Pages

Dussera - Nava Durga Puja

అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలలో ఎందుకు కొలుస్తారు. నవరాత్రుల వెనుక అసలు చరిత్ర ఏంటి ?

శరదృతువులో వస్తుంది కాబట్టి ‘శరన్నవరాత్రులు’ అంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమినుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట.

*ప్రధమంశైలపుత్రిణి*
*ద్వితీయం బ్రహ్మచారిణి*
*తృతీయం చంద్రఘంటేతి*
*కూష్మాంతేతి చతుర్ధామ్‌ ౹*
*పంచమం స్కంధమాతేతి*
*షష్ఠమం కాత్యాయనీ తిచ*
*సప్తమం కాళరాత్రంచ*
*మహాగౌరేతి చాష్టమం*
*నవమం సిద్ధితి ప్రోక్త*
*నవదుర్గ ప్రకీర్తిత ౹౹*

1. శైలపుత్రి :*

దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాల చంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్నీ చేత బట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతికావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మిం చింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కల్గించడానికి సంకేతం శైలపుత్రి. ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది.

2. బ్రహ్మచారిణి :*
దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరోపేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రాసిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి.

౩. చంద్రఘంట :*
అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట ఈ రూపం మిక్కిలి కళ్యాణ కారకం. శిరస్సుపై ధరించిన అర్థచంద్రుడు అర్ధాకృతలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చినవారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది.


4. కూష్మాండ:*
నాలుగవ స్వరూప నామం కూష్మాండ. అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి. ఎనిమిది భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను ‘అష్టభుజదేవి’ అని కూడా అంటారు.

5. స్కందమాత :*
అయిదో అవతారం స్కందమాత స్కంధుడు అనగా కుమార స్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేతపద్మంతో శోభిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందునటానికి సంకేతమే ఇది.

6. కాత్యాయని :*
దుర్గామాత ఆరో రూపం కాత్యాయని. ‘కొత్స’ అనే రుషి తనకు పార్వతీమాత కుమర్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.

7. కాళరాత్రి :*
దుర్గామాత ఏడో రూపం కాళరాత్రి. ఈమె శరీరం ఛాయ చీకటివలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈదేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు.

8. మహాగౌరి :*
ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకుమెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దాని వలన ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది.

9. సిద్ధిధాత్రి :*
దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.



History of Anantha Padmanabha Swami Temple - Kerala

శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం ,కేరళ.

అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్ధం. శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం శ్రీమహావిష్ణువు ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని కేరళా రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది.

చరిత్ర:

ట్రావంకోర్ రాజకుటుంబం చేరవాంశానికి చెందిన వారు అలాగే కులశేఖర సన్యాసి ఆళ్వార్ సంతతి వారు. ఈ ఆలయం శ్రీమహావిష్ణు యొక్క 108 దివ్యదేశములలో ఒకటి. 108 దివ్యాదేశములు అంటే శ్రీమహావిష్ణువు యొక్క ఆలయాలు ఉన్న దివ్యక్షేత్రాలు అని అర్ధం. శ్రీమత్భాగవతంలో బలరామదేవుడు తన తీర్ధయాత్రలో భాగంగా ఫాల్గుణం (ప్రస్తుత శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం ) అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్లు, ఇక్కడ ఉన్న పంచప్సరసులో (పద్మతీర్థంలో) స్నానం చేసినట్లు అలాగే పది వేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్యప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తుతించబడింది (6వ శతాబ్దం-9వ శతాబ్దం). 

