Pages

is one life enough?

    నా చిన్ననాటి మిత్రుడు ఒకాయన వచ్చారు , "గురువా! నేను హిందూ మతం లో పుస్తకాలు అన్నీ చదివి అంతా తెలుసుకున్నాను.  దేవతలు అందర్నీ ఆరాధించాను.  కానీ నాకు క్రిస్టియన్ మతమే నాకు దారి అని అనిపించింది.  అందుకే ఆ మతం పుచ్చుకున్నాను .  నా నిర్ణయం ఎలా అనిపిస్తుంది మీకు ?" అని అడిగాడు.  దానికి నేను " సరే మీకు నచ్చింది మీరు చేసారు .  o.k. కానీ నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను వాటికి మీరు జవాబు చెప్పండి .  మీరు హిందూ మతం లో దేవుళ్ళు ఎవరిని ఆరాదించారు ?  అని అడిగాను .  దానికి ఆయన కొన్ని గ్రామ దేవతల పేర్లు చెప్పాడు .  గురువుగారూ ! నేను ఆ దేవతలను ఆరాధించాను.  కానీ నాకు ఈ మతమే కరెక్ట్ అనిపించింది అని చెప్పాడు .  అప్పుడు నేను ఆయన్ని అడిగా "మీరు హిందూ మత గ్రంధాలు చదివారా ?  అని  దానికి ఆయన లేదు గురువుగారూ ! నేను పెద్దగా చదవలేదు .  అయినా ఏమి ఉంది  వాటిలో ?  అన్నీ ఉత్త మాటలేగా! అంటూ కొంచం వ్యంగ్యంగా అన్నాడు .   దానికి నేను అతనితో అన్నాను , మీరు మొదటి మెట్టు లో నుంచే వెనక్కు వచ్చేసారు .  మరి ఇంకా ఈ మతాన్ని గురించి మాట్లాడటం అనవసరం  అని అన్నాను .

      అతనితో ఇంకా సంభాషించాలి అని  మనసుకి అనిపించలేదు .  ఆ తర్వాత నేను కూర్చుని హిందూ మత గ్రంధాలు  అవి ఏమిటి అంటే 4 వేదాలు, బ్రహ్మ సూత్రాలు, 18 పురాణాలు , 150 ఉపనిషత్తులు , భగవద్గీత, ఇంకా హిందూమతం లోనే 5 ముఖ్య మతాలు , వాటిపై త్రి మతాచార్యులు శంకర , రామానుజ , మధ్వాచార్యులు వ్రాసిన భాష్యాలు ఇవి అన్నీ ముఖ్యమైనవి.  ఇంకా ఇతర గ్రంధాలు ఇంకా లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి .  వీటిని మనం పూర్తిగా చదివి అర్ధం చేసుకోటానికి ఒక జీవిత కాలం సరిపోదు మతం గురించి నాకు తెలిసిన విషయాలు జ్ఞప్తికి తెచ్చుకోవటం మొదలు పెట్టాను .
        హిందూ మతం లోని 5 మతాలను శంకరాచార్యులవారు చట్టబద్ధం చేసారు .   అవి ఏమిటంటే
1. సౌరం -- అంటే సూర్యుడిని కొలవటం .   2. గాణాపత్యం -- అంటే గణపతిని ఆరాధించటం . 3. అంబికాం -- అంటే శక్తీ మాత దుర్గ ను పూజించటం .  4. శ్రీవిష్ణుం --  అంటే విష్ణువు ను పూజించటం . 5.  మహేశ్వరం -- అంటే శివుని ఆరాధన .  ఈ 5 కాక ఆయన 6వ మతాన్ని ఒక దాన్ని స్థాపించారు   అది ఏమిటంటే ఈ పైన చెప్పిన 5గురు దేవతలలో మన ఇష్ట దైవాన్ని ఒకరిని మధ్యలో ఉంచి మొత్తం మిగిలిన వారిని చుట్టూ ఉంచి పూజించటం .  ఆయన ఈ సిద్ధాంతాన్ని నిరూపించి మిగిలిన 75 మతాల వారిని ఓదించి వాటిని తీసివేసారు .  అందువల్లనే ఆయన ను షన్మత స్తాపనాచార్య అనే పేరుతో పిలుస్తారు .  ఆది శంకరులు అద్వైతాన్ని స్థాపించారు .  అంటే భగవంతుడు, జీవుడు వేరు వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే అని చెప్పారు .  ద్వైతము కానిది అద్వైతము  అని ప్రతిపాదన చేసి భాష్యం వ్రాసారు .దానినే శంకర భాష్యం అని అంటారు .  ఆయన జగద్గురువు అని పేరు పొందారు .   ఆతర్వాత కాలం లో మళ్ళీ మూదాచారాలు తిరగాబెట్టినప్పుడు రామానుజులు వచ్చి విసిష్టాద్వైతాన్ని స్థాపించారు .  ఆయన సమాజం లోని రుగ్మతలు తొలగించటానికి పాటుపడ్డారు .  అన్ని కులాలు , మతాల వారిని తన దగ్గరకు ఆహ్వానించారు .  ఆయన మనుష్యులలో బేధాలు లేవు అంతా ఒక్కటే అని ప్రబోధించారు .  ఆయన సిద్దాంతం ప్రకారం పరమాత్మ +ప్రకృతి +జీవుడు అంటే ఎలెక్ట్రాన్+ప్రోటాన్ +న్యూట్రాన్ లాగా కలిస్తే ఈ సృష్టి అని ప్రతిపాదించారు .  అదే విశిష్టాద్వైతం .  ఈ ప్రతిపాదన తో వ్రాసినదే శ్రీభాష్యం . 
   ఇక మూడవ వారు మధ్వాచార్యులు.  వీరిది ద్వైతం .  అంటే పరమాత్మ +జీవుడు ఇద్దరు వేరు వేరు అని .  ఈయన కూడా ఈ మతానికి భాష్యం వ్రాసారు .
  ఇలా హిందూ మతం లో ఈ ముగ్గురు రచనలు చదవాల్సి ఉంటుంది .  ఇంకా తులసీదాసు , కబీరు వంటి గొప్పవారి రచనలు , ఆళ్వారుల గ్రంధాలు , రామాయణ భారతాలు ఇవి అన్నీ సాహిత్యమే .  అసలు ఇంత వరకు చదివి అర్ధం చేసుకోత్తనికే సమయం సరిపోదు .
   ఇంకా ఒక్క ఖురాన్ , లేదా బైబిల్ చదివితే మొత్తం మతం గురించి తెలియదు .  హిందూ మతంగురించి తెలుసుకోవటానికి , వేదాంత అనుభూతిని పొందటానికి ఒక్క జన్మ సరిపోదు .

