Pages

వలపుల వాన

సౌధం పై ద్వారం చెంత నిలబడి ఆమె ఇటే చూస్తోంది 
నేను వర్షం లో తడుస్తూ చెట్టు కింద ఉన్నాను
ఇరు చూపులు కలిసాయి . మెరుపులు మెరిసాయి .
వర్షం పెద్దదై తడిసిపోతున్నాను
ఆమె నవ్వులు మల్లెల మత్తులై కైపునిస్తున్నాయి
ఆమె అందాలను పైట చెంగు తో కప్పేస్తూ లోపల దోపుకుంది

ఇంట్లో జల్లు పడ్తోంది అంటూ తలుపులు వేసాడు పనివాడు .
నా చూపుల బాణాలు కిటికీలలోకి వేసాను .
ఆమె ఎక్కడా దర్శనం లేదు 
వర్షం తగ్గిపోయింది .
ఆమె మేడపై టీ తాగుతూ కనిపించింది
ఇక చాలు ఇంటికి వెళ్ళమని సైగ చేసింది
కొంటె నవ్వులతో గుండెను తూట్లు పొడిచింది .
అప్పుడే ఆగిన వర్షాన్ని తిట్టుకుంటూ ఇంటి ముఖం పట్టాను . 

 

Makara sankranthi - Cow worship

                                   HAPPY MAKARA SANKRANTHI TO U ALL.

      May this festival bring joy n prosperity in ur lives.   Today am just writing 2 slokas n the meanings which tell us the greatness of COW.  Actually on the third day of this festival we worship the Cows n Bulls.  In the villages, in olden days they used to decorate their Cows n Bulls n do pujas n all.  There used to be some competitions with bullock carts also.  That's a very good traditional way of celebrating this festival as this festival is considered to be the biggest festival for farmers n all the workers as they get the produce from their farm lands.  so they celebrate this festival in a grand scale.  So this is the biggest festival for all the farmers n workers.  On this occasion we atleast try to know the importance of this Holy Animal.



గోమయేనాను లిప్తాయాం  భూమౌ యాః  కుర్వతే క్రియాః
అనంత ఫలదా విప్ర! భవేయుహ్  వై న సంశయః    ( మాయాపురీ మహాత్మ్యం ).
   ఆవు పేడతో అలికిన భూమి పై చెయ్యబడిన పనులన్నియూ  నిస్సం శయముగా అనంత ఫలములను ఇచ్చును .

గాం చ స్పృశతి యో నిత్యం స్నాతో భవతి నిత్యశః
అతో మర్త్యః ప్రపుష్ట్యైస్తూ సర్వ పాపై: ప్రముచ్యతే     (పద్మ పురాణము )
   ప్రతిరోజు ఉదయం స్నానము చేసిన తరువాత ఆవును స్పర్శించినంత మాత్రమున సకల పాపముల నుండి విముక్తి పొందవచ్చును .

     

New year wishes

             Friends,


                         WISH U ALL A HAPPY N PROSPEROUS NEW YEAR - 2016

                                              MAY ALL UR DREAMS COME TRUE

                                                   WISH THIS NEW YEAR BRINGS

                                               SUCCESS N HAPPINESS IN UR LIFE.

క్రీమీ లేయర్ అవసరమా కాదా ??

     క్రీమీ లేయర్ అనేది నేడు అవసరమే .  సమాజం లో అన్ని కులాల్లోనూ, మతాల్లోనూ, ధనికులూ, పేదవారు ఉన్నారు.  అందుకే అంబేద్కర్ యొక్క కుమారుడు రాహుల్ అంబేద్కర్ ఈ మధ్య భారత దేశం లో అనేక ప్రాంతాలో పర్యటించారు .  ఆయన ఒక విషయం చెప్పారు.  రిజర్వేషన్లు అనేవి కులం, మతం వర్గాన్ని బట్టి కాకుండా ఆర్ధికం గా వెనుక బడిన వారికి ఎవరికైనా ఇచ్చేలా చట్టాలు ఉండాలి  అని నొక్కి చెప్పారు.  ఈ విషయం మన దేశం లో ఏ కుహనా రాజకీయ పార్టీలకు వినపడదు.  ఎందుకంటే వారికి కావలసింది కుర్చీలు , అధికారం. 
   ఇప్పుడు క్రీమీ లేయర్ విధానం పై అన్ని రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి.  6 లక్షలు పరిమితి సరిపోదు అనీ, దాన్ని 15 లక్షలకు పెంచమని గొడవ చేస్తున్నారు.  నేను చాలామంది బి .సి . కులాల వారిని అడిగి చూసాను.  వాళ్ళలో కోద్దా అత్యంత ధనవంతులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద అధికారులూ ఉన్నారు.  చాలా మంది ప్రభుత్వఉద్యోగులు ఉన్నారు.చాలా ప్రభుత్వ పదవులలో ఉద్యోగాలలో నెలకు 40,000 నుండి 50,000 వరకు జీతాలు వస్తున్నాయి.  ఏవో కొన్ని అటెండర్ , అటువంటి పోస్టుల్లో తప్పఅటువంటప్పుడు వారి జీతం సo,, కి 6 లక్షలు అవుతుంది కదా .  అంతే కాదు చాలామంది లేని వాళ్ళు అలానే ఉంటున్నారు .