క్రీ.శ 16వ శతాబ్దం అంతా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అపుడు ఈ ఆలయ సుందరగోపుర నిర్మాణం జరిగింది. ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవపెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ఈ ఆలయం కారణంగా కేరళా రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. 'తిరు అనంత పురం ' అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని యొక్క పవిత్ర ఆలయం అని అర్ధం. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే మరి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభస్వరూపమే. హిందుధర్మం భగవంతుడి రూపం సచ్చిదానందం అని చెప్తుంది. (సంపూర్ణ సత్యం, సంపూర్ణ జాగృతి మరియు సంపూర్ణ ఆనందం).
ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభస్వామి అనంతశయనం భంగిమలో (అనంతశేషుడి తల్పం మీద యోగనిద్ర)ఉంటాడు. ట్రివాంకోర్ మహారాజా తనకు తానే పద్మనాభదాసుడని నామకరణం చేసుకున్నాడు. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేక మైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది.

అనంత సంపద:

ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన తిరుపతి తిరుమల వడ్డి కాసుల వాడు... ఈ మధ్య కాలంలో కేరళ తిరువనంత పురంలోని అనంత పద్మ నాభ స్వామి వారి దేవాలయంలో బయల్పడిన అనంత సంపదతో వజ్రాలు, వైడుర్యాలు, టన్నుల కొద్ది బంగారు ఆబరణాలు మొదలగు వాటితొ లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదతో మొదటి స్థానంలో నిలబడగా రెండో స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఇంకా బయట పడవలసిన సంపద వున్నందున పూర్తి స్థాయిలో సంపద నంతటిని లెక్కకట్టాల్సి ఉంది. ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేల మాళిగలలో దాచి వున్నది తెలుసు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరిచి చూసిన పాపాన పోలేదు. 1860 లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950 లో సీల్ వేశారు. స్వాతంత్ర్యానంతరం స్థానిక ఆలయాలన్నిటిని ట్రావెంకూర్ దేవస్తానం బోర్డులో విలీనం చేసినా ఈ ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులే తమ పర్వవేక్షణ క్రిందనే వుంచు కున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాళ్ బలారామ వర్మను అప్పటి ప్రభుత్వం రాజ ప్రముఖ్ గా ప్రకటించింది. ఆ రాజ కుటుంబీకులే ఈ ఆలయ ని
ర్వహణ ట్రస్టీలుగా కొనసాగారు. ప్రస్తుతం ఎనభై తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఉత్తరదామ్ తిరుణాల్ మార్తాండ ట్రస్టీగా కొనసాగుతున్నారు. ఈ ఆలయ సంపద నిర్వహణలో అస్తవ్యస్తంగా వున్నదని దాన్ని గాడిలో పెట్టాలని టి.పి. సుందర రాజన్ అనే న్యాయ వాది సుప్రీం కోర్టులో దావా వేయగా, సుప్రిం కోర్టు ఒక కమిటీని వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది. ఆ విధంగా ఆ నేల మాళిగలలోని అనంత సంపదస్ వెలుగు చూసింది. 

ఇప్పటివరకు ఐదు నేలమాళిగలలోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులోనె అనంతమై సంపద బయట పడింది. ఇంకా ఆరో గది తెరవ వలసి ఉంది. దాని నిర్మాణ రీత్యా అది చాల పెద్దది, అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి వుంచ బడి వున్నదని తెలుస్తున్నది. ఇప్పటివరకే బయట పడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు బయల్పడిన సంపదలో బంగారం, వజ్రాబరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు పొదిగిన నగలు. బస్తాలకొద్ది బంగారు వెండి నాణేలు, దాదాపు రెండు వేల రకాల కంఠాభరణాలు గొలుసులు బయల్పడ్డాయి. పదహారవ శతాబ్దం నాటి శ్రీ కృష్ణ దేవరాయల కాలంనాటి నాణేలు, ఈస్టిండియా కాలం నాటి నాణెలు, నెపోలియన్ బోనపార్టే కాలం నాటివి బస్తాల్లో లబ్య మయాయి. అంతే గాక చిత్ర విచిత్రమైన వస్తువులెన్నొ ఉన్నాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూసాయి. ఇంత సంపద బయల్పడినా ఇంకా అతి పెద్దది, అతి ముఖ్యమైనది అయిన ఆరో గది తెరవాల్సి ఉంది.

