ఉత్త మాటలేగా! అంటూ కొంచం వ్యంగ్యంగా అన్నాడు . దానికి నేను అతనితో అన్నాను , మీరు మొదటి మెట్టు లో నుంచే వెనక్కు వచ్చేసారు . మరి ఇంకా ఈ మతాన్ని గురించి మాట్లాడటం అనవసరం అని అన్నాను .
అతనితో ఇంకా సంభాషించాలి అని మనసుకి అనిపించలేదు . ఆ తర్వాత నేను కూర్చుని హిందూ మత గ్రంధాలు అవి ఏమిటి అంటే 4 వేదాలు, బ్రహ్మ సూత్రాలు, 18 పురాణాలు , 150 ఉపనిషత్తులు , భగవద్గీత, ఇంకా హిందూమతం లోనే 5 ముఖ్య మతాలు , వాటిపై త్రి మతాచార్యులు శంకర , రామానుజ , మధ్వాచార్యులు వ్రాసిన భాష్యాలు ఇవి అన్నీ ముఖ్యమైనవి. ఇంకా ఇతర గ్రంధాలు ఇంకా లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి . వీటిని మనం పూర్తిగా చదివి అర్ధం చేసుకోటానికి ఒక జీవిత కాలం సరిపోదు మతం గురించి నాకు తెలిసిన విషయాలు జ్ఞప్తికి తెచ్చుకోవటం మొదలు పెట్టాను .
హిందూ మతం లోని 5 మతాలను శంకరాచార్యులవారు చట్టబద్ధం చేసారు . అవి ఏమిటంటే
1. సౌరం -- అంటే సూర్యుడిని కొలవటం . 2. గాణాపత్యం -- అంటే గణపతిని ఆరాధించటం . 3. అంబికాం -- అంటే శక్తీ మాత దుర్గ ను పూజించటం . 4. శ్రీవిష్ణుం -- అంటే విష్ణువు ను పూజించటం . 5. మహేశ్వరం -- అంటే శివుని ఆరాధన . ఈ 5 కాక ఆయన 6వ మతాన్ని ఒక దాన్ని స్థాపించారు అది ఏమిటంటే ఈ పైన చెప్పిన 5గురు దేవతలలో మన ఇష్ట దైవాన్ని ఒకరిని మధ్యలో ఉంచి మొత్తం మిగిలిన వారిని చుట్టూ ఉంచి పూజించటం . ఆయన ఈ సిద్ధాంతాన్ని నిరూపించి మిగిలిన 75 మతాల వారిని ఓదించి వాటిని తీసివేసారు . అందువల్లనే ఆయన ను షన్మత స్తాపనాచార్య అనే పేరుతో పిలుస్తారు . ఆది శంకరులు అద్వైతాన్ని స్థాపించారు . అంటే భగవంతుడు, జీవుడు వేరు వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే అని చెప్పారు . ద్వైతము కానిది అద్వైతము అని ప్రతిపాదన చేసి భాష్యం వ్రాసారు .దానినే శంకర భాష్యం అని అంటారు . ఆయన జగద్గురువు అని పేరు పొందారు . ఆతర్వాత కాలం లో మళ్ళీ మూదాచారాలు తిరగాబెట్టినప్పుడు రామానుజులు వచ్చి విసిష్టాద్వైతాన్ని స్థాపించారు . ఆయన సమాజం లోని రుగ్మతలు తొలగించటానికి పాటుపడ్డారు . అన్ని కులాలు , మతాల వారిని తన దగ్గరకు ఆహ్వానించారు . ఆయన మనుష్యులలో బేధాలు లేవు అంతా ఒక్కటే అని ప్రబోధించారు . ఆయన సిద్దాంతం ప్రకారం పరమాత్మ +ప్రకృతి +జీవుడు అంటే ఎలెక్ట్రాన్+ప్రోటాన్ +న్యూట్రాన్ లాగా కలిస్తే ఈ సృష్టి అని ప్రతిపాదించారు . అదే విశిష్టాద్వైతం . ఈ ప్రతిపాదన తో వ్రాసినదే శ్రీభాష్యం .
ఇక మూడవ వారు మధ్వాచార్యులు. వీరిది ద్వైతం . అంటే పరమాత్మ +జీవుడు ఇద్దరు వేరు వేరు అని . ఈయన కూడా ఈ మతానికి భాష్యం వ్రాసారు .
ఇలా హిందూ మతం లో ఈ ముగ్గురు రచనలు చదవాల్సి ఉంటుంది . ఇంకా తులసీదాసు , కబీరు వంటి గొప్పవారి రచనలు , ఆళ్వారుల గ్రంధాలు , రామాయణ భారతాలు ఇవి అన్నీ సాహిత్యమే . అసలు ఇంత వరకు చదివి అర్ధం చేసుకోత్తనికే సమయం సరిపోదు .