      
         .దీనిలో ఎక్కువ భాగం వహించేది యూనివర్సిటీ ప్రొఫెసర్లు, టీచర్లు, ఇలా బాగా చదువుకున్న వారు , చదువు చెప్పేవారు .  వీళ్ళు వారి సబ్జక్ట్స్ వదిలేసి వీరికి తెలియని వేదాలు, చదవని రామాయణ భారతాలు, భాగవతం మొదలైన వాటిపై వ్యాఖ్యానాలు చేస్తుంటారు. తిక్క తిక్క గా సమాధానాలు ఇస్తుంటారు.  పోనీ వారిని ఎవరైనా " మీరు ఆ గ్రంధాలు చదివారా ? అని అడిగితే , మేము చదవలేదు, అసలు చదవాల్సిన పని లేదు" అని చెప్తుంటారు.  మరి అసలు ఆ గ్రంధాలు చదవకుండా విషయ పరిజ్ఞానం లేకుండా కేవలం మిడి మిడి జ్ఞానం, అనుభవ రాహిత్యం తో ఏ విషయాన్ని వాధించలేము.  ఆ వాదనలు ఎక్కువ కాలం నిలువవు .  కుల వాదం, కుల వివక్ష  పోవాలని వాదిస్తారు .  కానీ ఆచరించరు.  బ్రాహ్మణులలో ఉప కులాలు వారు కొట్టుకు చస్తుంటారు.  ఇక బి .సి .లలో కూడా ఒకరితో ఒకరికి పడదు.  SC, ST, వారిలో కూడా కొన్ని తెగల వారు కొన్ని తెగల వారిని తక్కువగా చూస్తుంటారు. 
       ఇంకా బి .సి . కులాల్లో వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఎదుగుతున్నారు .  మరి లేని వారి పరిస్థితి ఏమిటీ ?  అసలు ఆ లెక్కలు కూడా తీయాలి.  ఈ మధ్య కొంత మంది ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఆస్తులు కూడబెట్టి ఇల్లు కట్టి అద్దెలకు ఇవ్వటం, ఇంకా బినామీ పేర్ల తో వ్యాపారాలు చేస్తున్నారు.  మళ్ళీ వాళ్ళ పిల్లలకే రిజర్వేషన్స్, ఇంటర్వ్యూ తర్వాత పోస్టింగ్స్ కోసం డబ్బు వెదజల్లటం వంటివి చేస్తున్నారు.  దాని వల్ల వల్ల తోటి బీద వారు వారి కులం వారే ఎప్పటికీ పేదవారిగానే మిగిలిపోతున్నారు. అందుకే ఈ క్రీమీ లేయర్ కావాలి అని వారిలోనే ఒక వర్గం వారు సమర్ధిస్తున్నారు చాలా మంది డబ్బు, పదవి హోదా దక్కగానే వాళ్ళ వాళ్ళనే హీనంగా చూస్తుంటారు.  దర్పం వెలగ బెడుతూ, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు, కుటుంబ పరిస్థితులు, ఎక్కి వచ్చిన మెట్లు అన్నీ మర్చిపోయి ఏదో గొప్ప రాజ  వంశీకులు లాగా ప్రవర్తిస్తుంటారు. 
    ఈ మధ్య  కాలం లో మన దినపత్రికల్లో ఒక విషయం చదివాము అది ఏంటంటే విదేశాల్లో మన ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు లక్షల సంఖ్యలో స్థిరపదినట్లు.  ఆ లెక్కలు కూడా చూపించారు .  ఇలా జరగటానికి కారణం ఏమిటి ?  ప్రతిభావంతుల ప్రతిభ ఖండాలు దాటి విదేశాలకు వలస పోవటానికి కారణం ఎవరు ?  మన స్వార్ధ రాజకీయ నాయకులు.  వాళ్ళు వాళ్ళ స్వార్ధం కోసం వారికి నచ్చిన విధం గా చట్టాలు మర్చేస్తుంటారు.  కానీ విద్య, ఉద్యోగం, ఉపాధి, ప్రతిభ కు సంబంధించిన చట్టాలు మాత్రం వాటి కాల పరిమితి దాటిపోయినా, ప్రస్తుత సామాజిక పరిస్థితులకు ఏమాత్రం అనుగుణం గా లేకపోయినా వాటిని మార్చటానికి ధైర్యం చెయ్యరు. వాళ్ళు కులం, మతం, జాతి ఎత్తవద్దు అని నాటకాలు ఆడుతుంటారు.రాజ్యాంగాన్ని పువ్వుల్లో పెట్టి పూజిస్తుంటారు.  కానీ వారికి అనుగుణంగా దాన్ని మార్పు చేస్తుంటారు.  కానీ ప్రజలకు అవసరమైన చట్టాలు చెయ్యాలంటే వనికిపోతుంటారు,  వారి పదవి పోతుందేమో అని భయం. 