వైష్ణవ దివ్యదేశం:

శ్లో. తిరువనంత పురే భుజగేశయో రుచిరమత్స్య సరోవర సుందరే|
   శశి విభూషణ వజ్రధరేక్షిత శ్శఠరిపూత్తమ సూరి పరిష్కృత:||
   అనంత పద్మనాభ శ్శ్రీహరి:లక్ష్మీ సమన్విత:|
   ద్వారత్రయేణ సంసేవ్య: హేమ కూట విమానగ:||

విశేషం:

ఇది కేరళ రాష్ట్ర ముఖ్య పట్టణము. సన్నిధి కోట మధ్య భాగమున ఉంది. ఇక్కడ స్వామిని మూడు ద్వారములలో దర్శించాలి. ఈ స్వామి విషయమై నమ్మాళ్వార్లు తమ తిరువాయిమొళి ప్రబంధములో (10-2)"అరవిల్ పళ్లి పైన్ఱవన్ పాతజ్గాణ నడుమినో సమర్‌ కళుళ్లీర్" భాగవతులారా! అనంతునిపై పవళించియున్న పద్మనాభ స్వామి శ్రీపాదములను సేవింప బయలుదేరుడు" అని యుపదేశించియున్నారు.

శ్రీరంగమున అధ్యయనోత్సవమున అరయరులు ఈ పాశురమును గానము చేయగా విని ఆళవందార్లు ఆనందపరవశులై ఆళ్వార్లు కీర్తించిన ఈ క్షేత్రమునకు పోయిరావలయునని వెంటనే తిరువనంతపురమునకు వెళ్ళాడు.


"కురుగైక్కావలప్పన్" అనువారు ఆళ్వందార్లకు యోగరహస్యములను ఉపదేశింప దలచి ఒక సుముహూర్తమును నిర్ణయించాడు. కాని ఆళవందార్లు ఆదినమున తిరువనంతపురములో ఉండేవాడు. ఆకారణమున యోగరహస్యము వారికి లభించ లేదు. "అయ్యో! పుష్పక విమానమైనను లేదే. ఉన్నచో కురుగైక్కావలప్పన్ సన్నిధికి చేరి యోగరహస్యములను పొంది యుండు వారమే" యని ఆళవందార్లు భావించారట.

పుష్పాలు పత్రాలు -- భగవంతుని పూజ

మనదేశసం స్కృతిలో చాలా కాలం నుంచి పువ్వుల ను భగవంతుని పూజ లో వాడటం అనేది ఉంది అయితే రకరకాల రంగు రంగుల తో ఆకర్షించే పుష్పాలు, సువాసన గలా పుష్పాలు, సువససన మరియు అందమైన పుష్పాలు ఇలా పూజల్లో ప్రముఖ మైన పాత్ర పోషిస్తున్నాయి. అలానే కొన్ని పత్రాలు అంటే ఆకులు, అలాగే అన్నిరకాల ఫలాలు ఆయా ప్రదేశాల్లో దొరికే స్థితిని బట్టి దేవుని. పూజ లో వాడుతూవుంటాము.అక్షింతలు కొన్ని ఎరుపు రంగులో కుంకుమ తో చేస్తారు భద్రాచలం సీతారాముల వారి కళ్యాణం లో ఎరుపు రంగు అక్షతలు కనిపిస్తాయి పైగా అవి కొన్నిగ్రామాలవారు వడ్లగింజలు చేతితో వలిచి ఆ బియ్యం ని అలా మారుస్తారుఎక్కువశాతం పసుపురంగు లోని అక్షతలు కనపడుతూవుంటాయి పెద్దలు చెబుతారు ఎరుపు రంగు అక్షతలు పురుషదేవతాలకు  అలానే పసుపు రంగు వి స్ర్తీ దేవతలకుఉపయోగిస్తారనిచెబుతారు ఇంకా కొన్ని ప్రదేశాలలో తెల్లబియ్యం కూడా వాడతారు.  ఆంధ్రా, ఒరిస్సా బోర్డుర్లు  లో మనుషులు చేసుకునే పెళ్ళి ల్లో పెళ్ళితలంబ్రాలలో కూడా తెల్లబియ్యం వాడతారు అయితే అవే తెల్లబియ్యం చాలాచోట్ల వేరే కర్మలకు వాడతారు శుభకార్యాలకు వాడరు అంటే ఒకోక్క ప్రాంతంలో ఆచారాలు వివిధ రకాలుగా వుంటాయి దాని విషయములో ఎవరిని తప్పు పట్టలేము ఇప్పుడు మనకు ఒకటి అర్థం కావాలి మనస్సు చూసే కోణం బట్టే అన్నీ ఉంటాయి అని అర్థం చేసుకోవచ్చు పూవులకు బదులు అక్షింతలు లేక అక్షితలు అంటారు వాటిని వాడటం, ఇంకా పసుపు,కుంకుమ మంచి గంధము మొదలైన వాటితో పూజలు చేస్తూవుంటారు.