ఇంకా ఒక్క ఖురాన్ , లేదా బైబిల్ చదివితే మొత్తం మతం గురించి తెలియదు . హిందూ మతంగురించి తెలుసుకోవటానికి , వేదాంత అనుభూతిని పొందటానికి ఒక్క జన్మ సరిపోదు .
అతనితో ఇంకా సంభాషించాలి అని మనసుకి అనిపించలేదు . ఆ తర్వాత నేను కూర్చుని హిందూ మత గ్రంధాలు అవి ఏమిటి అంటే 4 వేదాలు, బ్రహ్మ సూత్రాలు, 18 పురాణాలు , 150 ఉపనిషత్తులు , భగవద్గీత, ఇంకా హిందూమతం లోనే 5 ముఖ్య మతాలు , వాటిపై త్రి మతాచార్యులు శంకర , రామానుజ , మధ్వాచార్యులు వ్రాసిన భాష్యాలు ఇవి అన్నీ ముఖ్యమైనవి. ఇంకా ఇతర గ్రంధాలు ఇంకా లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి . వీటిని మనం పూర్తిగా చదివి అర్ధం చేసుకోటానికి ఒక జీవిత కాలం సరిపోదు మతం గురించి నాకు తెలిసిన విషయాలు జ్ఞప్తికి తెచ్చుకోవటం మొదలు పెట్టాను .
హిందూ మతం లోని 5 మతాలను శంకరాచార్యులవారు చట్టబద్ధం చేసారు . అవి ఏమిటంటే
1. సౌరం -- అంటే సూర్యుడిని కొలవటం . 2. గాణాపత్యం -- అంటే గణపతిని ఆరాధించటం . 3. అంబికాం -- అంటే శక్తీ మాత దుర్గ ను పూజించటం . 4. శ్రీవిష్ణుం -- అంటే విష్ణువు ను పూజించటం . 5. మహేశ్వరం -- అంటే శివుని ఆరాధన . ఈ 5 కాక ఆయన 6వ మతాన్ని ఒక దాన్ని స్థాపించారు అది ఏమిటంటే ఈ పైన చెప్పిన 5గురు దేవతలలో మన ఇష్ట దైవాన్ని ఒకరిని మధ్యలో ఉంచి మొత్తం మిగిలిన వారిని చుట్టూ ఉంచి పూజించటం . ఆయన ఈ సిద్ధాంతాన్ని నిరూపించి మిగిలిన 75 మతాల వారిని ఓదించి వాటిని తీసివేసారు . అందువల్లనే ఆయన ను షన్మత స్తాపనాచార్య అనే పేరుతో పిలుస్తారు . ఆది శంకరులు అద్వైతాన్ని స్థాపించారు . అంటే భగవంతుడు, జీవుడు వేరు వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే అని చెప్పారు . ద్వైతము కానిది అద్వైతము అని ప్రతిపాదన చేసి భాష్యం వ్రాసారు .దానినే శంకర భాష్యం అని అంటారు . ఆయన జగద్గురువు అని పేరు పొందారు . ఆతర్వాత కాలం లో మళ్ళీ మూదాచారాలు తిరగాబెట్టినప్పుడు రామానుజులు వచ్చి విసిష్టాద్వైతాన్ని స్థాపించారు . ఆయన సమాజం లోని రుగ్మతలు తొలగించటానికి పాటుపడ్డారు . అన్ని కులాలు , మతాల వారిని తన దగ్గరకు ఆహ్వానించారు . ఆయన మనుష్యులలో బేధాలు లేవు అంతా ఒక్కటే అని ప్రబోధించారు . ఆయన సిద్దాంతం ప్రకారం పరమాత్మ +ప్రకృతి +జీవుడు అంటే ఎలెక్ట్రాన్+ప్రోటాన్ +న్యూట్రాన్ లాగా కలిస్తే ఈ సృష్టి అని ప్రతిపాదించారు . అదే విశిష్టాద్వైతం . ఈ ప్రతిపాదన తో వ్రాసినదే శ్రీభాష్యం .
ఇక మూడవ వారు మధ్వాచార్యులు. వీరిది ద్వైతం . అంటే పరమాత్మ +జీవుడు ఇద్దరు వేరు వేరు అని . ఈయన కూడా ఈ మతానికి భాష్యం వ్రాసారు .
ఇలా హిందూ మతం లో ఈ ముగ్గురు రచనలు చదవాల్సి ఉంటుంది . ఇంకా తులసీదాసు , కబీరు వంటి గొప్పవారి రచనలు , ఆళ్వారుల గ్రంధాలు , రామాయణ భారతాలు ఇవి అన్నీ సాహిత్యమే . అసలు ఇంత వరకు చదివి అర్ధం చేసుకోత్తనికే సమయం సరిపోదు .
ఇంకా ఒక్క ఖురాన్ , లేదా బైబిల్ చదివితే మొత్తం మతం గురించి తెలియదు . హిందూ మతంగురించి తెలుసుకోవటానికి , వేదాంత అనుభూతిని పొందటానికి ఒక్క జన్మ సరిపోదు .
0 comments:
Post a Comment