Think before writing

         కసూరి రచన పై భౌతిక దాడులకు దిగటం కొంత భాదాకరమే అంటూ వ్యాసకర్తలు ఎడాపెడా వ్రాసిపారేస్తున్నారు.  గతం లో తమిళనాడు లో మనువు వ్రాసిన మనుస్మృతి పుస్తకాలు తగులబెట్టారు .  బ్రాహ్మణులు రోడ్లపై వెళ్తుంటే బట్టలు విప్పి కొట్టారు ఇతర కులాల వారు.  ఇంతకీ ఆ పుస్తకం 2000స0;; కు పూర్వం ఉన్న పరిస్థితులకు అనుగుణం గా వ్రాసినది.  ఇంకా గట్టిగా చెప్పాలంటే అది ఈ కలియుగం లో అమలు లో ఉండదు.  హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఇప్పుడు ఉండేది పరాశర సంహిత.  ఒక 1000స0;; తర్వాత అంబేద్కర్ వ్రాతలు పనికిరావని ఆ దారిన పొయ్యే వాళ్ళను కొడితే ఏమైనా అర్ధం ఉంటుందా ?  ఇదీ అంతే.
        పరమత సహనం అని ఈ రచయితలు రాస్తున్నారు.  ఈ సహనం విదేశాలకు పట్టదా ?  భారత దేశం పై ఎందరో దాడి చేసారు, సంపదలు దోచుకున్నారు .కానీ ఏనాడు మన దేశం ఇతర దేశాలపై ఉత్తుట్టిగానే అయినా దాడులకు వెళ్ళలేదు.  మన దేశపు సరిహద్దుల్లో మిలటరీ వాళ్ళు పడుతున్న కష్టాలు గురించి ఆలోచించండి .
        తప్పులు పాకిస్తాన్ వాళ్ళు చేస్తూ, మన దేశం వాళ్ళు చేస్తున్నారు అని అంతర్జాతీయ మీడియా లో బుకాయిస్తుంటే కనపడటం లేదా?ముషారఫ్ హయాం లో మన ఆర్మీ ఆఫీసర్స్ ని బంధింఛి చిత్ర హింసలకు గురి చేసి, వారి నాలుకలు కోసి, కళ్ళు పీకి, హింసలు పెట్టారు అప్పుడు మన దేశ భక్తులు ఏమి చేస్తున్నట్లు ?  తాగిన మైకం లో సరభ్ జిత్ సింగ్ పొరబాటుగా సరిహద్దు దాటి వెళ్ళిన నేరానికి అతడిని 30స0;;జైలు లో ఉంచారు.  చివరకు అక్కడే జైలు లో తోటి ఖైదీలతో రాళ్ళతో కొట్టించి చంపించారు.
         మనం చెప్పుకుంటూ పోతే ఇటువంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి.  ఆ దేశం లో హిందువులు ఎలా బ్రతుకుతున్నారు ? ఈ దేశం లో ముస్లిం లు ఎలా జీవిస్తున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే.  ఇన్ని జరిగినా కూడా మన దేశం అలాంటి ఒక గొప్ప దేశం పై స్నేహం చేయాలి అంటూ స్నేహ హస్తం ప్రతిసారీ అందిస్తూనే ఉండాలి వాళ్ళు ఎన్ని సార్లు వాతలు పెడుతున్న సరే అని వ్రాస్తున్న మన రచయితలను మనం గౌరవించాలి, సన్మానం చెయ్యాలి !! ఎందుకంటే వారిది చాలా విశాల హృదయం కదా మరి !!
           ఈ అవార్డులు, రివార్డులు తిరిగి ఇవ్వటానికి ముందు మన మేధావులు కొంచం ఈ విషయాలమీద ఆలోచించాలి.  ముందు దేశ ప్రజల మనసులో ఎటువంటి భావాలు ఉన్నాయో తెలుసుకోవాలి.  మనం పాకిస్తాన్ తో స్నేహం గా ఉండటం,వారి కళాకారులను గౌరవించటం ఇప్పటివరకూ జరుగుతూనే ఉంది.  కానీ వారు కూడా అదే గౌరవాన్ని మనకి ఇస్తున్నారా అని ఆలోచించాలి.
         అయినా మన దేశం లో పాకిస్తానీ కళాకారులు రావటం, ప్రదర్శనలు ఇవ్వటం, సినిమాలు, TV. లో నటించటం అన్నీ జరుగుతూనే ఉన్నాయి.  మరి ఇప్పుడు ఈ కులకర్ణి గారిని ఎందుకు వ్యతిరేకించారు అనేది ముందు అర్ధం చేసుకోవాలి .  మనం కసూరి ని ఒక రచయిత గా అంగీకరించ గలమా? అతను పాకిస్తాన్ మంత్రి  గా ఉండేవాడు.  రాజకీయ నాయకుడు.  మన దేశానికి వ్యతిరేకం గా పని చేసినవాడు.అటువంటి వాడిని మన మేధావులు గౌరవించాలి అని అనుకోవటం ఎంత వరకు సమంజసమో ఆలోచించండి .