 కొన్ని రకాల పువ్వులు కొంతమంది దేవతలకు వాడరు శివునికి మొగలి పువ్వులు వాడరు .కొన్ని పువ్వులు,ఆకులు కొంతమంది దేవుళ్ళు పూజల్లో ముఖ్యంగా వాడతారు .భగవంతుడు ఒక్కడే కానీ వివిధ రూపాలలో ఎవరి కావాల్సిన  కోరుకున్న రూపంలో మనకు దర్శనం ఇస్తూవుంటాడు .శివుడికి  మారేడు పత్రాలు ,కాసిని నీళ్లు  ఆయన పూజ లో ముఖ్యం శ్రీమహావిష్ణువు కి ఆ స్వామి కి సంబంధించిన అన్ని అవతారములకు తులసి మాలలు, తులసి పత్రములు సమర్పించి  పూజించవచ్చు . శ్రీకృష్ణ భగవానుడు భగవత్ గీత మొత్తం  చెప్పి ఇక చివరలో చెప్పింది ఏమిటి అంటే  నీవు భయంతో వున్నప్పుడు నా రక్షణ కావాలని నువ్వు  , మనస్సు పూర్తిగా కోరుకుంటే  నీ ప్రయత్నాలు అన్నీ అయిపోయి దిక్కుతోచని స్థితి లో వున్నా ,రెండు తులసి దళాలు భక్తి పూర్వకంగా నా పాదాలపై వుంచి  శరణు జొచ్చితే చాలు నిన్ను వెంట ఉండి కాపాడగలను అని  అభయం యిచ్చారు స్వామి.ముఖ్యంగా పారిజాతపుష్పాలుకి కూడా చాలా పవిత్రత, ఉంది ఏ  పువ్వులు అయినా నేల పైన పడితే అవి పూజకు వాడరు .కానీ పారిజాత పుష్పాలు మాత్రం భూమి పై సహజముగా రాలిన వి మాత్రమే పూజలో వాడాలి  అంతేకాని  కోయడమో, చెట్టుఊపి బలంగా పువ్వులు రాల్చి తీ సుకోకూడదు .అది దేవతా వృక్షం ఇంకా పురాణాలు, పెద్దలు చెబుతుంటారు ఆ చెట్టు మొదలులో  ఆంజనేయస్వామి   నివాసిస్తూవుంటాడాని  అంటారు. శ్రీ లక్ష్మీనారాయణులు  మాత్రమే ఉన్న ఒక ఫోటో తీసుకొని  గరుడుడు ఉన్న పరవాలేదు ఇంకా ఆ ఫోటో లో ఆ ముగ్గురు మాత్రమే ఉండాలి. ఉదయం వేళల్లో ఆ ఫోటో కి ప్రతీరోజూ కొన్ని పారిజాతపుష్పాలు తీసుకొని  ఆలంకారం చేస్తూ  ఏదో ఒక పండు ,లేక తీపి  స్వామికి లక్ష్మీ అమ్మవారలకు ఆరగింపు చేస్తూ వుంటే ధనం బాగా  కలిసి వస్తుంది, వృధ్ధిఅవుతుంది. ఎక్కువ పారిజాత పుష్పాలు దొరక్కపోయినా కొన్ని పెట్టినా చాలు .