          ఇలాంటి స్వార్ధ రాజకీయ నాయకులు, క్రీమీ లేయర్ వద్దు అని వాదించే వర్గాలు, ప్రభుత్వాలు, ముటాతత్వం ఉన్నంత కాలం ప్రతిభ విదేశాలకు వెళ్ళిపోవటం, మేధావులు విదేశాలను బాగుచేయ్యటం  అది చూస్తూ మనం బాధ పడటం తప్ప చేసేది ఏమి లేదు.  రాజ్యాంగం లో సమూల మార్పులు చెయ్యాలి.  ఆధునికత కు అనుగుణం గా అందరికీ సమాన అవకాశాలు దక్కేవిధం గా సంస్కరింప బడాలి.  కానీ అది జరగాలంటే మళ్ళీ కొందరు సంఘ సంస్కర్తలు పుట్టాలి.    

some techniques to cure neck pain n spondylosys

మీరు మెడ నొప్పి ని తగిన్చుకోవటానికి కొన్ని జాగ్రత్తలు :-
     ఎప్పుడూ మెడను పూర్తిగా గుండ్రం గా తిప్పకండి .  సగం మాత్రమె తిప్పండి .  నిద్ర పోయే సమయం లో పలుచగా ఉన్న తలగడను భుజాల కిందుగా ఉండేలా అమర్చుకోవాలి .  మరీ మెత్తటి తలగడను వాడకండి .

       మీ మెడ నొప్పి తగ్గటానికి మీ భుజాలను ష్రగ్ చేస్తున్నట్లుగా మెడకు దగ్గరగా లాక్కుని 5 అంకెలు లెక్క పెట్టి మళ్ళీ వదలండి .  ఇలా కనీసం 5సార్లు చెయ్యండి .  మీ భుజాలను మొదట 5 సార్లు సవ్య దిశలో , ఆతర్వాత 5 సార్లు అపసవ్య దిశలో తిప్పండి .  మీ నుదుటిని అరచేతితో పట్టుకుని తలను ఆ అరచేతికేసి నొక్కుతూ 5 అంకెలు లెక్క పెట్టండి .  అలాగే రెండు చెంపలకు అరచేతిని నొక్కుతున్నట్లుగా ఇదేవిధం గా వ్యాయామం చెయ్యండి . 
    ఆ తర్వాత తల వెనుక చేతిని పెట్టుకుని కాసేపు తలను వెనుక వైపునకు నొక్కుతూ వ్యాయామం చెయ్యండి .  మెడ , వెన్ను , భుజం ఇలా ఏ ప్రాంతం లో నొప్పి ఉందొ అక్కడ కాపడం పెట్టండి .  చదువుతున్నప్పుడు, రాస్తున్నప్పుడూ , పేపర్ చూస్తున్నప్పుడూ తలను ఎక్కువగా వంచకండి  మీకంప్యూటర్ మోనిటర్, టీవీ చూసేటప్పుడు దానిలోకి తొంగి చూస్తున్నట్లుగా మెడను ఉంచకండి.  ఫోన్ మాట్లాడే సమయం లో భుజానికీ, తలకు మధ్య ఫోన్ ను ఇరికించి తలను పక్కకు తిప్పి మాట్లాడకండి .భుజాలను ముందుకు ఒంగేలా ఉంచకండి .
           ల్యాప్ టాప్ గానీ , కంప్యూటర్ మానిటర్ గానీ మీ కళ్ళ లెవెల్ కు సమానంగా ఉండేలా చూసుకోండి .  కంటికీ మానిటర్ కు మధ్యన 16 నుండి 22 అంగుళాల దూరం ఉండాలి.  అంతకు తక్కువ, ఎక్కువా ఉండటం మంచిది కాదు.  కంప్యూటర్ పై పని చేసే సమయం లో మీ మోచేతులను కుర్చీ చేతులపై ఆన్చి .. వాటికి సపోర్ట్ ఉండేలా చూసుకోండి .
   ఈ విధం గా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించటం వల్ల మెడ నొప్పి , కండరాల నొప్పి,స్పాన్దిలోసిస్  వంటి సమస్యల నుండి బయట పడవచ్చు . 