please have some of these daily

రోజూ మీరు భోజనం లో తప్పక ఇవి ఉండేలా చూడండి :
1. పసుపు
2. సోయా పాలు  (50స0: దాటిన ఆడవారికి )
3. కరివేపాకు
4. పచ్చిమిర్చి
5. ఉల్లి మరియు వెల్లుల్లి
6. దాల్చిని చెక్క
7.  జీలకర్ర 
8. పప్పుధాన్యాలు
9. పాలు లేక పాల పదార్ధాలు
10.ఆకుకూరలు మరియు సలాడ్స్
ఇవి అన్నీ లేక కొన్ని అయినా మన రోజువారి ఆహారం లో ఉండేలా చూసుకుంటే మనకు బి .పీ ., షుగర్ , కొలెస్ట్రాల్, అజీర్ణం , గ్యాస్ అసిడిటీ వంటి చాలా సమస్యలు రాకుండా ఉంటాయి .  వీటి తోపాటు మానసిక ఒత్తిడి తగ్గించుకోటానికి యోగ , వ్యాయామం , ధ్యానం  కూడా అవసరం .  క్రమశిక్షణ పాటిస్తే ఆరోగ్యం మన సొంతం .

Do u know these?

హాయ్ !
ఇవి మేకు తెలుసా ?
అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి .
కరివేపాకు రక్త హీనతను తగ్గిస్తుంది
ఉలవలు తింటే ఊబకాయం తగ్గుతుంది
బ్లాకు టీ మధుమేహాన్ని దూరం గా ఉంచుతుంది
జామకాయలు హార్మోన్స్ లో హెచ్చు తగ్గులు నివారిస్తాయి
ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది
బీట్రూట్ రసం లో బి .పీ . సమస్యని తగ్గిస్తుంది
కీరదోసలో ఉండే సల్ఫర్, సిలికాన్ సిరోజాలకు మేలు చేస్తాయి
మునగాకు గ్యాస్త్రిక్ అల్సర్స్ ని దరి చేరనివ్వదు.
ఉల్లిపాయ శ్వాస కొస వ్యాదుల్ని తగ్గిస్తుంది
ఉల్లిపాయ ఇన్సులిన్ ని నియంత్రిస్తుంది, దానిలోని యాస్ప్రిన్ రక్తాన్ని గడ్డకట్టకుండా చేస్తుంది.
 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online