ఇక  భూలోకములో అటు తులసి పవిత్రత,ఇటు మారేడు  పవిత్రత కలబోసిన  చెట్టు ఉసిరిక చెట్టు అందుకే  ఈ చెట్టు కార్తీక మాసములో గొప్ప పవిత్రత ,వైభవము కలిగి ఎక్కువ పూజలు అందుకొంటుంది. ఇక లక్ష్మీ అమ్మవారికి కమలం పువ్వులు తో పూజ ఆ అమ్మవారికి  చాలా ఇష్టం ,అది ఏ రంగు కమలాలు ఆయన పరవాలేదు ,అలానే కలువలు కూడా ఆమెకు మహా ఇష్టం .శ్రీ వేంకటేశ్వరస్వామి వారు  శ్రీ మహా లక్ష్మి అమ్మవారిని  వెతుక్కుంటూ వచ్చి భూలోకములో తిరుచానూరు దగ్గర చాలా సంవత్సరములు తపస్సు ఆచరించారు .అప్పుడు అక్కడ ఒక కొలను ఏర్పరిచి , ఆ కొలనులో అమ్మవారికి  ఇష్టమైన కమలంపువ్వులు సిద్దచేసి మళ్ళి అవి వికసించడానికి సూర్యభగవానుడిని  ప్రతిష్ట చేసి అక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తపస్సు చేస్తే  అమ్మవారికి కోపం పోయి అక్కడ పద్మము లో దర్శనము యిచ్చింది. పద్మము లో వచ్చింది కాబట్టి పద్మావతి అమ్మవారు అని ,అలివేలుమంగమ్మతల్లి  అని పిలుస్తున్నారు. ఈ కోపతాపాలు. ఇలాంటి  ఘట్టాలు మనుష్య జాతిని,జీవులందరిని ఉద్ధరించటానికి ,వారు మానవలోకానికి  రావడానికి  ఒక కారణం అంతే కానీ మనుషుల్లో లాగా కొట్టుకోవడం కాదు అని జ్ఞానం తెలుసుకొని భక్తినీ పెంచుకోవాలి.అలానే షిర్డీసాయి నాధుడికి గులాబీలు అంటే  ఇష్టం అలానే ఆంజనేయస్వామి వారికి తమలపాకులు, అరటిపండ్లు అంటే చాలా యిష్టం అలానే నవగ్రహాల అధిష్ఠాన దేవతలకు ఒకొక్కరికి ఒక్కొక్క రంగు పువ్వులు యిష్టం . అలానే దుర్గాదేవి అమ్మవారిని ఎర్రని పూవులు,లలితాదేవి అమ్మావారికి ఎర్రమందారాలు అంటే యిష్టం సరస్వతి అమ్మవారికి తెల్లని రంగు కలపువ్వులు   యిష్టం.  