is one life enough?

    నా చిన్ననాటి మిత్రుడు ఒకాయన వచ్చారు , "గురువా! నేను హిందూ మతం లో పుస్తకాలు అన్నీ చదివి అంతా తెలుసుకున్నాను.  దేవతలు అందర్నీ ఆరాధించాను.  కానీ నాకు క్రిస్టియన్ మతమే నాకు దారి అని అనిపించింది.  అందుకే ఆ మతం పుచ్చుకున్నాను .  నా నిర్ణయం ఎలా అనిపిస్తుంది మీకు ?" అని అడిగాడు.  దానికి నేను " సరే మీకు నచ్చింది మీరు చేసారు .  o.k. కానీ నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి మీరు జవాబు చెప్పండి .  మీరు హిందూ మతం లో దేవుళ్ళు ఎవరిని ఆరాదించారు ?  అని అడిగాను .  దానికి ఆయన కొన్ని గ్రామ దేవతల పేర్లు చెప్పాడు .  గురువుగారూ ! నేను ఆ దేవతలను ఆరాధించాను.  కానీ నాకు ఈ మతమే కరెక్ట్ అనిపించింది అని చెప్పాడు .  అప్పుడు నేను ఆయన్ని అడిగా "మీరు హిందూ మత గ్రంధాలు చదివారా ?  అని  దానికి ఆయన లేదు గురువుగారూ ! నేను పెద్దగా చదవలేదు .  అయినా ఏమి ఉంది  వాటిలో ?  అన్నీ ఉత్త మాటలేగా! అంటూ కొంచం వ్యంగ్యంగా అన్నాడు .   దానికి నేను అతనితో అన్నాను , మీరు మొదటి మెట్టు లో నుంచే వెనక్కు వచ్చేసారు .  మరి ఇంకా ఈ మతాన్ని గురించి మాట్లాడటం అనవసరం  అని అన్నాను .

