Pages

Pedda Jiyyaru Swami



ఈరోజు అతి సామాన్యుల‌మైన‌ మ‌న‌మ౦ద‌రమూ కూడా రామానుజ‌ సిద్దా౦తాన్ని ఆచారిస్తున్నామ౦టే దానికి కార‌ణ‌ము మ‌న‌ పెద్ద‌జీయ‌ర్ స్వామి వారే  ఇ౦దులో ఏమాత్ర‌ము స౦దేహ‌ములేదు. 

నేపాల్ బ‌ద‌రీనాధ్ నుండి రామేశ్వ‌ర‌ము వ‌ర‌కు 9 స౦వ‌త్స‌రాల‌ పాటు వారు నిర్వ‌హి౦చిన‌ శ్రీరామ‌ క్ర‌తువులు త‌రుప‌రి నిర్వ‌హి౦చిన‌ వేద‌స్థూప‌ముల‌ ప్ర‌తిష్ఠ‌లు వారి స౦క‌ల్ప‌బ‌ల‌ము  ఏమిటో మ‌న‌కి తెలియ‌జేస్తాయి. కారాగార‌ముల‌లో ఉన్న‌ ఖైదీల‌కు కూడా ఆధ్యాత్మిక‌ శిక్ష‌ణ‌ని ఇచ్చి వారిలో ప‌రివ‌ర్త‌న‌ తెచ్చిన‌ మ‌హాపురుషులు మ‌న‌ స్వామివారు

అటు ఆధ్యాత్మిక‌ సేవ‌ మ‌రొక‌వైపు సామాజిక‌ సేవా ఏక‌కాల‌ములో రె౦డూ నిర్వ‌హి౦చిమ‌ అప‌ర‌ రామానుజులు పెద్ద‌జీయ‌ర్ స్వామివారు

వారి శ్రీచ‌ర‌ణాల‌కు దాశోహ‌ములు తెలుపుతూ
అడియేన్ రామానుజ‌ దాస‌న్ జ‌య‌ శ్రీమ‌న్నారాయ‌ణ‌*
*జ‌య‌ రామానుజ‌*

Why do we need to visit Varaha Swami temple before Balaji Temple in Tirumala???

వేంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి తెలుసుకోండి 

కలియుగ వైకుంఠమైన తిరుమలకు వేంకటాచలం అనే పేరు కూడా ఉన్నదని చాలా మందికి తెలుసు కానీ తిరుమలను ఆది వరాహ క్షేత్రం అంటారని తెలిసిన వారు తక్కువే.  
అంతే కాదు  శ్రీవారి దర్శనం కంటే ముందుగానే స్వామి వారి పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకుంటుంటారు , కానీ ఎందుకలా చేసుకోవాలి అనే వివరాలు తెలుసుకోవడం మన కనీస ధర్మం. పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడడానికి మునుపే శ్రీనివాసుడు తిరుమల చేరుకుని వకుళా మాత ఆశ్రమంలో ఉండేవారు. అప్పటికే అక్కడ తపస్సు చేసుకునే వరాహ స్వామి వారిని కలిశారు శ్రీవారు. అమ్మవారిని కల్యాణం చేసుకున్నాక తిరుమలలోనే స్థిర నివాసం ఏర్పరచుకోదలచి వరాహ స్వామి వారి దగ్గర కాస్త స్థలం అరువుగా తీసుకున్నారు.

 తిరుమలలో శ్రీనివాసుడు వెలసి 5000 సంవత్సరాలవ్వగా, అప్పటివరకూ తిరుమల శిఖరం వరాహస్వామి సొంతంమై ఉండేది.

అప్పటిలో వరాహ స్వామి వద్ద శిఖరంపై వంద చదరపు అడుగుల స్థలాన్ని బహుమతిగా తీసుకున్నాడు వెంకటేశ్వరస్వామి. దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీ ఇచ్చాడు వరాహస్వామికి. 

అదేమిటంటే… తనకోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్పాడు. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి కెక్కింది.
 
తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహ స్వామి ఆలయం వుంది. వెంకటేశ్వరస్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలిదర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రం (రాగిరేకు) పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఈ తామ్ర పత్రం మీద బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు దానిమీ
ద ఉన్నాయి. 

ఈ రాగిరేకును ఇది వరకు హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపించేవారు.ఇప్పుడు రద్దీ పెరగడం వలన వరాహ స్వామి విశిష్టతను , ఆ రాగి రేకును చూపించే సమయం లేదు. భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించుకుంటే ఆ శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా గాని భక్తులు తిరమల నుండి వస్తే, ఆ యాత్ర ఫలం దక్కదని చెబుతారు. కనుక తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహ స్వామి దర్శనం సంపూర్ణసిద్ధిని కలిగిస్తుంది

Hayagreeva jayanthi



శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ జయంతి 

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫిటికాకృతిం  |
ఆధార0 సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||