 .అలానే ఆంజనేయస్వామి వారికి  వడమాల అంటే కూడా ఇష్టం ముఖ్యంగా మంగళవారం కొంతమంది  భక్తులు ఆ వడమాల మొక్కుకుంటారు. మినుములు తో   చేసేవి మినుము లకు సంభందించిన  గ్రహం     గ్రహము యొక్క దయ కలగడానికి  ,ఆ సంభందించిన మినుములను ఆంజనేయస్వామి కి  వడలు గా  తయారుచేసి సమర్పించడమే ఇక్కడ  ముఖ్య విషయం.       ఇక శనివారం, మంగళవారం ఎక్కువగా  ఆంజనేయస్వామి వారికి విశేషమైన  పూజలు జరుగుతూవుంటాయి.నవగ్రహాలలో కూడా  ఒక్కొక్క గ్రహదేవతకి ఒక్కోక రంగు పుష్పాలు ఆయా పూజల్లో వాడతారు.అలానే ఒకోక్క రోజు కి ఒకోక్క గ్రహం అధిపతి ,మళ్ళి ఆ రోజుకి  ఒకోక్క దైవం అధిపతి , ఆదివారం ,సూర్యనారాయణుడు, అందుకే భానువారం అంటారు.నవగ్రహాలలో సూర్యదేవుడు మొదలు ,అందుకే ఆది. ఇతర దేశాలలో కూడాసన్ డే అని పిలుచుకుంటారుకడం .ఆయన కు మనం చేసే నమస్కారాలు అంటే ఇష్టం.నమస్కార ప్రియుడు. ఉదయమే కొంతమంది  నీరు దోసిలి తో ఆర్గ్యమిస్తారు నమస్కారములు చేస్తారు .ఆయన జీవులన్నింటికి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడి గాను.ప్రత్యక్షంగా కనిపిస్తున్నదైవం అని కూడా బాగా నమ్మకము ఉదయం వేళా  .ఆంధ్రా ప్రాంతం నుంచీ కోణార్క్ ప్రయాణము చేస్తుంటే ఎందరో సూర్యునికి నీరు ఆర్గ్యం ఇస్తూ కనపడతారు.


• ఇక దేవాలయంలో జరిగే  నిత్య పూజలకు ఎన్నో రకాలు పూలదండలు, తులసిమాలలు వాడుతూ వుంటారు. సాయంత్రం కాగానే  దేవాలయ పూజారులు  అవి అన్నీ తీసి బైట పెట్టేస్తూవుంటారు ,కొంతమంది మరుసటిరోజు శుభ్రం చేస్తూ ఆ పూలదండలు అవి బైట పెడుతూవుంటారు. కొంతమంది భక్తులు ఆ మాలలు ను ఇంటికి తెచ్చుకుంటారు . ఇలా ఇంటికి తెచ్చకున్న  ఆ పూవులు, లేక  మాలలను ఏమి చెయ్యాలి అనే దానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి   కొంతమంది పండితులు ఆ మాలలను తలుపులకు. ఇంటిగేట్లకు, ఇంటిదరవాజాలకు కట్టుకోవచ్చు అని చెబుతారు. . ఇంకా కొందరు అలా చేయకూడదు అని చెబుతున్నారు.ఇక  ఆ విషయం  లో అభిప్రాయబేధాలు ఉన్నప్పుడు.    మనకు దేవుడి విగ్రహాలకు అలంకరించిన వి కదా మనకు తీసుకోవాలని  ఉవ్విళ్లూరుతుంటాము  కదా మరి  అటువంటప్పుడు మనం కళ్లకు అద్దుకొని ఇంటికి తెచ్చుకొని మీ మం దిరములో ఒక పీట పై పెట్టి నమస్కారం చేసి ,మరుసటిరోజు మంగళవారం, శుక్రవారం కాకుండా మిగతా రోజుల్లో మనం తొక్కని ప్రదేశములో ,చెట్లలో  పడేయ వచ్చు ఒకవేళ మంగళ, శుక్రవారం లు వస్తే ఆ మరుసటి రోజు అవతల పడేయవచ్చు. ఏ మాలలు అయినా దేవుని గుడిలో తీసుకున్నవి తలమీద పెట్టుకొని మనం భక్తి లో తన్మయత్త్వం చెందవచ్చు  కానీ తులసి మాలలు మాత్రం ఎప్పుడూ కూడా మనం తలపై పెట్టుకోరాదు అని  ఒక్క శ్రీమహావిష్ణువు కి మాత్రమే ఆ సంప్రదాయం ఉంది అని తెలుసుకోవాలి .కావాలంటే మెడలో వేసుకోవచ్చు,కళ్ళకు అడ్డుకోవచ్చు .ఒకవేళ తెలవక చేస్తే కొంపలు ఏమి మునగవు చెంపలు వేసుకొని ,కళ్ళకు అద్దుకొని అక్కడ పెట్టేయవచ్చు.