      అతనితో ఇంకా సంభాషించాలి అని  మనసుకి అనిపించలేదు .  ఆ తర్వాత నేను కూర్చుని హిందూ మత గ్రంధాలు  అవి ఏమిటి అంటే 4 వేదాలు, బ్రహ్మ సూత్రాలు, 18 పురాణాలు , 150 ఉపనిషత్తులు , భగవద్గీత, ఇంకా హిందూమతం లోనే 5 ముఖ్య మతాలు , వాటిపై త్రి మతాచార్యులు శంకర , రామానుజ , మధ్వాచార్యులు వ్రాసిన భాష్యాలు ఇవి అన్నీ ముఖ్యమైనవి.  ఇంకా ఇతర గ్రంధాలు ఇంకా లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి .  వీటిని మనం పూర్తిగా చదివి అర్ధం చేసుకోటానికి ఒక జీవిత కాలం సరిపోదు మతం గురించి నాకు తెలిసిన విషయాలు జ్ఞప్తికి తెచ్చుకోవటం మొదలు పెట్టాను .
        హిందూ మతం లోని 5 మతాలను శంకరాచార్యులవారు చట్టబద్ధం చేసారు .   అవి ఏమిటంటే
1. సౌరం -- అంటే సూర్యుడిని కొలవటం .   2. గాణాపత్యం -- అంటే గణపతిని ఆరాధించటం . 3. అంబికాం -- అంటే శక్తీ మాత దుర్గ ను పూజించటం .  4. శ్రీవిష్ణుం --  అంటే విష్ణువు ను పూజించటం . 5.  మహేశ్వరం -- అంటే శివుని ఆరాధన .  ఈ 5 కాక ఆయన 6వ మతాన్ని ఒక దాన్ని స్థాపించారు   అది ఏమిటంటే ఈ పైన చెప్పిన 5గురు దేవతలలో మన ఇష్ట దైవాన్ని ఒకరిని మధ్యలో ఉంచి మొత్తం మిగిలిన వారిని చుట్టూ ఉంచి పూజించటం .  ఆయన ఈ సిద్ధాంతాన్ని నిరూపించి మిగిలిన 75 మతాల వారిని ఓదించి వాటిని తీసివేసారు .  అందువల్లనే ఆయన ను షన్మత స్తాపనాచార్య అనే పేరుతో పిలుస్తారు .  ఆది శంకరులు అద్వైతాన్ని స్థాపించారు .  అంటే భగవంతుడు, జీవుడు వేరు వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే అని చెప్పారు .  ద్వైతము కానిది అద్వైతము  అని ప్రతిపాదన చేసి భాష్యం వ్రాసారు .దానినే శంకర భాష్యం అని అంటారు .  ఆయన జగద్గురువు అని పేరు పొందారు .   ఆతర్వాత కాలం లో మళ్ళీ మూదాచారాలు తిరగాబెట్టినప్పుడు రామానుజులు వచ్చి విసిష్టాద్వైతాన్ని స్థాపించారు .  ఆయన సమాజం లోని రుగ్మతలు తొలగించటానికి పాటుపడ్డారు .  అన్ని కులాలు , మతాల వారిని తన దగ్గరకు ఆహ్వానించారు .  ఆయన మనుష్యులలో బేధాలు లేవు అంతా ఒక్కటే అని ప్రబోధించారు .  ఆయన సిద్దాంతం ప్రకారం పరమాత్మ +ప్రకృతి +జీవుడు అంటే ఎలెక్ట్రాన్+ప్రోటాన్ +న్యూట్రాన్ లాగా కలిస్తే ఈ సృష్టి అని ప్రతిపాదించారు .  అదే విశిష్టాద్వైతం .  ఈ ప్రతిపాదన తో వ్రాసినదే శ్రీభాష్యం . 
   ఇక మూడవ వారు మధ్వాచార్యులు.  వీరిది ద్వైతం .  అంటే పరమాత్మ +జీవుడు ఇద్దరు వేరు వేరు అని .  ఈయన కూడా ఈ మతానికి భాష్యం వ్రాసారు .
  ఇలా హిందూ మతం లో ఈ ముగ్గురు రచనలు చదవాల్సి ఉంటుంది .  ఇంకా తులసీదాసు , కబీరు వంటి గొప్పవారి రచనలు , ఆళ్వారుల గ్రంధాలు , రామాయణ భారతాలు ఇవి అన్నీ సాహిత్యమే .  అసలు ఇంత వరకు చదివి అర్ధం చేసుకోత్తనికే సమయం సరిపోదు .
   ఇంకా ఒక్క ఖురాన్ , లేదా బైబిల్ చదివితే మొత్తం మతం గురించి తెలియదు .  హిందూ మతంగురించి తెలుసుకోవటానికి , వేదాంత అనుభూతిని పొందటానికి ఒక్క జన్మ సరిపోదు .