 శ్రీ మహావిష్ణువు అవతారములలో 24 అవతారములు ముఖ్యమైనవి. ఈ అవతారములలోకెల్లా ముఖ్యాతిముఖ్యమైన, ఆద్యావతరమైన అవతారమే "హయగ్రీవావతారము''. ఈ అవతారము విశ్వవిరాట్ స్వరూపుని (శ్రీమన్నారాయణుని) ఉచ్వాసావతారమే అని, ఇది సృష్టి ఆరంభమునకు పూర్వమే జరిగినదని పెద్దలు చెబుతారు. శ్రీమన్నారాయణుని నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. విష్ణుమూర్తి కర్ణములు (చెవులు) నుండి మధుకైరభులు అనే రాక్షసులు అవతరిం చి, తమ జన్మ కారకులెవరో తెలియక మూల ప్రకృతియైన  ఆది పరాశక్తిని గూర్చి తపస్సు చేసి, జగన్మాత వలన తమ జన్మ రహస్యం తెలుసుకొని, ఎవరిచే కూడా మరణం జరగనట్లుగా వరం ప్రసాదించమని కోరారు. జగన్మాత అలా జరగదని చెప్పి, విచిత్ర దివ్య వైష్ణవ తేజో విశేషంతో తప్ప, ఇతరుల వలన మృత్యుభయం లేదని దేవి ద్వారా వరం పొందారు.

వరగర్వితులై అజేయులుగా ఉన్న మధుకైరభులు బ్రహ్మ వద్దనుండి వేదములను అపహరించి, బ్రహ్మాండమంతా జలమయం గావించి, పాతాళమున దాక్కున్నారు. మధ్య మధ్య బ్రహ్మను యుద్ధానికి కవ్విస్తూ బాధించేవారు. బ్రహ్మ వారితో యుద్ధము చేయలేక, వారు పెట్టే బాధలు సహించలేక, పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. నారాయణుడు బ్రహ్మ ప్రార్థన విని, తన దివ్యదృష్టితో సర్వం తెలుసుకొని, “ఐదు రోజులలో ఆ దైత్యులను సంహరించి, వేదాలను తెచ్చి నీకు అప్పగిస్తాను. వేదములు అందిన తరువాత సృష్టిని ప్రారంభించు, అంతవరకూ నన్ను ఆరాధించు'' అని విష్ణువు, బ్రహ్మను ఓదార్చి పంపించాడు.

వ్యాఖ్యా ముద్రం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే 
బిభద్బిన్నస్ఫటికరుచిరే పుండరీకే నిషణ్ణః |
అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్ మం 
ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగదీశః ||

వెంటనే శ్రీమన్నారాయణుని ఉచ్చ్వాస విశ్వాసముల నుండి శుద్ధస్ఫటిక సంకాశమైన శంఖ, చక్ర, గదా, అక్షరమాల పుస్తక శ్రీ ముద్రాది సంశోభితుడైన ఆశ్వముఖదారి అయినటువంటి "హయగ్రీవ స్వామి'' 
అవతారం చంద్రమండలం మధ్య నుండి అవతరించి, అసురులను హతమార్చి, వేదాలను, వేదవిద్యలను ఉద్ధరించి బ్రహ్మకు అప్పగించాడు. వేదాధిపత్యమును హ్రహ్మకు, సకలవిద్యాధిపత్యమును సరస్వతీదేవికి అప్పగించాడు. అప్పటినుండి బ్రహ్మ వేద ప్రతిపాదకంబైన సృష్టికి కర్తయై, వేదములకు అధినాయకుడయ్యాడు. సరస్వతి సకల విద్యాధిపత్యంబు వహించి, విద్యాప్రదాయినిగా ప్రసిద్ధిగాంచిందని మన పురాణాలు తెలుపుతున్నాయి.



కవిత కాదు ఓ భావన

            కవిత కాదు   ఓ  భావన
–––--------------////////-------------------

కొత్తఉద్యోగం  ......కొత్త వూరు
కొత్తఊరు .....కొత్తయిల్లు
కొత్త పంట ...కొత్త బెల్లం
కొత్తకుటుంబం  కొత్తపరిచయం కానీ పాత చుట్టాలం
ఇంటివారు ....నా ప్రార్ధన మన్నించారు
పాలు పొంగించటానికి పాలు పంపించారు
మెడ మెరిపిస్తూ మేను మురిపిస్తూ
పొడుగాటి జాడ శృ0గారాన్ని కురిపిస్తూ....
ఒయ్యారంగా ఆమె నా గదిలో పాలు పెట్టి వెళ్తోంది
కొత్త వంట  గా ప్రారంభం  చేశాను .
పాయసం ఎంతో రుచిగా వండాను .
ఆమెను కూడా కోటి  ఆశ ల జల్లు తో ఆహ్వానించాను .
మీరు  చాలా అందం గా వున్నారు మెల్లగా చెప్పాను .
ఆమె పెదవులు    రెండు    గులాబీ రేకుల్లా   విచ్చుకొన్నాయి .
అప్పుడు  ఆమె నాపై తెల్లని మల్లెల నవ్వును విసిరింది.
ఆమె పెదవులు మెరుస్తున్నాయితీయని తేనె పులిమినట్లు,
ఆమె నా కళ్ళలోకి కసి కసి గా చూస్తూ నవ్వింది.
ఆమె బుగ్గలపై చిలిపితనం పొంగిపొర్లింది.
ఇంత పెద్ద వర్షం ఇప్పుడే  విరుచుకు పడాలా !
కిరిటీలోనించి ఆమె కోసం వెతుకుతున్నాను.
కిరీటి అంతా వర్షపు బిందువులతోరణాలే,
మనస్సు అంతా తెలియని హర్షపు చిందులే ,
అన్ని బిందువులలో ఆమె అందమైన చిత్రమే ,విచిత్రమే
వండిన పాయసం దేవుని ఎదుట పెట్టాను .
ఆమెరాక కోసం ఆరాటపడుతూ బైట నిలుచున్నాను.
ఇంతలో పిల్లి వచ్చి మొత్తం తినేసి లొట్టలు వేస్తూ వెళ్ళిపోయింది.
ఓ కొత్త చుట్టం గారు ,బావా లేవండి  నిద్ర ఆపి పాలు పొంగిచండి.
ఏమిటి!   చ్చా! ఇదంతా  కలా .అబ్బా ఎంత మధురమో