The benefits of chanting Ashtakshari Manthra

అష్టాక్షరీ మంత్ర మహిమ.....*

” ఓం నమో నారాయణాయ ” అను ఎనిమిది అక్షరముల యొక్క మంత్ర స్మరణము అనంత పుణ్యప్రదం, అనంత పాప రాశి ని ద్వంసం చేయగల శక్తి కలిగినది.ఇట్టి అష్టాక్షరి మంత్ర అధిష్టాన పురుషోత్తముడే శ్రీ మన్నారాయణుడు స్థితి కారకుడై అష్ట ఐశ్వర్యములను ప్రసాదించునప్పుడు లక్ష్మీనారాయణునిగా, విధ్యజ్ఞానము ప్రసాదించునపుడు లక్ష్మీ హయగ్రీవునిగా, ఆరోగ్య ప్రధాతగా నిలిచిన సమయాన ధన్వంతరిగా, సంకల్ప దీక్ష నొసగు లక్ష్మీ నారసింహునిగా, సమస్త మానసిక రుగ్మతలు తొలగించు లక్ష్మీ సుదర్శనునిగా, భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రసాదించు అనఘ దత్తత్రేయునిగా, సర్వ మంగళకరుడగు శ్రీ వేంకటనాయకుడైన వేంకటేశ్వరునిగా భక్తులకు సుఖ శాంతులను ప్రసాదించుచున్నాడు

మానవాళిని తరింపచేసే ఓ పవిత్ర మంత్రం గురించి ప్రత్యేకంగా వివరిస్తోంది నరసింహ పురాణం పదిహేడో అధ్యాయం. 

వ్యాసభగవానుడు తన కుమారుడైన శుక మహర్షికి ఆ మంత్రాన్ని గురించి వివరించాడు. సంసారబంధాల నుంచి విముక్తులు కావటానికి, మానవాళి జపించాల్సిన మంత్రం ఓంనమో నారాయణాయ అనేది. ఇది అష్టాక్షరి. అంటే ఎనిమిది అక్షరాలతో కూడుకొని ఉంటుంది. మంత్రాలన్నింటిలోకి ఎంతో ఉత్తమమైంది ఈ మంత్రం. నిత్యం దీన్ని జపిస్తే ముక్తి లభిస్తుంది. ఈ అష్టాక్షరిని జపించేటప్పుడు శ్రీమహావిష్ణువును మనసులో ధ్యానిస్తుండాలి. అలాగే పవిత్ర నదీప్రాంతాలలో, ఏకాంత ప్రదేశాలలో, జలాశయాల దగ్గర శ్రీమహావిష్ణు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని అష్టాక్షరిని జపించటం మేలు.

అష్టాక్షరిలో ఉండే ఒక్కొక్క అక్షరానికి ఒక్కో ప్రత్యేక వర్ణం ఉంది. వరుసగా

"ఓం" కారం శుక్ల (తెలుపు) వర్ణం,
"న" కారం రక్త (ఎరుపు) వర్ణం,
"మో" అనే అక్షరం కృష్ణ (నలుపు),
"నా" అనే అక్షరం ఎర్రగానూ,
"రా" అనే అక్షరం కుంకుమరంగులోనూ,
య" అనే అక్షరం పసుపుపచ్చని రంగులోనూ,
"ణా" అనే అక్షరం కాటుకరంగులోనూ ఉంటుంది.

ఓంనమోనారాయణాయ అనే ఈ మంత్రం ఇన్ని వర్ణాలతో విడివిడిగా ఉంటూ అన్ని వర్ణాల సమ్మిళితమైన తెల్లని రంగులో చివరకు కనిపించటం సత్వగుణ ప్రాధాన్యతను తెలుపుతుంది. ఈ మంత్ర ప్రభావం వల్ల స్వర్గ, మోక్ష ఫలాలతోపాటు కోరిన కోర్కెలు కూడా సిద్ధిస్తుంటాయి. దీనిలో సకల వేదార్థాలు నిండి ఉన్నాయని పండితులు విశ్లేషించి చెబుతుంటారు. ఈ మంత్రాన్ని స్నానం చేసి శుచి అయిన తర్వాత పవిత్ర ప్రదేశంలో కూర్చొని జపించాలి.