Think before writing

         కసూరి రచన పై భౌతిక దాడులకు దిగటం కొంత భాదాకరమే అంటూ వ్యాసకర్తలు ఎడాపెడా వ్రాసిపారేస్తున్నారు.  గతం లో తమిళనాడు లో మనువు వ్రాసిన మనుస్మృతి పుస్తకాలు తగులబెట్టారు .  బ్రాహ్మణులు రోడ్లపై వెళ్తుంటే బట్టలు విప్పి కొట్టారు ఇతర కులాల వారు.  ఇంతకీ ఆ పుస్తకం 2000స0;; కు పూర్వం ఉన్న పరిస్థితులకు అనుగుణం గా వ్రాసినది.  ఇంకా గట్టిగా చెప్పాలంటే అది ఈ కలియుగం లో అమలు లో ఉండదు.  హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఇప్పుడు ఉండేది పరాశర సంహిత.  ఒక 1000స0;; తర్వాత అంబేద్కర్ వ్రాతలు పనికిరావని ఆ దారిన పొయ్యే వాళ్ళను కొడితే ఏమైనా అర్ధం ఉంటుందా ?  ఇదీ అంతే.
        పరమత సహనం అని ఈ రచయితలు రాస్తున్నారు.  ఈ సహనం విదేశాలకు పట్టదా ?  భారత దేశం పై ఎందరో దాడి చేసారు, సంపదలు దోచుకున్నారు .కానీ ఏనాడు మన దేశం ఇతర దేశాలపై ఉత్తుట్టిగానే అయినా దాడులకు వెళ్ళలేదు.  మన దేశపు సరిహద్దుల్లో మిలటరీ వాళ్ళు పడుతున్న కష్టాలు గురించి ఆలోచించండి .
        తప్పులు పాకిస్తాన్ వాళ్ళు చేస్తూ, మన దేశం వాళ్ళు చేస్తున్నారు అని అంతర్జాతీయ మీడియా లో బుకాయిస్తుంటే కనపడటం లేదా?ముషారఫ్ హయాం లో మన ఆర్మీ ఆఫీసర్స్ ని బంధింఛి చిత్ర హింసలకు గురి చేసి, వారి నాలుకలు కోసి, కళ్ళు పీకి, హింసలు పెట్టారు అప్పుడు మన దేశ భక్తులు ఏమి చేస్తున్నట్లు ?  తాగిన మైకం లో సరభ్ జిత్ సింగ్ పొరబాటుగా సరిహద్దు దాటి వెళ్ళిన నేరానికి అతడిని 30స0;;జైలు లో ఉంచారు.  చివరకు అక్కడే జైలు లో తోటి ఖైదీలతో రాళ్ళతో కొట్టించి చంపించారు.
         మనం చెప్పుకుంటూ పోతే ఇటువంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి.  ఆ దేశం లో హిందువులు ఎలా బ్రతుకుతున్నారు ? ఈ దేశం లో ముస్లిం లు ఎలా జీవిస్తున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే.  ఇన్ని జరిగినా కూడా మన దేశం అలాంటి ఒక గొప్ప దేశం పై స్నేహం చేయాలి అంటూ స్నేహ హస్తం ప్రతిసారీ అందిస్తూనే ఉండాలి వాళ్ళు ఎన్ని సార్లు వాతలు పెడుతున్న సరే అని వ్రాస్తున్న మన రచయితలను మనం గౌరవించాలి, సన్మానం చెయ్యాలి !! ఎందుకంటే వారిది చాలా విశాల హృదయం కదా మరి !!
           ఈ అవార్డులు, రివార్డులు తిరిగి ఇవ్వటానికి ముందు మన మేధావులు కొంచం ఈ విషయాలమీద ఆలోచించాలి.  ముందు దేశ ప్రజల మనసులో ఎటువంటి భావాలు ఉన్నాయో తెలుసుకోవాలి.  మనం పాకిస్తాన్ తో స్నేహం గా ఉండటం,వారి కళాకారులను గౌరవించటం ఇప్పటివరకూ జరుగుతూనే ఉంది.  కానీ వారు కూడా అదే గౌరవాన్ని మనకి ఇస్తున్నారా అని ఆలోచించాలి.
         అయినా మన దేశం లో పాకిస్తానీ కళాకారులు రావటం, ప్రదర్శనలు ఇవ్వటం, సినిమాలు, TV. లో నటించటం అన్నీ జరుగుతూనే ఉన్నాయి.  మరి ఇప్పుడు ఈ కులకర్ణి గారిని ఎందుకు వ్యతిరేకించారు అనేది ముందు అర్ధం చేసుకోవాలి .  మనం కసూరి ని ఒక రచయిత గా అంగీకరించ గలమా? అతను పాకిస్తాన్ మంత్రి  గా ఉండేవాడు.  రాజకీయ నాయకుడు.  మన దేశానికి వ్యతిరేకం గా పని చేసినవాడు.అటువంటి వాడిని మన మేధావులు గౌరవించాలి అని అనుకోవటం ఎంత వరకు సమంజసమో ఆలోచించండి .
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online