Moringa and other leaves -- Health benefits

ములగఆకులు చాలా మంచివి కూరగా ,కానీ పప్పులో కానీ లేక రోజూ ఓ గుప్పెడు ఆకులు పోపు లోవేసుకొని ఉడకబెట్టుకొని తింటే  చాలమంచిది కొలెస్ట్రాల్ ను తీసేయడమే కాకుండా గుండె నాళాలను వెడల్పు చేసి వాటిలో అడ్డంగా ఉన్న గారను తొలగిస్తుంది. చాలరకాల వ్యాధులకు ములగాకు దివ్య ఔషధం. ఎండబెట్టి పొడి లోపలకు తీసుకున్నా చాలా మంచిది.   చాలా క్యాన్సర్లకు ఈ ములగ ఆకు మందుల్లో వాడబోతున్నారు.  అలానే ములక్కాయలు కూడా తినడం వల్ల లోపల మిగిలిపోయిన ఇంగ్లీషు మందులటాక్సిన్లు
బైటకు వెళ్ళిపోతాయి. ఇంకా చాలా రకలయున విటమిన్లు, మినరల్స్ వీటిల్లో వుంటాయి .ముఖ్యముగా బీటాకేరోటిన్ ,విటమిన్ C , మాంసకృత్తులు ,ఇనుము, క్యాలిష్యం ,పొటాషియం సమృద్ధిగా వున్నాయి.

ఇక కామంచి ఆకు  లేదా కామాక్షి మొక్క అంటారు .ఈ కామంచి చెట్టు వల్ల చాలా ఆరోగ్య లాభాలు ముఖ్యంగా కళ్లకు, లివర్ కి చాలా మంచిది.లివర్ ఏ స్థితి లో ఉన్నా కూడా కామంచి మొక్క మొత్తం ఉండుకొని తింటే లివర్ బాగుపడుతుంది.

ఇక షుగర్  ఎక్కువగా ఉండి బాధపడుతున్నవాళ్ళు  ప్రతిరోజూ ఉదయమే కరివేపాకు ఆకులు 8 ఆకులు సుమారు గా పరగడుపున తిన0డి .కొద్దిగా నీరు త్రాగండి  ఓ పది నిమషముల తరువాత  కాఫీ  టీ లు త్రాగవచ్చు. ఇక షుగరు లేనివారు అయినా కరివేపాకు తింటే. వారసత్త్వం గా వచ్చే  షుగరు రాదు ,లేదా  షుగర్ త్వరగా జీవితం లోనికి రానివ్వదు. అలానే  ఒక కప్పు గోరువెచ్చని నీటిలో హాఫ్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్, ఒక హాఫ్ స్పూన్ మెంతుల పొడి ,ఒక చిటికెడు పచ్చి పసుపు   లను  బాగుగా కలిపి  పరగడుపున త్రాగాలి  కొద్దిసేపు వరకు  ఏమి లోపలికి తీసుకోకుండా ఉండాలి (10 నిముషాలు ఆగి తరువాత కాఫీ,టీ లు తీసుకోవచ్చు.దీనివల్ల షుగర్  రీడింగ్ లు తగ్గుముఖం పడతాయి .కావాలంటే మీకు సూట్ అయితే  కొంచెము ఆ పొడి  ని  పాలా  పెంచుకోవచ్చు.

.కళ్ళకు  తోటకూర, పుదీనా,కొత్తిమీర  క్యారెట్,, ఉసిరికాయ, చాలా మంచిది .కొద్దికాలం పాటు తింటూ ఉంటే మీకే తెలుస్తుంది కళ్ళ సైట్ పవర్ కూడా తగ్గుతాయి.
పచ్చిముక్కలు ఉల్లి,క్యారెట్, బీట్రూట్, ఇంకా మీకు ఇష్టమైన పచ్చిముక్కలు భోజనం కు ముందు కొద్దీ గా తినడం మంచిది రక్తంలోని  ట్రీగ్లిజరేట్ శాతం తగ్గిపోతుంది.  


 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online