సర్వకాల సర్వావస్థలలోనూ తాను పవిత్రంగా ఉన్నాననుకొన్నప్పుడు భక్తుడు ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఏ పనినైనా మొదలు పెట్టేటప్పుడు, పని అయిన తర్వాత దీన్ని జపించటం మేలు. ప్రతి నెలలోనూ ద్వాదశినాడు శుచి అయి, ఓంనమోనారాయణాయ అనే ఈ మంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో వందసార్లు జపించాలి. అలా జపించిన వారికి మోక్ష స్థితులలోని సామీప్యస్థితి లభిస్తుంది. స్వామిని గంధపుష్పాలతో పూజించి ఈ మంత్రాన్ని జపిస్తే పాపాలు హరించుకుపోతాయి. అష్టాక్షరీ మంత్రజపంలో మొదటి లక్ష పూర్తి కాగానే ఆత్మశుద్ధి కలుగుతుంది. రెండో లక్ష పూర్తి అయ్యేసరికి మనశ్శుద్ధి, మూడో లక్ష పూర్తి అయినప్పుడు స్వర్గలోక అర్హత, నాలుగో లక్ష పూర్తికాగానే శ్రీహరి సామీప్యస్థితికి అర్హతలు లభిస్తాయి. అయిదు లక్షలసార్లు ఈ మంత్రజపం చేసిన వారికి నిర్మలజ్ఞానం కలుగుతుంది. ఆరో లక్షతో విష్ణులోకంలో స్థిర నివాస అర్హత, ఏడో లక్షతో స్వస్వరూప జ్ఞానం. ఎనిమిదో లక్షతో ముక్తి లభిస్తాయి. నిత్యజీవితంలో చేసుకొనే పనులు చేసుకుంటూనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించవచ్చు.
నిత్యం ఈ మంత్రజపం చేసేవారికి దుస్వప్నాలు, పిశాచాలు, సర్పాలు, బ్రహ్మరాక్షసులు, దొంగలు, మోసగాళ్లు, మనోవ్యాధులు, వ్యాధులవల్ల బాధలుండవు.

ఓంకారంతో మొదలయ్యే ఈ అష్టాక్షరీ మంత్రం ఎంతో విశేషమైందని వేదాలు కూడా వివరిస్తున్నాయి. జ్ఞానులు, మునులు, పితృదేవతలు, దేవతలు, సిద్ధులు, రాక్షసులు ఈ మంత్రాన్ని జపించి పరమసిద్ధిని పొందిన సందర్భాలున్నాయి. ప్రాణాన్ని విడిచే సమయంలో ఒక్కసారి ఈ మంత్రాన్ని అనుకున్నా వైకుంఠం లభిస్తుంది. వేదాన్ని మించిన శాస్త్రం, నారాయణుడిని మించిన దైవం లేదన్నట్లు ఈ మంత్రాన్ని మించిన మంత్రం మరొకటి లేదు. ఒక్కోసారి శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల జయంతులు. పూజలు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఆయా అవతారాలకు సంబంధించిన మంత్రాలు కానీ, స్తోత్రాలు కానీ తెలియనప్పుడు "ఓం నమో నారాయణాయ" అనే అష్టాక్షరీ మంత్రాన్ని నూటఎనిమిది సార్లు జపించినా ఆయా అవతారాల పూజాఫలితం దక్కుతుంది. అని ఇలా నరసింహ పురాణంలో సాక్షాత్తు వ్యాసభగవానుడే ఈ విషయాన్ని తన కుమారుడైన శుకయోగికి వివరించి
చెప్పడంతో అష్టాక్షరీ మంత్ర ప్రభావం ఎంతటిదో  తెలుస్తోంది.



 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online